ఉష గారి బాధ అర్ధమవుతున్నది. కాని, కొంచెం స్పష్టంగా చెప్పవచ్చు కదా అనిపించింది. ఈమాటలో అందరి వ్యాఖ్యలూ కాదు, రమా భరద్వాజ పేరిట వస్తున్న వ్యాఖ్యలు మాత్రమే పెడసరంగా వుంటున్నాయి. ఆవిడ గారు పనికట్టుకుని కొందరి మీద రాళ్ళు రువ్వే పని పెట్టుకున్నట్టు, ఆ రాళ్ళన్నీ ఈమాట వైపే రువ్వుతున్నట్టు అనిపిస్తున్నది.ఆవిడ ఇంకెక్కడా కనిపించరు కనుక ఈ మాట అనవలసి వస్తున్నది. అన్యధా భావించరాదు.
చర్చ అఫ్సర్ పుస్తకం “వూరి చివర” గురించి. పుస్తకం చదివిన వేలూరి గారు ఆయనకు తోచింది రాసారు. అందులో విమర్శ కూడా వుంది. రమా భరద్వాజ గారికి ఆ విమర్శ కనిపించలేదు. అఫ్సర్ ని వేలూరి పొగిడారో అని చిన్న పిల్లలాగా ఉక్రోషం పట్టలేక యాగీ చేస్తున్నారు. రమ గారూ: చర్చని పుస్తకం మీద పెట్టి, అందులో అకవిత్వం ఏదో చెప్పగలిగితే బాగుంటుందేమో చూడండి. ఆ విధమ్మున అఫ్సర్ ని అకవి అనాలన్న మీ వుద్దేశం తీరుతుంది. ముందు అఫ్సర్ ని శుభ్రంగా వుతికి ఆరేసిన మీదట ముకుంద రామారావుకి మహాకవి అన్న అచ్చోసి వదులుదాం.
ఈమాటని గూర్చి నా “మరువం” బ్లాగులో మంచు మీద రాసిన ఓ కవితకి ఒకరి వ్యాఖ్య ఆధారంగా మొదటసారి సంవత్సమున్నర క్రితం మీ పత్రికలో చూడటం సంభవించింది. అప్పటినుంచీ సంచికల ఆధారంగా కాక సమయాన్ని బట్టి రావటం, ఈమాట రచయితలు అన్న టాబ్ నుంచి ఒకరిని ఎంచుకుని చదవటం. కనుక పాఠకురాలిగా మీ పత్రిక వయసులో నాది ఇరవై శాతం లోపే. అలాగే రచయితలనీ ఓ పాతికశాతం పూర్తిచేసాను. నా అభిరుచి కవితలు, పరిశోధనా వ్యాసాలు, కథలు కనుక అవి పట్టి పట్టి చదవటం అలవాటు. చదవటం ఒక కాలక్షేపంగా, జీవితానికి నేపథ్యంలో వున్న అభిరుచి మాత్రమే. అలాగే నా రచనలూను. అవి నా జీవితాన్నల్లుకున్న పడుగుపేకలు కాకపోయినా నాకత్యంత ప్రశాంతత దొరికేది వాటి వలననే. అన్నీ సగటు స్థాయిలో ఉన్న ఓ సాధారణ వ్యక్తిని. ఇది నా గురించిన స్వపరిచయం. ఇక ఈ వ్యాఖ్య ఈ ఒక్క రచనకే కాదు, నేను గమనించిన ఓ తీరు తెలుపటానికే, మీరు ఇది ప్రచురించకపోయినా వాటిల్లే నష్టం ఏమీ లేదు.
* * * * *
మీ పత్రిక ఒక చక్కని సాంప్రదాయంలో కొనసాగుతుంది. రచనలను గూర్చి కాక వ్యాఖ్యలను/విమర్శలను గూర్చీ ఈ మాట. ప్రింటు పత్రికల్లో ఒక రచనకి సంపాదకునికి లేఖగా – ప్రశంస/విమర్శ అందుతాయి. ఇక్కడ కొన్నిసార్లు ఒక రచనని చక్కని వ్యాఖ్యారూప వనరులు కలిపి మరింత సంపూర్ణం చేసేవారున్నా, కొన్ని కేవలం ఒక చర్చ, రచ్చగా అవుతున్నాయి. విమర్శలు చదవకుండా వెళ్ళొచ్చా అంటారా, అవి ఒక్కోసారి బంగారు నగకి రతనాలు పొదిగినట్లుగా ఉండబట్టే అట్టి చక్కటి చదువరులు/విమర్శకులు కనపడబట్టే చదివేది. మరికొన్ని ఇక్కడ నుండి వెళ్ళేసరికి అసలు రచనని చిల్లులకి అతుకేసి కుట్టిన చింకిపాతలా తోచేలా చేస్తున్నాయి. కొన్ని ఎంత తీవ్రంగా ఉంటున్నాయంటే, రచయిత చేత “అగత్యం” పట్టింది అని అనిపించేంత. మరి కొన్ని రచయితని ఒంటరిని చేసి అంతా కలిసి యుద్దం చేసినంత. పత్రికకి నిష్పక్షపాతం, అభిప్రాయాల పట్ల సహనం ముఖ్యమే కానీ వాటి తీరు వ్యక్తిగత దూషణగా మారినప్పుడు మీ బాధ్యత లేదా? ఒక్కోసారి 1:on:1 లేదా ఒక్కరిదే విలువిద్యాప్రదర్శన లా అవుతుందిక్కడ. పోటాపోటీగా back to back మాటలు రువ్వేస్తూ, అస్త్రాలు ముందే అరచేత బిగించి ఆవలీలగా వేళ్ళతో అక్షరబాణాలు సంధిస్తూ అన్నట్లుగా.. మరి అది అన్ని రచనలకా అంటే అలా లేదు. అసలు కొన్ని రచనలు ఏ ప్రాతిపదికన తీసుకున్నారు అని ఆలోచించేలా ఉంటాయి. వాటికి ప్రశంసలు మరింత తికమక పెట్టేలా ఉంటాయి. కనుక ఇక్కడి ప్రశంసలు లేదూ కనీసం రచయిత కృషి పట్ల సదభిప్రాయం [చాలా తక్కువ మోతాదులోనైనా] విమర్శలు [సద్విమర్శలా/కువిమర్శలా ఆయా వారికే తెలియాలి] ఊహాతీతం. ఇలా రాస్తున్నానని నేను ఎవరికీ సానుకూలురాలినీ, సానుభూతిపరురాలినీ కాదు. అస్మదీయులు, తస్మదీయులూ లేరు. నిజానికి ఓ అనాథ పాఠకురాలిని. ఇక్కడ ఓ లోకం వెదుకుతున్నదాన్ని. ఒక రచయితని/ఒక రచనని సానబట్టి, ఆ ప్రక్రియలో రచయిత చేత లోతుగా ఆలోచింపచెయ్యడం సర్వదా అభిలషనీయం. నొప్పించడం ఎవరి ఉద్దేశం కాకపోయినా, ఒక పద్దతిగా అది జరగాలని మాత్రమే నా ఉద్దేశం. నేను ఈ అనంత సాహితీవాహినిలో ఓ బిందువునే. మన వెనక పుట్టి మనని దాటి వెళ్ళే సాహిత్యానికి నా వంతు ఏముందా ఇవ్వనూ అని యోచించేదాన్ని మాత్రమే. “ఔరా పిల్లకాకి/కాకిపిల్లా!….” అన్నా నాకు ఆనందమే.
