” కర్ణపేయము”..” శ్రుతపేయము” అన్నమాటలు వాడుకలో ఉన్నమాటలు.
శ్రుతమ్ అంటే వినికి. శ్రుతి అన్నా అదే అర్ధమ్ “వినికి “అనే !! పేయం అంటే పాలు అమృతము వంటి బాగున్న ద్రవపదార్ధాలు.పానానికి అనువైనవి.ఇక్కడ చెవి నిజంగా ఆ ద్రవాలని పానం చేస్తుందని కాదుకదా! అలా చెప్పడమ్ ఒక మెచ్చుకోలు తరహా అంతే !వినడానికి సుఖంగా ఉందని అనడంలాంటిది అంటే ఆస్వాదయోగ్యంగా ఉందని అనడం.
భాషకి ప్రమాణం మొదటగా వాడుక మాత్రమే. వాడుకని అనుసరించి నిఘంటువులు అర్ధవివరణ చేస్తాయి. చెవికి ఇంపుగా ఉంది అన్న అర్ధంలో.. కాసింత విశేషణమ్ వేసిచెప్పడం. చెవి ఆ సంగీతాన్ని సంతోషంగా ఆస్వాదిస్తోంది అనిచెప్పడానికి …చెవి ఆ ధ్వనిని లేదా.. ఆ గానాన్ని స్వీకరిస్తోంది ..పానంచేస్తోంది.. తాగుతోంది అన్న విశేషణాలుగా మార్చిచెప్పడం.” ఆహా !! అమృతోపమానంగా ఉంది “..అని అనడం లాంటిదే ఇదికూడా!! వినడానికి బాగుందని మెచ్చుకోవడానికిగానూ చెవి ఆ గానాన్ని పానంచేస్తోంది అన్నట్టుగా అనడమ్. అందుకని “పేయమన్న” శబ్దం అక్కడ అవసరమయ్యింది. విడి విడిగా ఈ రెండుపదాలు చూస్తే అందులో అతుకు ఏదీలేదు. కానీ వాడుక వాటికి ఆ బలాన్ని ఇస్తుందన్నమాట..” కర్ణపేయంగా”.
నాకు తెలుసున్నంత వరకూ తాళ గతికీ అంత్య ప్రాసకీ సంబంధం లేదు. అంత్యప్రాస పాదం ముగించేటప్పుడు అందంగా ఉంటుంది. మీరు చెప్పినట్లు కేవలం రూపకాది తాళాలకే అంత్యప్రాసుండాలన్న నియమమూ లేదు. ఉండకూడదన్న సూత్రమూ లేదు. ఈ క్రింది త్యాగరాజ కీర్తన రూపకతాళంలో వుంది. ఇందులో రెండో అక్షర ప్రాసొక్కటే కనిపిస్తుంది.
భక్తి బిచ్చమియ్యవే
భావుకమగు సాత్వీక (భ)
ముక్తికఖిల శక్తికి త్రి-
మూర్తులకతి మేల్మి రామ (భ)
ప్రాణము లేని వానికి బంగారు పాగ చుట్టి
ఆణి వజ్ర భూషణమురమందు పెట్టు రీతి
జాణలకు పురాణాగమ శాస్త్ర వేద జప ప్రసంగ
త్రాణ కల్గియేమి భక్త త్యాగరాజ నుత రామ (భ)
అయితే సాధారణంగా చాలా భజన పాటలు రూపక తాళంలోనే స్వరపరుస్తారు. మోహనగారు చెప్పినట్లు ఆరేసి మాత్రలకి సమన్వయం కోసం అత్యప్రాస్తలు వాడుతారు. ఖండచాపులో వున్న “నాదుపై పలికేరు నరులు” కృతిలో ఒక చరణంలో ఏ ప్రాసా లేదు. మిగతా చరణాల్లో ద్వితీయాక్షర ప్రాసుంది.
