తెలుగు పరిస్థితి అన్ని వైపులనుంచీ ఆకళింపు అయింది. ఇక తెలుగు గురించి సిపాయి సమరం జరపను, సహాయ నిరాకరణ చేయను, ఉప్పూ చేయను, అప్పూ చేయను, సత్యాగ్రహమూ చేయను, నిరశన వ్రతమసలే చేయను, డిస్కవరీ ఆఫ్ ఇండియా, మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్ రాయను.
వేలూరి గారికి :
పుట్ట గొడుగుల దాక ఎందుకు గానీ ఈనెల ఈమాటలో తాడికొండ శివకుమార శర్మ గారి కథ చాలదుటండీ? ఆది చదవడానికి అష్టకష్టాలు పడ్డాను. యస్సర్ ప్యూర్ టెలుగూ స్టోరీ !!!
వేల్చేరుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్టుగా ప్రస్తుత ఆర్ధిక, సాంఘిక పరిస్థుతుల ప్రభావం తెలుగు భాషాభివృద్ధి పై ఎలా పడుతుందో చక్కగా చెప్పారు. కాని ప్రస్తుతం భారతదేశంలో నైతే నేమి, పాశ్చాత్య దేశాలలో నైతే నేమి, లేక అమెరికాలో నైతే నేమి -ఉన్న విద్యావిధానం అణుమాత్రమూ ప్రశంసనీయం కాదనే విషయాన్ని నిరాకరించే వారు ఎక్కువమందే ఉంటారు అని నా అభిప్రాయము. దీనికి కారణం మారుతున్న సాంఘిక వ్యవస్థలు, ఆర్ధిక పరిస్థితులు, రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు, అతలా కుతలముగా ఉన్న కుటుంబ జీవనాలు, దుర్హంకారాలతో నడుస్తున్న రాజికీయాలు, సంసారాలకు సంసారాలు కూలిపోతున్నాయి, వ్యక్తి జీవితానికి భద్రతలేని వ్యవస్థలు వీటివల్ల తరతరాలుగా మానవుడు మధించి అనుసంధానించిన ఆధ్యాత్మిక నైతిక భాషా నిపుణ్య విషయాలకు గౌరవం లేకుండా పోతుంది.
అందువల్ల, భాషాభివృద్ధి స్కూళ్ళ నుండి మొదలుకావాలి. అది మొదలు కావడానికి మంచి వేతనం, గౌరవంతో కూడిన ఉపాధ్యాయులను నియమించాలి. దానికి ప్రభుత్వ సహకారం ఎంతైనా అవసరం. అటుపై, అది కాలేజీలకు, విశ్వవిద్యాలయాలకు ప్రాకాలి, అక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. తెలుగు కు సంబంధించిన భర్తీలను పెంచాలి. అవసరం ఒక్క భర్తీ అయినా రెండు లేదా మూడు భర్తీలను నియమించాలి. ఉద్యోగం కొశం చదువుతారు అది వచ్చాక ఆ కొద్ది మందిలో కొదరైనా మీరు చెప్పిన విధానాలను పాటించవచ్చును.
వ్యాసకర్త చెప్పినట్లు విశ్వ విద్యాలయమల ప్రాముఖ్యత చాలా అవ్సరము. దానిని ప్రభుత్వము జీవనోపాధితో ముడిపెడితే గాని అభివృద్ధి జరుగదు. ఇంగ్లీషు విషయము తీసుకోండి, ఈరోజు ఎంగ్లీషులో ఎం.ఎ. లేదా పి.హెచ్.డి. చేస్తే చేసినవాడికి ఖచ్చితంగా తెలుసు ఏదో కార్పొరేటు కాలేజీలో నైనా లేదా బయట ఎక్కడైనా ఉద్యోగము దొరుకుతుందని నమ్మకము ఉండగానే ఉంది. తెలుగు అభివృద్ధి చెందాలంటే ప్రజలకి ఈ ఆశని కల్పించాలి.ఇక భాషమీద మక్కువ ఉండి విద్య నేర్చుకునే వారికి, మీరు చెప్పినట్లు పత్రికా సంస్కరణ ఖచ్చితముగా కావలెను.