పైన చెప్పినట్లుగా పాతిక శాతం పాఠకురాలిని, ఇలా నాలుగు దారుల కూడలిలో ఉన్నాను. నేను నడిచి వచ్చిన దారి నన్ను అయోమయంలో పడేస్తుంది. రచన చదివి పోవటమా/విమర్శలని పట్టించుకోకపోవటమా/ “ఈమాట” అంటే ఇది అని అవగతం అయ్యేంత వరకూ ఇలా కొనసాగటమా మిగిలున్నాయిక. నా ఈమాట మీ “ఈమాట” లో వెలుగు చూడకపోయినా దాదాపుగా ఆర్నెల్ల పాటుగా సందిగ్ధంలో పడి ఆగిన మాట వెలికివచ్చింది.
రామారావుగారూ,
ఆముక్తమాల్యద కర్తృత్వం గురించి మళ్ళీ మళ్ళీ అవే విషయాలు చర్చించడం అనవసరం అన్నాను కాని దాని గురించి కొత్త మార్గంలో పరిశోధించడమే అనవవసరమని నా ఉద్దేశం కాదు. “కొత్త విషయాలేమైనా తెలిస్తే తప్ప” అన్న కొసరు అందుకే 🙂
అలాగే ఇలాంటి పరిశోధనకి statistical techniques ఉపయోగపడవని కూడా నా అభిప్రాయం కాదు. వాటిని తెలుగు సాహిత్యంలో ఇంతవరకు నాకు తెలిసి ఎవరూ ఉపయోగించలేదు కాబట్టి, ఎంతవరకూ ఎలా ఉపయోగపడతాయో ప్రయోగాల ద్వారా పరిశీలించిన తర్వాత ఉపయోగించడం సమంజసమని నా ఉద్దేశం.
“ఏ కారణం చేత ఐతేనేం తెలుగులో ఆముక్తమాల్యద రాయటానికి పూనుకున్నాడు కాని సంస్కృత శ్లోక రచనా పథకాలే ఎక్కువగా ఈ పద్యాల్లోనూ వున్నాయి.” నాది కూడా సరిగ్గా ఇదే అభిప్రాయం. తెలుగు మాట్లాడని వాడు కావడం వల్లనే అలా రాసేడని నా ఉద్దేశం. ఇంతకుముందు చాలామంది విమర్శకులు దీనిని ప్రౌఢశైలి అని, క్షాత్రశైలి అని, క్లుప్తత అని అన్నారు. భావాలలో ప్రౌఢత్వాన్ని పక్క పెడితే, భాషలోని ప్రౌఢత్వం మాత్రం కవి తెలుగువాడు కాకపోవడం వల్లనే వచ్చిందని నాకనిపించింది. అయితే పూర్వకవి ప్రయోగాలు కనిపించనంత మాత్రాన అతనికి తెలుగు సాహిత్యంతో చెప్పుగోదగ్గ పరిచయమే లేదు అని చెప్పలేం. తెలుగువాడు కాకపోవడం వల్ల ఆ ప్రయోగాలు సహజంగా అతని మనసులో ముద్రపడలేదని అనుకోవచ్చు కదా.
సరళంగా ఉండే పద్యాల విషయంలో – we have to look at how they are distributed across the kavya. Only then we can decide on whether they are part of the inherent variability or written/modified by someone else. నేను చదివినంతలో అవి కావ్యమంతా అక్కడక్కడా ఉన్నాయనిపించింది. రాయల కలలో విష్ణువు చెప్పిన మాటల్లోనే, “ఎన్నిను…” అన్న పద్యంలో రాయల ముద్ర చాలా బలంగా కనిపిస్తుంది. వెంటనే “తెలుగదేలయన్న…” పద్యం. “బాసాడి” అన్న పదం ఇతర తెలుగు కవులెవరైనా ప్రయోగించారేమో నాకు తెలియదు. అలాగే రాజనీతి చెపుతున్నప్పుడు కాని (ముఖ్యంగా కందపద్యాలు), విష్ణుస్తుతి చేసేటప్పుడు కొన్ని చోట్ల, ఇలా అక్కడక్కడ కావ్యమంతా సరళమైన, సహజమైన తెలుగు పద్యాలు కనిపిస్తాయి, రెండుమూడు ఉదాహరణలు:
ఏపట్టున విసువక ర
క్షాపరుడవు గమ్ము ప్రజల చక్కి, విపన్ను
ల్గూపెట్టిన విని తీర్పుము
కాపురుషుల మీద నిడకు కార్యభరంబుల్
ఇప్పటి (జూలై 2010) కృష్ణదేవ రాయల ప్రత్యేక సంచిక సందర్భముగా ఈ వ్యాసం కూడా ముఖ్యమైనదే. కృష్ణరాయల గురించి, వారి కాలాన్ని గురించి, అప్పటి కవులను గురించి ప్రచురితమైన ఇలాటి వ్యాసాల పట్టికను ఒకటి తయారుచేసి సంపాదకులు ఒక చోట ఉంచితే బాగుంటుందేమో?
అష్టదిగ్గజాలగురించి ఒక మాట. అష్టదిగ్గజాలు, నవరత్నాలు అందరూ ఎందుకు తెలుగు కవులై ఉండాలి? రాయల ఆస్థానములో వ్యాసతీర్థులవంటి గొప్ప సంస్కృత కవులు, పండితులు, కర్ణాటక కవిసార్వభౌముడైన తిమ్మణార్యునివంటి వారు కూడా ఉన్నారు గదా? వారీ బిరుదుకు అర్హులు కారా? నాకేమో అనిపిస్తుంది ఎన్నో కట్టుకథలతో ఇది కూడా ఒక కట్టు కథ అనే.
సురేశ్ కొలిచాల ఈమాట సంపాదకుల్లో లేరు. అందువల్ల రాబోయే సంచికలో ఏ వ్యాసాలూ, శీర్షికలూ ఉండబోతున్నాయో ఆయనకీ తెలియదు. సురేశ్ ఈ పరిశోధనా పత్రాన్ని మా అభ్యర్థన మేరకు అనువదించారు. అంతవరకే. ఈ సంచికలో ఏ రకమైన సాహిత్యం ఉండాలి అనేది మా నిర్ణయం. అందువల్ల ఈ సంచికపై మీ అభిప్రాయాలకు కారణం, సంపాదకులమైన మేమే.