దినము నిత్యోత్సవమునకాస జెందితి
నా మనసున ఇల్లు ఒకటియనియుంటి కాని
అనుదినమునొరుల మేలును జూచి తాళ
లేకను రెండు సేయ వలెననుచు పల్కితినా
ప్రాసుంటే వినడానికి బావుంటుంది. లేకపోయినా పాట వినసొంపుగా ఉన్నంత వరకూ అభ్యంతరం లేదని నా అభిప్రాయం.
కర్ణపేయమూ, శ్రుతపేయమూ అన్న పదాల వాడుక నేను కొన్ని సంగీత పుస్తకాలలో చూసాను. ఇది నేను సృష్టించినది కాదు. అలావాడడం దుష్టసమాసం అంటే వెనక్కి తీసుకుంటాను. నాకు ఏ భాషలోనూ
పాండిత్యంలేదని మాత్రం గట్టిగా చెప్పగలను.
ఒక్కోసారి నిఘంటువుల్లో ఉన్న అర్థాలకే కాకుండా వేరే వాడకం కూడా ఉంటుంది. పైగా మన నిఘంటువులు తరచూ నవీకరణ చెయ్యరు. తరచూ మనం వాడే “అదృష్టం” పదానికి అసలర్థం నిఘంటువుల్లో వెతికితే మీరే ఆశ్చర్యపోతారు.
మోహన గారు, నా ప్రశ్న ఇంకొంచెం వివరంగా అడుగుతాను. రూపకం(6), ఆది(8), ఖండ(5),మిశ్ర(7).
అంత్యప్రాస ఉన్న పాటల్లో రూపకం/ఆది వాడటం, రెండవ అక్షర ప్రాస ఉన్న పాటల్లో చివరి రెండు తాళాలు విరివిగా వాడటం చూశాను. కర్ణాటక తాళాల్లో తాళీ, ఖాళీ ఉన్నాయో లేదో నాకు తెలీదు. హిందుస్తానీ తాళాల్ని బట్టి చూస్తే ప్రాస తరవాత మాత్ర తాళీ ఉండటం గమనించవచ్చు. ఇది రివాజా? లేక కాకతాళీయమా అన్నది నా ప్రశ్న.
వినీల్ గారు, నాకు సంగీత జ్ఞానము లేదు కాని, నాకు తెలిసినంతవరకు తాళం గతి (నడక) పైన ఆధారపడి ఉంటుంది. గతి మాత్రలపైన (దీనినే కళలు అని కూడ అంటారు) ఆధారపడి ఉంటుంది. మీరు చెప్పిన రూపక తాళానికి ఆధారం ఆరు మాత్రలు. అంత్య ప్రాస పదాలు కనరావా, వినలేవా లాటివి ఉంటే రూపక తాళానికి సరిపోతుంది. విధేయుడు – మోహన
ఇది ఈమాటకి కావలసిన సంగతో.. అఖ్ఖరలేని సంగతో నాకు తెలీకపోయినా ఇక్కడ జరిగిన ఈ సంఘటన గురించి ఈమాట పాఠకుల దృష్టికి తీసుకుని రావడానికి ప్రయత్నంగా దీన్ని భావించండి.