“మిత్రులు ఫిజిక్స్ ఆచార్యులు దాసు నేతాజీ మధుసూదన రావు గారు మొన్న వారు ‘వన్ ఇండియా – తెలుగు, మే 05, 2015’కు రాసిన ఒక వ్యాసం లింక్ పంపారు. అందులో నుంచి రెండు ముక్కలు – తెలుగు విశాఖపట్న వ్యవహార భాషగా ఎలా వెలిగి పొతోందో చూడండి.”
అలాగా? సరిగ్గా ఏడాది క్రితం, మే 2014లో, ఈమాటలో నేను రాసిన “వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు” అనే వ్యాసంలో ఇచ్చిన ఈ దిగువ ఉదాహరణ కూడా చూడండి.
“ఉదాహరణకి, పుట్టగొడుగుల వేపుడు చెయ్యటం ఎలాగో, ఒక తెలుగు పత్రికలో, ఈ దిగువ చూపిన విధంగా అభివర్ణించేరు ఒక రచయిత్రి.
తయారు చేసే పద్ధతి:
ఆయిల్ ని హీట్ చేసి, అందులో థరవ్ గా వాష్ చేసి డ్రెయిన్ చేసిన బాస్మతీ రైస్ ని త్రీ మినిట్స్ ఫ్రై చెయ్యాలి. అప్పుడు సూటబుల్ ఎమౌంట్ వాటర్ పోసి బోయిల్ చేసి రైస్ మెత్తబడేవరకూ కుక్ చెయ్యాలి. కుక్డ్ రైస్ ని కూల్ చెయ్యాలి. అనదర్ డిష్ లో ఆయిల్ పోసి అందులో డైస్ చేసిన అనియన్ పీసెస్, క్యాప్సికం, బీన్స్ వేసి వన్ మినిట్ ఫ్రై చెయ్యాలి. ఆఫ్టర్ వర్డ్స్ సోయ సాస్, టొమేటో పేస్ట్, పెప్పెర్ పౌడర్, సాల్ట్ ఏడ్ చేసి అప్పుడు డైస్ చేసిన మష్ రూం పీసెస్ మిక్స్ చేసి ఫైవ్ మినిట్స్ ఫ్రై చెయ్యాలి. మష్రూం పీసెస్ సాఫ్ట్ గా అయిన తరువాత కుక్ చేసి, కూల్ చేసిన రైస్ మిక్స్ చేసి టెన్ మినిట్స్ ఫ్లేం మీద ఉంచి అప్పుడు సెర్వ్ చెయ్యాలి. చాల టేస్టీగా ఉంటుందీ డిష్. ట్రై చెయ్యండి.”
ఈ వ్యాసంలో తెలుగు భాషాసారస్వతాల యొక్క ప్రాచీన మూలాల పట్ల గౌరవం లేకపోగా పైపెచ్చు చాలా నీచ/హీనభావమూ, చులకన ధోరణీ ధ్వనిస్తున్నాయి. అందుచేత దీని రచయితల కన్సర్నులలోని నిజాయితీ అనుమానాస్పదం కనుక అవి భాషాభిమానుల సానుభూతికి నోచుకోదగ్గవి కావు. ఒకవేళ తెలుగు నిజంగానే అంతర్జాతీయ భాష అయ్యే రోజొస్తే ప్రపంచం మనల్ని తప్పకుండా అడగబోయే ప్రశ్న: “మీ ఆదికవులెవరు?” అనే తప్ప “గురజాడ ఎవరు? శ్రీశ్రీ ఎవరు? తిలక్ ఎవరు?” అని కాదు. తమ పూర్వీకులకి గౌరవం ఇవ్వడం చేతకానివారు తమ తరువాతి తరాల నుంచి దాన్ని ఆశించడానికి అనర్హులవుతారు. అయిదో పండు తిన్నందువల్లనే ఆకలి తీరిందనీ అందువల్ల ముందు తిన్న నాలుగు పళ్లూ వేస్ట్ అనీ అనుకున్నాడట వెనకటికో ప్రబుద్ధుడు.
[వ్యాసం సరిగ్గా చదివి అర్థం చేసుకోకుండా వెల్లడి చేసే అభిప్రాయాలు కూడా సానుభూతికి నోచుకోదగ్గవి కావు, వాచస్పతి గారూ – సం.]
