కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె
జీవిత విశేషాలు
కథలు, నాటకాలు, వ్యాసాలు లెక్కలేనన్ని వెలువరించిన కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె (1936-2016) ఒక నడిచే గ్రంథాలయంలాంటి వారని ఆయన్ని ఎరిగిన వారందరికీ తెలుసు. వారు సంస్కృతంలో రాసిన కలిచెర్ల పట్టాభిరామ సుప్రభాతం, సీతాష్టకం, పోలేరిమాతాస్తోత్రాలను నేటికీ చిత్తూరులోని పలు దేవాలయాల్లో సుప్రభాత సమయాన వేస్తారు. తెలుగు పద్యకావ్యం “విషాద మాథవి”, పద్యకావ్యాలు “చరిత్రకెక్కిన మారణహోమం”, “ఒక రాఘవరెడ్డి కథ”, “ఓరుగల్లు-వీరగల్లు” రచించారు. వీరి ప్రముఖ రచన, చారిత్రక నవల “బోయకొట్టములు పండ్రెండు”.