పసునూరు శ్రీధర్‌బాబు


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

‘అనేకవచనం’ పసునూరు శ్రీధర్‌బాబు తొలి కవితా సంపుటి. 1999లో ప్రచురితమైంది. రెండో కవితా సంకలనం ‘నిదురపోని మెలకువ చెప్పిన కల’ 2021లో విడుదలైంది. ‘అనేకవచనం’ కవిత్వానికి అజంతా అవార్డు, రమణ సుమనశ్రీ ఫౌండేషన్, సిరిసిల్ల ‘మారసం రుద్రరవి’ పురస్కారాలు లభించాయి. ‘నిదురపోని మెలకువ చెప్పిన కల’ సంకలనానికి ‘రొట్టమాకు రేవు షేక్ మహ్మద్ మియా’ కవిత్వ పురస్కారం, ఖమ్మం ఈస్థటిక్స్ అవార్డు, నవసాహితి దాశరథి ఉత్తమ కవిత అవార్డు, మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారాలు లభించాయి. ‘ఏకాంతం ఒక అతిథి’ పేరుతో ఈ కవి తన మూడో సంకలనాన్ని 2025లో ప్రచురించారు. వృత్తిరీత్యా జర్నలిస్ట్. ఇండియా టుడే, హెచ్ఎంటీవీ, 10టీవీ, బీబీసీ న్యూస్‌ వంటి సంస్థలలో పని చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మోత్కూరులో 1969 జూలై 21న జన్మించారు.