ఈ వ్యాసంలో నాకు అసంతృప్తి కలిగించిన విషయాలు రెండుమూడు ఉన్నాయి కానీ ఒక్కటి మాత్రం ఇక్కడ చెప్దామనుకుంటున్నాను. వ్యాసంలోని ఉదాహరణలు, వాటిని వివరించిన తీరు సరిగా లేవని అనిపించాయి. ఉదాహరణ సరిగా లేనపుడు ప్రస్తావించిన ముఖ్యాంశం పాఠకులని మెప్పించడానికి బదులుగా ‘ఇది కేవలం పడికట్టుపదాల ప్రయోగమేమో’నని సందేహించే పరిస్థితిలో పడేస్తుంది.
1. “సైన్స్ ఫిక్షన్ రచనలో టైమ్ ట్రావెల్ ఒక అంగీకరింపబడిన సత్యం. అలాంటి రచనను టైమ్ ట్రావెల్ అనేది లేదు అది కేవలం కల్పన అనే ప్రాతిపదికన పరిశీలించబోవడం, ఆ రచనను దాని పరిధి దాటి పరిశీలించడం అవుతుంది. హాస్యం ప్రధానోద్దేశమైన రచనలో సామాజిక సందేశం వెతకడం ఇలాంటిదే.” –
ఇది మొదటి ఉదాహరణ. ఈ ఉదాహరణ కి ముందు వ్యాస రచయిత్రి చెప్పిన అంశం చదివి సమకాలీన విమర్శ గురించి ఒక సమగ్ర పరిశీలన చేస్తున్నారేమోనని అనుకునేలోపూ ఈ ఉదాహరణ వస్తుంది. దానితో ఆ అంశం యొక్క స్థాయి ఒక్కసారిగా పడిపోతుంది. ఇక్కడ చెప్తున్నది చాలా మామూలు విషయమనిపిస్తుంది. “పరిధి” అని దీనిని అంటున్నారా వ్యాసరచయిత్రి! ఈ పరిధి కూడా తెలియకుండా వున్నారా ఇప్పటి విమర్శకులు! అన్న ఆశ్చర్యం కలుగుతుంది.
(ఎందుకంటే నాకయితే ఫేస్బుక్ లో వ్యాఖ్యల వంటివి ఇలా (ఈ ఉదాహరణలలోగా) ఉండవచ్చు కానీ విమర్శ అనే శీర్షిక క్రింద వ్రాయబడే వ్యాసాలు ఇలా ఉంటాయని ఒప్పుకోలేమనిపించింది. సైన్సుఫిక్షన్ రచన గురించి విమర్శించ బూనుకున్న “సమకాలీన విమర్శకులు” టైమ్ ట్రావెల్ అనేది లేదు అనే ప్రాతిపదికన (అంటే మరీ ఆ స్థాయిలో) పరిశీలిస్తున్నారని అనడం సబబు కాదేమోననిపించింది.)
2) అలాగే “సూరన కళాపూర్ణోదయం యొక్క ప్రశస్తి, అందులోని వర్ణనలకే పరిమితం కాదనీ, మన దేశంలో ఆ కాలానికి వాడుకలో లేని ఆధునిక నవలా సాహిత్య లక్షణాలన్నీ అందులో ఉన్నాయనీ, ఆ రకంగా ఆ కావ్యం సాహిత్య చరిత్రనే కాదు, సాహిత్యం ఆధారంగా మన దేశచరిత్రనే పునఃపరిశీలించడానికి ఆస్కారం ఇచ్చిందనీ చెప్పడం– ఆ రచన సామాజిక, సాహిత్య చరిత్రలో ఎక్కడ ఒదుగుతోందో వెల్చేరు నారాయణరావుగారు[1] విశ్లేషించి, వివరించి చూపించడం వల్లే సాధ్యపడింది.” అన్న ఉదాహరణ కూడా. –
2002 లో వెల్చేరు నారాయణరావుగారు (ఆ పుస్తకం పీఠికలో) చెప్పేవరకు ఆ నవల ప్రశస్తిని విమర్శకులు వర్ణనలకే పరిమితం చేశారన్న ఈ ఉదాహరణ కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది.
3) ఇక “సోదాహరణంగా విమర్శ” అన్న శీర్షిక క్రింద మొదలుపెట్టిన పేరాలో కవితని వివరించిన తర్వాత వ్రాసిన వాక్యాలు “ఇప్పుడు ఎవరైనా- ఆ రచన ఆసాంతమూ చదవనివాళ్లు, ఈ మట్టివేర్లతో ఓ ఆకుపచ్చ దుప్పటి మీద కప్పుకోవడమన్న భావన ఆహ్లాదంగా ఉందనీ, ఇది సౌందర్యమనీ అనుకోవడం కద్దు. సమర్థులైన విమర్శకులు ఇలాంటి వ్యాఖ్యానాన్ని అందించడంతోనో, లేదా దీన్ని ఖండించడంతోనో ఆగిపోరు.” అన్నారు.
ఇవి చాలా అజాగ్రత్తతో వ్రాసిన వాక్యాలనిపించాయి. “ఆ రచన ఆసాంతమూ చదవనివాళ్లు” అనే మాట వ్రాయడంలో వ్యాస రచయిత్రి భావం ఏమిటి? విమర్శకులు కనీసం ఆసాంతమూ చదవకుండా విమర్శిస్తారనా! కాదు కదా!
లేక కవిత అసాంతమూ చదవనివారు అపార్థం చేసుకుంటారు కానీ ఆసాంతమూ చదివితే అందరికీ ఒకేలా అర్థమవుతుందనా! అదీ కాదు కదా! మరి ఇక “ఆసాంతమూ చదవనివారు” అనేమాట ఎందుకు వాడినట్లు?
అంతే కాదు “సమర్థులైన విమర్శకులు ఇలాంటి వ్యాఖ్యానాన్ని అందించడంతోనో, లేదా దీన్ని ఖండించడంతోనో ఆగిపోరు.” అన్న వాక్యం కూడా అనేక ప్రశ్నలకి తావిస్తుంది.
సమర్థులైన విమర్శకులు సరే సమకాలీన విమర్శకులు ఇలా చేస్తున్నారా చేయట్లేదా! అనేది వెంటనే వచ్చే ప్రశ్న. ఎందుకంటే వ్యాసం శీర్షిక “సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ” కాబట్టి.
అసమర్థులైన విమర్శకులు అసమర్థంగా చేస్తారు సమర్థులైన విమర్శకులు సమర్థంగా చేస్తారు అనేది ఎప్పుడూ ఉండేదే కదా! ఇపుడు ఈ వ్యాసం శీర్షికకి ఈ అంశం ఎలా పొసగుతోంది అనేది ఒక ప్రశ్న.
ఇక “ఈ ఉదాహరణలో చెప్పినదే సమర్థమైన విమర్శా!” అన్న ప్రశ్నని పక్కన పెట్టినా, “వ్యాసరచయిత్రి అభిప్రాయం ప్రకారం అది సమర్థమైన విమర్శ, విమర్శ అంటే అలా ఉండాలి” అని ఒప్పుకున్నా.. ఆతర్వాత కూడా మరికొన్ని ప్రశ్నలు వస్తాయి.
