నండూరి సుబ్బారావుగారు డాన్ క్విక్సోట్ గా నటీంచిన రేడియో నాటిక ఆకాశవాణి విజయవాడ కేద్రం నుండి 1969 లో వచ్చింది. ఆ నాటిక కోసం ఎంత ప్రయత్నించినా దొరకటంలేదు. మీరు పూనుకుంటే దొరకవచ్చు.
రాత్రిని రెండు తరాల కోణాల్లోంచి చూస్తూ జీవితాన్ని బాగా నిర్వచించారు.
ఈ కవిత కి టైటిల్ జీవితం-1 అని అనుకుని మిగిలిన పార్శ్వాలని కూడా ఆవిష్కరించవచ్చు.
ఉదాహరణకు, పిల్లల భవిష్యత్ గురించి పెద్దలు తపిస్తారు. కాని పెద్దైన పిల్లలు
కన్న వాళ్ళను భారంగా భావిస్తున్నారు. ఇది కూడా నిత్య పరంపర, జీవితానికి మరో నిర్వచనం.
తమిళములో కణ్ణదాసన్ ఎన్నో పాటలను ఆ కాలములో రాసారు. వాటికి విశ్వనాథన్ – రామమూర్తి గారలు, మహాదేవన్ గారు ఏ మార్పు లేకుండా స్వరపరచారు. అందువల్లనే ఆ పాటలు సంగీతములో, సాహిత్యములో ఎంతో చక్కగా ఉన్నాయి. నా స్నేహితుడు భానుమూర్తి చెప్పేవాడు – గీతగోవిందములోని అష్టపది బాణీలో రాస్తే ఏ పాటనైనా స్వరపరచవచ్చు అని ! ఉంటాను – మోహన
మనకు తెలిసిన పాటలను గురించి రచయిత బాగా విశ్లేషించారు. అయితే సినీగీతాల రచన ఎన్నో పరిమితులకు లోబడి జరుగుందనేది తెలిసిన విషయమే. మామూలు కవులకుండే స్వేచ్ఛ సినీరచయితలకుండదు. సాధారణంగా ఇచ్చిన ట్యూన్లకు పాటలు రాయించడం పరిపాటి. ఇది కవికి సవాలుగా పరిణమిస్తుంది. బాగా రాసి మెప్పించడం కష్టమవుతుంది.
సంగీతదర్శకుల్లో కె.వి.మహాదేవన్ తన ట్యూన్లకు పాట రాయమని ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఇచ్చిన పాటకు వరసలు చేసేవారట. ఇది ముందుగా తమిళంలో తయారై తెలుగులో మళ్ళీ తీసిన సినిమాలకు వర్తించదనుకోండి.
ఇందుకు సి.ఆర్.సుబ్బరామన్ పూర్తిగా విరుద్ధం. అతని పాటల రచనలన్నీ ట్యూన్లకు కిట్టించినవే. తెలుగువారిలో ఆదినారాయణరావువంటి స్వరరచయితలుకూడా ట్యూన్లకే ప్రాధాన్యతనిచ్చారు. ఘంటసాల ఒక్క సందర్భంలోనే (మల్లియలారా మాలికలారా) తాను ముందుగా చేసిన వరసకు అడిగి పాట రాయించుకున్నారని సి.నా.రె. ఒక సందర్భంలో చెప్పారు.
దేవులపల్లి కృష్ణశాస్త్రిగారిని (ముఖ్యంగా చివరి రోజుల్లో) ట్యూన్ కోసం పాట రాయమనే సాహసం ఎవరూ చేసేవారుకారు. ఆయన చేత ఒక్క పాటైనా రాయించుకోవటం తమకు అదృష్టంగా నిర్మాతలు భావించేవారట. ఘనశ్యామసుందరా అనే ప్రసిద్ధ మరాఠీ సినీగీతం ఒరవడిలో ఆయనచేత ఘనాఘనసుందరా అనే పాటను రాయించారు. భూప్ రాగంలోనే మరొక పద్ధతిలో స్వరరచన జరిగింది.
ముందుగా అరవంలో విడుదలైన పాటలకు తిరగరాసినప్పటికీ శ్రీశ్రీ రాసిన పాటలు కొన్ని ఒరిజినల్ కంటే బావుంటాయి. ఉదాహరణకు దొరికేరు దొరగారు (ప్రేమించిచూడు). నిపుణుడైన కవి ఎటువంటి పరిస్థితిలోనైనా బాగా రాయగలడని దీన్నిబట్టి తెలుస్తుంది.