ఒక కవిత ఏ విషయం మీద వ్రాసినా ,వ్యక్తీకరింపబడిన అనుభూతి ఏదైనా ,మహాబలీయమైన ముద్ర పాఠకుడి మీద వేసి “ఎంత బాగుంది” అని పదే పదే పలవరించేట్లు చేయాలి. అనేక మార్లు తరగని ఆనందంతో చదువుకునేటట్లు జేసి, దాన్ని కంఠవశం చేసుకోవాలనే తపనను కలిగించకపోతే ఆ కవిత కవితే కాదు.దాని ఆయుఃప్రమాణం అతి స్వల్పం: దాని ఎఫెక్ట్ , ఎఫిమిరల్. కవిత గొప్పదా,కాదా అనే విషయానికి సంబంధించి ఇది నిజమైన టెస్ట్ లా భావించవచ్చుననుకుంటాను.
వ్రాసేది కవిత కావాలి. అంటే పైన చెప్పిన శక్తిని అది సంతరించుకోవాలి. వ్రాసే వ్యక్తి కవి కావాలి. అంటే కేవలం మాటలు పేర్చటం మాత్రమే తన పనిగా భావించే వ్యక్తి కాకూడదు. ఒక బలమైన అనుభూతికి లోనై వ్రాయాలి.
ప్రాచీన ఛందో రీతులలో వ్రాసిన పేరడీ పద్యాలు కూడా కంఠవశం అయ్యే గుణం కలిగి ఉంటవి. అంత మాత్రం చేత అవి కవిత్వం అయిపోవు. ఆ కంఠవశం అయ్యే గుణాన్ని అవి కలిగి ఉండటం మన ప్రాచీన ఛందో రీతుల గొప్పదనం, వాటి వైశిష్ట్యం. కంఠవశం అయ్యే గుణం లేకపోతే మంచి కవిత్వం కాదన్నాము గానీ, కంఠవశం అయ్యే ప్రతిదీ మంచి కవిత్వం అనటం సాధ్యం కాదు.
వచనకవితలో కంఠవశం అయ్యే గుణం సాధించటం చాలా చాలా కష్టం. వచన కవి చాలా ప్రజ్ఞావంతుడై ఉండాలి. కవితా రసవిద్యా రహస్యం తెలిసినవాడై ఉండాలి. శక్తిమంతమైన,రసస్ఫోరకమైన పదచిత్రాలను,వైరుధ్యాలు లేని మెటఫర్ల సమాహారాలను, సంకేతాలను తనదైన, ప్రగాఢమైన అనుభూతిని ఆవిష్కరించటానికి, కవిత్వీకరణ మాధ్యమాలుగా సున్నితంగా మలచుకోవాలి. అంతేకాదు, కవితా పంక్తులలో ఒక మనోజ్ఞమైన, లయబద్ధమైన నడకను, పదబంధప్రయోగంలో శబ్దసారూప్యత వల్ల జనించే రమ్యమైన రిధంను అతను సాధించాలి. అప్పుడది గొప్ప కంఠవశమయ్యే గుణాన్ని, ప్రబలంగా ఆకట్టుకునే శక్తిని సంతరించుకుని ఎప్పుడూ మన మనస్సుని అంటిపెట్టుకుని ఉంటుంది. గొంతెత్తి పరవశంతో చదువుకునేటట్లు చేస్తుంది.
నాకు తెలిసినంతవరకు,నా అనుభవంలోకి వచ్చినంతవరకు వచనకవిత సమగ్ర సర్వాంగ సుందరంగా వ్రాసిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు మాత్రమే. వేరే వాళ్ళ కవితాపంక్తులు మూడు నాలుగు కంటే ఎక్కువ గుర్తు ఉండవు. తిలక్ కవితలు మనసులో మార్మోగుతూనే ఉంటవి. చాలా వరకు వారికవితలు ఆమూలాగ్రం ఇట్టే అవలీలగా కంఠవశం అవుతవి. పలుమార్లు పంక్తులకు పంక్తులు, కవితలకు కవితలు గొంతెత్తి చదువుకుంటూ పులకింతలు పోవటం నా స్వానుభవం.ఇది నూటికి నూరుపాళ్ళు సత్యం.
కవిత్వం వ్రాసే వాళ్ళు మానవ జీవితానుభవాలలో దేనిమీదైనా వ్రాయవచ్చు. ఒక తాత్విక చింతనను కానీ,సామాజిక స్పృహను కానీ సాంఘిక,ఆర్ధిక,రాజకీయ దురన్యాయాన్ని కానీ దోపిడీని కాని కవితలో ఆవిష్కరించవచ్చు. కానీ అది కవితామయం గానే జరగాలి. కవిత యొక్క వస్తువిశేషము కవిత యొక్క గొప్పదనం మీద ప్రభావాన్ని చూపలేదు. కవిత రచనా రీతికి సంబంధించినది; వస్తుప్రాధాన్యతకు సంబంధించినది కాదు. అయితే, కవిత్వానికి సాహిత్యానికి సామాజికప్రయోజనం లేదని కానీ, ఉండకూడదని కానీ కాదు. కవిత్వం, తక్కిన సాహిత్య ప్రక్రియలన్నీ రససిధ్ధి ద్వారా పాఠకులని ఉత్తమ మానవీయత వైపు నడిపించాలి. పునరుక్తి దోషంగా భావించవద్దు :ఇది రససిద్ధి ద్వారానే జరగాలి.
ఇకపోతే కవిత్వ విమర్శ కవితల గుణదోషపరిశీలనకు మాత్రమే పరిమితమై ఉండాలి. అటువంటి పరిశీలన ఇంటలెక్చువల్ లాంగ్వేజ్ లో ఎనలిటికల్ గా మాత్రమే జరగాలి. వ్యక్తిగత విమర్శలకు, అవహేళనలకు, నిందలకు దిగజారకూడదు. కవిత కవితై ఉండాలి; సాహిత్యవిమర్శ సాహిత్యవిమర్శ మాత్రమే అయి ఉండాలి. అలా మన స్థాయిని పెంచుకునే సామర్ధ్యం మనకు ఉంది, ఆ అవసరం కూడా ఉంది.
అఫ్సర్ గారంటే నాకు అపారమైన గౌరవం. ఎందుకంటే ఆయన సౌమ్యంగా మాట్లాడడమే కాదు, మాటల్ని ఆచి తూచి వాడతారు. అలాంటి వ్యక్తి ఇలాంటి దురుసుతనంతో కూడిన వ్యాఖ్య చేస్తారని ఊహించడం కష్టం.