తెలంగాణా రాజకీయనాయకుల పోరాటంలో భాగంగా ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని తెరాస వారి ఆధ్వర్యంలో మార్చ్ 10 న హైదరాబాద్ లో జరిగిన “మిలియన్ మార్చ్ ” చివరలో వికటించి, టాంక్ బండ్ మీద ఉన్న తెలుగుజాతి వైతాళికుల విగ్రహాలన్నీ తలలూ మొండేలూ తెగిపడి..మెడకి ఉరితాళ్లతో బిగించి లాగినట్టుగా కిందికిలాగబడి పక్కనే ఉన్న హుస్సేన్ సాగర్ లో తోసివేయబడ్డాయి. అందులో కవిత్రయం వారూ అన్నమయ్య గురజాడ అప్పారావు కందుకూరి వీరేశలింగం, గుర్రం జాషువా వంటి కవి రచయితలూ ఇంకా మిగిలిన సంస్కర్తలూ ఉన్నారు. వీరంతా ” సీమాంధ్ర రచయితలట”. దీనిమీద నిరసన ప్రకటనలు వెలువడ్డాయి. ” తెలంగాణా కోసమ్ 600 మంది విద్యార్ధులు చనిపోతే మీరు బాధని ప్రకటించలేదుగానీ ఏవో కొన్ని విగ్రహాలు కూల్చినందుకే అంత బాధ ఎందుకు పడిపోతున్నారంటూ “..తెరాస నాయకులు ఎద్దేవా చేయడం వగైరాలన్నీ గత మూడు రోజులుగా జరుగుతున్న సంఘటనలు. మీది సాహిత్య పత్రిక గనక… ఈ విషయమ్ మీద మీరు కూడా ఏమన్నా ప్రతిస్పందిస్తారేమోనని… మీకు ఈ సంగతిని తెలియజేస్తున్నాను.
రమ.
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి rama bharadwaj అభిప్రాయం:
03/16/2011 1:56 pm
” కర్ణపేయము”..” శ్రుతపేయము” అన్నమాటలు వాడుకలో ఉన్నమాటలు.
శ్రుతమ్ అంటే వినికి. శ్రుతి అన్నా అదే అర్ధమ్ “వినికి “అనే !! పేయం అంటే పాలు అమృతము వంటి బాగున్న ద్రవపదార్ధాలు.పానానికి అనువైనవి.ఇక్కడ చెవి నిజంగా ఆ ద్రవాలని పానం చేస్తుందని కాదుకదా! అలా చెప్పడమ్ ఒక మెచ్చుకోలు తరహా అంతే !వినడానికి సుఖంగా ఉందని అనడంలాంటిది అంటే ఆస్వాదయోగ్యంగా ఉందని అనడం.
భాషకి ప్రమాణం మొదటగా వాడుక మాత్రమే. వాడుకని అనుసరించి నిఘంటువులు అర్ధవివరణ చేస్తాయి. చెవికి ఇంపుగా ఉంది అన్న అర్ధంలో.. కాసింత విశేషణమ్ వేసిచెప్పడం. చెవి ఆ సంగీతాన్ని సంతోషంగా ఆస్వాదిస్తోంది అనిచెప్పడానికి …చెవి ఆ ధ్వనిని లేదా.. ఆ గానాన్ని స్వీకరిస్తోంది ..పానంచేస్తోంది.. తాగుతోంది అన్న విశేషణాలుగా మార్చిచెప్పడం.” ఆహా !! అమృతోపమానంగా ఉంది “..అని అనడం లాంటిదే ఇదికూడా!! వినడానికి బాగుందని మెచ్చుకోవడానికిగానూ చెవి ఆ గానాన్ని పానంచేస్తోంది అన్నట్టుగా అనడమ్. అందుకని “పేయమన్న” శబ్దం అక్కడ అవసరమయ్యింది. విడి విడిగా ఈ రెండుపదాలు చూస్తే అందులో అతుకు ఏదీలేదు. కానీ వాడుక వాటికి ఆ బలాన్ని ఇస్తుందన్నమాట..” కర్ణపేయంగా”.
రమ.
మూడు లాంతర్లు – 2 గురించి Madhav అభిప్రాయం:
03/16/2011 9:11 am
ఈవ్యాస పరంపరలో మూడవభాగం ఈరోజు (16మార్చ్ 2011) ఈమాటలో జతచేయబడింది.
