కోవెల సంపత్కుమార
జీవిత విశేషాలు
కోవెల సంపత్కుమారాచార్య కవి, రచయిత. తన పదమూడవ యేటనే సోదరుని కుమారుడు కోవెల సుప్రసన్నాచార్యతో కలిసి జంటగా కవిత్వం చెప్పనారంభించారు. 1950 ప్రాంతంలో విశ్వనాథ సత్యనారాయణతో పరిచయం ఏర్పడింది. అతని సాహిత్య ప్రభావం సంపత్కుమారపై జీవితకాలం పనిచేసింది. వ్యాకరణ, ఛందోగ్రంథాలను, విమర్శను, ఖండకావ్యాలను, సాహిత్య చరిత్రను, శతకాలను, ప్రాచీన గ్రంథాల పరిష్కరణలను, విపులమైన పీఠికలను, నాటికలను ఎన్నో వ్రాశారు. ‘మరుగునపడిన మన పండితులు’ పేరిట జనధర్మలో ధారావాహికంగా 52 వారాలు వ్రాశారు. అనేక పురస్కారాలను అందుకున్నారు.