నైషధాంధ్రీకరణ సందర్భంగా పరిహరింపబడిన శబ్దాశ్రయమైన అనుచితాలకి రెండు, మూడు ఉదాహరణలు మీకు కనబడినవి చూపించగలరా? (అవి Srinatha: The poet who made Gods and Kings లో ఉన్నాయేమో తెలియదు.)
ఏ విధంగా ఆలోచించినా మీరు ఉటంకిస్తున్న తర్కం సమగ్రంగా లేదని అనిపిస్తుంది.
3. అనౌచిత్యం అంటే మూలంలో వున్న రసప్రాతికూల్యతే. “అసలు విషయం: మూలంలో రసప్రాతికూల్యాన్ని ఆరోపించితే గాని, అనౌచిత్యస్థాపనం జరగదు.”
ఇందులో మూడో అడుగు తార్కికం కాదు. ఎందుకంటే, అనువాదంలో అనౌచిత్యం ఉండటానికి వేరే కారణాలు ఉండొచ్చు. ఇందుకు ఒక ఉదాహరణ, మూలభాషలోని శబ్దసమూహాలు అలాగే తీసుకుంటే గమ్యభాషలో అనుచితార్థాలు రావటం.
ఆ మూడవ అడుగు తార్కికం అవునో కాదో కానీ అది లాక్షణిక సాంప్రదాయమండి. “అనౌచిత్యాదృతే నాన్యద్రసభంగకారణమ్” – అని ఆనందవర్ధనుడు. తార్కికమా, అతార్కికమా అన్న విషయం శ్రీనాథుని కాలాన్ని బట్టి ఊహించాలి. ఈ కాలపు మన ఆలోచనలో తర్కాన్ని శ్రీనాథునిపై ఆరోపించటం సబబెలా అవుతుంది? ఆ కాలం నాటికి లాక్షణిక సాంప్రదాయం ప్రకారం రసభంగమే అనౌచిత్యం.
మూలభాషలో శబ్దసమూహాలు గమ్యభాషలో అనుచితార్థం అయే అవకాశాన్ని పురస్కరించుకుని, ఒక సరికొత్త లాక్షణిక సాంప్రదాయానికి, సరికొత్త మౌలిక ప్రతిపాదనకూ శ్రీనాథుడు నడుం కట్టడం అన్నది దూరాన్వయమైన విషయమండి. ఒక వేళ అలా ఊహించినా కొన్ని ఇబ్బందులు వస్తాయి.
మూలభాష, గమ్యభాష – అని కాకుండా సంస్కృతమైనా, ప్రాకృతమైనా, ఏదేని ఒక కావ్యానికి సంబంధించి ’అశ్లీలము, అమంగళకరమూ, వ్రీడాజనకము’ అయిన శబ్దాలు పరిహార్యాలు అని మమ్మటుడు కావ్యప్రకాశంలోని దోషప్రకరణం లో నిర్దేశించాడు. పైన మీరు చెప్పిన ’గమ్యభాషలో అనుచితార్థం” అన్న విషయం మమ్మటుని దోషనిర్వచనంలో (ఇంకా నేయార్థమూ ఇత్యాది దోషాదులలో) భాగమై విలీనమవుతుంది. లాక్షణికులు తమ ఉదాహరణలలో ప్రాకృత కావ్యాలనూ ఉదాహరించారు. అందువలన వారి నిర్దేశాలు సంస్కృతానికే కాక సంస్కృతేతర భాషల కావ్యాలకూ వర్తిస్తాయి.
మీరు చెప్పిన ఉదాహరణతోనే Acapulco ను తెనుగులో మూలభాషలో నాదానుగుణంగా యథాతథంగా అనువదించి తెలుగులో ఉపయోగిస్తే అది (సహృదయుడైన సామాజికుని దృష్ట్యా) అశ్లీలశబ్దమవుతుంది. ఇది కావ్యప్రకాశకారుడి ప్రకారం దోషం. అది వరకే ఏర్పడి ఉన్న లాక్షణిక సాంప్రదాయం.ఆ సాంప్రదాయాన్ని గుర్తుంచుకుని రచన చేసి ఉంటాడు కానీ, తిరిగి కొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పే అవసరం శ్రీనాథునికి ఉండరాదు.
