ఒక శిల్పాన్ని నిర్మించడమంటే, మనిషి ముక్కు చెవులు తెలిసేట్టు ఏదో చెక్కుకుంటూ పోవడం కాదు. మనసుపెట్టి చూసేవారికి అందులోని ప్రతి వంపులోనూ విశిష్టత కనిపించాలి. ఆ కూర్పులో గొప్ప సౌష్ఠవం తొణికిసలాడాలి. మనసుపెట్టి చూసేవారికి అందులోని ప్రతి వంపులోనూ విశిష్టత కనిపించాలి. ఆ కూర్పులో గొప్ప సౌష్ఠవం తొణికిసలాడాలి. పద్యమైనా అంతే!

మేమూ పిల్లలలమే ఒకప్పుడు
మాకూ సమయం తెలియని కాలం ఉండేది
లోకం తెలియని నవ్వులు ఉండేవి
తడిసిన చెంపలు తుడిచే చేతులు ఉండేవి

తన నైట్‌డ్రెస్ ఆ చిన్న వెలుతురులో మరింత పలచగా ఉన్నట్టు కనిపించింది. విరబోసుకున్న తన జుట్టు నుండి వెచ్చదనం, వొంటినుండి వస్తున్న వాసన నాకు కొత్తగా ఉండింది. నా వేళ్ళు తనలోని ఏదో ఒక భాగాన్ని తాకగలిగేంత దగ్గరగా నిల్చునుండింది. తననే చూస్తున్న నన్ను చూసి చూపుడు వేలు పెదవులపై శిలువలా పెట్టి సైగ చేస్తూ మెల్లగా నడిచి తలుపు తీసుకుని వెళ్ళిపోయింది.

మంగళవారమో, బుధవారమో సాయంత్రం మా పిల్లలు ఆడుతూ ఆ దీగుడు తలుపు తెరిచారు. అందులో రెండు అరలీటర్ పేకెట్లు కనబడినై, జున్నయిపోయి! అంటే, యాదయ్య ఆదివారం నాడు మాకు పాలు వద్దని చెప్పిన విషయం మరిచిపోయి వుంటాడు కాబట్టి వేశాడు. పైగా ఖర్మకొద్దీ ఆ రోజున ఓనరంకుల్ గేటు తీయకముందే వచ్చివుంటాడు. లేదంటే, మా ఓనర్ వాళ్ళయినా చెప్పివుండేవాళ్ళు.

మిగతా భాషలతో పోలిస్తే తెలుగు సినిమాలు హాస్యానికిచ్చిన ప్రాధాన్యత మరెక్కడా కనపడదు. ఆ మధ్య ఇండియా టుడే పత్రిక ప్రతి పరిశ్రమని సర్వే చేసి ఇప్పటి వరకూ మీ భాషలో వచ్చిన అతి గొప్ప చిత్రం ఏమిటని అడిగితే, తెలుగులో మాయాబజార్ సినిమాకి ఎక్కువ ఓట్లు పడ్డాయి (మల్లీశ్వరి, శంకరాభరణం, మేఘ సందేశం, తదితరాలు ఉండగానే).

అలా కాలిఫోర్నియాకు పోవడం బాగా కలిసొచ్చింది ఇద్దరికీ. ఇద్దరికీ ఉద్యోగాలు వెంటవెంటనే దొరికేయి. జీతం ఆరెంకెల్లోకి, హెచ్-1 వీసా గ్రీన్ కార్డులోకి, గ్రీన్ కార్డు సిటిజన్‌షిప్ గానూ మారితే, రెండు కార్లు, అయిదు బెడ్రూముల ఇల్లు, ఇద్దరు పిల్లలూ ఒకదాని మీద ఒకటి వచ్చి చేరేయి. రెండేళ్ళకోసారి వర్ష మొగుడితోటీ పిల్లల్తోటీ ఇండియా వచ్చి వెళ్తోంది.