-సంపాదకులు
ఇద్దరు దుర్మార్గులు గురించి SAMPATH అభిప్రాయం:
03/16/2011 3:26 am
SUPER BROTHER
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి Brahmanandam Gorti అభిప్రాయం:
03/15/2011 5:18 pm
వినీల్ / మోహన గార్లకి,
నాకు తెలుసున్నంత వరకూ తాళ గతికీ అంత్య ప్రాసకీ సంబంధం లేదు. అంత్యప్రాస పాదం ముగించేటప్పుడు అందంగా ఉంటుంది. మీరు చెప్పినట్లు కేవలం రూపకాది తాళాలకే అంత్యప్రాసుండాలన్న నియమమూ లేదు. ఉండకూడదన్న సూత్రమూ లేదు. ఈ క్రింది త్యాగరాజ కీర్తన రూపకతాళంలో వుంది. ఇందులో రెండో అక్షర ప్రాసొక్కటే కనిపిస్తుంది.
భక్తి బిచ్చమియ్యవే
భావుకమగు సాత్వీక (భ)
ముక్తికఖిల శక్తికి త్రి-
మూర్తులకతి మేల్మి రామ (భ)
ప్రాణము లేని వానికి బంగారు పాగ చుట్టి
ఆణి వజ్ర భూషణమురమందు పెట్టు రీతి
జాణలకు పురాణాగమ శాస్త్ర వేద జప ప్రసంగ
త్రాణ కల్గియేమి భక్త త్యాగరాజ నుత రామ (భ)
అయితే సాధారణంగా చాలా భజన పాటలు రూపక తాళంలోనే స్వరపరుస్తారు. మోహనగారు చెప్పినట్లు ఆరేసి మాత్రలకి సమన్వయం కోసం అత్యప్రాస్తలు వాడుతారు. ఖండచాపులో వున్న “నాదుపై పలికేరు నరులు” కృతిలో ఒక చరణంలో ఏ ప్రాసా లేదు. మిగతా చరణాల్లో ద్వితీయాక్షర ప్రాసుంది.
దినము నిత్యోత్సవమునకాస జెందితి
నా మనసున ఇల్లు ఒకటియనియుంటి కాని
అనుదినమునొరుల మేలును జూచి తాళ
లేకను రెండు సేయ వలెననుచు పల్కితినా
ప్రాసుంటే వినడానికి బావుంటుంది. లేకపోయినా పాట వినసొంపుగా ఉన్నంత వరకూ అభ్యంతరం లేదని నా అభిప్రాయం.
-బ్రహ్మానందం.
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి Brahmanandam Gorti అభిప్రాయం:
03/15/2011 4:50 pm
శ్రీనివాస్ గారూ,
కర్ణపేయమూ, శ్రుతపేయమూ అన్న పదాల వాడుక నేను కొన్ని సంగీత పుస్తకాలలో చూసాను. ఇది నేను సృష్టించినది కాదు. అలావాడడం దుష్టసమాసం అంటే వెనక్కి తీసుకుంటాను. నాకు ఏ భాషలోనూ
పాండిత్యంలేదని మాత్రం గట్టిగా చెప్పగలను.
ఒక్కోసారి నిఘంటువుల్లో ఉన్న అర్థాలకే కాకుండా వేరే వాడకం కూడా ఉంటుంది. పైగా మన నిఘంటువులు తరచూ నవీకరణ చెయ్యరు. తరచూ మనం వాడే “అదృష్టం” పదానికి అసలర్థం నిఘంటువుల్లో వెతికితే మీరే ఆశ్చర్యపోతారు.
-బ్రహ్మానందం.
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి వినీల్ అభిప్రాయం:
03/15/2011 1:19 pm
మోహన గారు, నా ప్రశ్న ఇంకొంచెం వివరంగా అడుగుతాను. రూపకం(6), ఆది(8), ఖండ(5),మిశ్ర(7).