అందుచేత అనువాదం కోసం ప్రత్యేకమైన ’అనౌచిత్య నిర్వచనాన్ని’ తనకు తానే శ్రీనాథుడు నిర్దేశించుకునే అవసరం లేదు. ఒకవేళ నిర్దేశించుకున్నా అందుకు మూలం ఎక్కడో ఉండాలి. లేదా ఆ విషయం గురించి సమగ్రంగా ఒక లాక్షణిక గ్రంథాన్ని వెలువర్చి, ఈ ప్రతిపాదనను సాకల్యంగా చర్చించి ఉండాలి. ఎందుకంటే సంస్కృత అలంకారిక గ్రంథాలన్నీ ఆ ధోరణిలో రచింపబడినవే కాబట్టి. అలాంటివేవీ మనకు కానరావు.
మరొక పార్శ్వం. శ్రీనాథుని కంటే ముందు మూలఘటిక కేతన – దశకుమారచరితమ్ వచన కావ్యాన్ని తెనుగు పద్యానువాదం చేశాడు. మూలభాష సంస్కృతంలోని దండి దశకుమారచరితమ్ – పదలాలిత్యానికి, మాధుర్యాది గుణాలకు ప్రతీతి. నిజంగా అయితే శబ్దమాధుర్యాన్ని, సంస్కృతస్వరనాదాన్ని శ్రీనాథునికి ముందువాడైన కేతన పరిగణనలోనికి తీసుకొని ఉండాలని ఊహించటం తర్కబద్దం. ఎందుకంటే మూలకావ్యంలోని ప్రధానలక్షణమే ’పదలాలిత్యం’ అన్నారు కనుక. తద్వారా శ్రీనాథునికి కేతన మార్గదర్శకం కావాలి. అలా జరిగినట్టు లేదు. కేతనను శ్రీనాథుడు ఉదాహరింపలేదు.
శ్రీహర్షుని నైషధీయచరితమ్ – శృంగారరససంచితమైన ప్రౌఢకావ్యము. ఈ కావ్యం ప్రౌఢిమకు, పాండిత్యానికి పేరు పొంది “నైషధం విద్వదౌషధమ్’ అనిపించుకున్నది కానీ, దండి కావ్యంలా పదలాలిత్యానికి, జయదేవుని గీతగోవింద కావ్యంలా శబ్దసౌందర్యానికి పేరుపడిన కావ్యం కాదని పండితుల తీర్పు. నైషధాన్ని అనుసరించిన శ్రీనాథుడు – అందులో పాండిత్యాన్ని, రసనిర్భరతను, ధ్వని మార్గాదులను గుర్తెఱిగి తెనుగున అనువదింపడానికి పాల్పడ్డం ఔచిత్యం అవాలి కానీ మీరు చెప్పిన విధంగా మూలభాషపు శబ్దనాదాన్ని పరిగణనలోనికి తీసుకోవడం అన్నది అంతగా పొసగని కారణం. అదే కారణమని భావిస్తే కూలకంషంగా మూల భాషలో కావ్యాన్ని, అందులో శబ్దసౌందర్యానికి, స్వరమాధుర్యానికి ముఖ్యకారణాలు అయిన యమక, అనుప్రాసాది గుణాలను మూలకావ్యం యొక్క శ్లోకాలలో వెతికి వాటి తెనుగు అనువాదాలను సరి చూసి సాకల్యంగా విషయాన్ని ప్రతిపాదించి శ్రీనాథుడు చెప్పిన ’అనౌచిత్యంబు పరిహరించి’ అర్థం ఇదేనని నిరూపించాలి.(శ్రీ వేల్చేరు నారాయణరావు గారు, షూల్మన్ గారు అలా చేశారో లేదో నాకు తెలియదు.) తర్కబద్ధం అన్న ఒక్కమాట తర్కానికి సమగ్రత నివ్వదు.
ఏతావతా – ఈ విషయంలో శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి వివరణయే సముచితమని నా వ్యక్తిగత అభిప్రాయం.