“ఇప్పుడీ నేపథ్యంలో మనం చర్చిస్తున్న కవితను చూస్తే, ఇది ఏ కోవకు చెందిందో స్పష్టంగా చెప్పడం అంత తేలిక కాదు. వాక్యం వెనుక వాక్యం హాయిగా ముగిసే తీరు, సౌమ్యమైన పదాల పోహణింపు ఇది ఒక సౌందర్యాత్మకమైన కవితేనన్న భావన కలిగించినా, కవి పాఠకుడికి చెప్పాలనుకున్న భావం ఆ వాతావరణానికి పూర్తిగా ఆవలి దిక్కున ఉండి, ఒక చేదు అనుభూతినీ బాధనూ మిగుల్చుతోంది.” లాంటి వాక్యాలు వ్యాసరచయిత్రి ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారో అర్థం కాదు. సాధారణ పాఠకులనా! విమర్శకులనా! వాళ్ళలో సమర్థులనా! అసమర్థులనా! వగైరా వగైరా…
ఎందుకంటే అక్కడే మళ్ళీ “ఇలా ఒకేసారి రెండు భిన్నమైన అనుభవాలను కలిగించడం ద్వారా, ఈ కవిత పాఠకుడిని మలి పఠనాలకు ప్రేరేపిస్తోంది” అంటున్నారు. అదే ఆ కవిత యొక్క ప్రత్యేకత అని విశ్లేషిస్తున్నారు. మరి అలాంటి రెండు భిన్నమైన అనుభవాలని కవిత పాఠకుడికి అందించగలుగుతున్నపుడు ఇక్కడ విమర్శకుడి పాత్ర ఏమిటి అనేది మరొక ప్రశ్న!
ఇలా అడుగడుగుకీ ఎన్నో ప్రశ్నలు రావడం వలన ఉదాహరణలు, పదాలు మరింత జాగ్రత్తగా ఎంచుకోవలసిందేమోననీ, వాక్యనిర్మాణాల పట్ల ఇంకొంచెం శ్రద్ధ పెట్టవలసిందేమోననీ అనిపించింది.
ఈ వ్యాసం మీద లైలా గారి స్పందన ఆలోచనాత్మకంగా వుంది. వ్యాసం మాత్రం నేలబారుగా, మూసపద్ధతిలో సాగింది. లైలా గారి “ఫిరదౌసి” గురించిన మాటలు సహేతుకాలే ఐనా ఆవిడ premise సరైనది కాదని నా అభిప్రాయం. నా ఉద్దేశ్యంలో ఆ కావ్యం అసలు ఫిరదౌసి గురించి కాదు; అతను నిమిత్తమాత్రుడు; అది జాషువా తన గురించి రాసుకున్న కావ్యం. ఫిరదౌసికి బంగారు నాణేల బదులు వెండి నాణేలు దొరకటం జాషువాకి తన అర్హతకి తగిన గుర్తింపు, ఆదరణ దొరక్కపోవటానికి ప్రతీక. బంగారు నాణేలు వచ్చేసరికి ఫిరదౌసి పరలోకాలకి పోవటం తను బతికుండగా తనకూ తగ్గ గౌరవం దక్కదనే జాషువా భావనకి రూపం. ఈ దృష్టితో చూస్తే జాషువాకి ఫిరదౌసి గురించి ఏమీ తెలియనక్కర్లేదు ఎప్పుడో ఎక్కడో ఒక కవికి ఎంతో అన్యాయం జరిగిందన్న ఒక myth తప్ప.
బాగా రాసారు ఈ వ్యాసం. చక్కగా విషయం గురించి చదివి, ఆలోచించి, వివరంగా చక్కని ఉదాహరణలతో రాసారు. మీ కవిత, చిత్రమూ కూడా బాగున్నవి.
మీ కవితల గురించి, చిత్రాల గురించి ఈ పత్రికలో ప్రచురించండి. One artist’s exhibition లాగా ఆనందం కలిగిస్తుంది. ఎదురు చూస్తాను.
వేలూరి తన వ్యాసంలో, ఈ ‘ప్రక్రియ’ తెలుగువారికి పరిచయం లేదు అని ఉండాల్సింది కాదు. Ecphrasis అన్న ‘మాట’ తో తెలుగు వారికి (ఇతరులకు కూడా) పెద్దగా పరిచయం లేదు అని ఉండాల్సింది. వెబ్స్టర్ డిక్షనరీ ఆ మాటతో తనకు అంత పరిచయం లేదని చెప్పుకున్నట్టు. Microsft word కి కూడా Ekphrasis మాట తో పరిచయం లేదు. రెండు స్పెల్లింగులు ఇప్పుడు డిక్షనరీ లో ఎక్కించాను. Ecphrasis ప్రక్రియ గా ఐతే వాడుకలో ఎప్పుడూ ఉంది. భారతదేశంలో తెలుగు స్కూల్లో ఉన్నప్పడే లేండ్సేప్ చిత్రాలు, ఇతర పోస్టర్లు ఇచ్చి వాటికి మాటలు రాయించేవారు మాతో. ఐతే అది ఏదో ప్రక్రియ అని టీచర్లు చెప్పలేదు.
వేలూరి విస్తారంగా చదువుతారు. ఎక్కువమందికి తెలియని మాటలు, కాన్సెప్ట్స్ తెలియచేస్తారు. డయాస్పోరా లిటరేచర్ అంటే ఏమిటి అని కొన్నేళ్ల క్రితం వేలూరి ఉపన్యాసంగా మాట్లాడితేనే నాకు తెలిసింది. పద్యాల మొదటి లైన్లు తీసుకుని, మరో పద్యం చేస్తే వాటిని అదేదో ఆ మాట అంటారని ఇక్కడి పాఠకులకు చెప్పినట్టు. రాసి చూపించినట్టు. మనకి కూడా ప్రయత్నించ బుద్ధి అవుతుంది. ఐతే దామెర్ల రామారావు చిత్రానికి తెలుగులో వేలూరి వివరణ పద్యం నాకేం పెద్ద ఆనందం కలిగించలేదు. ఇంగ్లీష్లో రాస్తే, Sarojini Naidu – Bangle Sellers poem లాగా కొంచెం exotic గా ఉండేదేమో. అరుంధతీ రాయ్ కోతులు -కొబ్బరికాయల కథలు ఫారెనర్స్కి బాగున్నట్టు. కొందరు ఇండియన్స్కి కూడా బాగుంటయ్. నాకు సోది. కొన్నిసార్లు ఒళ్లు మంట. ఆ ‘ద న్యూయార్కర్’ లో టీనా బ్రౌన్ ఎడిటర్గా ఉన్నప్పుడు, కొంతమంది స్త్రీ రైటర్లను ముద్దు చేసింది. వారికి పులిట్జర్లూ, బుకర్ ప్రైజ్ లూ వచ్చాయి. ఏమైనా, emphasis (చూసారా, మైక్రొసాఫ్ట్ ఇంకా మాట నేర్చుకోలేదు. నేను రాసిన మాటను మళ్లీ emphasis అని దిద్దింది) ఎక్ఫ్రాసిస్ లో అందమైన Grecian Urn – art piece కి దీటుగా ఉండే On Grecian Urn అన్న కీట్స్ పొయెట్రీ లాటి వైతే రెండూ ‘కళ ‘ గా ఆనందిస్తాము. లేకుంటే ఒకటి కళ, రెండోది exercise. ‘వేలూరి’ కెందుకంట ఆ వెంకాయమ్మ టెంకాయమ్మ ఒకటో తరగతి కబుర్లు, పిల్లమ్మ ఇకనుంచి ఓణీ వేసుకోవాలి – లాటి ఎడ్వైజులూ.
