eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
పాఠకుల అభిప్రాయాలు
Total Comments: 16489
ఛందోధర్మము
గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
08/28/2008
5:22 pm
చక్కగా సత్య గారు సత్యాన్నే చెప్పారు.
ఇంకొక్క ఆలోచన. రచయిత వివరాలేమీ తెలియకుండానే రచనను ఆదర్శవంతం అని అనుకున్నట్లే, రచయిత నడవడి తెలిసింతరువాత, అది రచన యొక్క ప్రధానాంశానికి పచ్చి విరుద్ధంగా ఉన్నప్పుడు, అయ్యో రచన అందించిన ఆదర్శం రచయితకే ఎంత దూరంగా ఉంది అనుకొని, ఆ రచన యొక్క ఆదర్శ స్ఫూర్తితోనే ఆ రచయితను సైతం బేరీజు వేసుకోవడం సహజమూ, సమంజసమే అనుకుంటాను. అంతమాత్రాన రచన గుణాలు తగ్గాయని కాదు. రచన చూపించే వెలుగుతోనే రచయితను కూడా నిగ్గుదేల్చి, స్పష్టంగా చూడడం మాత్రమే.
ఇది కేవలం రచన, రచయితలకే పరిమితం అయిన విషయం కాదని కూడా అనిపిస్తుంది. ఎటుచూస్తే అటు అంతటా ఉన్న విషయమేనేమో!
ఎకరాలకెకరాలు భూకబ్జాలు చేసి, గజాలకొద్ది మాత్రం గుడికో, ఆసుపత్రికో విరాళం ఇవ్వడం, ప్రశంసనీయమా, “విచార”ణీయమా! భారీగా పన్నులు ఎగ్గొట్టి, ప్రభుత్వ నియమాలను నేలరాసి, ప్రకృతి ఉపద్రవాలొచ్చినప్పుడు ప్రధాన మంత్రి relief fund కు కొన్ని పైసలివ్వడం గొప్పనా, దారుణమా! ఇట్లా ఎన్నో!
ఆధునిక తెలుగు సాహితీలోకంలోనే మన ముందున్న ఒక ప్రముఖ ఉదాహరణ. శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి అవధాన ప్రజ్ఞను, పాండితిని ప్రశంసించిన అభిమాన సంఘాలు, సంస్థలే ఆయన వ్యక్తిగత అంశాలను తెలుసుకున్నాక ఆయనలోని కళాకౌశలాన్ని దూరం నుంచి మాత్రమే అందుకోవడానికి ముందుకురావడం చూస్తునే ఉన్నాం. దూరంగా ఉంచింది రచనను, కళను కాదు, రచయితనో, కళాకారున్నో మాత్రమే. ఇది ఏదో నా అభిప్రాయం కాదు, కళ్ళెదుటున్న వాస్తవం.
నేను డొక్కా శ్రీను అన్నమాట. నాకు తెలిసి నా తోటివాళ్ళు ముగ్గురు
ఫణులున్నారు. బాలాంత్రపు ఫణి, ఎర్రమిల్లి ఫణి, కొంచెం చిన్నవాడు చావలి ఫణీను. నాపేరులో ఫణున్నా అందరూ చిన్నప్పుడు శ్రీను అనే పిలిచేవారు. నా ఈమెయిలు ఫణిడొక్కా ఎట్ యాహూ డాట్ కాం. వీలుచూసుకుని మెయిలు పంపించు.
మళ్ళీ వినాయకచవితొచ్చేస్తోంది, మీ సీతాఫలం చెట్టు జాగర్త 🙂
నాకు చందమామ పుస్తకాలంటే చాలా ఇష్టం. నేను తెలుగులో ఈ మాత్రం వెలగ బెట్టగలుగుతున్నానంటే వాటి తోడ్పాటు వల్లే నని ఒప్పుకోక తప్పదు.
హనుమంతరావుగారన్న మాటలు చదివాక నాకు ఎవరి టీ షర్టు మీదో చదివిన వాక్యం గుర్తుకొచ్చింది. “Please take my advice. I don’t use it anyway!”
వారు “నమ్మకాలు బ్రతుకుతెరువు” అన్న శీర్షిక కింద రాసిన విషయాలు నమ్మదగినట్టే వున్నాయి. కానీ మనము ఇలా కూడా ఆలోచించవచ్చేమో!
ఒక స్థూలకాయుడో స్థూలకాయురాలో నేను మీ బరువు తగ్గిస్తానని ఆర్భాటంగా ఏదైనా పత్రికలో ప్రకటన ఇచ్చారనుకుందాం. దానికి ప్రజల స్పందన ఎలావుంటుంది?
