ఎస్. రామకృష్ణన్


సొంత ఊరు:
మల్లాంగిణరు, దక్షిణ తమిళనాడు
ప్రస్తుత నివాసం:
చెన్నై
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

ప్రస్తుత తమిళ సాహిత్య ప్రపంచంలో ఎస్. రామకృష్ణన్ ముఖ్యమైన రచయిత. గత ముప్పై ఐదేళ్ళుగా కథలు, నవలలు, వ్యాసాలు, నాటికలు, బాలల సాహిత్యం, అనువాద రచనలూ రాస్తున్నారు. సినిమాలకు కూడా రచనలు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్, టీవీ మాథ్యమాల్లోనూ రచయితగా తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటివరకు ఈయన రచనలు వందకు పైగా పుస్తకాలుగా వెలువడ్డాయి. ఉపపాండవం, యామమ్, ఉఱుపసి, తుయిల్, నిమిత్తం, చంచారం, ఇటక్కై, పదిన్ వంటివి ప్రసిద్ధమైన కొన్ని నవలలు. భారత దేశమంతా తిరిగి ఆ జీవితానుభవాలతో ‘దేశాంతరి’ అన్న శీర్షికతో రాసిన వ్యాసాలు అతి ముఖ్యమై రచనల్లో ఒకటి. ఎనదు ఇందియా, మఱైక్కప్పట్ట ఉణ్మైగళ్ వంటివి ఈయన రాసిన చారిత్రక గ్రంథాలు. తుణైయెళుత్తు, కథావిలాసం, కేళ్విక్కుఱి, సిఱుదు వెళిచ్చం వంటివి లక్షలాది పాఠకులని ఆకట్టుకున్న రచనలు. బాలలకోసం పదిహేనుకు పైగా పుస్తకాలు రాశారు. ‘ఇయల్’ సాహిత్య సంస్థవారి జీవినసాఫల్య పురస్కారం, ఠాగూర్ పురస్కారం, పెరియార్ పురస్కారం, మాక్సిమ్ గోర్కీ పురస్కారం, తమిళనాడు ప్రభుత్వం అందించే ఉత్తమ నవలా రచయిత పురస్కారాలు ఈయన అందుకున్న పురస్కారాల్లో కొన్ని. ఈయన రాసిన ‘చంచారం’ నవలకుగానూ 2018వ సంవత్సరం సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.


 

ఉయ్యాల బల్లమీద కూర్చుని తనివి తీరేదాకా ఊగింది. తర్వాత దగ్గర్లో ఉన్న అంగటికెళ్ళి ఒకే ఒక్క చాప మాత్రం కొనుక్కొచ్చుకుంది. హాల్లో చాప పరిచి పడుకుంది. ఇది తన ఇల్లు. తను మాత్రమే ఉండబోయే ఇల్లు. ఇలాంటొక ఇల్లు ఉండటం ఎవరికీ తెలియకూడదు. ఈ ఇంటిలో తనతో ఎవరూ ఉండరు. తాను మాత్రమే ఇక్కడ ఉండబోతున్నాను అన్నది ఆమెకు వల్లమాలినంత సంతోషాన్ని ఇచ్చింది.