సర్లెండి, మరి ఈ వ్యాసం ఇంత చక్కగా రాసారుగదా, ఆ ట్రివియా వ్యాసమెందుకు పాఠకుల వ్యాఖ్యల మీద. నాకు నచ్చలేదు. అది ఎడిటర్ లకు నచ్చింది. ఏదో మంచి ఎడ్జెక్టివ్ వాడారు మీ పరిశీలన ప్రస్తావిస్తూ. ఎడిటర్ల సూచనలను మీరు Ten Commandments లాగా చూపి, పాఠకులను, కొద్దిగా రూల్స్ ఉల్లంఘించి, కట్టుబాట్లకు లొంగని వాళ్లుగా, సరదాకి ఏదో గాలిగా రాసేస్తూ, పత్రికల్లో లిటరేచర్ని ‘సీరియస్’ గా తీసుకోని వాళ్లలాగా చూపినందునా. Can’t be. ఇక్కడ ఎడిటర్లు నవ్వూ హాస్యం, ఉన్నవాళ్లు. పాఠకులు పత్రికలో ఆటలాడితే వాళ్లకు ఇష్టమే. ఎవరైనా పాఠకులు, సరదాకి రాసానంటే, వేరే వాళ్లకు బాధ ఎందుకు.
పైగా ఈ వ్యాసంలో మీ కవిత, అక్కడ ఆమె బొమ్మ చూస్తే, కట్టుబాట్లు అంటే మీకు ఎంత రోత అనేది తెలుస్తా ఉంది కదా. జీవితంలో సరదా పాడూ లేకుండా ఆమె ఇష్టం లేని పెళ్లి జైల్లోకి బోయి ఆ తలుపు మూత బడిపోతే ఇంకేమన్నా ఉందా? అనే కదా మీ కవిత చెప్పేది. (పాతకాలపు Bias ఉందనుకోండి. ఆడవాళ్లకే ఇష్టం లేని పెళ్లి జరుగుతుందనీ, మగవాళ్లకు అది వర్తించదన్నట్టు. ‘ఆమె’ కావటం వల్ల ఒక్క ప్రెగ్నెన్సీ తప్పించి మిగతా సమస్త కష్టాలూ, ఆడా, మగా కు సమానమే. ఒ ఓ. సవరింపు. మగవాళ్లకు బట్టతల. మగవాళ్లు ఆడవాళ్ల మీద ప్రద్దానికీ జాలి పడిపోయినట్టు, తమ విషయం గురించి రాతల్లో బట్టబయలు చెయ్యరు). మరి సాహిత్యంలో మాత్రం రాసేవారికీ, రాసినవి చదివి రాసేవారికీ -అందరికీ స్వాతంత్రం అక్కర్లేదూ? వ్యాఖ్యల పరిశీలన అంటూ – లెక్కలతో మొదలెట్టి, లింగూ లిటుకూ డేటా కలెక్షన్ చేసి ఆఖరులో వ్యవసాయం ఉపమానం గల కవిత్వపు వాక్యంతో ముగించారు.
ఆ ముగింపు వాక్యాల అర్ధమేమిటి? నాకు తెలియలేదు. అందులో గానీ పరిశీలనా ఫలితం, ఏదైనా హెచ్చరిక గాని ఉంటే అది నాకు తెలియలేదు.
ఓ. నేను ముగించే ముందు – Rx: మేరేజ్! కథ మీరు సమ్మరైజ్ చేసినట్టుగా గాని, ఇక్కడి మీ సీరియస్ తెలుగు కవితలో కంటెంట్ లాగా గాని చదవాల్సిన కథ కాదు. అది కొంచెం నవ్వూ, హాస్యంతో చదువుకోవాల్సిన కథ. (చి.న.) అందంగా లేకపోతే పెళ్లి కాదనుకుంటే అన్ని కోట్ల పెళ్ళిళ్ళు ఎలా జరిగినాయండీ? భలేవారు మీరు! (ద.హా.)
“విమర్శకులు తమ అభిప్రాయం జనబాహుళ్యంలో అప్పటికే ప్రచారంలో ఉన్న అభిప్రాయానికి భిన్నమైనదైనా సరే, ప్రతిపాదించడానికి కూడా వెనుకాడకూడదు.” డా. విజయ్ కోగంటి
Well and Good.
మానస గారి వ్యాసం ‘జాషువా –ఫిరదౌసి’ ఈ పత్రికలోనే ఉన్నది. చదివినారా? ముఖ్యంగా ఈ పై కారణం వల్లనే, చాలా పేలవమైన వ్యాసం అని నేను అనుకున్నాను.
జాషువా రచించిన ‘ఫిరదౌసి’ ఒక ఎన్నదగిన రచన కానే కాదు. ఆ ఖండకావ్యానికి మంచిపేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఇంటర్మీడియేట్ విద్యార్ధులకు 1940 వరకు పఠనగ్రంధాలలో ఒకటి గా ఉన్నదని జాషువా కవి తెలిపారు. ఆ యా గురువులు ఆ కావ్యం గురించి ఆ రోజులలో వారి విద్యార్ధులకు ఏమి బోధించారో!
నా ప్రశ్న – జాషువా ‘ఫిరదౌసి’ లో ఒక పారశీక కవి రూపుగాని, మాటగాని, ఏ పారశీక కవిత్వపు తీరుగాని, అందునా ఫిరదౌసి కవిత్వ పరిచయం గాని ఉన్నదా? సమాధానం: శూన్యం. సున్నా. షానామా కవిత్వప్రఖ్యాతి వల్లే కదా జనులు ఫిరదౌసిని తెలుసుకోవాలనుకునేది? కాదా? స్వాతంత్ర పోరాటం, సత్యాగ్రహం గురించి కాపోతే, మోహనదాస్ కరంచంద్ గాంధీని గురించి ఎవరు తెలుసుకోవాలనుకుంటారు?
కవిత్వ ప్రియులు, కవిత్వం తెలుసుకోటం మాని, కవిని గురించిన కాకమ్మ కథలు వినటం – జాషువా ఫిరదౌసి చదవటం. ఫిరదౌసి అన్న పారశీక కవిని గురించి ప్రచారం లో ఉన్న ధన సంబంధమైన ఒక కథను గూర్చి మాత్రమే జాషువా రాసినాడు. (ఇలాటి చాటువు, చాటు గురించి ఈ పత్రికలో మాటికి ముమ్మారు చాటి చెప్పిగా విన్నాం కదా.) ఆ రచన ఎలాటిదంటే, ఒక సంగీతవేత్త గాని – భక్త రామదాసు జైల్లో ఉంటే రాముడు లక్ష్మణుడు వచ్చి, కప్పం కట్టి అతడిని చెర వినిపించటం కట్టుకథ మనకు చెప్పి, – రామదాసు కీర్తన ఒక్కటి తెలియచెప్పటం గానీ, పాడటం కానీ చెయ్యలేకపోటం వంటిది.
ఒక కవి, ఇంకో కవి కవిత్వం చదవకుండానో, ఆ ప్రసక్తి ఇంత తేకుండానో, మకుటం లో అతని పేరుతో అతని మీద ఖండకావ్యం రాయటమేమిటి?
జాషువా రాసిన ఫిరదౌసి కావ్యం పేరు మార్చి, కాళిదాసు, బమ్మెర పోతన అని పెట్టినా, కీట్స్ అని గాని, షేక్స్పియర్ అని గాని పెట్టి, లోపల పద్యాలలో పేరు మారిస్తే, చాలు. ఏం తేడా రాదు. ఆ ఏ ఒక్కరి specific జీవనం, విద్య, శైలి, ఆలోచన రీతి, సాధించిన పని, మనకింత కూడా తెలియదు. అలాటి generic రచన జాషువా చేసింది. ఫిరదౌసి పారశీకపు కవిత్వపు తీరు తెన్నులు జాషువాకు బహుశా తెలియవు. ఆయన చెప్పలేనందున ఈ ఖండకావ్యం ద్వారా మనకూ తెలియవు. కొంతమంది చదువరులకు మరి ఫిరదౌసి కవిత్వ పరిచయం జాషువా రచన ద్వారా, ఎలా కలిగిందో?