తమ భావజాలాన్ని వ్యతిరేకించేవారిపై రకరకాల ముద్రలు వేయడంతో సహా; విభజనపూర్వకమైన సాంప్రదాయిక భాష, వ్యక్తీకరణ సహస్రాధిక ప్రమాణంలో బలం పుంజుకోవడం నేటి మన దైనందిన అనుభవం. ఉదాహరణల కోసం గాలించవలసిన అవసరమే లేదు. వేయిపడగల సాంప్రదాయిక సమాజ పునరుత్థానానికి ఇది మరో ప్రత్యక్షసాక్ష్యం.

ఒకటొకటిగా నిటారుగా నిలబడ్డ
అంతస్తుల వరుసలకు అందకుండా
ఆకాశం కనిపించని ఎత్తుకు ఎగిరిపోయింది!

పచ్చదనంతో దోబూచులాడే కువకువలన్నీ
ఎటో వలస పోయాయి
పాకలో ఆవులు నెమరేయటం మరిచిపోయాయి.

గీత గీసే ముందూ రంగులద్దేముందూ
ఒకింత పరికించుకో
ఆకసానికి ఆకుపచ్చనీ
గడ్డిపరకకు నీలాన్నీ అద్దకు
నవ్వుకూ కన్నీటికీ
ప్రతి రంగుకూ ఓ భాష వుంటుంది
కొంచెం గమనించుకో

మీ అమ్మాయి, పెద్దది కాబోలు, బిందెతో నీళ్ళు తీసుకొస్తోంది. వెనకాల అబ్బాయి రాగిచెంబుతో నీళ్ళు తెస్తున్నాడు. వీళ్ళ వెనుక మీ చంటిది ఎఱ్ఱటి లక్క పిడత నిండా నీళ్ళుపోసి తలమీద పెట్టుకుని రెండు చేతులూ పైకెత్తి అతి పొందికగా, ఒక్క చుక్క నీళ్ళు పడిపోకుండా తీసుకొస్తోంది. నేను పలకరిస్తే ఆ ఆరిందా అంటూందీ… ‘బాంది… ఎవలింట్లో నీల్లు వాల్లు తెచ్చుకోలూ?’

మెయిన్‌ స్ట్రీమ్‌ తెలుగు సాహిత్యంలో ఉన్నట్టే యాత్రాసాహిత్యంలోనూ అనేకానేక ధోరణులు ఉన్నాయి. అక్కడ పాపులర్‌ సాహిత్యం ఉన్నట్టే ఇక్కడా కాస్తంత సమాచారం దట్టించిన కాలక్షేపం ట్రావెలాగ్స్‌ ఉన్నాయి. అక్కడ సమాజ హితం కోసం తపించే సాహిత్యమున్నట్టే ఇక్కడా అనుభూతీ అనుభవాలూ మానవ సంబంధాలూ ప్రధానంగా సాగే యాత్రా రచనలు ఉన్నాయి.

“నీదేకాదు. నీలాంటి చాలామందే ఉన్నారు మరి. నేనింతకు ముందే చెప్పాను గదా! ఇప్పుడిక ఏమీ చేయలేం! అయిదేళ్ళు ఆగాల్సిందే. తప్పదు. అప్పుడు గెలువు నువ్వు! ఇంతకింత గెలువు! గుర్తుంచుకో! మంచిముక్కపై పందెం కట్టు! నాకు చాలా పనులున్నాయి. నేను అందరినీ హెచ్చరించాలి!” బనీను మేధావి వేగంగా వెళ్ళిపోయాడు.

