ఈ వ్యాసంలో ఇంకా అక్కడక్కడ కనిపించిన అచ్చు తప్పులు సరిదిద్ది, పాఠక మహాశయులు అభిప్రాయాలని లెక్కలోకి తీసుకుని మరికొన్ని మార్పులు, చేర్పులు చేసి, నా సంతృప్తి కోసం ఒక నఖ చిత్రంలా ఋజువుని ఇంగ్లీషులో కూడ రాసి, ఒక పుస్తకం రూపంలో ప్రచురించేను. ఈ దిగువ ఇచ్చిన కినిగె లంకె నుండి ఈ పుస్తకాన్ని ఉచితంగా దింపుకోవచ్చు!
పాఠక మహాశయులకి:
ఈ వ్యాసంతోపాటు, ఈమాటలో నేను ప్రచురించిన గణిత సంబంధమైన మరిన్ని వ్యాసాలని కూడగట్టి, “రామానుజన్ నుండి ఇటూ, అటూ” అనే ఇ-పుస్తకం ప్రచురించేను అని గతంలో ఒకసారి మనవి చేసేను కదా! ఇప్పటికి పాఠకులు 1000 ప్రతులు దింపుకున్నారు. అంటే వెయ్యి మంది ఏకైక (యునీక్) పాఠకులని నేను అనుకోను. ఒకొక్కరు పరాగ్గా దింపుకునే బొత్తాన్ని రెండు సార్లు నొక్కి ఉండవచ్చు. కనుక 500 వ్యక్తులు అయినా దింపుకుని ఉంటారు. వీరిలో కనీసం 50 మంది అయినా చదివి ఉంటారు. పరవాలేదు. లెక్కలమీద రాసిన పుస్తకానికి ఈమాత్రం ఆదరణ వచ్చిందంటే సంతోషించవలసిన విషయమే!
ఇక్కడ ఉన్నత స్థాన మైన ఆకాశం (స్వర్గం) నుండి అధమ స్థాన మైన పాతాళం చేరు కోవడమే వివేక భ్రష్ఠత.స్వర్గం లో ఉండవలసిన గంగాదేవి ఎలా జారి క్రిందకు పడి పోయింది అనేదే ప్రధాన అంశం.ఆలా పడి పోవడానికి ఎవరు కారణం? అలా పడి పోవడం వల్ల ఎవరికి ప్రయోజనం? పడి పోవడం వల్ల మేలే జరిగింది కదా! కాబట్టి అది వివేక భ్రష్ఠత కాదు-వివేకద్యుమ్నము అని అన్వయించాలని ప్రయత్నించడం అసంగత మైన చర్చ అనిపిస్తుంది. ఐతే,కథ మాత్రం చాలా బాగుంది.
వ్యాసం బాగుంది. చర్చ ఇంకా బాగుంది. ఈ చర్చ ముగిసినా, నా నోరు ఊరుకోక రెండు మాటలు.
నాకైతే తెలుగు వర్ణమాల ఉద్దేశాలు రెండు అని అనిపిస్తున్నది. మొదటిది తెలుగు వ్రాయడానికి, రెండవది సంస్కృతం వ్రాయడానికి.
తెలుగు మాటలలో ఌ, ౡ లు వెతికినా నాకు కనిపించలేదు. మీకెవరికైనా తెలిస్తే చెప్పండి. ఉౡకము, కఌప్తము అందరూ చెప్పే ఉదాహరణలు. రెండూ సంస్కృత పదాలే. ఉలూకము ఉచ్చారణకి ఉౡకము కి తేడా ఏమిటో ఎవరన్నా వివరిస్తే బాగుంటుంది. అలాగే కఌప్తము. క్లుప్తము అని రాసినా, చదివినా, నాకైతే తేడా తెలవటము లేదు. పైగా ఌ మహేశ్వర సూత్రములలో కూడా లేదు. అసలు ఌ, ౡ లు అచ్చులు ఎలా అవుతున్నాయో నాకు అర్థం కావటం లేదు. అచ్చులు పలికేటప్పుడు నాలుక నోటిలో ఏ భాగాన్ని స్పర్శించదు. ఌ, ౡ అలా కాదు.