ఫిరదౌసి అన్న కావ్యంలో ఆ కవి లేనే లేడన్న విషయం మానస మాత్రం గమనించిందా? లేదు.
జాషువా రాసిన ఆ ఖండకావ్యము పేరుగొన్నదనే చదువుకుని, బాగున్నదనే నమ్మి, వాల్మీకి, నారాయణరావు, గురజాడ – ఇలా సాహిత్యంలో తెలిసిన కొందరిని, వారి మాటలను తన వ్యాసం లో ప్రస్తావిస్తూ రివాజు ప్రకారం ఒక సాంప్రదాయికమైన వ్యాసాన్ని, మానస తయారు చేసింది. ఆ ప్రస్తావనలు కూడా ఆమెకు ఈ రచన సందర్భంలో సొంత ఆలోచన లేకపోటాన్నే బలపరుస్తాయి. వాల్మీకి – సీతకు ఎడమ కన్నో, కుడి కన్నో అదరటానికీ, ఒక పారశీక కవి నమ్మికలకూ, మానసిక స్ధితిగతులకూ ఏమిటి సంబంధం?
ఫిరదౌసి గురించి జాషువా “ఏమని కవిత్వం వ్రాసినట్టు, ఎందుకు వ్రాసినట్టు” అని మానస ప్రశ్నించుకుంది. సాహితీ వ్యాసాల్లో – ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి? అని తమ వ్యాసాల్లో అనటం నేర్పిన సాహిత్య సైంటిస్ట్ ల నుండి ఆ వాక్యం రాయటం వరకు ఆమెకు వచ్చింది. మరి సంపాదించిన సమాధానం? అదసలు ఏమిటి? దొరికినది సజావుగా ఉన్నదా?
ఎన్నో విషయాల మీద ఆసక్తితో మనుషులు శ్రమిస్తారు. సైంటిస్ట్ లకు ఒక పరిశోధనలో ముఫ్పై ఏళ్లు శ్రమిస్తే, అందునుండి మనుషులకో, మరెవరికో ఉపయోగించే ఫలితం ఏదీ రాకపోతే ఆవేదన కలుగుతుంది. అనుకున్న ఆదాయం రాకపోయినా కష్టం కలుగుతుంది. నిజమే.. మరి, ఫిరదౌసి కవిత్వమైతే ప్రజలకు ఆనందించటానికి ఉన్నది. జాషువా కావ్యం రాసేనాటికి ఫిరదౌసి ప్రసిధ్ధుడైన కవే. ఆ కవిత్వం దొరుకుతున్నది. మరి జాషువా ఒక పాతకథను పట్టుకు ఎందుకు పాకులాడ్డం? ప్రపంచంలోనే పేరు పడిన కవిని, మరో కవి ముఖ్యంగా అతని కవిత్వాన్ని గుర్తిస్తాడా? కవిత్వాన్ని పరిచయం చేస్తాడా – లేక, అది మరచి, (నిజమో కాదో తెలియని) ఒక పరిదీన పరిస్థితిలో మనకు ఫిరదౌసిని చూపుతాడా? అది చేయదగ్గ పనిగా నాకు అనిపించటం లేదు.
జాషువా కావ్య వస్తువుగా తన తెలుగు జీవితం, తన నిజ పరిస్థితిని తనే వర్ణించి తన సమకాలీన పాఠకులకు చూపవచ్చు. “గబ్బిలము” లో ఎంతో కొంత చూపినాడు. కాని, ఏనాటి వాడో పర్షియన్ ఫిరదౌసిని జీవితంలో ఏదో అన్యాయానికి గురైన వాడుగా మాత్రమే నమ్మి మనకు కావ్యంలో చూపటం గాని, కవిత్వ ప్రస్తావనే లేని కావ్యం రాయటం కాని, ఫిరదౌసి జీవితం తో జాషువా జీవితానికి సాపత్యం ఉంది – అని అతనైనా, ఎవరైనా అనుకోటం కాని, అవి సరైన ఆలోచనలు కావు.
మానస – తన రచనలో 1. జాషువాకు ఫిరదౌసి కవిత్వం తెలుసునో తెలియదో చెప్పగలగాలి. 3. అందుకు స్వయంగా ఫిరదౌసి కవిత్వం కొంతైనా తను చదివి, చర్చించ గలిగి ఉండాలి. అప్పుడు గదా ఆమె ‘జాషువా- ఫిరదౌసి’ అన్న వ్యాసం రాయవలసింది. కాదా? Is it not?
(సమయం కొద్దీ, మానస చామర్తి కవితలు, కవిత పరిచయాల గురించి మరోసారి.)
శ్రీశ్రీ అంటే ప్రాణం. అర్ధం అయిన వాటి నుంచి ఏదో తెలుసుకోవాలని, అలా నేను నాలుగు మాటలు చెప్పాలని అనిపించేది, కానీ అర్ధం కానీ పదాలు వచ్చినప్పుడు కవిత ప్రవాహం అయితే సాగిపోయేది కానీ ఎక్కడో చిన్న అసౌకర్యం ఉండేది. నాకు తెలిసిన భాషలో చెప్తాను. మనకు నచ్చిన ముద్దపప్పుతో గోంగూర పచ్చడి నంజుకుని తింటునేటప్పుడు ఎక్కడో అన్నములో మట్టి బెడ్డ తగిలినట్లు.
చిన్నప్పుడు తెలుగు పాఠ్య పుస్తకాలూ చదువుకునేటప్పుడు పాఠం మొత్తము అయిన తరువాత అర్ధాలు ఉన్నట్లే, ఈ కవితల్లో ఉన్న తెలియని, క్లిష్టంగా ఉన్నాయి. అనుకున్న పదాలకు అర్ధాలు సమకూరిస్తే ఈ కవుల కవిత్వం మరింత కాలం సజీవంగా ఉంటాది.
ఎందుకంటే మా క్లాసులో ఉన్న 60 మందిలో, ఒక 6 గురికి మాత్రమే తెలుగు చదవాలని చిన్న ఆశ, అందులో ఇద్దరికీ మాత్రమే ఇలాంటి కవితలు చదవాలని, రాయాలని ఆశ, మరి ఇలాగే ఉంటే ఆ పాఠకులను కూడా కోల్పోతారు.
సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి రాధిక అభిప్రాయం:
01/22/2018 5:49 am
ఈ వ్యాసంలో నాకు అసంతృప్తి కలిగించిన విషయాలు రెండుమూడు ఉన్నాయి కానీ ఒక్కటి మాత్రం ఇక్కడ చెప్దామనుకుంటున్నాను. వ్యాసంలోని ఉదాహరణలు, వాటిని వివరించిన తీరు సరిగా లేవని అనిపించాయి. ఉదాహరణ సరిగా లేనపుడు ప్రస్తావించిన ముఖ్యాంశం పాఠకులని మెప్పించడానికి బదులుగా ‘ఇది కేవలం పడికట్టుపదాల ప్రయోగమేమో’నని సందేహించే పరిస్థితిలో పడేస్తుంది.