With all due respect to Laila, logic is not a subjective matter that needs to be decided through majority opinion. ఈ వ్యాసంలో వున్న తర్కం ఇది –
1. శృంగార నైషథం కావ్యాంతంలో వున్న అనువాదవిధాన వివరణ “ఏ విధంగా చూసినా అన్వయింపని అర్థసంగతి”
2. ఇందుకు ముఖ్యకారణం ఈ వివరణలో ఉన్న అనౌచిత్య పరిహరణ అంశం.
3. అనౌచిత్యం అంటే మూలంలో వున్న రసప్రాతికూల్యతే. “అసలు విషయం: మూలంలో రసప్రాతికూల్యాన్ని ఆరోపించితే గాని, అనౌచిత్యస్థాపనం జరగదు.”
4. మూలంలో రసప్రాతికూల్యత వున్నట్టు విమర్శకులు ఎవరూ అనలేదు. మూలంలో రసప్రాతికూల్యత లేదు.
5. “మహాలాక్షణికుడైన శ్రీనాథుడు సందిగ్ధాంశభూయిష్ఠమైన ఇటువంటి పొందిపొసగని నిర్వచనంతో అనర్ఘమైన తన అనువాద విధానాన్ని సూచించి ఉండడు.”
6. కాబట్టి ఈ భాగం శ్రీనాథుడు రాసింది కాదు.
ఇందులో మూడో అడుగు తార్కికం కాదు. ఎందుకంటే, అనువాదంలో అనౌచిత్యం ఉండటానికి వేరే కారణాలు ఉండొచ్చు. ఇందుకు ఒక ఉదాహరణ, మూలభాషలోని శబ్దసమూహాలు అలాగే తీసుకుంటే గమ్యభాషలో అనుచితార్థాలు రావటం.
ఒక తర్కక్రమంలో ఒక్క అడుగు పూర్తిగా నిజం కాకపోయినా ఆ క్రమం అంతా దెబ్బతిన్నట్టే. ఇది తర్కంలో ఒక మూలసూత్రం.
లక్ష్మీదేవిగారు నా అభిప్రాయాన్ని సానుకూలంగా తీసుకొన్నందుకు కృతజ్ఞుడిని. కథను తీసుకోండి. అవసరమైనట్లైతే కథనవిధానాన్ని కూడా తీసుకోండి. కాని మీరే మీదైన మంచి వ్యావహారికంలో మీశైలిలో వ్రాయండి. మీ కథలూ అనువాదాలూ మరిన్ని చదవాలని ఆశిస్తున్నాను.
శ్రీ అనామకుడు గారి లేఖకు సమాధానం వ్రాసినప్పటి నుంచి నా దగ్గరున్న గ్రంథాలన్నీ మరొక్కసారి సరిచూస్తుంటే అమృతానంద యోగి రచించిన అలంకారసంగ్రహంలో ‘కష్టము’నకు ఉదాహరణగా “కష్టః కృచ్ఛ్రేణ విజ్ఞేయః శబ్దసంక్షేపతో యథా” అన్న నిర్వచనంతో శ్రీహర్షుని నైషధీయచరితంలోని “కలశే నిజహేతుదణ్డజః” అన్న (2-32) లోని శ్లోకోదాహరణం కనుపించింది. నేను పాతికేళ్ళ మునుపు చదివిన జ్ఞాపకంతో అమృతానంద యోగి ఉదాహరణలను చూపలేదని నా లేఖలో పొరపాటుగా వ్రాశాను. శబ్దసంక్షేపం వల్ల అర్థం చేసుకోవటం కష్టసాధ్యమైన రచన ‘కష్టము’ అన్నమాట. ఈ ‘శబ్దసంక్షేపము’నే వేదం వేంకటరాయశాస్త్రి గారు తరచు ‘ఇమిడిక’ అన్న సంకేతంతో గుణముగా వ్యవహరించేవారు. వామనుడు కావ్యాలంకారసంగ్రహంలో ‘కష్టము’ను శబ్దదోషమని పరిగణించాడు. అది భామహాదుల దృష్టిపథంలో ఉన్నదే. ‘కష్టశబ్దము’ అనే దోషం కూడా మరొకటున్నది. అమృతానంద యోగి ‘కష్టము’ను శబ్దదోషంగా కాక అర్థదోషాధ్యాయంలో ఉదాహరించాడు. నిజానికి ఇది ‘ప్రౌఢి’లో భాగమై గుణమే అయినప్పటికీ, దోషప్రస్తావనతో లాక్షణికోదాహరణమంటూ ఒకటున్నది కాబట్టి వ్యాసాన్ని ముద్రించేటప్పుడు (ఇంకేమైనా ఉదాహృతులు కనబడితే వాటితోపాటు) వాక్యాన్ని సరిచేస్తానని వారికి విన్నవిస్తున్నాను.
