ఒక అరుదైన నాటకం అందిస్తున్నాను. ఈ నాటకంలో చేయి పెట్టినవారందరూ ప్రముఖులే! సావిత్రి, గుమ్మడి, అల్లు రామలింగయ్య వంటి గొప్ప నటులు పాత్రలు పోషించారు. పాకాల రాజమన్నార్ రచించిన ఈ నాటకానికి దాశరథి స్క్రిప్ట్ రైటర్ గాను, మల్లంపల్లి ఉమామహేశ్వరరావు అనౌన్సర్ గానూ పనిచేశారు.
గొరుసు జగదీశ్వరరెడ్డి
జీవిత విశేషాలు
‘వలసపక్షులు’ కథతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న కథకుడు గొరుసు జగదీశ్వర రెడ్డి. TANA వంటి సంస్థల కథా సంకలనాల్లో, ప్రముఖ పత్రికలలో తన రచనల ద్వారా పాలమూరు (మహబూబ్ నగర్) ప్రాంత వలస కార్మికుల కష్టాలను, సామాజిక అంశాలను ప్రతిబింబించారు. ముఖ్యంగా వలస పక్షులు, గజ ఈతరాలు వంటి కథల ద్వారా ప్రసిద్ధి పొందారు.
గొరుసు జగదీశ్వరరెడ్డి రచనలు
అపుడపుడు మా ఇంటి వసారా గూట్లోంచి గుమ్మం ముందు పడిపోయే రెక్కలు రాని పిచుకపిల్ల కళ్ళముందు కదలాడి, కడుపులో దేవినట్టు అయ్యింది.