1. “సైన్స్ ఫిక్షన్ రచనలో టైమ్ ట్రావెల్ ఒక అంగీకరింపబడిన సత్యం. అలాంటి రచనను టైమ్ ట్రావెల్ అనేది లేదు అది కేవలం కల్పన అనే ప్రాతిపదికన పరిశీలించబోవడం, ఆ రచనను దాని పరిధి దాటి పరిశీలించడం అవుతుంది. హాస్యం ప్రధానోద్దేశమైన రచనలో సామాజిక సందేశం వెతకడం ఇలాంటిదే.” –
ఇది మొదటి ఉదాహరణ. ఈ ఉదాహరణ కి ముందు వ్యాస రచయిత్రి చెప్పిన అంశం చదివి సమకాలీన విమర్శ గురించి ఒక సమగ్ర పరిశీలన చేస్తున్నారేమోనని అనుకునేలోపూ ఈ ఉదాహరణ వస్తుంది. దానితో ఆ అంశం యొక్క స్థాయి ఒక్కసారిగా పడిపోతుంది. ఇక్కడ చెప్తున్నది చాలా మామూలు విషయమనిపిస్తుంది. “పరిధి” అని దీనిని అంటున్నారా వ్యాసరచయిత్రి! ఈ పరిధి కూడా తెలియకుండా వున్నారా ఇప్పటి విమర్శకులు! అన్న ఆశ్చర్యం కలుగుతుంది.
(ఎందుకంటే నాకయితే ఫేస్బుక్ లో వ్యాఖ్యల వంటివి ఇలా (ఈ ఉదాహరణలలోగా) ఉండవచ్చు కానీ విమర్శ అనే శీర్షిక క్రింద వ్రాయబడే వ్యాసాలు ఇలా ఉంటాయని ఒప్పుకోలేమనిపించింది. సైన్సుఫిక్షన్ రచన గురించి విమర్శించ బూనుకున్న “సమకాలీన విమర్శకులు” టైమ్ ట్రావెల్ అనేది లేదు అనే ప్రాతిపదికన (అంటే మరీ ఆ స్థాయిలో) పరిశీలిస్తున్నారని అనడం సబబు కాదేమోననిపించింది.)
2) అలాగే “సూరన కళాపూర్ణోదయం యొక్క ప్రశస్తి, అందులోని వర్ణనలకే పరిమితం కాదనీ, మన దేశంలో ఆ కాలానికి వాడుకలో లేని ఆధునిక నవలా సాహిత్య లక్షణాలన్నీ అందులో ఉన్నాయనీ, ఆ రకంగా ఆ కావ్యం సాహిత్య చరిత్రనే కాదు, సాహిత్యం ఆధారంగా మన దేశచరిత్రనే పునఃపరిశీలించడానికి ఆస్కారం ఇచ్చిందనీ చెప్పడం– ఆ రచన సామాజిక, సాహిత్య చరిత్రలో ఎక్కడ ఒదుగుతోందో వెల్చేరు నారాయణరావుగారు[1] విశ్లేషించి, వివరించి చూపించడం వల్లే సాధ్యపడింది.” అన్న ఉదాహరణ కూడా. –
2002 లో వెల్చేరు నారాయణరావుగారు (ఆ పుస్తకం పీఠికలో) చెప్పేవరకు ఆ నవల ప్రశస్తిని విమర్శకులు వర్ణనలకే పరిమితం చేశారన్న ఈ ఉదాహరణ కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది.
3) ఇక “సోదాహరణంగా విమర్శ” అన్న శీర్షిక క్రింద మొదలుపెట్టిన పేరాలో కవితని వివరించిన తర్వాత వ్రాసిన వాక్యాలు “ఇప్పుడు ఎవరైనా- ఆ రచన ఆసాంతమూ చదవనివాళ్లు, ఈ మట్టివేర్లతో ఓ ఆకుపచ్చ దుప్పటి మీద కప్పుకోవడమన్న భావన ఆహ్లాదంగా ఉందనీ, ఇది సౌందర్యమనీ అనుకోవడం కద్దు. సమర్థులైన విమర్శకులు ఇలాంటి వ్యాఖ్యానాన్ని అందించడంతోనో, లేదా దీన్ని ఖండించడంతోనో ఆగిపోరు.” అన్నారు.
ఇవి చాలా అజాగ్రత్తతో వ్రాసిన వాక్యాలనిపించాయి. “ఆ రచన ఆసాంతమూ చదవనివాళ్లు” అనే మాట వ్రాయడంలో వ్యాస రచయిత్రి భావం ఏమిటి? విమర్శకులు కనీసం ఆసాంతమూ చదవకుండా విమర్శిస్తారనా! కాదు కదా!
లేక కవిత అసాంతమూ చదవనివారు అపార్థం చేసుకుంటారు కానీ ఆసాంతమూ చదివితే అందరికీ ఒకేలా అర్థమవుతుందనా! అదీ కాదు కదా! మరి ఇక “ఆసాంతమూ చదవనివారు” అనేమాట ఎందుకు వాడినట్లు?
అంతే కాదు “సమర్థులైన విమర్శకులు ఇలాంటి వ్యాఖ్యానాన్ని అందించడంతోనో, లేదా దీన్ని ఖండించడంతోనో ఆగిపోరు.” అన్న వాక్యం కూడా అనేక ప్రశ్నలకి తావిస్తుంది.
సమర్థులైన విమర్శకులు సరే సమకాలీన విమర్శకులు ఇలా చేస్తున్నారా చేయట్లేదా! అనేది వెంటనే వచ్చే ప్రశ్న. ఎందుకంటే వ్యాసం శీర్షిక “సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ” కాబట్టి.
అసమర్థులైన విమర్శకులు అసమర్థంగా చేస్తారు సమర్థులైన విమర్శకులు సమర్థంగా చేస్తారు అనేది ఎప్పుడూ ఉండేదే కదా! ఇపుడు ఈ వ్యాసం శీర్షికకి ఈ అంశం ఎలా పొసగుతోంది అనేది ఒక ప్రశ్న.
ఇక “ఈ ఉదాహరణలో చెప్పినదే సమర్థమైన విమర్శా!” అన్న ప్రశ్నని పక్కన పెట్టినా, “వ్యాసరచయిత్రి అభిప్రాయం ప్రకారం అది సమర్థమైన విమర్శ, విమర్శ అంటే అలా ఉండాలి” అని ఒప్పుకున్నా.. ఆతర్వాత కూడా మరికొన్ని ప్రశ్నలు వస్తాయి.
“ఇప్పుడీ నేపథ్యంలో మనం చర్చిస్తున్న కవితను చూస్తే, ఇది ఏ కోవకు చెందిందో స్పష్టంగా చెప్పడం అంత తేలిక కాదు. వాక్యం వెనుక వాక్యం హాయిగా ముగిసే తీరు, సౌమ్యమైన పదాల పోహణింపు ఇది ఒక సౌందర్యాత్మకమైన కవితేనన్న భావన కలిగించినా, కవి పాఠకుడికి చెప్పాలనుకున్న భావం ఆ వాతావరణానికి పూర్తిగా ఆవలి దిక్కున ఉండి, ఒక చేదు అనుభూతినీ బాధనూ మిగుల్చుతోంది.” లాంటి వాక్యాలు వ్యాసరచయిత్రి ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారో అర్థం కాదు. సాధారణ పాఠకులనా! విమర్శకులనా! వాళ్ళలో సమర్థులనా! అసమర్థులనా! వగైరా వగైరా…
ఎందుకంటే అక్కడే మళ్ళీ “ఇలా ఒకేసారి రెండు భిన్నమైన అనుభవాలను కలిగించడం ద్వారా, ఈ కవిత పాఠకుడిని మలి పఠనాలకు ప్రేరేపిస్తోంది” అంటున్నారు. అదే ఆ కవిత యొక్క ప్రత్యేకత అని విశ్లేషిస్తున్నారు. మరి అలాంటి రెండు భిన్నమైన అనుభవాలని కవిత పాఠకుడికి అందించగలుగుతున్నపుడు ఇక్కడ విమర్శకుడి పాత్ర ఏమిటి అనేది మరొక ప్రశ్న!