శ్రీవెంకటేశ్వరరావుగార్కి –
మీరు పరిచయం చేసిన పూసపాటి కృష్ణంరాజుగారి ‘రెండు బంట్లు పోయాయి’ కథని (మరోసారి), కథ మీకు నచ్చడం వెనకున్న కారణాల్ని చదివాను. రాజుల జీవితాల్ని దగ్గర్నుంచి చూసినవాళ్లకు, పతంజలిగారి రచనల్ని ఔపోసన పట్టిన వాళ్లకూ ఈ కథ బాగా నచ్చుతుంది.
ఇక ‘రెండు బంట్లు పోయాయి’ అనే దానికి అర్థం – కథలోనే ఉంది.
పెళ్లికూతురు తన చేతిలోని పరదాని పెళ్లికొడుకు ముఖాన కొట్టి వెళ్లిపోగానే … తాతగారు ‘ఇంతమంది రాజుల్లోనూ రాజుల పరువూ, మర్యాదా మంటగలిసేయి’ అని గొణుక్కుంటాడు. తాతగారు చదరంగం ఆడే మనిషి కాబట్టి అదే భాషలో చివర్లో అల్లా అన్నాడన్నమాట. ‘పరువూ, మర్యాదా’ ఆయన ఉద్దేశ్యంలో రెండు బంట్లని.
1994లో కారా మాస్టారు సప్తతి సభని విశాఖపట్నంలో జరిపినప్పుడు కొందరు సాహితీ ప్రముఖులతో పాటు అనుకోకుండా నేను కూడా హైద్రాబాద్నుండి వెళ్లాను. ఆ సభలో పూసపాటిగారు మాట్లాడ్డం చూశాను. కాని ఆ సభ జరిగిన పది, పదిహేను రోజుల్లోనే ఆయన పోయారనే వార్త విని చాలా బాధపడటం ఒక విషాద జ్ఞాపకమైతే… పదేళ్లక్రితం వంశీ (దర్శకులు) గారు ‘సీతాలు జలుపడ్డది’ పుస్తకాన్ని నా దగ్గర్నుంచి తీసుకొని అన్ని పేజీలూ జిరాక్సు తీసుకోవడం రెండో జ్ఞాపకం.
కృష్ణంరాజుగారి మరోకథ ‘దివాణం సేరీ ఆట’ చదివి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్న సందర్భమూ ఉంది.
వింధ్యవాసిని గారూ,
మీ స్వగతం చాలా బాగుంది.
దాదాపు చాలామంది కి చిన్నపటినుంచీ జరిగిన ఇటువంటి అనుభవాలు గుర్తుకొచ్చివుండవచ్చు.
మొదటి సైకిలు, మొదటి మోపెడు, మొదటి కారు, డ్రైవింగ్ లో మొదటి పొరబాట్లు ఎప్పటికీ మరవలేనివి
– యం.వి. బాలసుబ్రహ్మణ్యం, బెంగుళూరు
నాటికి నేడు – రేడియో నాటిక గురించి వంశీ అభిప్రాయం:
11/19/2010 8:24 am
@గొరుసు గారు – ఈ యామినీపూర్ణతిలక నాటిక రెండు భాగాలుగా పబ్లిష్ అయి ఉన్నది డాక్టర్ కె.బి.గోపాలం గారి సౌజన్యంతో.
మొదటి భాగం 50 MB కావున కొద్దిగా ఓపిక చూపించవలసి ఉంటుంది.. 🙂
భవదీయుడు
వంశీ
నాటికి నేడు – రేడియో నాటిక గురించి SIVARAMAPRASAD KAPPAGANTU అభిప్రాయం:
11/18/2010 12:28 pm
శ్రీనివాస్ గారూ,
నండూరి సుబ్బారావుగారు డాన్ క్విక్సోట్ గా నటీంచిన రేడియో నాటిక ఆకాశవాణి విజయవాడ కేద్రం నుండి 1969 లో వచ్చింది. ఆ నాటిక కోసం ఎంత ప్రయత్నించినా దొరకటంలేదు. మీరు పూనుకుంటే దొరకవచ్చు.