మంత్ర శాస్త్రంలో ఌ, ౡ వాడతారని అంటారు. మామూలు తెలుగే విదేశాలలో నేర్పటానికి శ్రమ పడుతున్నప్పుడూ, మంత్ర శాస్త్రానికి పనికి వచ్చే అక్షరాలు నేర్పటానికి అర్థం కనిపించటం లేదు.
ఇక ఙ. ఈ అక్షరంతో తెలుగు పదాలు ఉన్నవా? వెంకటేశ్వరుడు బదులు వేఙ్కటేశ్వరుడు అని వ్రాయవచ్చు. కానీ వాడుకలో లేదు. వేఙ్కటేశ్వరుడు అని వ్రాస్తే ఎవరూ అడ్డు పడరు. ముచ్చటపాడేవారు కొంత మంది ఉండవచ్చు.
అయితే మనం తెలుగు నేర్పేటప్పుడు, ముఖ్యంగా విదేశాలలో, ఈ అక్షరం అవసరం ఉందా?
పెద్దవారు, వేమూరి వారి వలే నేను కూడా అమెరికాలో తెలుగు నేర్పుతున్నాను. అయితే నేను నేర్పేది తెలుగు వారి పిల్లలకు. ఆంతె దేశాలలో (ఆంధ్ర, తెలంగాణ) లాగా మేము తెలుగు నేర్పడం కష్టం. ఇక్కడ పిల్లల తల్లిదండ్రులకు కూడా చాలా మందికి తెలుగు వ్రాయడం రాదు. ముఖ్యంగా హైదరాబాదులో పెరిగిన తల్లిదండ్రులకు. హైదరబాదులోని తెలుగు పండితులు కూడా చాలా మంది తమ పిల్లలకు తెలుగు నేర్పించలేదు.
ఇంకో పెద్ద సమస్య నేటి తెలుగు సినిమాలు. ఇవాళ తెలుగు హీరోయిన్లు లేరు. ఉత్తరాది నుండి తీసుకు వచ్చిన వాళ్లకు తెలుగు రాదు. మాటలు తుంచి, అన్ని మాటలనీ హలంతాలుగు చేసి, ఇంగ్లీషు పదాలతో పిచ్చి పిచ్చి సంకర చేసి చెపుతున్నారు. దీనికి కారణం దర్శకులే. వారికి కూడా నంది అవార్డులు ఇస్తున్నారు. ఈ సినిమాలు చూసి అమెరికాలోని తెలుగు వారి పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు. తరగతులలో మేము ఎంత శ్రమ పడినా ఈ సినీ పిచ్చి తెలుగును ఎదిరించటం కష్టంగానే ఉంది.
తేలిక తెలుగుని పరిహసించిన వారు ఈ సినీ పిచ్చి తెలుగుని కూడా ఎదురించితే ప్రయోజనం ఉంటుందేమో.
ఆంతె దేశాలలో తెలుగుని ఉద్దరించటానికి వేమూరి వారు చేసిన సూచనలకు నేను ఇంకొకటి కలుపుతున్నాను.
10వ తరగతి, ఇంటర్మీడియేట్లలో ద్వితీయ భాషగా సంస్కృతం, ఫ్రెంచ్, జెర్మన్ తీసి వేయాలి. లేకపోతే వాటి ప్రమాణాలను తెలుగుకి సమానంగా పెంచాలి. ఈ మూడు భాషలలో అయితే అక్షరాలు, ఏవో నాలుగు పదాలు నేర్చుకున్నా 90 మార్కులు వస్తాయి. తెలుగు అలా కాదు. మన తెలుగు మాస్టార్లు, మాస్టారిణిలూ ప్రతి తప్పుకూ కత్తిరిస్తారు. ఎంత బాగా రాసినా 70 రావటం కూడా కష్టమే. అందుకుని పిల్లలూ ఫ్రెంచ్, జెర్మన్ మీదే మొగ్గుతున్నారు. వారి తల్లిదండ్రులూకి “మా వాడు ఫ్రెంచ్ తీసుకున్నాడు” అని గొప్పలు పోతూ చెప్పడం ఒక సరదా. పిల్లగాడికి ఫ్రెంచ్ చదువు కన్యా శుల్కంలోని “ట్వింకిల్ ట్వింకిల్ లిట్ల్ స్టార్”ని మాత్రం దాటదు.