చక్కటి పరిచయాన్ని అందించిన వేలూరి వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.
లిఖిత, మౌఖిక సాంప్రదాయాల లేదా ప్రక్రియలనడుమ మనమే సృష్టించుకున్న లక్ష్మణరేఖల్ని చెరిపేసుకుంటే బాబ్ డిలాన్ వంటి గాయకుల, గేయకారుల కవిత్వం ఉప్పొంగి ఉక్కిరిబిక్కిరి చేస్తుందని తెలుగు, ఇంగ్లీషు భాషల జోడుగుర్రాల పైన అవలీలగా స్వారీ చేస్తూ వచ్చి నాబోంట్లకు తెలియజెప్పినందుకు – మరీ ముఖ్యంగా ధన్యవాదాలు.
ఈ పరిచయ వ్యాసం చదివినవాళ్లెవరైనా ఒక గాయకుడికి సాహిత్యరంగంలో నోబెల్ బహుమతి ఇవ్వొచ్చునా, కూడదా అనే అనవసరపు వివాదంలోంచి బయటపడగలుగుతారని నమ్ముతున్నాను.
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి రంగ అభిప్రాయం:
11/22/2016 5:20 am
ఆచార్య రామారావు గారికి,
నైషధాంధ్రీకరణ సందర్భంగా పరిహరింపబడిన శబ్దాశ్రయమైన అనుచితాలకి రెండు, మూడు ఉదాహరణలు మీకు కనబడినవి చూపించగలరా? (అవి Srinatha: The poet who made Gods and Kings లో ఉన్నాయేమో తెలియదు.)
రంగ
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి రవి అభిప్రాయం:
11/22/2016 4:49 am
కె.వి.యస్. రామారావు గారికి,
ఏ విధంగా ఆలోచించినా మీరు ఉటంకిస్తున్న తర్కం సమగ్రంగా లేదని అనిపిస్తుంది.
ఆ మూడవ అడుగు తార్కికం అవునో కాదో కానీ అది లాక్షణిక సాంప్రదాయమండి. “అనౌచిత్యాదృతే నాన్యద్రసభంగకారణమ్” – అని ఆనందవర్ధనుడు. తార్కికమా, అతార్కికమా అన్న విషయం శ్రీనాథుని కాలాన్ని బట్టి ఊహించాలి. ఈ కాలపు మన ఆలోచనలో తర్కాన్ని శ్రీనాథునిపై ఆరోపించటం సబబెలా అవుతుంది? ఆ కాలం నాటికి లాక్షణిక సాంప్రదాయం ప్రకారం రసభంగమే అనౌచిత్యం.
మూలభాషలో శబ్దసమూహాలు గమ్యభాషలో అనుచితార్థం అయే అవకాశాన్ని పురస్కరించుకుని, ఒక సరికొత్త లాక్షణిక సాంప్రదాయానికి, సరికొత్త మౌలిక ప్రతిపాదనకూ శ్రీనాథుడు నడుం కట్టడం అన్నది దూరాన్వయమైన విషయమండి. ఒక వేళ అలా ఊహించినా కొన్ని ఇబ్బందులు వస్తాయి.