ఇలా అడుగడుగుకీ ఎన్నో ప్రశ్నలు రావడం వలన ఉదాహరణలు, పదాలు మరింత జాగ్రత్తగా ఎంచుకోవలసిందేమోననీ, వాక్యనిర్మాణాల పట్ల ఇంకొంచెం శ్రద్ధ పెట్టవలసిందేమోననీ అనిపించింది.
సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
01/19/2018 3:30 pm
ఈ వ్యాసం మీద లైలా గారి స్పందన ఆలోచనాత్మకంగా వుంది. వ్యాసం మాత్రం నేలబారుగా, మూసపద్ధతిలో సాగింది. లైలా గారి “ఫిరదౌసి” గురించిన మాటలు సహేతుకాలే ఐనా ఆవిడ premise సరైనది కాదని నా అభిప్రాయం. నా ఉద్దేశ్యంలో ఆ కావ్యం అసలు ఫిరదౌసి గురించి కాదు; అతను నిమిత్తమాత్రుడు; అది జాషువా తన గురించి రాసుకున్న కావ్యం. ఫిరదౌసికి బంగారు నాణేల బదులు వెండి నాణేలు దొరకటం జాషువాకి తన అర్హతకి తగిన గుర్తింపు, ఆదరణ దొరక్కపోవటానికి ప్రతీక. బంగారు నాణేలు వచ్చేసరికి ఫిరదౌసి పరలోకాలకి పోవటం తను బతికుండగా తనకూ తగ్గ గౌరవం దక్కదనే జాషువా భావనకి రూపం. ఈ దృష్టితో చూస్తే జాషువాకి ఫిరదౌసి గురించి ఏమీ తెలియనక్కర్లేదు ఎప్పుడో ఎక్కడో ఒక కవికి ఎంతో అన్యాయం జరిగిందన్న ఒక myth తప్ప.
Ekphrasis గురించి మరి కొంత… గురించి lyla yerneni అభిప్రాయం:
01/18/2018 2:00 pm
బాగా రాసారు ఈ వ్యాసం. చక్కగా విషయం గురించి చదివి, ఆలోచించి, వివరంగా చక్కని ఉదాహరణలతో రాసారు. మీ కవిత, చిత్రమూ కూడా బాగున్నవి.
మీ కవితల గురించి, చిత్రాల గురించి ఈ పత్రికలో ప్రచురించండి. One artist’s exhibition లాగా ఆనందం కలిగిస్తుంది. ఎదురు చూస్తాను.
వేలూరి తన వ్యాసంలో, ఈ ‘ప్రక్రియ’ తెలుగువారికి పరిచయం లేదు అని ఉండాల్సింది కాదు. Ecphrasis అన్న ‘మాట’ తో తెలుగు వారికి (ఇతరులకు కూడా) పెద్దగా పరిచయం లేదు అని ఉండాల్సింది. వెబ్స్టర్ డిక్షనరీ ఆ మాటతో తనకు అంత పరిచయం లేదని చెప్పుకున్నట్టు. Microsft word కి కూడా Ekphrasis మాట తో పరిచయం లేదు. రెండు స్పెల్లింగులు ఇప్పుడు డిక్షనరీ లో ఎక్కించాను. Ecphrasis ప్రక్రియ గా ఐతే వాడుకలో ఎప్పుడూ ఉంది. భారతదేశంలో తెలుగు స్కూల్లో ఉన్నప్పడే లేండ్సేప్ చిత్రాలు, ఇతర పోస్టర్లు ఇచ్చి వాటికి మాటలు రాయించేవారు మాతో. ఐతే అది ఏదో ప్రక్రియ అని టీచర్లు చెప్పలేదు.
వేలూరి విస్తారంగా చదువుతారు. ఎక్కువమందికి తెలియని మాటలు, కాన్సెప్ట్స్ తెలియచేస్తారు. డయాస్పోరా లిటరేచర్ అంటే ఏమిటి అని కొన్నేళ్ల క్రితం వేలూరి ఉపన్యాసంగా మాట్లాడితేనే నాకు తెలిసింది. పద్యాల మొదటి లైన్లు తీసుకుని, మరో పద్యం చేస్తే వాటిని అదేదో ఆ మాట అంటారని ఇక్కడి పాఠకులకు చెప్పినట్టు. రాసి చూపించినట్టు. మనకి కూడా ప్రయత్నించ బుద్ధి అవుతుంది. ఐతే దామెర్ల రామారావు చిత్రానికి తెలుగులో వేలూరి వివరణ పద్యం నాకేం పెద్ద ఆనందం కలిగించలేదు. ఇంగ్లీష్లో రాస్తే, Sarojini Naidu – Bangle Sellers poem లాగా కొంచెం exotic గా ఉండేదేమో. అరుంధతీ రాయ్ కోతులు -కొబ్బరికాయల కథలు ఫారెనర్స్కి బాగున్నట్టు. కొందరు ఇండియన్స్కి కూడా బాగుంటయ్. నాకు సోది. కొన్నిసార్లు ఒళ్లు మంట. ఆ ‘ద న్యూయార్కర్’ లో టీనా బ్రౌన్ ఎడిటర్గా ఉన్నప్పుడు, కొంతమంది స్త్రీ రైటర్లను ముద్దు చేసింది. వారికి పులిట్జర్లూ, బుకర్ ప్రైజ్ లూ వచ్చాయి. ఏమైనా, emphasis (చూసారా, మైక్రొసాఫ్ట్ ఇంకా మాట నేర్చుకోలేదు. నేను రాసిన మాటను మళ్లీ emphasis అని దిద్దింది) ఎక్ఫ్రాసిస్ లో అందమైన Grecian Urn – art piece కి దీటుగా ఉండే On Grecian Urn అన్న కీట్స్ పొయెట్రీ లాటి వైతే రెండూ ‘కళ ‘ గా ఆనందిస్తాము. లేకుంటే ఒకటి కళ, రెండోది exercise. ‘వేలూరి’ కెందుకంట ఆ వెంకాయమ్మ టెంకాయమ్మ ఒకటో తరగతి కబుర్లు, పిల్లమ్మ ఇకనుంచి ఓణీ వేసుకోవాలి – లాటి ఎడ్వైజులూ.
సర్లెండి, మరి ఈ వ్యాసం ఇంత చక్కగా రాసారుగదా, ఆ ట్రివియా వ్యాసమెందుకు పాఠకుల వ్యాఖ్యల మీద. నాకు నచ్చలేదు. అది ఎడిటర్ లకు నచ్చింది. ఏదో మంచి ఎడ్జెక్టివ్ వాడారు మీ పరిశీలన ప్రస్తావిస్తూ. ఎడిటర్ల సూచనలను మీరు Ten Commandments లాగా చూపి, పాఠకులను, కొద్దిగా రూల్స్ ఉల్లంఘించి, కట్టుబాట్లకు లొంగని వాళ్లుగా, సరదాకి ఏదో గాలిగా రాసేస్తూ, పత్రికల్లో లిటరేచర్ని ‘సీరియస్’ గా తీసుకోని వాళ్లలాగా చూపినందునా. Can’t be. ఇక్కడ ఎడిటర్లు నవ్వూ హాస్యం, ఉన్నవాళ్లు. పాఠకులు పత్రికలో ఆటలాడితే వాళ్లకు ఇష్టమే. ఎవరైనా పాఠకులు, సరదాకి రాసానంటే, వేరే వాళ్లకు బాధ ఎందుకు.
