కె. వరలక్ష్మి
జీవిత విశేషాలు
ప్రఖ్యాత రచయిత్రి కె.వరలక్ష్మిగారి కథలు ప్రధానంగా తను నివసిస్తోన్న మెట్ట ప్రాంతానికి చెందిన స్త్రీల, బడుగు జీవులకు చెందిన కథలు. కథలతోబాటు ఆవిడ కవిత్వం వ్రాసారు. రేడియోనాటికలు, వ్యాసాలు, నవలికలు వ్రాసారు. శ్రీ శ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కందుకూరి రాజ్యలక్ష్మి పురస్కారాలతో సహా సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం, చాసో స్ఫూర్తి పురస్కారం వంటి అనేకం వీరు అందుకున్నారు.