నలుగురు యాత్రికులు – నలుగురిదీ ఒకటే బాణీ. జీవితానికీ ప్రయాణానికీ అంతరం లేదని భావించినవారు. జడజీవితం మీద తిరుగుబాటు జెండా ఎగరేసినవారు. ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త జీవితాన్ని, ఆ ప్రక్రియలో తమను తాము అన్వేషించుకుంటూ సాగినవారు.

ప్రాచ్యంలో కవులు సాధారణంగా ఆధ్యాత్మిక ఆర్తిని సూచించడానికి రతిని వర్ణిస్తారు. పరమాత్మను స్త్రీగా (ఉమర్ ఖయ్యామ్), పురుషుడిగా (సూరదాసు, క్షేత్రయ) భావించి కవిత చెప్పారు. ఈ రతి ఎలియట్‍లో విరతిగా కావ్యవస్తువు అయింది. అంటే, లైంగికవాంఛ, దాని సాఫల్యము ఎలియట్ కవితలలో అభావరూపంలో ఉంటుంది.

ఎంతో గొప్ప నవలలు రాసిన జేన్ ఆస్టిన్, ఎమిలీ బ్రాంటీ, షార్లెట్ బ్రాంటీ, జార్జి ఎలియట్, ఎలిజబెత్ గాస్కెల్ వంటివారు ప్రణయానికి తమ నవలల్లో పెద్దపీట వేశారు. కానీ ఈ రష్యన్ అక్కచెల్లెళ్ళు మాత్రం సమాజంలో తమ స్థానానికీ, ఎదుగుదలకూ పోరాడే స్త్రీ పాత్రలనే సృష్టించారు.

ఇవాళ బామ్మ నోట మరోమాట విన్నా. ‘నువ్వు వెయ్యి చెప్పు, లక్ష చెప్పు. వాడు బుర్రకి ఎక్కించుకోడ్రా!’ అని బుచ్చిబాబుగారితో అన్నాది. బుచ్చిబాబుగారు మూడుమేడల వీధిలో చివారి ఇంట్లో ఉంటారు. బామ్మ దగ్గరికి వచ్చే అందరి లాగానే ఈయనా తన గోడు చెప్పుకోడానికి వస్తూ ఉంటాడు. వాడెవడో బుర్రకు ఎక్కించుకోడట!

పలకమంటుంది కొన్ని పదాలు
ఎన్ని పలికితే
జీవనసారంలోంచి పూవులా విచ్చుకొనే చిరునవ్వులవుతాయి
దుఃఖపుశిల చెమరించి రాల్చిన కన్నీరవుతాయి
మన స్పర్శలో మేలుకొనే దయాపూర్ణ లోకాలవుతాయి
అనుకొంటావు

నా వ్యక్తిత్వాన్నీ ప్రతిభాపాటవాలనీ
ప్రపంచం వేనోళ్ళ కీర్తిస్తున్నప్పుడు
వేల చూపులు వాలిన
వర్షాకాలపు తొలి చిగురులా
నేను గిలిగింతలవుతుంటే
గోడ మీద నా కుటుంబపు చిత్రం
నన్ను నవ్వుతూ చూసింది.

ప్రాపంచిక మాలిన్యంతో
పాలిపోయిన రహస్యాలని
చెట్టుకో పుట్టగా తంతూ
ముడికో చుక్క చొప్పున హుక్కు చొప్పున
దోసిట్లోంచి వాకిట్లోంచి చీకట్లోంచి
వాణ్నీ దాన్నీ చూసి తరించి

చివ‌రికొచ్చిన క‌థ‌
కంచికి చేర‌లేదింకా-
తుదిని మొద‌లెట్ట‌లేక
తాక‌రాని తేనెతుట్టెను త‌ట్టి లేపుతోంది.

మ‌ర‌పుకొచ్చిన క‌ల‌
స్మృతిని వ‌ద‌ల‌లేదింకా-

రెండు రెళ్ళు నాలుగని తెలిసినా
అరవై సార్లు భుజం తట్టుకున్నా
అవసరమైన వేళ నోరు పెగలదు

ఎక్కాలు, గుణింతాలు
నేర్చుకున్నంత సులువుగా
బంధాలను గుణించుకోలేవు

మూడురోజుల కుంభవృష్టి తెరపిచ్చింది. సన్నటి జల్లు. రోడ్లన్నీ నీళ్ళల్లోనే మునిగి ఉన్నాయి. రోడ్డుపై ఐదారుగురు మనుషులు మూగి ఉన్నారు. చిట్టితల్లి హడావుడే అయుంటుంది అనుకున్నాను. చిట్టితల్లి కనపడలేదు. నీళ్ళల్లో పడవలు తేలుతున్నాయేమో అని చూశాను. ఇంటిముందు పడవలూ కనిపించలేదు. కనిపించడానికి అక్కడికి ఒక కిలోమీటరు దూరం వెళ్ళాలట.

నమ్మలేం కదూ
ఎవరిలో వారు గజగజలాడూతూ
సమయానికి ఎదురీదడం
ఎవరికి వారు మౌనంగా
గతం మరోసారి పునశ్చరణ గావించడం
నమ్మలేరు తీసిపారేసిన గడ్డిపరక నమ్మకం

ఒకానొకప్పుడు ఒక అడవిలో ఒక సరుగుడు చెట్టు వుండేది. మంచి వర్షంతో పాటూ తగినంత సూర్యరశ్మి కూడా ఉండడంతో అది ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ వుండేది. దాని నీడలో పిల్లలు ఆనందంగా ఆడుతూ పాడుతూ వుండేవారు. దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకున్న పక్షులు కిలకిలారావాలు ఆలపించేవి. కొమ్మ నుంచి కొమ్మకు దూకుతూ సరస సల్లాపాలాడే ఉడతల్ని చూస్తే, ఎవరికైనా ఉత్సాహం ఉరకలేస్తుండేది.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

ఆధునిక వర్ణనాత్మక భాషశాస్త్రజ్ఞుల వలె సూత్రాలను ఉదాహరణలతో అతి తక్కువ పారిభాషిక పదాలతో తన వ్యాకరణాన్ని 191 పద్యాలతో రాసిన కేతన తొలి తెలుగు వ్యాకర్త. సంస్కృత సంప్రదాయంలో పాణినీయ పరిభాషకు భిన్నంగా తేలికైన మాటలతో రాసిన మొట్టమొదటి తెలుగు వ్యాకరణం. అందరూ చదవదగ్గది, చదివి ఆలోచించదగ్గదీను!

క్రితం సంచికలోని గడినుడి-58కి మొదటి ఇరవై రోజుల్లో పదముగ్గురి నుండి మాత్రమే సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-58 సమాధానాలు.