పైగా ఈ వ్యాసంలో మీ కవిత, అక్కడ ఆమె బొమ్మ చూస్తే, కట్టుబాట్లు అంటే మీకు ఎంత రోత అనేది తెలుస్తా ఉంది కదా. జీవితంలో సరదా పాడూ లేకుండా ఆమె ఇష్టం లేని పెళ్లి జైల్లోకి బోయి ఆ తలుపు మూత బడిపోతే ఇంకేమన్నా ఉందా? అనే కదా మీ కవిత చెప్పేది. (పాతకాలపు Bias ఉందనుకోండి. ఆడవాళ్లకే ఇష్టం లేని పెళ్లి జరుగుతుందనీ, మగవాళ్లకు అది వర్తించదన్నట్టు. ‘ఆమె’ కావటం వల్ల ఒక్క ప్రెగ్నెన్సీ తప్పించి మిగతా సమస్త కష్టాలూ, ఆడా, మగా కు సమానమే. ఒ ఓ. సవరింపు. మగవాళ్లకు బట్టతల. మగవాళ్లు ఆడవాళ్ల మీద ప్రద్దానికీ జాలి పడిపోయినట్టు, తమ విషయం గురించి రాతల్లో బట్టబయలు చెయ్యరు). మరి సాహిత్యంలో మాత్రం రాసేవారికీ, రాసినవి చదివి రాసేవారికీ -అందరికీ స్వాతంత్రం అక్కర్లేదూ? వ్యాఖ్యల పరిశీలన అంటూ – లెక్కలతో మొదలెట్టి, లింగూ లిటుకూ డేటా కలెక్షన్ చేసి ఆఖరులో వ్యవసాయం ఉపమానం గల కవిత్వపు వాక్యంతో ముగించారు.
ఆ ముగింపు వాక్యాల అర్ధమేమిటి? నాకు తెలియలేదు. అందులో గానీ పరిశీలనా ఫలితం, ఏదైనా హెచ్చరిక గాని ఉంటే అది నాకు తెలియలేదు.
ఓ. నేను ముగించే ముందు – Rx: మేరేజ్! కథ మీరు సమ్మరైజ్ చేసినట్టుగా గాని, ఇక్కడి మీ సీరియస్ తెలుగు కవితలో కంటెంట్ లాగా గాని చదవాల్సిన కథ కాదు. అది కొంచెం నవ్వూ, హాస్యంతో చదువుకోవాల్సిన కథ. (చి.న.) అందంగా లేకపోతే పెళ్లి కాదనుకుంటే అన్ని కోట్ల పెళ్ళిళ్ళు ఎలా జరిగినాయండీ? భలేవారు మీరు! (ద.హా.)
Lyla
సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి lyla yerneni అభిప్రాయం:
01/18/2018 11:52 am
“విమర్శకులు తమ అభిప్రాయం జనబాహుళ్యంలో అప్పటికే ప్రచారంలో ఉన్న అభిప్రాయానికి భిన్నమైనదైనా సరే, ప్రతిపాదించడానికి కూడా వెనుకాడకూడదు.” డా. విజయ్ కోగంటి
Well and Good.
మానస గారి వ్యాసం ‘జాషువా –ఫిరదౌసి’ ఈ పత్రికలోనే ఉన్నది. చదివినారా? ముఖ్యంగా ఈ పై కారణం వల్లనే, చాలా పేలవమైన వ్యాసం అని నేను అనుకున్నాను.
జాషువా రచించిన ‘ఫిరదౌసి’ ఒక ఎన్నదగిన రచన కానే కాదు. ఆ ఖండకావ్యానికి మంచిపేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఇంటర్మీడియేట్ విద్యార్ధులకు 1940 వరకు పఠనగ్రంధాలలో ఒకటి గా ఉన్నదని జాషువా కవి తెలిపారు. ఆ యా గురువులు ఆ కావ్యం గురించి ఆ రోజులలో వారి విద్యార్ధులకు ఏమి బోధించారో!
నా ప్రశ్న – జాషువా ‘ఫిరదౌసి’ లో ఒక పారశీక కవి రూపుగాని, మాటగాని, ఏ పారశీక కవిత్వపు తీరుగాని, అందునా ఫిరదౌసి కవిత్వ పరిచయం గాని ఉన్నదా? సమాధానం: శూన్యం. సున్నా. షానామా కవిత్వప్రఖ్యాతి వల్లే కదా జనులు ఫిరదౌసిని తెలుసుకోవాలనుకునేది? కాదా? స్వాతంత్ర పోరాటం, సత్యాగ్రహం గురించి కాపోతే, మోహనదాస్ కరంచంద్ గాంధీని గురించి ఎవరు తెలుసుకోవాలనుకుంటారు?
కవిత్వ ప్రియులు, కవిత్వం తెలుసుకోటం మాని, కవిని గురించిన కాకమ్మ కథలు వినటం – జాషువా ఫిరదౌసి చదవటం. ఫిరదౌసి అన్న పారశీక కవిని గురించి ప్రచారం లో ఉన్న ధన సంబంధమైన ఒక కథను గూర్చి మాత్రమే జాషువా రాసినాడు. (ఇలాటి చాటువు, చాటు గురించి ఈ పత్రికలో మాటికి ముమ్మారు చాటి చెప్పిగా విన్నాం కదా.) ఆ రచన ఎలాటిదంటే, ఒక సంగీతవేత్త గాని – భక్త రామదాసు జైల్లో ఉంటే రాముడు లక్ష్మణుడు వచ్చి, కప్పం కట్టి అతడిని చెర వినిపించటం కట్టుకథ మనకు చెప్పి, – రామదాసు కీర్తన ఒక్కటి తెలియచెప్పటం గానీ, పాడటం కానీ చెయ్యలేకపోటం వంటిది.
ఒక కవి, ఇంకో కవి కవిత్వం చదవకుండానో, ఆ ప్రసక్తి ఇంత తేకుండానో, మకుటం లో అతని పేరుతో అతని మీద ఖండకావ్యం రాయటమేమిటి?
జాషువా రాసిన ఫిరదౌసి కావ్యం పేరు మార్చి, కాళిదాసు, బమ్మెర పోతన అని పెట్టినా, కీట్స్ అని గాని, షేక్స్పియర్ అని గాని పెట్టి, లోపల పద్యాలలో పేరు మారిస్తే, చాలు. ఏం తేడా రాదు. ఆ ఏ ఒక్కరి specific జీవనం, విద్య, శైలి, ఆలోచన రీతి, సాధించిన పని, మనకింత కూడా తెలియదు. అలాటి generic రచన జాషువా చేసింది. ఫిరదౌసి పారశీకపు కవిత్వపు తీరు తెన్నులు జాషువాకు బహుశా తెలియవు. ఆయన చెప్పలేనందున ఈ ఖండకావ్యం ద్వారా మనకూ తెలియవు. కొంతమంది చదువరులకు మరి ఫిరదౌసి కవిత్వ పరిచయం జాషువా రచన ద్వారా, ఎలా కలిగిందో?