మూలభాష, గమ్యభాష – అని కాకుండా సంస్కృతమైనా, ప్రాకృతమైనా, ఏదేని ఒక కావ్యానికి సంబంధించి ’అశ్లీలము, అమంగళకరమూ, వ్రీడాజనకము’ అయిన శబ్దాలు పరిహార్యాలు అని మమ్మటుడు కావ్యప్రకాశంలోని దోషప్రకరణం లో నిర్దేశించాడు. పైన మీరు చెప్పిన ’గమ్యభాషలో అనుచితార్థం” అన్న విషయం మమ్మటుని దోషనిర్వచనంలో (ఇంకా నేయార్థమూ ఇత్యాది దోషాదులలో) భాగమై విలీనమవుతుంది. లాక్షణికులు తమ ఉదాహరణలలో ప్రాకృత కావ్యాలనూ ఉదాహరించారు. అందువలన వారి నిర్దేశాలు సంస్కృతానికే కాక సంస్కృతేతర భాషల కావ్యాలకూ వర్తిస్తాయి.
మీరు చెప్పిన ఉదాహరణతోనే Acapulco ను తెనుగులో మూలభాషలో నాదానుగుణంగా యథాతథంగా అనువదించి తెలుగులో ఉపయోగిస్తే అది (సహృదయుడైన సామాజికుని దృష్ట్యా) అశ్లీలశబ్దమవుతుంది. ఇది కావ్యప్రకాశకారుడి ప్రకారం దోషం. అది వరకే ఏర్పడి ఉన్న లాక్షణిక సాంప్రదాయం.ఆ సాంప్రదాయాన్ని గుర్తుంచుకుని రచన చేసి ఉంటాడు కానీ, తిరిగి కొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పే అవసరం శ్రీనాథునికి ఉండరాదు.
అందుచేత అనువాదం కోసం ప్రత్యేకమైన ’అనౌచిత్య నిర్వచనాన్ని’ తనకు తానే శ్రీనాథుడు నిర్దేశించుకునే అవసరం లేదు. ఒకవేళ నిర్దేశించుకున్నా అందుకు మూలం ఎక్కడో ఉండాలి. లేదా ఆ విషయం గురించి సమగ్రంగా ఒక లాక్షణిక గ్రంథాన్ని వెలువర్చి, ఈ ప్రతిపాదనను సాకల్యంగా చర్చించి ఉండాలి. ఎందుకంటే సంస్కృత అలంకారిక గ్రంథాలన్నీ ఆ ధోరణిలో రచింపబడినవే కాబట్టి. అలాంటివేవీ మనకు కానరావు.
మరొక పార్శ్వం. శ్రీనాథుని కంటే ముందు మూలఘటిక కేతన – దశకుమారచరితమ్ వచన కావ్యాన్ని తెనుగు పద్యానువాదం చేశాడు. మూలభాష సంస్కృతంలోని దండి దశకుమారచరితమ్ – పదలాలిత్యానికి, మాధుర్యాది గుణాలకు ప్రతీతి. నిజంగా అయితే శబ్దమాధుర్యాన్ని, సంస్కృతస్వరనాదాన్ని శ్రీనాథునికి ముందువాడైన కేతన పరిగణనలోనికి తీసుకొని ఉండాలని ఊహించటం తర్కబద్దం. ఎందుకంటే మూలకావ్యంలోని ప్రధానలక్షణమే ’పదలాలిత్యం’ అన్నారు కనుక. తద్వారా శ్రీనాథునికి కేతన మార్గదర్శకం కావాలి. అలా జరిగినట్టు లేదు. కేతనను శ్రీనాథుడు ఉదాహరింపలేదు.