అఫ్సర్ గారి దృష్టిలో అమెరికా పాఠకులన్నా, రచయితలన్నా చాలా చాలా చిన్న చూపుందని ఇప్పుడే అర్థమయ్యింది. ఇక్కడి తెలుగు పాఠకుల, రచయితల అభిరుచులన్నీ ఫ్రోజన్ బ్రతుకులని చిటికలో నిర్ధారించేసారు.
రామారావు గారేమన్నారు? ఎవరికోసమో కాకుండా వాళ్ల కోసం వాళ్లు రాసుకునే గుర్తింపు, సాహసం మన విదేశ తెలుగురచయితలు / కవులకు ముందుముందైనా వస్తాయని ఆశ పడ్డారు. అంతే ఒక్కసారి విరుచుకు పడిపోయారు క్షణంలో అమెరికాలో ఉన్న తెలుగు పాఠక, రచయితల సమూహాన్ని ఒక్క చేత్తో ఫ్రోజన్ రాటకి కట్టేసారు. ఆంధ్రాలో పాఠకోత్తముల స్వభావాలు మారిపోయాయట. రచయితలూ మారిపోయారట. వారిని అందుకోవడానికి అమెరికా తెలుగు వారికి కొన్ని తరాలు పడుతుందట. అమెరికా తెలుగు వారికి ఇదీ అఫ్సర్ గారి కితాబు.
ఇరవై ఏళ్ళ క్రితం తెలుగు సాహిత్యం అమెరికాలో అందుబాటులో లేదంటే నమ్మొచ్చు. ఇంటర్నెట్ వచ్చాకా తెలుగు సాహిత్యం గురించీ, పత్రికల గురించీ తెలియదంటే ఎవరూ నమ్మరు. ఏఏ పత్రికల్లో ఏఏ వాదాల సాహిత్యం వస్తుందో, ఎవరి రచనలు అచ్చవుతాయో అందరికీ తెలుసు.
అఫ్సర్ గారు అమెరికాలో ఈ ఫ్రోజన్ సమాజాలకి దూరంగా వుంటూ ఆంధ్రాలో తెలుగు పాఠకుల మార్పుని ఎలా తెలుసుకున్నారో తెలుసుకోవాలని ఉత్సాహంగా వుంది. ఎవరికయినా ఇంటర్నెట్టూ, లేదా ఒకరిద్దరితో ఫోను సంభాషణలూ తప్పించి వేరే మార్గాలేమిటా ఆన్నది తెలుసుకోవాలనుంది. విప్లవ రచయితల్ని తిట్టే వారూ వున్నారు. ఇతర రచయితల్నీ తూలనాడే విప్లవ మేధావులూ వున్నారు. ఇందులో ఎవరికెవరూ తీసిపోలేదు. సాహిత్యం వాదాలకీ, ప్రాంతాలకీ అంకితమై పోయింది కాబట్టే ఈ ఉనికి వివాదాలూ, నడ్డి గోకుడు గ్రూపులూ పుట్టుకొచ్చాయి. ఏ వాదమయినా మంచి కవిత్వం మంచి కవిత్వమే! దానికి ఎవరి భుజాలూ, బాకాలూ అవసరం లేదు. ఆంధ్రాలో వచ్చిన సాహితీ మార్పులు తెలుసుకోలేదని అఫ్సర్ గారు ఎలా నిర్ధారణ కొచ్చారో తెలియ పరిస్తే తెలుసుకోవాలనుంది. ఇప్పటికీ అమెరికా రచయితలకంటే ఓ మెట్టు మేమే పైనున్నామన్న బలమైన అభిప్రాయం ఆంధ్రా రచయితల్లో నాటుకుపోయింది. కథయినా, కాకరకాయయినా వారే వండాలి, వడ్డించాలన్న ధోరణి బలంగా కనిపిస్తూ వుంటుంది. బహుశా ఇదే అభిప్రాయం పదేళ్ళుగా అమెరికాలో ఉంటున్న అఫ్సర్ గారికీ స్థిరపడిందా అన్న అనుమానం ఆయన వ్యాఖ్యల్లో కనిపించింది.
చివరగా “ఇప్పుడు అక్కడి సాహిత్య సాంద్రతని అందుకోడానికి అమెరికన్ తెలుగు రచయితలకు ఇంకో తరం పడ్తుందేమో!” అని బ్లాంకెట్ స్టేట్మెంటు చేసేసారు. ఇలాంటి దురుసు వ్యాఖ్యలతో సాహిత్య సాంద్రత పెరుగుతుందేమో తెలీదు.
అఫ్సర్ గారూ మీరు మీ గురించి చెప్పండి. శ్రద్ధగా వింటాం. కవిత్వంలో విప్లవ కక్కులు ఉన్నాయని ఒక వ్యాఖ్య వస్తే మీరు అందర్నీ దూషించడం పెద్దరికం అనిపించుకోదు. చివరగా పదేళ్ళుగా అమెరికాలో ఉంటున్నారు కాబట్టి మీరూ అమెరికన్ తెలుగు రచయితల కోవలోకే వస్తారని నా నమ్మకం. కాదంటారా? మీకు శతకోటి నమస్కారాలు.
ఇక్కడ మిగిలిన పాఠకులకు ఒక చిన్న విషయం చెప్పాలి. రామారావుగారు మే 2000 ఈమాటలో ఆముక్తమాల్యదపైన ఒక దీర్ఘమైన వ్యాసమే వ్రాసారు. చదవనివారు దానిని చదివితే బాగుంటుంది. విధేయుడు – మోహన
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి కృష్ణ అభిప్రాయం:
07/09/2010 6:45 pm
ఉష గారి బాధ అర్ధమవుతున్నది. కాని, కొంచెం స్పష్టంగా చెప్పవచ్చు కదా అనిపించింది. ఈమాటలో అందరి వ్యాఖ్యలూ కాదు, రమా భరద్వాజ పేరిట వస్తున్న వ్యాఖ్యలు మాత్రమే పెడసరంగా వుంటున్నాయి. ఆవిడ గారు పనికట్టుకుని కొందరి మీద రాళ్ళు రువ్వే పని పెట్టుకున్నట్టు, ఆ రాళ్ళన్నీ ఈమాట వైపే రువ్వుతున్నట్టు అనిపిస్తున్నది.ఆవిడ ఇంకెక్కడా కనిపించరు కనుక ఈ మాట అనవలసి వస్తున్నది. అన్యధా భావించరాదు.