దయచేసి ప్రయత్నించగలరు.
నా అందం ఏమయింది? గురించి పార్ధ సారధి అభిప్రాయం:
11/17/2010 11:16 pm
చాలా బాగుంది
జీవితం గురించి naren అభిప్రాయం:
11/17/2010 10:33 pm
రాత్రిని రెండు తరాల కోణాల్లోంచి చూస్తూ జీవితాన్ని బాగా నిర్వచించారు.
ఈ కవిత కి టైటిల్ జీవితం-1 అని అనుకుని మిగిలిన పార్శ్వాలని కూడా ఆవిష్కరించవచ్చు.
ఉదాహరణకు, పిల్లల భవిష్యత్ గురించి పెద్దలు తపిస్తారు. కాని పెద్దైన పిల్లలు
కన్న వాళ్ళను భారంగా భావిస్తున్నారు. ఇది కూడా నిత్య పరంపర, జీవితానికి మరో నిర్వచనం.
నాటికి నేడు – రేడియో నాటిక గురించి ramana అభిప్రాయం:
11/17/2010 10:30 pm
2 పాత్రలతో 30 నిమిషాల రేడియో నాటకం మెప్పించడము గొప్ప.
తెలుగు సినిమా పాటల్లో కొన్ని రచనా విశేషాలు గురించి మోహన అభిప్రాయం:
11/17/2010 8:27 pm
తమిళములో కణ్ణదాసన్ ఎన్నో పాటలను ఆ కాలములో రాసారు. వాటికి విశ్వనాథన్ – రామమూర్తి గారలు, మహాదేవన్ గారు ఏ మార్పు లేకుండా స్వరపరచారు. అందువల్లనే ఆ పాటలు సంగీతములో, సాహిత్యములో ఎంతో చక్కగా ఉన్నాయి. నా స్నేహితుడు భానుమూర్తి చెప్పేవాడు – గీతగోవిందములోని అష్టపది బాణీలో రాస్తే ఏ పాటనైనా స్వరపరచవచ్చు అని ! ఉంటాను – మోహన
తెలుగు సినిమా పాటల్లో కొన్ని రచనా విశేషాలు గురించి Rohiniprasad అభిప్రాయం:
11/17/2010 5:31 am
మనకు తెలిసిన పాటలను గురించి రచయిత బాగా విశ్లేషించారు. అయితే సినీగీతాల రచన ఎన్నో పరిమితులకు లోబడి జరుగుందనేది తెలిసిన విషయమే. మామూలు కవులకుండే స్వేచ్ఛ సినీరచయితలకుండదు. సాధారణంగా ఇచ్చిన ట్యూన్లకు పాటలు రాయించడం పరిపాటి. ఇది కవికి సవాలుగా పరిణమిస్తుంది. బాగా రాసి మెప్పించడం కష్టమవుతుంది.
సంగీతదర్శకుల్లో కె.వి.మహాదేవన్ తన ట్యూన్లకు పాట రాయమని ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఇచ్చిన పాటకు వరసలు చేసేవారట. ఇది ముందుగా తమిళంలో తయారై తెలుగులో మళ్ళీ తీసిన సినిమాలకు వర్తించదనుకోండి.
ఇందుకు సి.ఆర్.సుబ్బరామన్ పూర్తిగా విరుద్ధం. అతని పాటల రచనలన్నీ ట్యూన్లకు కిట్టించినవే. తెలుగువారిలో ఆదినారాయణరావువంటి స్వరరచయితలుకూడా ట్యూన్లకే ప్రాధాన్యతనిచ్చారు. ఘంటసాల ఒక్క సందర్భంలోనే (మల్లియలారా మాలికలారా) తాను ముందుగా చేసిన వరసకు అడిగి పాట రాయించుకున్నారని సి.నా.రె. ఒక సందర్భంలో చెప్పారు.
దేవులపల్లి కృష్ణశాస్త్రిగారిని (ముఖ్యంగా చివరి రోజుల్లో) ట్యూన్ కోసం పాట రాయమనే సాహసం ఎవరూ చేసేవారుకారు. ఆయన చేత ఒక్క పాటైనా రాయించుకోవటం తమకు అదృష్టంగా నిర్మాతలు భావించేవారట. ఘనశ్యామసుందరా అనే ప్రసిద్ధ మరాఠీ సినీగీతం ఒరవడిలో ఆయనచేత ఘనాఘనసుందరా అనే పాటను రాయించారు. భూప్ రాగంలోనే మరొక పద్ధతిలో స్వరరచన జరిగింది.