శ్రీ పరుచూరి: పట్టలేనంత ఆనందం! ఈసందర్భంలో రెండు మాటలు.
మొదటిది: శ్రీ పురాణం ఆంధ్ర జ్యోతిలో చదివినది. విశాఖపట్నం నుంచి బందరు వరకూ బెజవాడలో బండి మారి రైలు ప్రయాణం చేసేవారట, బందరులో పనిచేస్తున్న కాలంలో. ఒకతూరి బెజవాడలొ రైలెక్కారు. పాసింజరు. ప్రతి స్టేషన్ లోనూ ఆగుతూ వెళ్తోంది. ఎదురుగా రైతు లాగా కనిపిస్తూ ఒకాయన కూర్చున్నాడు. రైలు ఒక స్టేషన్ లో ఆగిన ప్రతిసారీ ఆయనను శ్రీ దువ్వూరి, తరువాతి స్టేషను ఏమిటి ? అని అడుగుతూ ఉన్నారుట. ఇలా రెండుమూడుసార్లు జరిగింతర్వాత ఆ రైతులా కనపడుతున్న వ్యక్తి శ్రీ దువ్వూరిని, మీకు సంస్కృతం తెలుసునా? అని అడిగాడట. ఏదో కొద్దిగా చదువుకున్నాను, అని శ్రీ దువ్వూరి. అయితే వినండి అంటూ అతగాడు “బెరానిఉత ఇందోగు నూకవప్పెచిమాక్రమాత్ స్టేషన్లు బెబం శాఖాయాం నూక్రాస్యాదితి నిర్ణయః!” అని చెప్పి ఊరుకున్నాడు. “అన్ని స్టేషన్లూ (బెజవాడ, రామవరప్పాడు, నిడమానూరు, ఉప్పులూరు, తరిగొప్పుల, ఇందుపల్లి, దోసపాడు, గుడివాడ, నూజెళ్ళ , కవుతవరం, వడ్లమాన్నాడు, పెడన, చిలకలపూడి, మచిలీపట్నం) తెలిశాయి గానీ ఈ చివరి నూక్రాస్యాదితి నిర్ణయః యేమిటి? అని అడిగారట శ్రీ దువ్వూరి. నూజెళ్ళ వద్ద క్రాసింగు ఉండును, ఆంటూ ఆయన దిగి పోయాడట. ఇది పూర్తిగా జ్ణాపకం మీద ఆధారపడి రాసాను.
రెండవది నేను ప్రత్యక్షంగా విన్నది. కాన్వొకేషన్ అయిన మర్నాడు గౌరవ డాక్టరేట్లు తీసుకున్న వారిని, ఉపాధ్యాయ సంఘం ఆనవాయితీగా పాత విద్యార్థులుగా చేర్చుకుని వారికి అభినందన సభ యేర్పాటు చేసినప్పుడు శ్రీ దువ్వూరి చెప్పినది: వారి మాటల్లో కాదు గానీ వారన్నట్టుగా, “పూర్వం చాన్సలర్లు బ్రిటిష్ వారు, వారు ‘కళాప్రపూర్ణ’ ఇస్తూ, ‘కాలప్రపూర్ణ’ అని పలికే వారు. గౌరవం పొందుతున్న వాళ్ళు గూడా బాగా వృద్ధులు. ఈ గౌరవం లభించిన కొద్ది కాలానికే పరమపదం చేరుకునేవారు…” — సభ అంతా నవ్వులు.
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి తఃతః అభిప్రాయం:
05/09/2015 5:24 am
తెలుగు పరిస్థితి అన్ని వైపులనుంచీ ఆకళింపు అయింది. ఇక తెలుగు గురించి సిపాయి సమరం జరపను, సహాయ నిరాకరణ చేయను, ఉప్పూ చేయను, అప్పూ చేయను, సత్యాగ్రహమూ చేయను, నిరశన వ్రతమసలే చేయను, డిస్కవరీ ఆఫ్ ఇండియా, మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్ రాయను.