పద్యాల్ని మామూలుగా చదువుకుని వాటిలోని భావ సౌందర్యానికీ, పద్యాల నడకల సొబగులకే మురిసి పోయే మా లాంటి వారికీ తీరికగా వాటి లోతుల్ని తరచి విశేషాలను వెలికి తీసి అందిస్తున్న వారిని అభినందించకుండా ఉండలేము. మరీ ముఖ్యంగా వ్యాసం మీద కామెంట్ల రూపంలో వచ్చే పెద్దల అభిప్రాయాలు చదివి ఎంతో ఆనందం కలుగుతుంది.శ్రీ కామేశ్వర రావు గారికీ ఏల్చూరి వారికీ అభినందనలు.
కథ చాలా బాగుంది.ఎందుకో నాకు ఎన్నో ఏళ్ళుగా ఈ పద్యాన్ని తలచుకున్నప్పుడల్లా గంగానదిని వివేకభ్రష్టురాలనడం నచ్చేది కాదు.ఈ కథలో చెప్పినట్లు గంగానదికి సముద్రంలో కలిసి ఆవిరై మళ్ళా వర్షరూపంలో హిమాద్రిని చేరుకునే అవకాశం ఉన్నా అలా చేయకుండా పాతాళానికి ఎందుకు వెళ్ళిందనే దానికి ఒక కారణం ఉంది.ఆకాశంలో పారే గంగ భూమి మీదకు రావడానికే ఇష్టపడదు. కాని భగీరథుని కోరిక మన్నించి బ్రహ్మగారు అతడితో వెళ్ళమని చెప్పిన తర్వాత అతడి వెనుకే పాతాళంలో ఉన్న సగరకుమారుల అస్థికలమీదుగా ప్రవహించి వారికి మోక్షాన్ని కలిగించడానికి అంగీకరించి వచ్చిన తర్వాత ఇంక మధ్యలో ఆగిపోయే ప్రశ్నే రాకూడదు. ఆరంభించరు నీచమానవులు ..అన్న పద్యంలో చెప్పినట్లు ధీరుల్ విఘ్న నిహన్యమానసుల్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ కావునన్..అనుకున్న ప్రజ్ఞానిధి కావుననే ధ్యేయాన్ని వదిలిపెట్టకుండా పాతాళానికే సాగింది అని సరిపెట్టుకున్నాను కానీ దీనిని వివేకభ్రష్టతగా చిత్రించడం మాత్రంనాకు ఇప్పటికీ నచ్చలేదు.
ఫెర్మా చివరి సిద్ధాంతం గురించి Rao Vemuri అభిప్రాయం:
09/23/2016 11:10 am
ఈ వ్యాసంలో ఇంకా అక్కడక్కడ కనిపించిన అచ్చు తప్పులు సరిదిద్ది, పాఠక మహాశయులు అభిప్రాయాలని లెక్కలోకి తీసుకుని మరికొన్ని మార్పులు, చేర్పులు చేసి, నా సంతృప్తి కోసం ఒక నఖ చిత్రంలా ఋజువుని ఇంగ్లీషులో కూడ రాసి, ఒక పుస్తకం రూపంలో ప్రచురించేను. ఈ దిగువ ఇచ్చిన కినిగె లంకె నుండి ఈ పుస్తకాన్ని ఉచితంగా దింపుకోవచ్చు!
