గరికపాటి నరసింహారావు


సొంత ఊరు:
బోడపాడు అగ్రహారం, ప.గో. జిల్లా
ప్రస్తుత నివాసం:
హైదరాబాద్
వృత్తి:
ఉపాధ్యాయుడు
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

గరికిపాటి నరసింహారావు రచయిత, అవధాని, ఉపన్యాసకులు. దేశ విదేశాల్లో ఒక మహా సహస్రావధానం, శత, ద్విశతావధానాలు, వందలాది అష్టావధానాలు చేశారు. పలు టెలివిజన్ ఛానెళ్ళలో వివిధ శీర్షికలు నిర్వహిస్తూ వేలాది ఎపిసోడ్ల పాటు పలు సాహిత్య, ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగాలు చేశారు. వాటిలో 11 అంశాలను సీడీలుగా రూపొందించి విడుదల అయాయి. పద్యకావ్యాలు, పరిశోధన, పాటలవంటి వివిధ అంశాలపై వీరు రాసిన 14 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ధారణా బ్రహ్మరాక్షసుడు, అవధాన శారదవంటి బిరుదులు, కళారత్న, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, కొప్పరపు కవులు పురస్కారం తదితర పురస్కారాలు, కనకాభిషేకాలు, సువర్ణ కంకణాలు మొదలైన గౌరవాలు అందుకున్నారు. భారత ప్రభుత్వంచే 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.


 
  1. మన పద్యం – మన వ్యక్తిత్వం
  2. తానా 2013
  3. శ్రీ గరికిపాటి నరసింహా రావు గారి అష్టావధాన విశేషాలు
  4. వ్యాసాలు » సెప్టెంబర్ 2003