ఫిరదౌసి అన్న కావ్యంలో ఆ కవి లేనే లేడన్న విషయం మానస మాత్రం గమనించిందా? లేదు.
జాషువా రాసిన ఆ ఖండకావ్యము పేరుగొన్నదనే చదువుకుని, బాగున్నదనే నమ్మి, వాల్మీకి, నారాయణరావు, గురజాడ – ఇలా సాహిత్యంలో తెలిసిన కొందరిని, వారి మాటలను తన వ్యాసం లో ప్రస్తావిస్తూ రివాజు ప్రకారం ఒక సాంప్రదాయికమైన వ్యాసాన్ని, మానస తయారు చేసింది. ఆ ప్రస్తావనలు కూడా ఆమెకు ఈ రచన సందర్భంలో సొంత ఆలోచన లేకపోటాన్నే బలపరుస్తాయి. వాల్మీకి – సీతకు ఎడమ కన్నో, కుడి కన్నో అదరటానికీ, ఒక పారశీక కవి నమ్మికలకూ, మానసిక స్ధితిగతులకూ ఏమిటి సంబంధం?
ఫిరదౌసి గురించి జాషువా “ఏమని కవిత్వం వ్రాసినట్టు, ఎందుకు వ్రాసినట్టు” అని మానస ప్రశ్నించుకుంది. సాహితీ వ్యాసాల్లో – ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి? అని తమ వ్యాసాల్లో అనటం నేర్పిన సాహిత్య సైంటిస్ట్ ల నుండి ఆ వాక్యం రాయటం వరకు ఆమెకు వచ్చింది. మరి సంపాదించిన సమాధానం? అదసలు ఏమిటి? దొరికినది సజావుగా ఉన్నదా?
ఎన్నో విషయాల మీద ఆసక్తితో మనుషులు శ్రమిస్తారు. సైంటిస్ట్ లకు ఒక పరిశోధనలో ముఫ్పై ఏళ్లు శ్రమిస్తే, అందునుండి మనుషులకో, మరెవరికో ఉపయోగించే ఫలితం ఏదీ రాకపోతే ఆవేదన కలుగుతుంది. అనుకున్న ఆదాయం రాకపోయినా కష్టం కలుగుతుంది. నిజమే.. మరి, ఫిరదౌసి కవిత్వమైతే ప్రజలకు ఆనందించటానికి ఉన్నది. జాషువా కావ్యం రాసేనాటికి ఫిరదౌసి ప్రసిధ్ధుడైన కవే. ఆ కవిత్వం దొరుకుతున్నది. మరి జాషువా ఒక పాతకథను పట్టుకు ఎందుకు పాకులాడ్డం? ప్రపంచంలోనే పేరు పడిన కవిని, మరో కవి ముఖ్యంగా అతని కవిత్వాన్ని గుర్తిస్తాడా? కవిత్వాన్ని పరిచయం చేస్తాడా – లేక, అది మరచి, (నిజమో కాదో తెలియని) ఒక పరిదీన పరిస్థితిలో మనకు ఫిరదౌసిని చూపుతాడా? అది చేయదగ్గ పనిగా నాకు అనిపించటం లేదు.
జాషువా కావ్య వస్తువుగా తన తెలుగు జీవితం, తన నిజ పరిస్థితిని తనే వర్ణించి తన సమకాలీన పాఠకులకు చూపవచ్చు. “గబ్బిలము” లో ఎంతో కొంత చూపినాడు. కాని, ఏనాటి వాడో పర్షియన్ ఫిరదౌసిని జీవితంలో ఏదో అన్యాయానికి గురైన వాడుగా మాత్రమే నమ్మి మనకు కావ్యంలో చూపటం గాని, కవిత్వ ప్రస్తావనే లేని కావ్యం రాయటం కాని, ఫిరదౌసి జీవితం తో జాషువా జీవితానికి సాపత్యం ఉంది – అని అతనైనా, ఎవరైనా అనుకోటం కాని, అవి సరైన ఆలోచనలు కావు.
మానస – తన రచనలో 1. జాషువాకు ఫిరదౌసి కవిత్వం తెలుసునో తెలియదో చెప్పగలగాలి. 3. అందుకు స్వయంగా ఫిరదౌసి కవిత్వం కొంతైనా తను చదివి, చర్చించ గలిగి ఉండాలి. అప్పుడు గదా ఆమె ‘జాషువా- ఫిరదౌసి’ అన్న వ్యాసం రాయవలసింది. కాదా? Is it not?
(సమయం కొద్దీ, మానస చామర్తి కవితలు, కవిత పరిచయాల గురించి మరోసారి.)
Lyla
సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి srini అభిప్రాయం:
01/17/2018 5:24 pm
Well written. Very timely. Enjoyed reading it.
రీప్లే గురించి A S Murthy అభిప్రాయం:
01/17/2018 3:42 am
గందర గోళంగా ఉంది, ఇప్పటి యూత్ లాగా?
సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:
01/17/2018 3:02 am
మంచి వ్యాసం మానస గారు
త్రిశంకు స్వర్గం గురించి B J S REDDY (శ్రీ) అభిప్రాయం:
01/17/2018 1:36 am
చాలా బాగుంది , చిన్నగా , చక్కగా , నికచ్చిగా…
అర్థంకాని మాటలు – అర్థమవని కవితలు – గురించి B J S REDDY (శ్రీ) అభిప్రాయం:
01/16/2018 8:04 pm
శ్రీశ్రీ అంటే ప్రాణం. అర్ధం అయిన వాటి నుంచి ఏదో తెలుసుకోవాలని, అలా నేను నాలుగు మాటలు చెప్పాలని అనిపించేది, కానీ అర్ధం కానీ పదాలు వచ్చినప్పుడు కవిత ప్రవాహం అయితే సాగిపోయేది కానీ ఎక్కడో చిన్న అసౌకర్యం ఉండేది. నాకు తెలిసిన భాషలో చెప్తాను. మనకు నచ్చిన ముద్దపప్పుతో గోంగూర పచ్చడి నంజుకుని తింటునేటప్పుడు ఎక్కడో అన్నములో మట్టి బెడ్డ తగిలినట్లు.
చిన్నప్పుడు తెలుగు పాఠ్య పుస్తకాలూ చదువుకునేటప్పుడు పాఠం మొత్తము అయిన తరువాత అర్ధాలు ఉన్నట్లే, ఈ కవితల్లో ఉన్న తెలియని, క్లిష్టంగా ఉన్నాయి. అనుకున్న పదాలకు అర్ధాలు సమకూరిస్తే ఈ కవుల కవిత్వం మరింత కాలం సజీవంగా ఉంటాది.
ఎందుకంటే మా క్లాసులో ఉన్న 60 మందిలో, ఒక 6 గురికి మాత్రమే తెలుగు చదవాలని చిన్న ఆశ, అందులో ఇద్దరికీ మాత్రమే ఇలాంటి కవితలు చదవాలని, రాయాలని ఆశ, మరి ఇలాగే ఉంటే ఆ పాఠకులను కూడా కోల్పోతారు.
అలా జరగకూడదని ఆశిస్తూ….
తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – మొదటి భాగం గురించి PARTHU అభిప్రాయం:
01/16/2018 4:09 am
నమస్తే సార్,
యుద్ద కథ చాల బాగుంది. మీకు చాలా దన్యవాదాలు . మీరు దయచెసి దీనిని pdf format లో ఉంచగలరు, download చేసుకోడానికి వీలుగా.