కశ్యపుని భార్య దితి, శివుని మొదటి భార్య సతి అక్కాచెల్లెళ్లు. వీరి తండ్రి దక్షుడు. మత్స్యపురాణంలో దక్షప్రజాపతి 60 మంది కూతుర్లుగా ఇచ్చిన పేర్లలో వీరిద్దరి పేర్లు కూడా కనిపిస్తాయి.
Last stanza “dhana madandhula” perhaps needs replacement with “dharani naadhula” – since potana’s style of vinamrata is more appropriate with dharani nadhula. you may also refer to the upanyasam by C Narayana reddy in “www.andhrabharathi.com”. Also, V Nagayya in bhakta potana sang this poem as Dharani Nadhula kouvela tapasulaku.
1. బెండకాయ వేపుడు చేసేటప్పుడు ముక్కలు జిగురు రాకుండా, అడుగున అంటుకోకుండా ఉండాలంటే వేపుడు చేసే పాత్రలో కొంచెం ఇంగువ వెయ్యాలి.
2. క్యాబేజి వండేటప్పుడు చెంచా నిమ్మరసం వేస్తే వాసన రాకుండా ఉంటుంది
3. అనీజీ (uneasy) గా ఉన్న టైంలో మళ్ళి ప్రశాంతంగా అవ్వాలంటే ఇంద్రాణి గారి కవిత చదవాలి
ఈరోజు “మహాకవి తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము” వ్యాసమును చదివే భాగ్యం కలిగింది. రమణగారూ! మీ వ్యాసము అమోఘం. చాలా చాలా బాగుంది. ఈ కావ్యములో ఇన్నేసి మంచి పద్యములు ఉన్నాయని ఇప్పటివరకు తెలియదు. వాటిని ప్రతిపదార్థములతో మీరు వివరించిన తీరు ప్రశంసనీయం. మొదట కఠినసమాస భూయిష్ఠంగా గోచరించిన పద్యములు, మీ వివరణ తర్వాత ఆస్వాదనీయ మధురఫలములుగా మారిపోయినవి. మీకు అనేక ధన్యవాదములు, మరియు అభినందనలు.
మీ లేఖిని నుండి ఇలాంటి మరికొన్ని సాహితీవ్యాసములు వెలువడాలని అస్మదీయుల ఆకాంక్ష.
కావ్యాల నాయకుడు ఎప్పుడూ ధీరోదాత్తుడే. ఈ ధీరోదాత్తుడు, అతని పేరులా ధీరుడు, ఉదాత్తుడు. గొప్ప వంశానికి చెందినవాడు, ఇట్టి నాయకులు విరహముతో బాధపడుతున్నా సామాన్య మానవునిలా నిగ్రహమును కోల్పోరు. కిష్కింధ కాండలో రాముడు సీత విరహముతో బాధ పడుతున్నప్పుడు కూడ దారిలో కనబడే ప్రకృతి దృశ్యాలను వర్ణించడము మరువలేదు. నా ఉద్దేశములో రామాయణములోని యీ ప్రకృతి వర్ణనలు నిజముగా చాల అందమైనవి. అదే విధముగా ఇక్కడ యక్షుడు కూడ నిగ్రహవంతుడై కనబడుతాడు. అదియునుగాక, అతని ప్రధానమైన గురి తన భార్యకు తన సందేశమును అందజేయడము. ఆ కార్యములో కృతకృత్యుడు కావాలంటే దారిని చక్కగా వివరణలతో మేఘునికి తెలుపవలెను గదా! అందువల్ల ఇది ఒక యాత్రా మార్గదర్శిలా అనిపిస్తుంది. కాని ఇందులో ముఖ్యమైన రసము విరహమే. కావ్య లక్షణాలు, ధీరోదాత్తుల లక్షణాలను గురించి క్లుప్తముగా ఇక్కడ చదువవచ్చును. ఇది పాత తెలుసా పాఠకులకు Down the memory lane లాటిది. – మోహన
మీరన్నది నిజమే గానీ ఆశ్చర్యం ఏమీ లేదు. అందులో, గత ఇరవైయేళ్ళలో సమగ్రమైన తెలుగు సినిమా సమీక్ష అన్నది నా కళ్ళబడలేదు. సమీక్షకులున్నారు కానీ పత్రికలకా అవసరం లేదు. ఇవ్వాళ తెలుగుదేశములో ఎన్ని సినిమా పత్రికలొస్తున్నాయన్నది ఎవరూ నికరంగా తేల్చిచెప్పలేని ఒక విచిత్రమైన ప్రశ్న. ఇవాళ వస్తున్న సినిమా పత్రికలు అభిమానుల కోసమే పాఠకులందరి కోసం కాదు. మిగతా వాటిల్లో అంటే సినిమా పత్రికలు కాని వాటిల్లో సినిమా వార్తలు, విశేషాలూ సచిత్రంగానే ఉంటాయి తప్ప సినిమా సమీక్షలు ఉండవు. ఈనాడు దినపత్రిక ప్రింట్ ఎడిషన్ లో ఇవ్వదు కానీ ఆన్ లైన్ ఎడిషన్ లో సినిమా సమీక్షలు ఇస్తుంది. ఆంధ్రభూమి వెన్నెల ప్రతి శుక్రవారం సినిమా అనుబందం ఉన్నవాటిలో చాలా మెరుగు.