ఎండా కాలం మా మద్దులేటి వాగు పక్కన
చిన్ని చేతులతో ఇసుక తవ్వి
తీసిన చెలిమ లోంచి కడవ లోనికి
లోటా లోటా తోడుకున్న చల్లని నీళ్ళలో
ఒకే ఒక్క లోటా చాలు
మరి అరవయ్యేళ్ళు బతికేస్తాను జీవనదినై

గడినుడి-7కు అన్నీ కరక్టు సమాధానాలు పంపిన వారు: పం.గో.కృ.రావు రవిచంద్ర ఇనగంటి సుభద్ర వేదుల కె. వి. గిరిధరరావు సుధారాణి ఒక తప్పుతో సమాధానాలు […]

గడినుడి-7కు అన్నీ కరక్టు సమాధానాలు పంపిన వారు: 1. పం.గో.కృ.రావు, 2. రవిచంద్ర ఇనగంటి, 3. సుభద్ర వేదుల, 4. కె. వి. గిరిధరరావు, 5. సుధారాణి. ఒక తప్పుతో సమాధానాలు పంపినవారు: పి. సి. రాములు, సూర్యప్రకాష్. విజేతలకు అభినందనలు.

గడి నుడి – 7 సమాధానాలు, వివరణ.

ఇది విశ్వనాథ రాసిన మొదటి నాటకం (1924). చాలా చక్కటి రచన! కీచకవధ కథని నాటక వస్తువుగా తీసుకుని చాలా గొప్పగా నిర్వహించారు విశ్వనాథ. నాలుగుసార్లు (ఇంకా ఎక్కువ?) ముద్రణలు పొందింది. ఈ నాటకాన్ని రేడియోలో ప్రసారం కోసమై ఉషశ్రీ కొంత కుదించారు.

తెలుగువారు ఇప్పటికీ ఎప్పటికీ గొప్పగా చెప్పుకునే మిస్సమ్మ, మాయాబజార్, పాతాళభైరవి, జగదేకవీరుని కథ వంటి సినీమాలను తన కెమేరా కంటితో అంతటి కళాఖండాలుగా తీర్చిదిద్దిన ఘనత మార్కస్ బార్ట్‌లీది. ఏ డిజిటల్ సాంకేతికత లేని ఆ రోజుల్లోనే ఆయన చూపిన ప్రతిభ అసమానమైంది. దక్షిణభారత చలనచిత్ర చరిత్రలో బార్ట్‌లీది ప్రముఖ పాత్ర. ఆయన శతజయంతి సందర్భంగా జెజ్జాల కృష్ణ మోహన రావు నివాళి ఛాయామాయావి: మార్కస్ బార్ట్‌లీ; విచిత్రంగా, ఒక రాజు వల్ల కృష్ణునికీ అర్జునునికీ యుద్ధం జరిగింది. అర్జునుడి రథసారథి శల్యుడు. ఒక్క ధర్మరాజుని తప్ప, అర్జునునితో సహా అతని సైన్యం మొత్తాన్ని కృష్ణుడు తన చక్రధారతో చంపేసి, ఆ తర్వాత, కృపతో ఉభయ సైన్యాల వీరులందరినీ తిరిగి బతికించిన ఒక చిత్రమైన కథ. అందులో ఒక అప్సరస అశ్వంగా మారిన వైనం, తద్వారా మన సంప్రదాయ కథాకథన పద్ధతినీ ప్రస్తావిస్తున్న భైరవభట్ల కామేశ్వరరావు శీర్షిక నాకు నచ్చిన పద్యం; సాదత్ హసన్ మంటో ప్రసంగం, నవరసాల పద్య రసాయనం, కథలు, కవితలు, వ్యాసాలూ మరింకా ఈ సంచికలో.

ప్రముఖ రచయిత సాదత్ హసన్ మంటో పై నందితా దాస్ తీస్తున్న చిత్రం నుంచి ఒక చిన్న సన్నివేశం షార్ట్‌ఫిల్మ్‌గా ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మొదటిసారి ప్రదర్శింపబడినప్పటినుంచి ఎందరో అభిమానులను మూటకట్టుకుంది. నవాజుద్దీన్ సిద్దీకీ మంటోగా నటించిన ఈ సినిమా టీజర్‌లో మంటో భావప్రకటనా స్వేచ్ఛ గురించి, తన రచనల గురించి మాట్లాడతాడు. ఆ షార్ట్‌ఫిల్మ్ తోపాటు పాఠకుల కోసం మంటో ప్రసంగానికి తెలుగు అనువాదం కూడా జతచేశాం.