పాలపర్తి శ్యామలానంద ప్రసాదు
జీవిత విశేషాలు
‘తొలి అచ్చతెలుగు అవధాని’, ‘కుదురాటగండ’, ‘కళారత్న’ డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాదుగారు సంస్కృతాంధ్రాలలో నిష్ణాతుడైన కవి-పండితులు. తెలుగులోనూ, సంస్కృతంలోనూ ఎం.ఎ. పూర్తిచేసి రెంటిలోనూ పి.హెచ్.డి. సాధించారు. సంస్కృతంలో విశ్వనాథ రాసిన రూపకాలపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. అయిదువందలకు పైగా అష్టావధానాలు, మూడు శతావధానాలు చేసారు. అచ్చతెలుగులో అవధానం చేయడం వీరి ప్రత్యేకత.