రాష్ట్రంలో జర్నలిజం కోర్సు అందిస్తున్న యే విశ్వవిద్యాలయంలోనూ సినిమా అనేది ‘స్పెషలైజేషన్’ గా లేదు. పైగా యూనివర్శిటీ పట్టాలు పుచ్చుకున్నవారు దాదాపుగా ఎవరూ సినిమా జర్నలిజంలో స్థిరపడటం లేదు.కొ.కు, ఇంటూరి వెంకటేశ్వరరావు, కాట్రగడ్డ నరసయ్య ప్రభృతులు రాసిన సినిమా వ్యాసాల గురించి ఇవ్వాళ దాదాపుగా ఎవరికీ తెలీదు. తెలియనప్పుడు ‘సినీజర్నలిజంలో అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడాలను గురించి కామెంట్లు రాయకపోవడం’ సామాన్యమైన విషయం. అయితే ఈ మాట పాఠకుల వరకూ మీపరిశీలన నిజమే.
లక్ష్మణదేవర నవ్వు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
05/24/2012 1:37 pm
కశ్యపుని భార్య దితి, శివుని మొదటి భార్య సతి అక్కాచెల్లెళ్లు. వీరి తండ్రి దక్షుడు. మత్స్యపురాణంలో దక్షప్రజాపతి 60 మంది కూతుర్లుగా ఇచ్చిన పేర్లలో వీరిద్దరి పేర్లు కూడా కనిపిస్తాయి.
నాకు నచ్చిన పద్యం: పోతనామాత్యుని జీవన దృక్పథం గురించి naarayaNa baabu అభిప్రాయం:
05/24/2012 12:34 am
dear Brundavana rao garu,
Last stanza “dhana madandhula” perhaps needs replacement with “dharani naadhula” – since potana’s style of vinamrata is more appropriate with dharani nadhula. you may also refer to the upanyasam by C Narayana reddy in “www.andhrabharathi.com”. Also, V Nagayya in bhakta potana sang this poem as Dharani Nadhula kouvela tapasulaku.
narayan babu vedula
jamshedpur
లక్ష్మణదేవర నవ్వు గురించి Satyanarayana Piska అభిప్రాయం:
05/23/2012 9:38 pm
దితి సహోదరి భర్త అయిన శివుడిని
సురేశ్ కొలిచాలగారు పై విధంగా అన్నారు. శివుడు దితి సహోదరి భర్త ఎలా అయ్యాడు?! అర్థంకాలేదు. దితి సహోదరి పార్వతీదేవా? ఎలాగ? వివరించగలరని కోరుతున్నాను.
చందవరం, ప్రకాశం జిల్లా గురించి శారదా కిషోర్ అభిప్రాయం:
05/23/2012 4:55 am
1. బెండకాయ వేపుడు చేసేటప్పుడు ముక్కలు జిగురు రాకుండా, అడుగున అంటుకోకుండా ఉండాలంటే వేపుడు చేసే పాత్రలో కొంచెం ఇంగువ వెయ్యాలి.
2. క్యాబేజి వండేటప్పుడు చెంచా నిమ్మరసం వేస్తే వాసన రాకుండా ఉంటుంది
3. అనీజీ (uneasy) గా ఉన్న టైంలో మళ్ళి ప్రశాంతంగా అవ్వాలంటే ఇంద్రాణి గారి కవిత చదవాలి
మహాకవి తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మాహాత్మ్యము’ గురించి Satyanarayana Piska అభిప్రాయం:
05/23/2012 1:40 am
ఈరోజు “మహాకవి తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము” వ్యాసమును చదివే భాగ్యం కలిగింది. రమణగారూ! మీ వ్యాసము అమోఘం. చాలా చాలా బాగుంది. ఈ కావ్యములో ఇన్నేసి మంచి పద్యములు ఉన్నాయని ఇప్పటివరకు తెలియదు. వాటిని ప్రతిపదార్థములతో మీరు వివరించిన తీరు ప్రశంసనీయం. మొదట కఠినసమాస భూయిష్ఠంగా గోచరించిన పద్యములు, మీ వివరణ తర్వాత ఆస్వాదనీయ మధురఫలములుగా మారిపోయినవి. మీకు అనేక ధన్యవాదములు, మరియు అభినందనలు.
మీ లేఖిని నుండి ఇలాంటి మరికొన్ని సాహితీవ్యాసములు వెలువడాలని అస్మదీయుల ఆకాంక్ష.