http://kinige.com/kbook.php?id=7464
నమస్కారం
వేమూరి వేంకటేశ్వరరావు
అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి Rao Vemuri అభిప్రాయం:
09/22/2016 4:17 pm
పాఠక మహాశయులకి:
ఈ వ్యాసంతోపాటు, ఈమాటలో నేను ప్రచురించిన గణిత సంబంధమైన మరిన్ని వ్యాసాలని కూడగట్టి, “రామానుజన్ నుండి ఇటూ, అటూ” అనే ఇ-పుస్తకం ప్రచురించేను అని గతంలో ఒకసారి మనవి చేసేను కదా! ఇప్పటికి పాఠకులు 1000 ప్రతులు దింపుకున్నారు. అంటే వెయ్యి మంది ఏకైక (యునీక్) పాఠకులని నేను అనుకోను. ఒకొక్కరు పరాగ్గా దింపుకునే బొత్తాన్ని రెండు సార్లు నొక్కి ఉండవచ్చు. కనుక 500 వ్యక్తులు అయినా దింపుకుని ఉంటారు. వీరిలో కనీసం 50 మంది అయినా చదివి ఉంటారు. పరవాలేదు. లెక్కలమీద రాసిన పుస్తకానికి ఈమాత్రం ఆదరణ వచ్చిందంటే సంతోషించవలసిన విషయమే!
దీనిని ఈ దిగువ జాలస్థలి నుండి ఉచితంగా దింపుకోవచ్చు.
http://kinige.com/kbook.php?id=6975
భర్తృహరి అభాషితం గురించి K V SESHA KUMAR అభిప్రాయం:
09/21/2016 8:31 am
ఇక్కడ ఉన్నత స్థాన మైన ఆకాశం (స్వర్గం) నుండి అధమ స్థాన మైన పాతాళం చేరు కోవడమే వివేక భ్రష్ఠత.స్వర్గం లో ఉండవలసిన గంగాదేవి ఎలా జారి క్రిందకు పడి పోయింది అనేదే ప్రధాన అంశం.ఆలా పడి పోవడానికి ఎవరు కారణం? అలా పడి పోవడం వల్ల ఎవరికి ప్రయోజనం? పడి పోవడం వల్ల మేలే జరిగింది కదా! కాబట్టి అది వివేక భ్రష్ఠత కాదు-వివేకద్యుమ్నము అని అన్వయించాలని ప్రయత్నించడం అసంగత మైన చర్చ అనిపిస్తుంది. ఐతే,కథ మాత్రం చాలా బాగుంది.
వేలుపిళ్ళై నిజం, సెందామరై కల్పితం! –సి. రామచంద్ర రావుగారితో ఒక మధ్యాహ్నం గురించి దేవరకొండ అభిప్రాయం:
09/21/2016 2:35 am
చక్కని ముఖాముఖీ! సుజాత గార్కి అభినందనలు. ఈ కథలు ఇంగ్లీషులోకి అనువాదం ఎవరైనా చేశారేమో తెలుపగలరు.
హృదయం ఇక్కడే వుంది! గురించి manohar అభిప్రాయం:
09/16/2016 11:48 am
గీత విహారిని బతికించిందన్నారు. కానీ గీత వెళ్ళే సరికే విహారి విషం తాగాడన్నారు. కొంచెం క్లారిటీ మిస్సయ్యింది.
తేలిక తెలుగు గురించి సుభాషుడు అభిప్రాయం:
09/16/2016 10:07 am
అయ్యలూ, అమ్మలూ,
వ్యాసం బాగుంది. చర్చ ఇంకా బాగుంది. ఈ చర్చ ముగిసినా, నా నోరు ఊరుకోక రెండు మాటలు.
నాకైతే తెలుగు వర్ణమాల ఉద్దేశాలు రెండు అని అనిపిస్తున్నది. మొదటిది తెలుగు వ్రాయడానికి, రెండవది సంస్కృతం వ్రాయడానికి.
తెలుగు మాటలలో ఌ, ౡ లు వెతికినా నాకు కనిపించలేదు. మీకెవరికైనా తెలిస్తే చెప్పండి. ఉౡకము, కఌప్తము అందరూ చెప్పే ఉదాహరణలు. రెండూ సంస్కృత పదాలే. ఉలూకము ఉచ్చారణకి ఉౡకము కి తేడా ఏమిటో ఎవరన్నా వివరిస్తే బాగుంటుంది. అలాగే కఌప్తము. క్లుప్తము అని రాసినా, చదివినా, నాకైతే తేడా తెలవటము లేదు. పైగా ఌ మహేశ్వర సూత్రములలో కూడా లేదు. అసలు ఌ, ౡ లు అచ్చులు ఎలా అవుతున్నాయో నాకు అర్థం కావటం లేదు. అచ్చులు పలికేటప్పుడు నాలుక నోటిలో ఏ భాగాన్ని స్పర్శించదు. ఌ, ౡ అలా కాదు.