అలాగే మనము కొన్ని సార్లు టీవీ లో చూస్తూ ఉంటాము. ఏదో ఒక ఇంద్రలుప్తకుడు ఇతరుల కేశసంపదనీ సౌందర్యాన్నీ పెంపొందిస్తానని (సంకోచం ఏమాత్రమూ లేకుండా) అనర్గళంగా వ్యాఖ్యానించి నిష్క్రమిస్తారు. అది ఎలా వుంటుంది?
స్థూలంగా ఉండటమో, బట్టతల కలిగి ఉండటమో అపరాధాలు కావు. నేను కూడా కొద్దిగా స్థూలంగానూ, బట్టతలతోనూ వున్నానని అనుకుంటున్నాను. 🙂
కానీ ఇలాంటి ప్రకటనలకీ వ్యాఖ్యానాలకీ ప్రజలు ఎలా స్పందిస్తారో అదే విధంగానే రచయితల రచనలక్కూడా స్పందిస్తారని ఊహించడం అసమంజసం కాదనుకుంటాను.
ఇకపోతే నమ్మకాలనూ, స్వభావాలానూ సులభంగా కప్పిపుచ్చవచ్చు. తమ తమ ఆశయ ఆకాంక్ష, నమ్మకాలకు వ్యతిరేకంగా రచయితలు తమ రచనలను సాగించవచ్చు. రచయితలందరూ నీతిమంతులుగా ఉండాలన్నది లేదు.
జైళ్ళల్లో కూరుచుని రాసే/రాసేసిన రచయితలు లేరా?
ఎవరి ఇష్టం వారిది. ఎవరి జీవితం వారిది. రచయితలు భ్రష్టులతే అభ్యంతరం చెప్పవలిసిన అవసరం ఉందో లేదో నాకు తెలియదు. లేదనే నేననుకుంటున్నాను. రాయడం సవ్యంగా వస్తే చాలు. చెత్త రచనలకి వెల ఎంతైనా ఎక్కువే, విలువ ఎంతైనా తక్కువే అని వేరే చెప్పవలసిన అవసరం లేదని అనుకుంటున్నాను.
వారేమి రాసినా దాని గతో దుర్గతో నిర్గతో నిర్ణయించడాన్ని పాఠకులే చూసుకుంటారు.
మరి చివరి విషయం. రచయితలలో రెండు రకాలు. తెలివైన వారూ, తెలివితక్కువవారు. అదేలాగా పాఠకులు కూడా రెండు విధాలు. తెలివైన వారూ, తెలివితక్కువవారు.
రచయితలందరూ తెలివైన వారైతే బాధ లేదు. అలాగే పాఠకులందరూ తెలివైన వారైనా బాధ ఏమాత్రమూ లేదు.
పాఠకులు కొందరు మాత్రమే తెలివైన వాళ్ళైతే రచయితలు భ్రష్టులైనా నీతిమంతులైనా ఒక్కటే. అటువంటి పాఠకులు చదివిన ప్రతిదానినీ విచక్షణా దృక్పథంతో చూచి తమకు నచ్చినది మాత్రం ఏరుకుంటారు. మిగిలిన చెత్తని విసర్జిస్తారు.
ఇక పోతే మిగిలినది బుద్ధితక్కువ పాఠకుల విషయం.
పాఠకులు బుద్ధి హీనులైతే బుద్ధిహీనుల రచనలనే సమర్థిస్తారు. అవే వారికి నచ్చుతాయి. వారు చాదస్తపు మొగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు అన్న ధోరణిలో ఉంటారు. వారికి ఏమీ చెప్పకుండా, వారిని ఎక్కడా గిల్లకుండా ఉంటే ఏ బాధా లేదు.
ఇందులో ఇంకో విచిత్రం ఏమిటంటే తెలివితక్కువ వారికి తెలివిగలవాళ్ళు తెలివితక్కువ వాళ్ళుగా కనిపిస్తారు. తెలివిగలవాళ్ళకి తెలివి తక్కువవారు తెలివితక్కువ వారుగానే కనిపిస్తారు.
అంటే ఒక విధంగా అందరూ తెలివితక్కువ వాళ్ళే. ఇంకో విధంగా అందరూ తెలివిగలవాళ్ళే. కాబట్టి అస్సలు బాధే లేదు.
మీరెవరైనా చెప్పే ముందే ఒప్పేసుకుంటాను. నేను తెలివి తక్కువ వాణ్ణేను.