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి మోహన అభిప్రాయం:
05/18/2012 3:06 pm
కావ్యాల నాయకుడు ఎప్పుడూ ధీరోదాత్తుడే. ఈ ధీరోదాత్తుడు, అతని పేరులా ధీరుడు, ఉదాత్తుడు. గొప్ప వంశానికి చెందినవాడు, ఇట్టి నాయకులు విరహముతో బాధపడుతున్నా సామాన్య మానవునిలా నిగ్రహమును కోల్పోరు. కిష్కింధ కాండలో రాముడు సీత విరహముతో బాధ పడుతున్నప్పుడు కూడ దారిలో కనబడే ప్రకృతి దృశ్యాలను వర్ణించడము మరువలేదు. నా ఉద్దేశములో రామాయణములోని యీ ప్రకృతి వర్ణనలు నిజముగా చాల అందమైనవి. అదే విధముగా ఇక్కడ యక్షుడు కూడ నిగ్రహవంతుడై కనబడుతాడు. అదియునుగాక, అతని ప్రధానమైన గురి తన భార్యకు తన సందేశమును అందజేయడము. ఆ కార్యములో కృతకృత్యుడు కావాలంటే దారిని చక్కగా వివరణలతో మేఘునికి తెలుపవలెను గదా! అందువల్ల ఇది ఒక యాత్రా మార్గదర్శిలా అనిపిస్తుంది. కాని ఇందులో ముఖ్యమైన రసము విరహమే. కావ్య లక్షణాలు, ధీరోదాత్తుల లక్షణాలను గురించి క్లుప్తముగా ఇక్కడ చదువవచ్చును. ఇది పాత తెలుసా పాఠకులకు Down the memory lane లాటిది. – మోహన
కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి krish అభిప్రాయం:
05/18/2012 8:07 am
Nice story, don’t mind comments like from Sridhar. I am sure its a good story.
కినిమా పత్రిక నుంచి – 3 గురించి రాజేంద్ర కుమార్ దేవరపల్లి అభిప్రాయం:
05/16/2012 8:39 pm
రోహిణీప్రసాద్ గారు,
మీరన్నది నిజమే గానీ ఆశ్చర్యం ఏమీ లేదు. అందులో, గత ఇరవైయేళ్ళలో సమగ్రమైన తెలుగు సినిమా సమీక్ష అన్నది నా కళ్ళబడలేదు. సమీక్షకులున్నారు కానీ పత్రికలకా అవసరం లేదు. ఇవ్వాళ తెలుగుదేశములో ఎన్ని సినిమా పత్రికలొస్తున్నాయన్నది ఎవరూ నికరంగా తేల్చిచెప్పలేని ఒక విచిత్రమైన ప్రశ్న. ఇవాళ వస్తున్న సినిమా పత్రికలు అభిమానుల కోసమే పాఠకులందరి కోసం కాదు. మిగతా వాటిల్లో అంటే సినిమా పత్రికలు కాని వాటిల్లో సినిమా వార్తలు, విశేషాలూ సచిత్రంగానే ఉంటాయి తప్ప సినిమా సమీక్షలు ఉండవు. ఈనాడు దినపత్రిక ప్రింట్ ఎడిషన్ లో ఇవ్వదు కానీ ఆన్ లైన్ ఎడిషన్ లో సినిమా సమీక్షలు ఇస్తుంది. ఆంధ్రభూమి వెన్నెల ప్రతి శుక్రవారం సినిమా అనుబందం ఉన్నవాటిలో చాలా మెరుగు.
రాష్ట్రంలో జర్నలిజం కోర్సు అందిస్తున్న యే విశ్వవిద్యాలయంలోనూ సినిమా అనేది ‘స్పెషలైజేషన్’ గా లేదు. పైగా యూనివర్శిటీ పట్టాలు పుచ్చుకున్నవారు దాదాపుగా ఎవరూ సినిమా జర్నలిజంలో స్థిరపడటం లేదు.కొ.కు, ఇంటూరి వెంకటేశ్వరరావు, కాట్రగడ్డ నరసయ్య ప్రభృతులు రాసిన సినిమా వ్యాసాల గురించి ఇవ్వాళ దాదాపుగా ఎవరికీ తెలీదు. తెలియనప్పుడు ‘సినీజర్నలిజంలో అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడాలను గురించి కామెంట్లు రాయకపోవడం’ సామాన్యమైన విషయం. అయితే ఈ మాట పాఠకుల వరకూ మీపరిశీలన నిజమే.
హాబూ నిప్పు గురించి KMK Sastry అభిప్రాయం:
05/16/2012 2:45 pm
ఆ రాత్రి చెవులు బద్దలైపోయేంత గట్టిగా మెరుపు మెరిసింది?
సరి చేసుకోగలరు.
కోటేశ్వర శాస్త్రి.
[కృతజ్ఞతలు – సం.]
మల్లె అంటు గురించి జ్యోతిర్మయి అభిప్రాయం:
05/15/2012 11:08 pm
“ఎంతో దూరాన తాను వదిలేసిన తన వెచ్చని కుదురును
పచ్చని బాల్యాన్ని తలుచుకుని చిన్నబోయిన మల్లె అంటు”
ఈ వాక్యాలు చదివాక చిన్నబోయింది మల్లె అంటు మాత్రమే కాదులెండి… తడిపొడిగా తడిసిన జ్ఞాపకాలు కదిలాయి..