తఃతః
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Okadu అభిప్రాయం:
05/08/2015 7:15 pm
వేమూరి గారికి అని పడాలి వేలూరి గారిక్కాదు . సారీ ఎక్సూజ్ మీ! మెనీ క్షమా .. కాదు కాదు ధన్య… కాదేమో లెండి. 🙂
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Okadu అభిప్రాయం:
05/08/2015 7:09 pm
వేలూరి గారికి :
పుట్ట గొడుగుల దాక ఎందుకు గానీ ఈనెల ఈమాటలో తాడికొండ శివకుమార శర్మ గారి కథ చాలదుటండీ? ఆది చదవడానికి అష్టకష్టాలు పడ్డాను. యస్సర్ ప్యూర్ టెలుగూ స్టోరీ !!!
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి శివశంకర్ అయ్యలసోమయాజుల అభిప్రాయం:
05/08/2015 6:28 pm
వేల్చేరుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్టుగా ప్రస్తుత ఆర్ధిక, సాంఘిక పరిస్థుతుల ప్రభావం తెలుగు భాషాభివృద్ధి పై ఎలా పడుతుందో చక్కగా చెప్పారు. కాని ప్రస్తుతం భారతదేశంలో నైతే నేమి, పాశ్చాత్య దేశాలలో నైతే నేమి, లేక అమెరికాలో నైతే నేమి -ఉన్న విద్యావిధానం అణుమాత్రమూ ప్రశంసనీయం కాదనే విషయాన్ని నిరాకరించే వారు ఎక్కువమందే ఉంటారు అని నా అభిప్రాయము. దీనికి కారణం మారుతున్న సాంఘిక వ్యవస్థలు, ఆర్ధిక పరిస్థితులు, రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు, అతలా కుతలముగా ఉన్న కుటుంబ జీవనాలు, దుర్హంకారాలతో నడుస్తున్న రాజికీయాలు, సంసారాలకు సంసారాలు కూలిపోతున్నాయి, వ్యక్తి జీవితానికి భద్రతలేని వ్యవస్థలు వీటివల్ల తరతరాలుగా మానవుడు మధించి అనుసంధానించిన ఆధ్యాత్మిక నైతిక భాషా నిపుణ్య విషయాలకు గౌరవం లేకుండా పోతుంది.
అందువల్ల, భాషాభివృద్ధి స్కూళ్ళ నుండి మొదలుకావాలి. అది మొదలు కావడానికి మంచి వేతనం, గౌరవంతో కూడిన ఉపాధ్యాయులను నియమించాలి. దానికి ప్రభుత్వ సహకారం ఎంతైనా అవసరం. అటుపై, అది కాలేజీలకు, విశ్వవిద్యాలయాలకు ప్రాకాలి, అక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. తెలుగు కు సంబంధించిన భర్తీలను పెంచాలి. అవసరం ఒక్క భర్తీ అయినా రెండు లేదా మూడు భర్తీలను నియమించాలి. ఉద్యోగం కొశం చదువుతారు అది వచ్చాక ఆ కొద్ది మందిలో కొదరైనా మీరు చెప్పిన విధానాలను పాటించవచ్చును.
వ్యాసకర్త చెప్పినట్లు విశ్వ విద్యాలయమల ప్రాముఖ్యత చాలా అవ్సరము. దానిని ప్రభుత్వము జీవనోపాధితో ముడిపెడితే గాని అభివృద్ధి జరుగదు. ఇంగ్లీషు విషయము తీసుకోండి, ఈరోజు ఎంగ్లీషులో ఎం.ఎ. లేదా పి.హెచ్.డి. చేస్తే చేసినవాడికి ఖచ్చితంగా తెలుసు ఏదో కార్పొరేటు కాలేజీలో నైనా లేదా బయట ఎక్కడైనా ఉద్యోగము దొరుకుతుందని నమ్మకము ఉండగానే ఉంది. తెలుగు అభివృద్ధి చెందాలంటే ప్రజలకి ఈ ఆశని కల్పించాలి.ఇక భాషమీద మక్కువ ఉండి విద్య నేర్చుకునే వారికి, మీరు చెప్పినట్లు పత్రికా సంస్కరణ ఖచ్చితముగా కావలెను.
