మధ్యాహ్నం భోజనం అయ్యేక అంగట్లో ఖాళీ ఉన్నప్పుడు వచ్చారు తండ్రీ త్రివక్రా – సుదాముణ్ణి చూడ్డానికి. వచ్చిన వాళ్ళని కూర్చోపెట్టి అడిగేడు. “ఎందుకు మీరీ పిల్లని అలా హింసిస్తున్నారు రోజూ? ఈ శరీరం, ఈ అవకరాలు అన్నీ భగవంతుడిచ్చినవి. మనం ఏదో జన్మలో చేసుకున్న కర్మ వల్ల ఇలాంటి మానవ జీవితం వచ్చింది. ఇప్పుడు సంతోషంగా ఆ మిగిలిపోయిన కర్మ మౌనంగా అనుభవించేస్తే మేలు. ఎవరూ కూడా అవకరాలు కావాలని కొని తెచ్చుకోరు కద?”
శీర్షికలు శీర్షికలు
హాల్లో అత్తయ్యా మావయ్యా నల్ల బల్ల ఉయ్యాల మీద కూర్చున్నారు. ఒకరెదురుగా ఒకరు. ఆవిడ సన్నజాజుల మాల కడుతోంది. మావయ్య పూల మొగ్గల్ని జోడించి అందిస్తున్నాడు. చాలా దీక్షగా. ఎంత శ్రద్ధ మావయ్యకి. రోజూ మేడెక్కి పూలు కోసుకొస్తాడు. ఎండా కాలాల్లో మల్లెపూలు, కనకాంబరాలు పది మరువం రెమ్మలూ. ఇదీ ఆ సముద్రంలా ఎప్పుడొచ్చినా మనసు నిండా నిండిపోయే చిత్రమే.
అరూబా, ఆ కరీబియన్ ద్వీపం ఎంత అందమైంది. వారి హోటెల్ రూమ్ లోనుండి అనంతంగా కనిపిస్తున్న నియాన్ ఆకుపచ్చ, ప్రష్యన్ నీలం కలబోతల సముద్రం నిసికి మానసిక ప్రశాంతతనూ, విశాలతనూ, లోతునూ కలిగిస్తే, శ్యాంలో అవి ఉద్రిక్తతనూ, పొంగే పురుషత్వాన్ని సంతరించాయి. కామకేళిలో ఆమె శరీరపు స్పర్శలు, తనను హత్తుకునే తీరు, ఆమెను ముద్దాడినప్పుడు తిరుగు కౌగిలింతలు, అతనికి ఎంతో ఇష్టం. వారికి ఇతరుల గురించిన ఆలోచనలూ, వ్యగ్రతలూ నశించాయి.
రాయుడు ఉత్త వాగుడుకాయ. బుర్రలో పుట్టే ఆలోచనల ప్రవాహం కంటె ఎక్కువ జోరుగా మాట్లాడడంలో అతనికి అతనే సాటి. అప్పుడప్పుడొక మోతాదు అశ్లీలాలు దొర్లిస్తూ మాట్లాడే తత్త్వమేమో, ‘కంట్రీ క్లబ్బు’లో అతను ఎక్కడ ఉంటే అక్కడ పదిమంది తేనె చుట్టూ చేరే ఈగల్లా చేరి కేరింతాలు కొడుతూ ఉంటారు. నాయుడికి రాయుడంటే చిరాకు. ముభావంగా ముడుచుకు కూర్చునే నాయుడు చుట్టూ వందిమాగధులు ఎవ్వరూ చేరరు. అందుకని రాయుడంటే అసూయ పడుతున్నాడో ఏమో! మనకి తెలియదు.
సరమాగో ప్రారంభంలో రాస్తాడు: “భూతకాలం రాళ్ళు రప్పలతో కప్పబడ్డ విశాలమైన భూమి. చాలామంది జోరుగా కారుల్లో ఏమీ పట్టించుకోకండా పోతారు, ఆ రాళ్ళమీద! కొద్దిమంది మాత్రం ఓపిగ్గా ఒక్కొక్క రాయీ ఎత్తి ఆ రాయి క్రింద ఏమున్నదో అని జాగ్రత్తగా చూస్తారు. ఒక్కోసారి తేళ్ళు, మరొక్క సారి జెర్రులు, గొంగళీ పురుగులూ, గమ్మనకండా కూచున్న గూటిపురుగులూ కనిపిస్తాయి. అసాధ్యం కాదు గాని, ఒకే ఒక్కసారైనా సరే, ఒక ఏనుగు కనిపించవచ్చు…”
పురాణాల గురించి వాళ్ళు చేసే వ్యాఖ్యానాలూ ప్రవచనాలూ ప్రసంగాలూ, ‘కలలో వార్తలు విప్పిచెప్పడం’ వంటిదట. ఇది మరొక ఆశ్చర్యమైన పోలిక. అందులోని స్వారస్యం పాఠకులే గ్రహింతురు గాక! అలా పురాణార్థాలను వివరించే సన్యాసులకు సైతం నిజంగా మోక్షం అంటే ఏమిటో తెలియదబ్బాయ్ అన్నాడు. మోక్షాన్ని కౌగిలించుకోవడం అనేది చింతకాయ కజ్జాయం వంటిదట.