మంత్ర శాస్త్రంలో ఌ, ౡ వాడతారని అంటారు. మామూలు తెలుగే విదేశాలలో నేర్పటానికి శ్రమ పడుతున్నప్పుడూ, మంత్ర శాస్త్రానికి పనికి వచ్చే అక్షరాలు నేర్పటానికి అర్థం కనిపించటం లేదు.
ఇక ఙ. ఈ అక్షరంతో తెలుగు పదాలు ఉన్నవా? వెంకటేశ్వరుడు బదులు వేఙ్కటేశ్వరుడు అని వ్రాయవచ్చు. కానీ వాడుకలో లేదు. వేఙ్కటేశ్వరుడు అని వ్రాస్తే ఎవరూ అడ్డు పడరు. ముచ్చటపాడేవారు కొంత మంది ఉండవచ్చు.
అయితే మనం తెలుగు నేర్పేటప్పుడు, ముఖ్యంగా విదేశాలలో, ఈ అక్షరం అవసరం ఉందా?
పెద్దవారు, వేమూరి వారి వలే నేను కూడా అమెరికాలో తెలుగు నేర్పుతున్నాను. అయితే నేను నేర్పేది తెలుగు వారి పిల్లలకు. ఆంతె దేశాలలో (ఆంధ్ర, తెలంగాణ) లాగా మేము తెలుగు నేర్పడం కష్టం. ఇక్కడ పిల్లల తల్లిదండ్రులకు కూడా చాలా మందికి తెలుగు వ్రాయడం రాదు. ముఖ్యంగా హైదరాబాదులో పెరిగిన తల్లిదండ్రులకు. హైదరబాదులోని తెలుగు పండితులు కూడా చాలా మంది తమ పిల్లలకు తెలుగు నేర్పించలేదు.
ఇంకో పెద్ద సమస్య నేటి తెలుగు సినిమాలు. ఇవాళ తెలుగు హీరోయిన్లు లేరు. ఉత్తరాది నుండి తీసుకు వచ్చిన వాళ్లకు తెలుగు రాదు. మాటలు తుంచి, అన్ని మాటలనీ హలంతాలుగు చేసి, ఇంగ్లీషు పదాలతో పిచ్చి పిచ్చి సంకర చేసి చెపుతున్నారు. దీనికి కారణం దర్శకులే. వారికి కూడా నంది అవార్డులు ఇస్తున్నారు. ఈ సినిమాలు చూసి అమెరికాలోని తెలుగు వారి పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు. తరగతులలో మేము ఎంత శ్రమ పడినా ఈ సినీ పిచ్చి తెలుగును ఎదిరించటం కష్టంగానే ఉంది.
తేలిక తెలుగుని పరిహసించిన వారు ఈ సినీ పిచ్చి తెలుగుని కూడా ఎదురించితే ప్రయోజనం ఉంటుందేమో.
ఆంతె దేశాలలో తెలుగుని ఉద్దరించటానికి వేమూరి వారు చేసిన సూచనలకు నేను ఇంకొకటి కలుపుతున్నాను.
10వ తరగతి, ఇంటర్మీడియేట్లలో ద్వితీయ భాషగా సంస్కృతం, ఫ్రెంచ్, జెర్మన్ తీసి వేయాలి. లేకపోతే వాటి ప్రమాణాలను తెలుగుకి సమానంగా పెంచాలి. ఈ మూడు భాషలలో అయితే అక్షరాలు, ఏవో నాలుగు పదాలు నేర్చుకున్నా 90 మార్కులు వస్తాయి. తెలుగు అలా కాదు. మన తెలుగు మాస్టార్లు, మాస్టారిణిలూ ప్రతి తప్పుకూ కత్తిరిస్తారు. ఎంత బాగా రాసినా 70 రావటం కూడా కష్టమే. అందుకుని పిల్లలూ ఫ్రెంచ్, జెర్మన్ మీదే మొగ్గుతున్నారు. వారి తల్లిదండ్రులూకి “మా వాడు ఫ్రెంచ్ తీసుకున్నాడు” అని గొప్పలు పోతూ చెప్పడం ఒక సరదా. పిల్లగాడికి ఫ్రెంచ్ చదువు కన్యా శుల్కంలోని “ట్వింకిల్ ట్వింకిల్ లిట్ల్ స్టార్”ని మాత్రం దాటదు.