రచయితల పేరులను తొలగించి వారి “మంచి” రచనలను
మన ముందు ఎవరైనా ఉంచితే, అందులో ఏ రచన
నిజాయితీ ఉన్న రచయిత రాసింది, ఏ రచన నిజాయితీ
లేని రచయిత రాసింది అనే విషయాన్ని చెప్పడం సులభం
కాదనుకొంటాను. రచయిత దుర్బలుడుగా ఉండవచ్చు,
అంత మాత్రాన అతడు (ఆమె) రాసిన రచనలు ఆదర్శవంతముగా
ఎందుకు ఉండరాదు? రచయిత వ్యక్తిగత జీవితానికి
ఆ రచయిత రాసిన రచనకు లంకె పెట్టడం సబబు కాదు.
విధేయుడు – మోహన
ఛందోధర్మము
గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
08/28/2008
11:32 am
It is unfair to take a dig at Vemana’s past. He wrote padyams after, not before, overcoming his past. Same thing with Valmiki et.al.
శ్రీశ్రీ భక్తి రచనలు ఉపాధికోసం రాసాను అనడం వాస్తవికతనే కాక అతని నిజాయితీని కూడా చెప్పుతుంది. అయితే ఈ చర్చ కేవలం రచనలు, రచయితలకే పరిమితం చేయడం అన్యాయం!
“తిట్టొద్దు, కొట్టొద్దు, (లేదా మీకిష్టమొచ్చిన తప్పిదాన్ని ఇరికించండి)
అని చెప్పుతూ, నువ్వు అవ్వే చేయొచ్చు, కాని నేను అవి చేస్తే తప్పేంటి నాన్నా” అని అనడం, వినడం తెలియని వారెవ్వరు! మాటకు, చేతకు అదే సంబంధం. చేత మనిషి వ్యక్తిత్త్వం అయితే మాటలు ఆ వ్యక్తి రచనలు కావచ్చు.
తప్పిదాలగురించి కాదు, వొప్పిదాల గురించి అయితే కూడా ఇదే పరిస్థితా అని అడుగొచ్చు.
అందరికి తెలిసిన కథ గుర్తుకొచ్చింది.
గాందీజీ దగ్గరకు ఒక తల్లి బిడ్డను తీసుకొచ్చి వీడికి చక్కెర ఎక్కువ తినొద్దని చెప్పమని వేడుకుందట. తల్లి ఎంత చెప్పినా వినలేదు కాబట్టి గాంధీజీ దగ్గరకు తీసుకొచ్చింది ఆయన చెపితేనన్నా వింటాడేమో అని ఆశతో.
ఏముంది! ఇప్పుడు కాదు, వారం రోజులయింతరువాత తిరిగి రమ్మన్నారట గాంధీజీ. మళ్ళీ వారం తరువాత వెళ్ళితే, గాంధీజీ పిల్లవాడిని ప్రేమతో దగ్గరకు చేర్చుకొని చక్కెర ఎక్కువగా తినకు అని చెప్పాడట. ఈ మాత్రం ముక్క చెప్పడానికి వారం తరువాత ఎందుకు రమ్మన్నారు అని ఆ తల్లి ఆడిగిందట. వారం రోజుల క్రితం వరకు నేను కూడా చక్కెర ఎక్కువగా తినేవాడిని. నేను తగ్గించిన తరువాత ఇప్పుడు చెప్పాను అని వివరించాడట గాంధీజీ. కథ కంచికి.
రచయిత అకారణంగానో, సకారణంగానో, ఒకరి దుకాణంకోసమో,లేక సవాలక్షల కారణాలతో రాయొచ్చు. ఎందుకు రాయకూడదు? అందంగా, అధ్భుతంగా కూడా ఆ రచనలు రావొచ్చు. అవార్డులు కూడా పొందొచ్చు. అయితే నిజాయితీ లోపించే రచనలు ఆ తల్లి చెప్పిన మంచి మాటల్లాగానే మిగిలిపోతాయేమో.
నిజాయితీతో చెప్పిన మాటలు పెద్ద రచయితవి అయినా కాకపోయినా, అవార్డులు రివార్డులేవి వచ్చినా రాకపోయినా, అసలు రాయడం చదవడం కూడా రాని వాడివైనా కూడా గుండెకు తగులుతాయి. మార్పుకు ఊపిరి ఇస్తాయి.
చండీదాస్ అన్న మాట చాలా సబబయినదే కాదు, ఉదాత్తమైనది కూడా. ముందు తన రచనని చదవమన్నాడు. అది విలువైనదయితే, తను నలుగురూ తెలుసుకోదగ్గ రచయితయితే, తన జీవితం – దాంట్లో అల్పత్వాలున్నా మహత్వాలున్నా – అందరి ముందరా పెడతానన్నాడు.