చెరగని స్మృతులు 1 పన్నెండు పంపుల కథ గురించి Rajashekar reddy.c అభిప్రాయం:
05/08/2015 2:13 pm
Great
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Rao Vemuri అభిప్రాయం:
05/08/2015 1:43 pm
అలాగా? సరిగ్గా ఏడాది క్రితం, మే 2014లో, ఈమాటలో నేను రాసిన “వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు” అనే వ్యాసంలో ఇచ్చిన ఈ దిగువ ఉదాహరణ కూడా చూడండి.
“ఉదాహరణకి, పుట్టగొడుగుల వేపుడు చెయ్యటం ఎలాగో, ఒక తెలుగు పత్రికలో, ఈ దిగువ చూపిన విధంగా అభివర్ణించేరు ఒక రచయిత్రి.
తయారు చేసే పద్ధతి:
ఆయిల్ ని హీట్ చేసి, అందులో థరవ్ గా వాష్ చేసి డ్రెయిన్ చేసిన బాస్మతీ రైస్ ని త్రీ మినిట్స్ ఫ్రై చెయ్యాలి. అప్పుడు సూటబుల్ ఎమౌంట్ వాటర్ పోసి బోయిల్ చేసి రైస్ మెత్తబడేవరకూ కుక్ చెయ్యాలి. కుక్డ్ రైస్ ని కూల్ చెయ్యాలి. అనదర్ డిష్ లో ఆయిల్ పోసి అందులో డైస్ చేసిన అనియన్ పీసెస్, క్యాప్సికం, బీన్స్ వేసి వన్ మినిట్ ఫ్రై చెయ్యాలి. ఆఫ్టర్ వర్డ్స్ సోయ సాస్, టొమేటో పేస్ట్, పెప్పెర్ పౌడర్, సాల్ట్ ఏడ్ చేసి అప్పుడు డైస్ చేసిన మష్ రూం పీసెస్ మిక్స్ చేసి ఫైవ్ మినిట్స్ ఫ్రై చెయ్యాలి. మష్రూం పీసెస్ సాఫ్ట్ గా అయిన తరువాత కుక్ చేసి, కూల్ చేసిన రైస్ మిక్స్ చేసి టెన్ మినిట్స్ ఫ్లేం మీద ఉంచి అప్పుడు సెర్వ్ చెయ్యాలి. చాల టేస్టీగా ఉంటుందీ డిష్. ట్రై చెయ్యండి.”
– వేమూరి
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి వాచస్పతి అభిప్రాయం:
05/08/2015 8:49 am
ఈ వ్యాసంలో తెలుగు భాషాసారస్వతాల యొక్క ప్రాచీన మూలాల పట్ల గౌరవం లేకపోగా పైపెచ్చు చాలా నీచ/హీనభావమూ, చులకన ధోరణీ ధ్వనిస్తున్నాయి. అందుచేత దీని రచయితల కన్సర్నులలోని నిజాయితీ అనుమానాస్పదం కనుక అవి భాషాభిమానుల సానుభూతికి నోచుకోదగ్గవి కావు. ఒకవేళ తెలుగు నిజంగానే అంతర్జాతీయ భాష అయ్యే రోజొస్తే ప్రపంచం మనల్ని తప్పకుండా అడగబోయే ప్రశ్న: “మీ ఆదికవులెవరు?” అనే తప్ప “గురజాడ ఎవరు? శ్రీశ్రీ ఎవరు? తిలక్ ఎవరు?” అని కాదు. తమ పూర్వీకులకి గౌరవం ఇవ్వడం చేతకానివారు తమ తరువాతి తరాల నుంచి దాన్ని ఆశించడానికి అనర్హులవుతారు. అయిదో పండు తిన్నందువల్లనే ఆకలి తీరిందనీ అందువల్ల ముందు తిన్న నాలుగు పళ్లూ వేస్ట్ అనీ అనుకున్నాడట వెనకటికో ప్రబుద్ధుడు.
[వ్యాసం సరిగ్గా చదివి అర్థం చేసుకోకుండా వెల్లడి చేసే అభిప్రాయాలు కూడా సానుభూతికి నోచుకోదగ్గవి కావు, వాచస్పతి గారూ – సం.]
దువ్వూరి వారి బాలవ్యాకరణావతారం, జానకితో జనాంతికం గురించి తఃతః అభిప్రాయం:
05/08/2015 7:15 am
శ్రీ పరుచూరి: పట్టలేనంత ఆనందం! ఈసందర్భంలో రెండు మాటలు.