సుభాషుడు
గడి నుడి – 1 గురించి k k rao అభిప్రాయం:
09/15/2016 12:37 pm
ఈ మాట చాలా బాగుంది. ముఖ్యంగా నాకు ఇష్టమైనది గడి-నుడి. చక్కగా మనోరంజకంగా ఉంది. శుభాభినందనలు.
నాకు నచ్చిన పద్యం: తెలుగు సత్యభామ పలుకు-బడి గురించి వురుపుటూరి శ్రీనివాస్ అభిప్రాయం:
09/15/2016 8:11 am
శివకుమార శర్మ: “ఈ తుమ్మున్నర్థకమే లాటిన్ లాగా కనబడుతోంది.”
సంస్కృతంలా వినబడాలే? :-). గంతుమ్ (వెళ్ళుటకు), కర్తుమ్ (చేయుటకు) వంటి మాటల్లో చివర్లో వచ్చే “తుమున్” ప్రత్యయం “కొరకు”/”కు” అర్థాన్నిస్తుంది.
నాకు నచ్చిన పద్యం: తెలుగు సత్యభామ పలుకు-బడి గురించి పంతుల గేోపాల కృష్ణ అభిప్రాయం:
09/15/2016 12:39 am
పద్యాల్ని మామూలుగా చదువుకుని వాటిలోని భావ సౌందర్యానికీ, పద్యాల నడకల సొబగులకే మురిసి పోయే మా లాంటి వారికీ తీరికగా వాటి లోతుల్ని తరచి విశేషాలను వెలికి తీసి అందిస్తున్న వారిని అభినందించకుండా ఉండలేము. మరీ ముఖ్యంగా వ్యాసం మీద కామెంట్ల రూపంలో వచ్చే పెద్దల అభిప్రాయాలు చదివి ఎంతో ఆనందం కలుగుతుంది.శ్రీ కామేశ్వర రావు గారికీ ఏల్చూరి వారికీ అభినందనలు.
భర్తృహరి అభాషితం గురించి పంతుల గోపాల కృష్ణ అభిప్రాయం:
09/14/2016 12:39 pm
కథ చాలా బాగుంది.ఎందుకో నాకు ఎన్నో ఏళ్ళుగా ఈ పద్యాన్ని తలచుకున్నప్పుడల్లా గంగానదిని వివేకభ్రష్టురాలనడం నచ్చేది కాదు.ఈ కథలో చెప్పినట్లు గంగానదికి సముద్రంలో కలిసి ఆవిరై మళ్ళా వర్షరూపంలో హిమాద్రిని చేరుకునే అవకాశం ఉన్నా అలా చేయకుండా పాతాళానికి ఎందుకు వెళ్ళిందనే దానికి ఒక కారణం ఉంది.ఆకాశంలో పారే గంగ భూమి మీదకు రావడానికే ఇష్టపడదు. కాని భగీరథుని కోరిక మన్నించి బ్రహ్మగారు అతడితో వెళ్ళమని చెప్పిన తర్వాత అతడి వెనుకే పాతాళంలో ఉన్న సగరకుమారుల అస్థికలమీదుగా ప్రవహించి వారికి మోక్షాన్ని కలిగించడానికి అంగీకరించి వచ్చిన తర్వాత ఇంక మధ్యలో ఆగిపోయే ప్రశ్నే రాకూడదు. ఆరంభించరు నీచమానవులు ..అన్న పద్యంలో చెప్పినట్లు ధీరుల్ విఘ్న నిహన్యమానసుల్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ కావునన్..అనుకున్న ప్రజ్ఞానిధి కావుననే ధ్యేయాన్ని వదిలిపెట్టకుండా పాతాళానికే సాగింది అని సరిపెట్టుకున్నాను కానీ దీనిని వివేకభ్రష్టతగా చిత్రించడం మాత్రంనాకు ఇప్పటికీ నచ్చలేదు.