చర్చ అఫ్సర్ పుస్తకం “వూరి చివర” గురించి. పుస్తకం చదివిన వేలూరి గారు ఆయనకు తోచింది రాసారు. అందులో విమర్శ కూడా వుంది. రమా భరద్వాజ గారికి ఆ విమర్శ కనిపించలేదు. అఫ్సర్ ని వేలూరి పొగిడారో అని చిన్న పిల్లలాగా ఉక్రోషం పట్టలేక యాగీ చేస్తున్నారు. రమ గారూ: చర్చని పుస్తకం మీద పెట్టి, అందులో అకవిత్వం ఏదో చెప్పగలిగితే బాగుంటుందేమో చూడండి. ఆ విధమ్మున అఫ్సర్ ని అకవి అనాలన్న మీ వుద్దేశం తీరుతుంది. ముందు అఫ్సర్ ని శుభ్రంగా వుతికి ఆరేసిన మీదట ముకుంద రామారావుకి మహాకవి అన్న అచ్చోసి వదులుదాం.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి ఉష అభిప్రాయం:
07/09/2010 8:41 am
ఈమాటని గూర్చి నా “మరువం” బ్లాగులో మంచు మీద రాసిన ఓ కవితకి ఒకరి వ్యాఖ్య ఆధారంగా మొదటసారి సంవత్సమున్నర క్రితం మీ పత్రికలో చూడటం సంభవించింది. అప్పటినుంచీ సంచికల ఆధారంగా కాక సమయాన్ని బట్టి రావటం, ఈమాట రచయితలు అన్న టాబ్ నుంచి ఒకరిని ఎంచుకుని చదవటం. కనుక పాఠకురాలిగా మీ పత్రిక వయసులో నాది ఇరవై శాతం లోపే. అలాగే రచయితలనీ ఓ పాతికశాతం పూర్తిచేసాను. నా అభిరుచి కవితలు, పరిశోధనా వ్యాసాలు, కథలు కనుక అవి పట్టి పట్టి చదవటం అలవాటు. చదవటం ఒక కాలక్షేపంగా, జీవితానికి నేపథ్యంలో వున్న అభిరుచి మాత్రమే. అలాగే నా రచనలూను. అవి నా జీవితాన్నల్లుకున్న పడుగుపేకలు కాకపోయినా నాకత్యంత ప్రశాంతత దొరికేది వాటి వలననే. అన్నీ సగటు స్థాయిలో ఉన్న ఓ సాధారణ వ్యక్తిని. ఇది నా గురించిన స్వపరిచయం. ఇక ఈ వ్యాఖ్య ఈ ఒక్క రచనకే కాదు, నేను గమనించిన ఓ తీరు తెలుపటానికే, మీరు ఇది ప్రచురించకపోయినా వాటిల్లే నష్టం ఏమీ లేదు.
* * * * *
మీ పత్రిక ఒక చక్కని సాంప్రదాయంలో కొనసాగుతుంది. రచనలను గూర్చి కాక వ్యాఖ్యలను/విమర్శలను గూర్చీ ఈ మాట. ప్రింటు పత్రికల్లో ఒక రచనకి సంపాదకునికి లేఖగా – ప్రశంస/విమర్శ అందుతాయి. ఇక్కడ కొన్నిసార్లు ఒక రచనని చక్కని వ్యాఖ్యారూప వనరులు కలిపి మరింత సంపూర్ణం చేసేవారున్నా, కొన్ని కేవలం ఒక చర్చ, రచ్చగా అవుతున్నాయి. విమర్శలు చదవకుండా వెళ్ళొచ్చా అంటారా, అవి ఒక్కోసారి బంగారు నగకి రతనాలు పొదిగినట్లుగా ఉండబట్టే అట్టి చక్కటి చదువరులు/విమర్శకులు కనపడబట్టే చదివేది. మరికొన్ని ఇక్కడ నుండి వెళ్ళేసరికి అసలు రచనని చిల్లులకి అతుకేసి కుట్టిన చింకిపాతలా తోచేలా చేస్తున్నాయి. కొన్ని ఎంత తీవ్రంగా ఉంటున్నాయంటే, రచయిత చేత “అగత్యం” పట్టింది అని అనిపించేంత. మరి కొన్ని రచయితని ఒంటరిని చేసి అంతా కలిసి యుద్దం చేసినంత. పత్రికకి నిష్పక్షపాతం, అభిప్రాయాల పట్ల సహనం ముఖ్యమే కానీ వాటి తీరు వ్యక్తిగత దూషణగా మారినప్పుడు మీ బాధ్యత లేదా? ఒక్కోసారి 1:on:1 లేదా ఒక్కరిదే విలువిద్యాప్రదర్శన లా అవుతుందిక్కడ. పోటాపోటీగా back to back మాటలు రువ్వేస్తూ, అస్త్రాలు ముందే అరచేత బిగించి ఆవలీలగా వేళ్ళతో అక్షరబాణాలు సంధిస్తూ అన్నట్లుగా.. మరి అది అన్ని రచనలకా అంటే అలా లేదు. అసలు కొన్ని రచనలు ఏ ప్రాతిపదికన తీసుకున్నారు అని ఆలోచించేలా ఉంటాయి. వాటికి ప్రశంసలు మరింత తికమక పెట్టేలా ఉంటాయి. కనుక ఇక్కడి ప్రశంసలు లేదూ కనీసం రచయిత కృషి పట్ల సదభిప్రాయం [చాలా తక్కువ మోతాదులోనైనా] విమర్శలు [సద్విమర్శలా/కువిమర్శలా ఆయా వారికే తెలియాలి] ఊహాతీతం. ఇలా రాస్తున్నానని నేను ఎవరికీ సానుకూలురాలినీ, సానుభూతిపరురాలినీ కాదు. అస్మదీయులు, తస్మదీయులూ లేరు. నిజానికి ఓ అనాథ పాఠకురాలిని. ఇక్కడ ఓ లోకం వెదుకుతున్నదాన్ని. ఒక రచయితని/ఒక రచనని సానబట్టి, ఆ ప్రక్రియలో రచయిత చేత లోతుగా ఆలోచింపచెయ్యడం సర్వదా అభిలషనీయం. నొప్పించడం ఎవరి ఉద్దేశం కాకపోయినా, ఒక పద్దతిగా అది జరగాలని మాత్రమే నా ఉద్దేశం. నేను ఈ అనంత సాహితీవాహినిలో ఓ బిందువునే. మన వెనక పుట్టి మనని దాటి వెళ్ళే సాహిత్యానికి నా వంతు ఏముందా ఇవ్వనూ అని యోచించేదాన్ని మాత్రమే. “ఔరా పిల్లకాకి/కాకిపిల్లా!….” అన్నా నాకు ఆనందమే.