తన దోషాన్ని తాను తెలుసుకోవడం కష్టం. కళ్ళు తమ కాటుకను ఎప్పుడూ చూడలేవు. అందువల్ల కావ్యరచనకు పూనుకున్నవాడు తెలివిగల వాళ్ళ చేత తన కావ్యాన్ని చదివించుకోవాలి — భారతీయ భాషలలోనే కాక ప్రపంచ భాషల్లోనే కవిరాజమార్గం ఒక విశిష్ట శాస్త్ర గ్రంథమని చెప్పడానికి ఆస్కారం ఉంది. భారతీయ అలంకారశాస్త్ర సంప్రదాయాన్ని స్థానిక భాషలో జనుల రీతి నీతుల్ని చేర్చి తీర్చిదిద్దిన ఘనత శ్రీవిజయునిది.
మాదొక చిన్న విన్నపము. విద్యాశాఖామాత్యులు మీరు తలచుకుంటే తక్షణం అనుగ్రహింపవలసినది …
మంత్రివృషభమ! మాదుగ్రామంబునందు
పాఠశాలను నెలకొల్పు ‘ప్లాను’ గలదు;
దీనికై మీప్రభుత్వంపు దీవెనలను,
‘పర్మిటును’ గోరుటకు నిట వచ్చినాము.
మనో నిశ్చయంలో
మరో పర్వతమై వెలుగొందావు
ఇక్కడ భూమిని చూస్తున్న కళ్ళతో
అక్కడి నీ ప్రయాణ పాటవాన్ని
ఊహించి చెబుతున్నాను
కటిక నేల. చెయ్యి దిండు.
సగం మూసిన కనులు. సగం తెరచిన నోరు.
ఆదమరచిన శరీరం. ఆవులిస్తూ ఆవు.
చెట్టు తొర్రలో కదలని ఉడుత.
ఓ మధ్యాహ్నం వేళ
నల్ల మబ్బులు తెల్ల మబ్బులు కలిసి
పల్చని వెలుగుకి తోవ ఇచ్చాక
గడ్డి మీద వాలి గాలితో కదులుతూ
గులాబీలు అద్దిన
గొడుగు వేసుకుని
లేత గులాబీ రంగు
పెదాలకు పూసుకుని
గాలికి ఊగే
గులాబీలా ఆమె.
అగ్గిపెట్టెల్లోంచి ఎగిరిపోయి
బంతాకులు నెమరేస్తూ
కలల్ని వెదజల్లుతున్న బంగారిపురుగులు
హరివిల్లు లోంచి రంగులను తెచ్చి
పూలతోట కద్దుతున్న సీతాకోకలు
నువ్వు నా మాటల్ని
వింటున్నావనుకుంటాను.
ఆనందంగా, అనర్గళంగా
మాట్లాడుతూనే ఉంటాను.
కాని, నీ చెవుల్లో…
దిగ్గజాల గండస్థలాల మీద తుమ్మెదలు తచ్చాడుతూ తమ రెక్కలకి మదం అంటించుకుంటున్నాయి. వాటితో రెక్కలు బరువెక్కి ఎగరడానికి ప్రయాస పడుతున్నాయి. ఇంతలో రావణుణ్ణి శ్రీరాముడు యుద్ధంలో నేలకూల్చాడు. ఒక్కసారిగా దేవతలు పువ్వుల్ని పెద్దవానగా కురిపించారు. తుమ్మెదలు ఆ పువ్వుల వెనక పడ్డాయి. భూమి వైపుగా పోతున్న వాటి వెనక ప్రయాణించడం తుమ్మెదలకి సులువుగా ఉంది.
చతుర్మాత్రలతో పాటలు అన్ని భాషలలో నున్నవి. చతుర్మాత్రలతో అష్టమాత్రలను చేర్చి వ్రాసినప్పుడు వాటికి ఒక ప్రత్యేకమైన అందము కలుగుతుంది, నడకలో వైవిధ్యము పుట్టుతంది. ఇట్టి అమరికలు ఈ వ్యాసములో వివరించినట్లు ఛందశ్శాస్త్రములో గలవు. కాని వాటిని వెలికి ఇంతవఱకు ఎవ్వరు తీసికొని రాలేదు. ఈ నా ప్రయత్నము గానయోగ్యమైన ఛందస్సులను కల్పించుటకు సహాయకారిగా నుంటుందని భావిస్తాను.