శ్రీహర్షుని నైషధీయచరితమ్ – శృంగారరససంచితమైన ప్రౌఢకావ్యము. ఈ కావ్యం ప్రౌఢిమకు, పాండిత్యానికి పేరు పొంది “నైషధం విద్వదౌషధమ్’ అనిపించుకున్నది కానీ, దండి కావ్యంలా పదలాలిత్యానికి, జయదేవుని గీతగోవింద కావ్యంలా శబ్దసౌందర్యానికి పేరుపడిన కావ్యం కాదని పండితుల తీర్పు. నైషధాన్ని అనుసరించిన శ్రీనాథుడు – అందులో పాండిత్యాన్ని, రసనిర్భరతను, ధ్వని మార్గాదులను గుర్తెఱిగి తెనుగున అనువదింపడానికి పాల్పడ్డం ఔచిత్యం అవాలి కానీ మీరు చెప్పిన విధంగా మూలభాషపు శబ్దనాదాన్ని పరిగణనలోనికి తీసుకోవడం అన్నది అంతగా పొసగని కారణం. అదే కారణమని భావిస్తే కూలకంషంగా మూల భాషలో కావ్యాన్ని, అందులో శబ్దసౌందర్యానికి, స్వరమాధుర్యానికి ముఖ్యకారణాలు అయిన యమక, అనుప్రాసాది గుణాలను మూలకావ్యం యొక్క శ్లోకాలలో వెతికి వాటి తెనుగు అనువాదాలను సరి చూసి సాకల్యంగా విషయాన్ని ప్రతిపాదించి శ్రీనాథుడు చెప్పిన ’అనౌచిత్యంబు పరిహరించి’ అర్థం ఇదేనని నిరూపించాలి.(శ్రీ వేల్చేరు నారాయణరావు గారు, షూల్మన్ గారు అలా చేశారో లేదో నాకు తెలియదు.) తర్కబద్ధం అన్న ఒక్కమాట తర్కానికి సమగ్రత నివ్వదు.
ఏతావతా – ఈ విషయంలో శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి వివరణయే సముచితమని నా వ్యక్తిగత అభిప్రాయం.
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి బామ్మర్ది అభిప్రాయం:
11/21/2016 7:51 pm
దెబ్బలాటలు అని అర్ధం 🙂 (సర్దాగా అన్నాను లెండి.)
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
11/21/2016 1:54 pm
With all due respect to Laila, logic is not a subjective matter that needs to be decided through majority opinion. ఈ వ్యాసంలో వున్న తర్కం ఇది –
1. శృంగార నైషథం కావ్యాంతంలో వున్న అనువాదవిధాన వివరణ “ఏ విధంగా చూసినా అన్వయింపని అర్థసంగతి”
2. ఇందుకు ముఖ్యకారణం ఈ వివరణలో ఉన్న అనౌచిత్య పరిహరణ అంశం.
3. అనౌచిత్యం అంటే మూలంలో వున్న రసప్రాతికూల్యతే. “అసలు విషయం: మూలంలో రసప్రాతికూల్యాన్ని ఆరోపించితే గాని, అనౌచిత్యస్థాపనం జరగదు.”
4. మూలంలో రసప్రాతికూల్యత వున్నట్టు విమర్శకులు ఎవరూ అనలేదు. మూలంలో రసప్రాతికూల్యత లేదు.
5. “మహాలాక్షణికుడైన శ్రీనాథుడు సందిగ్ధాంశభూయిష్ఠమైన ఇటువంటి పొందిపొసగని నిర్వచనంతో అనర్ఘమైన తన అనువాద విధానాన్ని సూచించి ఉండడు.”
6. కాబట్టి ఈ భాగం శ్రీనాథుడు రాసింది కాదు.
ఇందులో మూడో అడుగు తార్కికం కాదు. ఎందుకంటే, అనువాదంలో అనౌచిత్యం ఉండటానికి వేరే కారణాలు ఉండొచ్చు. ఇందుకు ఒక ఉదాహరణ, మూలభాషలోని శబ్దసమూహాలు అలాగే తీసుకుంటే గమ్యభాషలో అనుచితార్థాలు రావటం.
ఒక తర్కక్రమంలో ఒక్క అడుగు పూర్తిగా నిజం కాకపోయినా ఆ క్రమం అంతా దెబ్బతిన్నట్టే. ఇది తర్కంలో ఒక మూలసూత్రం.
తన మాట కోసం గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
11/21/2016 10:19 am
లక్ష్మీదేవిగారు నా అభిప్రాయాన్ని సానుకూలంగా తీసుకొన్నందుకు కృతజ్ఞుడిని. కథను తీసుకోండి. అవసరమైనట్లైతే కథనవిధానాన్ని కూడా తీసుకోండి. కాని మీరే మీదైన మంచి వ్యావహారికంలో మీశైలిలో వ్రాయండి. మీ కథలూ అనువాదాలూ మరిన్ని చదవాలని ఆశిస్తున్నాను.