పైన చెప్పినట్లుగా పాతిక శాతం పాఠకురాలిని, ఇలా నాలుగు దారుల కూడలిలో ఉన్నాను. నేను నడిచి వచ్చిన దారి నన్ను అయోమయంలో పడేస్తుంది. రచన చదివి పోవటమా/విమర్శలని పట్టించుకోకపోవటమా/ “ఈమాట” అంటే ఇది అని అవగతం అయ్యేంత వరకూ ఇలా కొనసాగటమా మిగిలున్నాయిక. నా ఈమాట మీ “ఈమాట” లో వెలుగు చూడకపోయినా దాదాపుగా ఆర్నెల్ల పాటుగా సందిగ్ధంలో పడి ఆగిన మాట వెలికివచ్చింది.
కృష్ణదేవరాయలు గురించి Megha అభిప్రాయం:
07/08/2010 11:00 pm
thanks Madhav
శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి Kameswara Rao అభిప్రాయం:
07/08/2010 9:43 pm
రామారావుగారూ,
ఆముక్తమాల్యద కర్తృత్వం గురించి మళ్ళీ మళ్ళీ అవే విషయాలు చర్చించడం అనవసరం అన్నాను కాని దాని గురించి కొత్త మార్గంలో పరిశోధించడమే అనవవసరమని నా ఉద్దేశం కాదు. “కొత్త విషయాలేమైనా తెలిస్తే తప్ప” అన్న కొసరు అందుకే 🙂
అలాగే ఇలాంటి పరిశోధనకి statistical techniques ఉపయోగపడవని కూడా నా అభిప్రాయం కాదు. వాటిని తెలుగు సాహిత్యంలో ఇంతవరకు నాకు తెలిసి ఎవరూ ఉపయోగించలేదు కాబట్టి, ఎంతవరకూ ఎలా ఉపయోగపడతాయో ప్రయోగాల ద్వారా పరిశీలించిన తర్వాత ఉపయోగించడం సమంజసమని నా ఉద్దేశం.
“ఏ కారణం చేత ఐతేనేం తెలుగులో ఆముక్తమాల్యద రాయటానికి పూనుకున్నాడు కాని సంస్కృత శ్లోక రచనా పథకాలే ఎక్కువగా ఈ పద్యాల్లోనూ వున్నాయి.” నాది కూడా సరిగ్గా ఇదే అభిప్రాయం. తెలుగు మాట్లాడని వాడు కావడం వల్లనే అలా రాసేడని నా ఉద్దేశం. ఇంతకుముందు చాలామంది విమర్శకులు దీనిని ప్రౌఢశైలి అని, క్షాత్రశైలి అని, క్లుప్తత అని అన్నారు. భావాలలో ప్రౌఢత్వాన్ని పక్క పెడితే, భాషలోని ప్రౌఢత్వం మాత్రం కవి తెలుగువాడు కాకపోవడం వల్లనే వచ్చిందని నాకనిపించింది. అయితే పూర్వకవి ప్రయోగాలు కనిపించనంత మాత్రాన అతనికి తెలుగు సాహిత్యంతో చెప్పుగోదగ్గ పరిచయమే లేదు అని చెప్పలేం. తెలుగువాడు కాకపోవడం వల్ల ఆ ప్రయోగాలు సహజంగా అతని మనసులో ముద్రపడలేదని అనుకోవచ్చు కదా.
సరళంగా ఉండే పద్యాల విషయంలో – we have to look at how they are distributed across the kavya. Only then we can decide on whether they are part of the inherent variability or written/modified by someone else. నేను చదివినంతలో అవి కావ్యమంతా అక్కడక్కడా ఉన్నాయనిపించింది. రాయల కలలో విష్ణువు చెప్పిన మాటల్లోనే, “ఎన్నిను…” అన్న పద్యంలో రాయల ముద్ర చాలా బలంగా కనిపిస్తుంది. వెంటనే “తెలుగదేలయన్న…” పద్యం. “బాసాడి” అన్న పదం ఇతర తెలుగు కవులెవరైనా ప్రయోగించారేమో నాకు తెలియదు. అలాగే రాజనీతి చెపుతున్నప్పుడు కాని (ముఖ్యంగా కందపద్యాలు), విష్ణుస్తుతి చేసేటప్పుడు కొన్ని చోట్ల, ఇలా అక్కడక్కడ కావ్యమంతా సరళమైన, సహజమైన తెలుగు పద్యాలు కనిపిస్తాయి, రెండుమూడు ఉదాహరణలు:
ఏపట్టున విసువక ర
క్షాపరుడవు గమ్ము ప్రజల చక్కి, విపన్ను
ల్గూపెట్టిన విని తీర్పుము
కాపురుషుల మీద నిడకు కార్యభరంబుల్
ఎక్కడి రాజ్యవైభవము? లెక్కడి భోగము? లేటి సంభ్రమం?
బక్కట! బుద్బుదప్రతిమమైన శరీరము నమ్మి మోక్షపుం
జక్కి గణింపకుంటి, యుగసంధుల నిల్చియు గాలు చేతి బల్
త్రొక్కుల నమ్మను ప్రభృతులున్ దుద రూపఱకుండ నేర్చిరే
ఎవ్వని చూడ్కిచేసి జనియించు జగంబు, వసించు నిజ్జగం
బెవ్వనియందు, డిందు మరి యెవ్వనియందిది, యట్టి విష్ణుతో
నివ్వల నొక్క వేల్పు గణియించిన పాతకి నౌదు నేడ నే
నెవ్విధియైన నిన్గదియ నేని యనన్ విని బంధమూడ్చినన్
(పోతన్నని కచ్చితంగా చదివే (వినే) ఉంటాడనడానికి ఈ పద్యమే సాక్ష్యం 🙂
కృష్ణరాయల కవిపోషణ గురించి mOhana అభిప్రాయం:
07/08/2010 1:12 pm
ఇప్పటి (జూలై 2010) కృష్ణదేవ రాయల ప్రత్యేక సంచిక సందర్భముగా ఈ వ్యాసం కూడా ముఖ్యమైనదే. కృష్ణరాయల గురించి, వారి కాలాన్ని గురించి, అప్పటి కవులను గురించి ప్రచురితమైన ఇలాటి వ్యాసాల పట్టికను ఒకటి తయారుచేసి సంపాదకులు ఒక చోట ఉంచితే బాగుంటుందేమో?
అష్టదిగ్గజాలగురించి ఒక మాట. అష్టదిగ్గజాలు, నవరత్నాలు అందరూ ఎందుకు తెలుగు కవులై ఉండాలి? రాయల ఆస్థానములో వ్యాసతీర్థులవంటి గొప్ప సంస్కృత కవులు, పండితులు, కర్ణాటక కవిసార్వభౌముడైన తిమ్మణార్యునివంటి వారు కూడా ఉన్నారు గదా? వారీ బిరుదుకు అర్హులు కారా? నాకేమో అనిపిస్తుంది ఎన్నో కట్టుకథలతో ఇది కూడా ఒక కట్టు కథ అనే.