అంత్యప్రాస ఉన్న పాటల్లో రూపకం/ఆది వాడటం, రెండవ అక్షర ప్రాస ఉన్న పాటల్లో చివరి రెండు తాళాలు విరివిగా వాడటం చూశాను. కర్ణాటక తాళాల్లో తాళీ, ఖాళీ ఉన్నాయో లేదో నాకు తెలీదు. హిందుస్తానీ తాళాల్ని బట్టి చూస్తే ప్రాస తరవాత మాత్ర తాళీ ఉండటం గమనించవచ్చు. ఇది రివాజా? లేక కాకతాళీయమా అన్నది నా ప్రశ్న.
సువర్ణభూమిలో … గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:
03/15/2011 8:52 am
ఈ కవిత అనేక పదిసంవత్సరాల సంకలనలో చేర్చారు
కవికి, ప్రచురణ కర్తలకి అభినందనలు
ధ్యానం గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:
03/15/2011 8:41 am
ఈ కవిత అనేక పది సంవత్సారాల కవిత్వంలోకి ఎంపిక అయ్యింది.
కవికి, ప్రచురణ కర్తలకు అభినందనలు
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి మోహన అభిప్రాయం:
03/14/2011 2:30 pm
వినీల్ గారు, నాకు సంగీత జ్ఞానము లేదు కాని, నాకు తెలిసినంతవరకు తాళం గతి (నడక) పైన ఆధారపడి ఉంటుంది. గతి మాత్రలపైన (దీనినే కళలు అని కూడ అంటారు) ఆధారపడి ఉంటుంది. మీరు చెప్పిన రూపక తాళానికి ఆధారం ఆరు మాత్రలు. అంత్య ప్రాస పదాలు కనరావా, వినలేవా లాటివి ఉంటే రూపక తాళానికి సరిపోతుంది. విధేయుడు – మోహన
ఈమాట గురించి గురించి rama bharadwaj అభిప్రాయం:
03/14/2011 12:39 pm
సంపాదకులకి,
ఇది ఈమాటకి కావలసిన సంగతో.. అఖ్ఖరలేని సంగతో నాకు తెలీకపోయినా ఇక్కడ జరిగిన ఈ సంఘటన గురించి ఈమాట పాఠకుల దృష్టికి తీసుకుని రావడానికి ప్రయత్నంగా దీన్ని భావించండి.
తెలంగాణా రాజకీయనాయకుల పోరాటంలో భాగంగా ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని తెరాస వారి ఆధ్వర్యంలో మార్చ్ 10 న హైదరాబాద్ లో జరిగిన “మిలియన్ మార్చ్ ” చివరలో వికటించి, టాంక్ బండ్ మీద ఉన్న తెలుగుజాతి వైతాళికుల విగ్రహాలన్నీ తలలూ మొండేలూ తెగిపడి..మెడకి ఉరితాళ్లతో బిగించి లాగినట్టుగా కిందికిలాగబడి పక్కనే ఉన్న హుస్సేన్ సాగర్ లో తోసివేయబడ్డాయి. అందులో కవిత్రయం వారూ అన్నమయ్య గురజాడ అప్పారావు కందుకూరి వీరేశలింగం, గుర్రం జాషువా వంటి కవి రచయితలూ ఇంకా మిగిలిన సంస్కర్తలూ ఉన్నారు. వీరంతా ” సీమాంధ్ర రచయితలట”. దీనిమీద నిరసన ప్రకటనలు వెలువడ్డాయి. ” తెలంగాణా కోసమ్ 600 మంది విద్యార్ధులు చనిపోతే మీరు బాధని ప్రకటించలేదుగానీ ఏవో కొన్ని విగ్రహాలు కూల్చినందుకే అంత బాధ ఎందుకు పడిపోతున్నారంటూ “..తెరాస నాయకులు ఎద్దేవా చేయడం వగైరాలన్నీ గత మూడు రోజులుగా జరుగుతున్న సంఘటనలు. మీది సాహిత్య పత్రిక గనక… ఈ విషయమ్ మీద మీరు కూడా ఏమన్నా ప్రతిస్పందిస్తారేమోనని… మీకు ఈ సంగతిని తెలియజేస్తున్నాను.
రమ.