ఫ్రాగ్మెంట్స్ గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:
11/21/2016 1:10 am
థాంక్యూ సీత గారు
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
11/19/2016 11:12 am
శ్రీ అనామకుడు గారి లేఖకు సమాధానం వ్రాసినప్పటి నుంచి నా దగ్గరున్న గ్రంథాలన్నీ మరొక్కసారి సరిచూస్తుంటే అమృతానంద యోగి రచించిన అలంకారసంగ్రహంలో ‘కష్టము’నకు ఉదాహరణగా “కష్టః కృచ్ఛ్రేణ విజ్ఞేయః శబ్దసంక్షేపతో యథా” అన్న నిర్వచనంతో శ్రీహర్షుని నైషధీయచరితంలోని “కలశే నిజహేతుదణ్డజః” అన్న (2-32) లోని శ్లోకోదాహరణం కనుపించింది. నేను పాతికేళ్ళ మునుపు చదివిన జ్ఞాపకంతో అమృతానంద యోగి ఉదాహరణలను చూపలేదని నా లేఖలో పొరపాటుగా వ్రాశాను. శబ్దసంక్షేపం వల్ల అర్థం చేసుకోవటం కష్టసాధ్యమైన రచన ‘కష్టము’ అన్నమాట. ఈ ‘శబ్దసంక్షేపము’నే వేదం వేంకటరాయశాస్త్రి గారు తరచు ‘ఇమిడిక’ అన్న సంకేతంతో గుణముగా వ్యవహరించేవారు. వామనుడు కావ్యాలంకారసంగ్రహంలో ‘కష్టము’ను శబ్దదోషమని పరిగణించాడు. అది భామహాదుల దృష్టిపథంలో ఉన్నదే. ‘కష్టశబ్దము’ అనే దోషం కూడా మరొకటున్నది. అమృతానంద యోగి ‘కష్టము’ను శబ్దదోషంగా కాక అర్థదోషాధ్యాయంలో ఉదాహరించాడు. నిజానికి ఇది ‘ప్రౌఢి’లో భాగమై గుణమే అయినప్పటికీ, దోషప్రస్తావనతో లాక్షణికోదాహరణమంటూ ఒకటున్నది కాబట్టి వ్యాసాన్ని ముద్రించేటప్పుడు (ఇంకేమైనా ఉదాహృతులు కనబడితే వాటితోపాటు) వాక్యాన్ని సరిచేస్తానని వారికి విన్నవిస్తున్నాను.
Yippee! I’m a poet, and I know it గురించి ఉణుదుర్తి సుధాకర్ అభిప్రాయం:
11/19/2016 2:20 am
చక్కటి పరిచయాన్ని అందించిన వేలూరి వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.
లిఖిత, మౌఖిక సాంప్రదాయాల లేదా ప్రక్రియలనడుమ మనమే సృష్టించుకున్న లక్ష్మణరేఖల్ని చెరిపేసుకుంటే బాబ్ డిలాన్ వంటి గాయకుల, గేయకారుల కవిత్వం ఉప్పొంగి ఉక్కిరిబిక్కిరి చేస్తుందని తెలుగు, ఇంగ్లీషు భాషల జోడుగుర్రాల పైన అవలీలగా స్వారీ చేస్తూ వచ్చి నాబోంట్లకు తెలియజెప్పినందుకు – మరీ ముఖ్యంగా ధన్యవాదాలు.
ఈ పరిచయ వ్యాసం చదివినవాళ్లెవరైనా ఒక గాయకుడికి సాహిత్యరంగంలో నోబెల్ బహుమతి ఇవ్వొచ్చునా, కూడదా అనే అనవసరపు వివాదంలోంచి బయటపడగలుగుతారని నమ్ముతున్నాను.
అనగనగా ఒక జైలు… గురించి శ్రీకాంత్ అభిప్రాయం:
11/18/2016 6:49 am
కథ చాలా బాగుంది. నేను మా మిత్రునికి కూడా చదవమని చెప్పాను ఈ కథను.
ఫ్రాగ్మెంట్స్ గురించి Seetha అభిప్రాయం:
11/18/2016 12:02 am
చాలా బాగుంది