మొదటిది: శ్రీ పురాణం ఆంధ్ర జ్యోతిలో చదివినది. విశాఖపట్నం నుంచి బందరు వరకూ బెజవాడలో బండి మారి రైలు ప్రయాణం చేసేవారట, బందరులో పనిచేస్తున్న కాలంలో. ఒకతూరి బెజవాడలొ రైలెక్కారు. పాసింజరు. ప్రతి స్టేషన్ లోనూ ఆగుతూ వెళ్తోంది. ఎదురుగా రైతు లాగా కనిపిస్తూ ఒకాయన కూర్చున్నాడు. రైలు ఒక స్టేషన్ లో ఆగిన ప్రతిసారీ ఆయనను శ్రీ దువ్వూరి, తరువాతి స్టేషను ఏమిటి ? అని అడుగుతూ ఉన్నారుట. ఇలా రెండుమూడుసార్లు జరిగింతర్వాత ఆ రైతులా కనపడుతున్న వ్యక్తి శ్రీ దువ్వూరిని, మీకు సంస్కృతం తెలుసునా? అని అడిగాడట. ఏదో కొద్దిగా చదువుకున్నాను, అని శ్రీ దువ్వూరి. అయితే వినండి అంటూ అతగాడు “బెరానిఉత ఇందోగు నూకవప్పెచిమాక్రమాత్ స్టేషన్లు బెబం శాఖాయాం నూక్రాస్యాదితి నిర్ణయః!” అని చెప్పి ఊరుకున్నాడు. “అన్ని స్టేషన్లూ (బెజవాడ, రామవరప్పాడు, నిడమానూరు, ఉప్పులూరు, తరిగొప్పుల, ఇందుపల్లి, దోసపాడు, గుడివాడ, నూజెళ్ళ , కవుతవరం, వడ్లమాన్నాడు, పెడన, చిలకలపూడి, మచిలీపట్నం) తెలిశాయి గానీ ఈ చివరి నూక్రాస్యాదితి నిర్ణయః యేమిటి? అని అడిగారట శ్రీ దువ్వూరి. నూజెళ్ళ వద్ద క్రాసింగు ఉండును, ఆంటూ ఆయన దిగి పోయాడట. ఇది పూర్తిగా జ్ణాపకం మీద ఆధారపడి రాసాను.
రెండవది నేను ప్రత్యక్షంగా విన్నది. కాన్వొకేషన్ అయిన మర్నాడు గౌరవ డాక్టరేట్లు తీసుకున్న వారిని, ఉపాధ్యాయ సంఘం ఆనవాయితీగా పాత విద్యార్థులుగా చేర్చుకుని వారికి అభినందన సభ యేర్పాటు చేసినప్పుడు శ్రీ దువ్వూరి చెప్పినది: వారి మాటల్లో కాదు గానీ వారన్నట్టుగా, “పూర్వం చాన్సలర్లు బ్రిటిష్ వారు, వారు ‘కళాప్రపూర్ణ’ ఇస్తూ, ‘కాలప్రపూర్ణ’ అని పలికే వారు. గౌరవం పొందుతున్న వాళ్ళు గూడా బాగా వృద్ధులు. ఈ గౌరవం లభించిన కొద్ది కాలానికే పరమపదం చేరుకునేవారు…” — సభ అంతా నవ్వులు.
నమస్కారాలతో
తఃతః
చెట్టు కూలిన వేళ గురించి Damu ndm అభిప్రాయం:
05/08/2015 7:08 am
ఉరుక వచ్చీ ఉడుత ‘ఉస్సు ‘ రని మళ్ళింది
వాల కొమ్మా లేక వలస బోయెను పిచుక
గూడు కూనా లేక గోడుమనె గోరింక
చాలా బాగున్నాయి
కాటుక తిలకం కుంకాలు శతమానం పూసలు గురించి Damu ndm అభిప్రాయం:
05/08/2015 5:49 am
ఇప్పుడు కూడా ఇలాంటి వీధి వ్యాపారాలు ఉన్నాయా? ఉంటే చాలా బాగుంటుంది.