ముందుగా అరవంలో విడుదలైన పాటలకు తిరగరాసినప్పటికీ శ్రీశ్రీ రాసిన పాటలు కొన్ని ఒరిజినల్ కంటే బావుంటాయి. ఉదాహరణకు దొరికేరు దొరగారు (ప్రేమించిచూడు). నిపుణుడైన కవి ఎటువంటి పరిస్థితిలోనైనా బాగా రాయగలడని దీన్నిబట్టి తెలుస్తుంది.
రెండు బంట్లు పోయాయి: కథ నచ్చిన కారణం గురించి jagadeeshwar reddy అభిప్రాయం:
11/16/2010 7:34 am
శ్రీవెంకటేశ్వరరావుగార్కి –
మీరు పరిచయం చేసిన పూసపాటి కృష్ణంరాజుగారి ‘రెండు బంట్లు పోయాయి’ కథని (మరోసారి), కథ మీకు నచ్చడం వెనకున్న కారణాల్ని చదివాను. రాజుల జీవితాల్ని దగ్గర్నుంచి చూసినవాళ్లకు, పతంజలిగారి రచనల్ని ఔపోసన పట్టిన వాళ్లకూ ఈ కథ బాగా నచ్చుతుంది.
ఇక ‘రెండు బంట్లు పోయాయి’ అనే దానికి అర్థం – కథలోనే ఉంది.
పెళ్లికూతురు తన చేతిలోని పరదాని పెళ్లికొడుకు ముఖాన కొట్టి వెళ్లిపోగానే … తాతగారు ‘ఇంతమంది రాజుల్లోనూ రాజుల పరువూ, మర్యాదా మంటగలిసేయి’ అని గొణుక్కుంటాడు. తాతగారు చదరంగం ఆడే మనిషి కాబట్టి అదే భాషలో చివర్లో అల్లా అన్నాడన్నమాట. ‘పరువూ, మర్యాదా’ ఆయన ఉద్దేశ్యంలో రెండు బంట్లని.
1994లో కారా మాస్టారు సప్తతి సభని విశాఖపట్నంలో జరిపినప్పుడు కొందరు సాహితీ ప్రముఖులతో పాటు అనుకోకుండా నేను కూడా హైద్రాబాద్నుండి వెళ్లాను. ఆ సభలో పూసపాటిగారు మాట్లాడ్డం చూశాను. కాని ఆ సభ జరిగిన పది, పదిహేను రోజుల్లోనే ఆయన పోయారనే వార్త విని చాలా బాధపడటం ఒక విషాద జ్ఞాపకమైతే… పదేళ్లక్రితం వంశీ (దర్శకులు) గారు ‘సీతాలు జలుపడ్డది’ పుస్తకాన్ని నా దగ్గర్నుంచి తీసుకొని అన్ని పేజీలూ జిరాక్సు తీసుకోవడం రెండో జ్ఞాపకం.
కృష్ణంరాజుగారి మరోకథ ‘దివాణం సేరీ ఆట’ చదివి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్న సందర్భమూ ఉంది.
– గొరుసు
సామాన్యుని స్వగతం: వాహనయోగం గురించి యం.వి. బాలసుబ్రహ్మణ్యం అభిప్రాయం:
11/16/2010 5:15 am
వింధ్యవాసిని గారూ,
మీ స్వగతం చాలా బాగుంది.
దాదాపు చాలామంది కి చిన్నపటినుంచీ జరిగిన ఇటువంటి అనుభవాలు గుర్తుకొచ్చివుండవచ్చు.
మొదటి సైకిలు, మొదటి మోపెడు, మొదటి కారు, డ్రైవింగ్ లో మొదటి పొరబాట్లు ఎప్పటికీ మరవలేనివి
– యం.వి. బాలసుబ్రహ్మణ్యం, బెంగుళూరు
కోనసీమ కథలు: న్యాయవాదం గురించి sravanthi అభిప్రాయం:
11/15/2010 3:02 pm
Story so good