విధేయుడు – మోహన
విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం గురించి Madhav అభిప్రాయం:
07/08/2010 11:19 am
రవికిరణ్ గారూ,
సురేశ్ కొలిచాల ఈమాట సంపాదకుల్లో లేరు. అందువల్ల రాబోయే సంచికలో ఏ వ్యాసాలూ, శీర్షికలూ ఉండబోతున్నాయో ఆయనకీ తెలియదు. సురేశ్ ఈ పరిశోధనా పత్రాన్ని మా అభ్యర్థన మేరకు అనువదించారు. అంతవరకే. ఈ సంచికలో ఏ రకమైన సాహిత్యం ఉండాలి అనేది మా నిర్ణయం. అందువల్ల ఈ సంచికపై మీ అభిప్రాయాలకు కారణం, సంపాదకులమైన మేమే.
మాధవ్ మాచవరం
సంపాదకుల బృందం తరఫున.
పువ్వులు.. పువ్వులు.. పువ్వులు .. గురించి రాఘవ అభిప్రాయం:
07/08/2010 8:26 am
ప్రస్తుతానికి శేషేంద్రశర్మగారి సాహిత్యకౌముది చదువుతున్నాను. అందులో ఆయన ఉటంకించిన
అన్నది గుర్తొచ్చింది, ఈ కవిత చదివితే.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి C.S.Rao అభిప్రాయం:
07/07/2010 7:54 pm
ఒక కవిత ఏ విషయం మీద వ్రాసినా ,వ్యక్తీకరింపబడిన అనుభూతి ఏదైనా ,మహాబలీయమైన ముద్ర పాఠకుడి మీద వేసి “ఎంత బాగుంది” అని పదే పదే పలవరించేట్లు చేయాలి. అనేక మార్లు తరగని ఆనందంతో చదువుకునేటట్లు జేసి, దాన్ని కంఠవశం చేసుకోవాలనే తపనను కలిగించకపోతే ఆ కవిత కవితే కాదు.దాని ఆయుఃప్రమాణం అతి స్వల్పం: దాని ఎఫెక్ట్ , ఎఫిమిరల్. కవిత గొప్పదా,కాదా అనే విషయానికి సంబంధించి ఇది నిజమైన టెస్ట్ లా భావించవచ్చుననుకుంటాను.
వ్రాసేది కవిత కావాలి. అంటే పైన చెప్పిన శక్తిని అది సంతరించుకోవాలి. వ్రాసే వ్యక్తి కవి కావాలి. అంటే కేవలం మాటలు పేర్చటం మాత్రమే తన పనిగా భావించే వ్యక్తి కాకూడదు. ఒక బలమైన అనుభూతికి లోనై వ్రాయాలి.
ప్రాచీన ఛందో రీతులలో వ్రాసిన పేరడీ పద్యాలు కూడా కంఠవశం అయ్యే గుణం కలిగి ఉంటవి. అంత మాత్రం చేత అవి కవిత్వం అయిపోవు. ఆ కంఠవశం అయ్యే గుణాన్ని అవి కలిగి ఉండటం మన ప్రాచీన ఛందో రీతుల గొప్పదనం, వాటి వైశిష్ట్యం. కంఠవశం అయ్యే గుణం లేకపోతే మంచి కవిత్వం కాదన్నాము గానీ, కంఠవశం అయ్యే ప్రతిదీ మంచి కవిత్వం అనటం సాధ్యం కాదు.
వచనకవితలో కంఠవశం అయ్యే గుణం సాధించటం చాలా చాలా కష్టం. వచన కవి చాలా ప్రజ్ఞావంతుడై ఉండాలి. కవితా రసవిద్యా రహస్యం తెలిసినవాడై ఉండాలి. శక్తిమంతమైన,రసస్ఫోరకమైన పదచిత్రాలను,వైరుధ్యాలు లేని మెటఫర్ల సమాహారాలను, సంకేతాలను తనదైన, ప్రగాఢమైన అనుభూతిని ఆవిష్కరించటానికి, కవిత్వీకరణ మాధ్యమాలుగా సున్నితంగా మలచుకోవాలి. అంతేకాదు, కవితా పంక్తులలో ఒక మనోజ్ఞమైన, లయబద్ధమైన నడకను, పదబంధప్రయోగంలో శబ్దసారూప్యత వల్ల జనించే రమ్యమైన రిధంను అతను సాధించాలి. అప్పుడది గొప్ప కంఠవశమయ్యే గుణాన్ని, ప్రబలంగా ఆకట్టుకునే శక్తిని సంతరించుకుని ఎప్పుడూ మన మనస్సుని అంటిపెట్టుకుని ఉంటుంది. గొంతెత్తి పరవశంతో చదువుకునేటట్లు చేస్తుంది.
నాకు తెలిసినంతవరకు,నా అనుభవంలోకి వచ్చినంతవరకు వచనకవిత సమగ్ర సర్వాంగ సుందరంగా వ్రాసిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు మాత్రమే. వేరే వాళ్ళ కవితాపంక్తులు మూడు నాలుగు కంటే ఎక్కువ గుర్తు ఉండవు. తిలక్ కవితలు మనసులో మార్మోగుతూనే ఉంటవి. చాలా వరకు వారికవితలు ఆమూలాగ్రం ఇట్టే అవలీలగా కంఠవశం అవుతవి. పలుమార్లు పంక్తులకు పంక్తులు, కవితలకు కవితలు గొంతెత్తి చదువుకుంటూ పులకింతలు పోవటం నా స్వానుభవం.ఇది నూటికి నూరుపాళ్ళు సత్యం.
కవిత్వం వ్రాసే వాళ్ళు మానవ జీవితానుభవాలలో దేనిమీదైనా వ్రాయవచ్చు. ఒక తాత్విక చింతనను కానీ,సామాజిక స్పృహను కానీ సాంఘిక,ఆర్ధిక,రాజకీయ దురన్యాయాన్ని కానీ దోపిడీని కాని కవితలో ఆవిష్కరించవచ్చు. కానీ అది కవితామయం గానే జరగాలి. కవిత యొక్క వస్తువిశేషము కవిత యొక్క గొప్పదనం మీద ప్రభావాన్ని చూపలేదు. కవిత రచనా రీతికి సంబంధించినది; వస్తుప్రాధాన్యతకు సంబంధించినది కాదు. అయితే, కవిత్వానికి సాహిత్యానికి సామాజికప్రయోజనం లేదని కానీ, ఉండకూడదని కానీ కాదు. కవిత్వం, తక్కిన సాహిత్య ప్రక్రియలన్నీ రససిధ్ధి ద్వారా పాఠకులని ఉత్తమ మానవీయత వైపు నడిపించాలి. పునరుక్తి దోషంగా భావించవద్దు :ఇది రససిద్ధి ద్వారానే జరగాలి.