అకారము మొదలు అక్షర మాలకు
ఆది ఆకసము మొదలు అఖిల జగతికిని
పెనవి పెను కడలి నీదను వశమా
చిన్నయ సూరి బాలవ్యాకరణం పైన ఏ మాత్రం ఆసక్తి వున్న వారికైనా దువ్వూరి వెంకటరమణశాస్త్రిగారి పేరు తప్పకుండా తెలిసి వుంటుంది. ఆయన బాలవ్యాకరణానికి రమణీయం అన్న పేరుతో రాసిన వ్యాఖ్య బహు ప్రసిద్ధం. ఈ సంచికలో ఆ ప్రసంగం వినండి.
మార్చ్ 26న అట్లాంటా నగరంలోని ఎమరీ యూనివర్సిటీలో తెలుగు ఆచార్య పదవి నెలకొల్పబడబోతున్న సందర్భంగా ప్రత్యేక ప్రకటన ఈమాట పాఠకులతో పంచుకోడం కోసం.
ఒక సమాజపు ఔన్నత్యం, ఆ సమాజం తన స్త్రీలు, పిల్లలు, వృద్ధులతో ఎలా ప్రవర్తిస్తుంది అన్న అంశంపై ఆధారపడి వుంటుందని వాడుక. వీరితో మనం ప్రస్తుతం ఎలా ప్రవర్తిస్తున్నామో మనకూ తెలుసు. ఇప్పుడు ఈ జాబితాలో మనదేశపు రచయితలనూ కళాకారులనూ చేర్చవలసి రావడం దౌర్భాగ్యం. సంస్కృతి పేరుతో స్త్రీల పైన, మనోభావాలు దెబ్బ తింటున్నాయన్న నెపంతో రచయితలు, కళాకారుల పైన, తమ ఆత్మన్యూనతను కప్పి పుచ్చుకునేందుకు ఈ సంస్కృతీరక్షకుల దౌర్జన్యం రానురానూ దుర్భరమవుతున్నది. వీరికి మాత్రమే సమాజపు మంచీ చెడూ తెలుసు, వీరు ఒప్పుకున్నవే విలువలు, కేవలం వీరే నైతికధర్మాధికారులు, వీరిని వీరే ఎన్నుకుంటారు. సృజనకూ అభిప్రాయ వ్యక్తీకరణకూ స్వేచ్ఛ ఇవ్వని సమాజమూ విమర్శను తీసుకోలేని సంస్కృతీ పతనానికే దారి తీస్తాయని వీరు గ్రహించరు. ఈ రకమైన ప్రవర్తనలో వీరు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారో స్పష్టంగానే కనిపిస్తుంది. మనవారు రాయని శాస్త్రం లేదని, ప్రవచించని సత్యం లేదని, కనిపెట్టని విజ్ఞానం లేదని, మనల్ని మనం మభ్యపెట్టుకుంటూ అబద్ధాల చరిత్రలు రాసుకున్నంత మాత్రాన మన సమాజం, సంస్కృతి ఉన్నతమైనవి అయిపోవని, మన ఔన్నత్యం కేవలం మన ప్రజాస్వామ్యపు విలువలని కాపాడుకోవడం లోనే ఉందనీ వీరు గ్రహించరు. సంస్కృతీసాంప్రదాయాల పరిరక్షణ ముసుగులో వీరు చేస్తున్న అఘాయిత్యాలు కేవలం వీరి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే. ఈ రకమైన నిర్బంధాలు మానవ చరిత్రలో కొత్త కాదు. కాలం నిదానంగా అయినా సరే, నిష్పక్షపాతంగానే నిజాన్ని వెలికితీస్తుంది. చరిత్రలో ఇంతకు ముందు ఇదేవిధంగా ఎందరో ఉగ్రవాదులను పంపిన దారినే వీరినీ పంపుతుంది. రక్షణ కోసం స్వాతంత్ర్యాన్ని త్యాగం చేసిన మనిషి ఆ రెంటికీ అర్హుడు కాడని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నట్టు, ఇలాంటి ప్రతికూలత ఎదురైనప్పుడల్లా ఎవరికీ తల ఒగ్గకుండా మన స్వేచ్ఛను నిర్భయంగా ప్రకటించుకుంటూ వుండడమే మనం చేయగలిగిందీ చేయాల్సిందీ.