ఇకపోతే కవిత్వ విమర్శ కవితల గుణదోషపరిశీలనకు మాత్రమే పరిమితమై ఉండాలి. అటువంటి పరిశీలన ఇంటలెక్చువల్ లాంగ్వేజ్ లో ఎనలిటికల్ గా మాత్రమే జరగాలి. వ్యక్తిగత విమర్శలకు, అవహేళనలకు, నిందలకు దిగజారకూడదు. కవిత కవితై ఉండాలి; సాహిత్యవిమర్శ సాహిత్యవిమర్శ మాత్రమే అయి ఉండాలి. అలా మన స్థాయిని పెంచుకునే సామర్ధ్యం మనకు ఉంది, ఆ అవసరం కూడా ఉంది.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి Sai Brahmanandam అభిప్రాయం:
07/07/2010 7:38 pm
అఫ్సర్ గారంటే నాకు అపారమైన గౌరవం. ఎందుకంటే ఆయన సౌమ్యంగా మాట్లాడడమే కాదు, మాటల్ని ఆచి తూచి వాడతారు. అలాంటి వ్యక్తి ఇలాంటి దురుసుతనంతో కూడిన వ్యాఖ్య చేస్తారని ఊహించడం కష్టం.
అఫ్సర్ గారి దృష్టిలో అమెరికా పాఠకులన్నా, రచయితలన్నా చాలా చాలా చిన్న చూపుందని ఇప్పుడే అర్థమయ్యింది. ఇక్కడి తెలుగు పాఠకుల, రచయితల అభిరుచులన్నీ ఫ్రోజన్ బ్రతుకులని చిటికలో నిర్ధారించేసారు.
రామారావు గారేమన్నారు? ఎవరికోసమో కాకుండా వాళ్ల కోసం వాళ్లు రాసుకునే గుర్తింపు, సాహసం మన విదేశ తెలుగురచయితలు / కవులకు ముందుముందైనా వస్తాయని ఆశ పడ్డారు. అంతే ఒక్కసారి విరుచుకు పడిపోయారు క్షణంలో అమెరికాలో ఉన్న తెలుగు పాఠక, రచయితల సమూహాన్ని ఒక్క చేత్తో ఫ్రోజన్ రాటకి కట్టేసారు. ఆంధ్రాలో పాఠకోత్తముల స్వభావాలు మారిపోయాయట. రచయితలూ మారిపోయారట. వారిని అందుకోవడానికి అమెరికా తెలుగు వారికి కొన్ని తరాలు పడుతుందట. అమెరికా తెలుగు వారికి ఇదీ అఫ్సర్ గారి కితాబు.
ఇరవై ఏళ్ళ క్రితం తెలుగు సాహిత్యం అమెరికాలో అందుబాటులో లేదంటే నమ్మొచ్చు. ఇంటర్నెట్ వచ్చాకా తెలుగు సాహిత్యం గురించీ, పత్రికల గురించీ తెలియదంటే ఎవరూ నమ్మరు. ఏఏ పత్రికల్లో ఏఏ వాదాల సాహిత్యం వస్తుందో, ఎవరి రచనలు అచ్చవుతాయో అందరికీ తెలుసు.
అఫ్సర్ గారు అమెరికాలో ఈ ఫ్రోజన్ సమాజాలకి దూరంగా వుంటూ ఆంధ్రాలో తెలుగు పాఠకుల మార్పుని ఎలా తెలుసుకున్నారో తెలుసుకోవాలని ఉత్సాహంగా వుంది. ఎవరికయినా ఇంటర్నెట్టూ, లేదా ఒకరిద్దరితో ఫోను సంభాషణలూ తప్పించి వేరే మార్గాలేమిటా ఆన్నది తెలుసుకోవాలనుంది. విప్లవ రచయితల్ని తిట్టే వారూ వున్నారు. ఇతర రచయితల్నీ తూలనాడే విప్లవ మేధావులూ వున్నారు. ఇందులో ఎవరికెవరూ తీసిపోలేదు. సాహిత్యం వాదాలకీ, ప్రాంతాలకీ అంకితమై పోయింది కాబట్టే ఈ ఉనికి వివాదాలూ, నడ్డి గోకుడు గ్రూపులూ పుట్టుకొచ్చాయి. ఏ వాదమయినా మంచి కవిత్వం మంచి కవిత్వమే! దానికి ఎవరి భుజాలూ, బాకాలూ అవసరం లేదు. ఆంధ్రాలో వచ్చిన సాహితీ మార్పులు తెలుసుకోలేదని అఫ్సర్ గారు ఎలా నిర్ధారణ కొచ్చారో తెలియ పరిస్తే తెలుసుకోవాలనుంది. ఇప్పటికీ అమెరికా రచయితలకంటే ఓ మెట్టు మేమే పైనున్నామన్న బలమైన అభిప్రాయం ఆంధ్రా రచయితల్లో నాటుకుపోయింది. కథయినా, కాకరకాయయినా వారే వండాలి, వడ్డించాలన్న ధోరణి బలంగా కనిపిస్తూ వుంటుంది. బహుశా ఇదే అభిప్రాయం పదేళ్ళుగా అమెరికాలో ఉంటున్న అఫ్సర్ గారికీ స్థిరపడిందా అన్న అనుమానం ఆయన వ్యాఖ్యల్లో కనిపించింది.
చివరగా “ఇప్పుడు అక్కడి సాహిత్య సాంద్రతని అందుకోడానికి అమెరికన్ తెలుగు రచయితలకు ఇంకో తరం పడ్తుందేమో!” అని బ్లాంకెట్ స్టేట్మెంటు చేసేసారు. ఇలాంటి దురుసు వ్యాఖ్యలతో సాహిత్య సాంద్రత పెరుగుతుందేమో తెలీదు.
అఫ్సర్ గారూ మీరు మీ గురించి చెప్పండి. శ్రద్ధగా వింటాం. కవిత్వంలో విప్లవ కక్కులు ఉన్నాయని ఒక వ్యాఖ్య వస్తే మీరు అందర్నీ దూషించడం పెద్దరికం అనిపించుకోదు. చివరగా పదేళ్ళుగా అమెరికాలో ఉంటున్నారు కాబట్టి మీరూ అమెరికన్ తెలుగు రచయితల కోవలోకే వస్తారని నా నమ్మకం. కాదంటారా? మీకు శతకోటి నమస్కారాలు.
శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి mOhana అభిప్రాయం:
07/07/2010 7:31 pm
ఇక్కడ మిగిలిన పాఠకులకు ఒక చిన్న విషయం చెప్పాలి. రామారావుగారు మే 2000 ఈమాటలో ఆముక్తమాల్యదపైన ఒక దీర్ఘమైన వ్యాసమే వ్రాసారు. చదవనివారు దానిని చదివితే బాగుంటుంది. విధేయుడు – మోహన