రేపో మాపో చండీదాస్ స్వీయచరిత్ర వెలువడితే, ఆయనొక యోగిలా బ్రతికాడని తెలిస్తే, అనుక్షణికం విలువ ఓ పిసరు పెరగొచ్చు. భ్రష్టుడనిపిస్తే ఓ పిసరు తగ్గొచ్చు. కాని మౌలికంగా నవల విలువలో మార్పుండదు. ఉంటే మనం సాహిత్యాన్ని వెలకట్టడానికి వాడే తూనికరాళ్ళని తనిఖీ చెయ్యాలి.
శ్రీశ్రీ భక్తి రచనలు జీవనోపాధి కోసం రాశానన్న సమర్థన దబాయింపు గానూ లేదు, సంజాయిషీ గానూ లేదు. కఠోరమైన వాస్తవికతతో కూడి ఉంది. మహాప్రస్థానం తోనో విప్లవ రచనలతోనో వచ్చే డబ్బుతో పొట్ట గడుస్తుందంటారా? గడవకపోతే ఏమాయె, “సతుల్, సుతుల్, హితుల్ పోతే పోనీ, … తిట్లూ, రాట్లూ, పాట్లూ రానీ,” అన్న కళా రవి, ఆ మాత్రం నిజజీవితంలో ఆటుపోట్లకి తట్టుకోలేనివాడు, కవిత్వం, కాకరకాయా రాయడమెందుకు అంటారా?
“తన విశ్వాసాలు, నమ్మకాలూ ఎలాంటివైనా చందమామ పాఠకుల కోసం ఆయన విశేషమైన కృషి చేసి, సేకరించి, అందజేసిన ప్రాచీన ఇతిహాసాలూ, పౌరాణిక గాథలూ, ఆ శైలీ మరువరానివి. స్వర్గీయ శ్రీ చక్రపాణి ఆశయాలకు రూపం కల్పించి, తన శైలితో పాఠకలోకాన్నీ, తక్కిన పత్రికలనూ ఆకర్షించిన మేధావి శ్రీ కుటుంబరావు.”
అంటే కుటుంబరావు తన నమ్మకాలతో సంబంధంలేని రచనలకి మెరుగులు దిద్దే పనికి అంకితమయ్యేడనే కదా! ఎందువలన? అని చలసానే కుటుంబరావుని సూటిగా ఆయన బ్రతికుండగనే అడిగారు:
“మీరు – నేనూ ఒకే వృత్తిలో ఉన్నాం. ఎడిటర్ గిరీ అనేది ఒక వృత్తి. బతుకుతెరువు. మనం ఎడిటర్లగా కాక ఏ ఆఫీసర్ గానో, లెక్చరర్ గానో, బ్యాంకు ఉద్యోగిగానో వుంటే, ఆఫీసులో మనం చేసే పని గురించిగానీ, దాని స్వభావం గురించిగానీ ఎవరూ ప్రశ్నించరు, విమర్శించరు. కానీ, ఎడిటర్ అనీగాన అందరూ అతను పనిచేసే పత్రికలోని భావాలన్నింటికీ అతన్నే బాధ్యుడిగా భావిస్తారు, విమర్శిస్తారు. మీరు చందమామ లో వేసే కథల స్వభావం గురించి, వాటిలో రాక్షసులు, భూతాలు, దయ్యాలు, దేవుళ్ళు మున్నగు వాటిలో గల ఔచిత్యాన్ని గురించి చాలా మంది ప్రశ్నిస్తున్నారు…. దీనిని మీరు ఎలా సమర్థిస్తారు?” (రసన, పేజీ 133.)
కుటుంబరావు దీనికి సమాధానం ఇవ్వలేదు కాని, నేనూహించుకోగలను – కుటుంబరావుకీ పోషించాల్సిన కుటుంబమొకటుంది. శ్రీశ్రీ, కుటుంబరావు, ఇంకా అనేకమంది, పొట్టపోషణ కోసం తమ నమ్మకాలతో పూర్తిగా కాకపోయినా కొంతయినా పొసగని పనిలో ఉండి ఉండొచ్చు. వాళ్ళు తమ నమ్మకాలని వదిలెయ్యాలా? లేక వేరే బ్రతుకుతెరువు చూసుకోవాలా? మీరయితే ఏం చేస్తారు?
కొడవళ్ళ హనుమంతరావు
ఛందోధర్మము
గురించి ravikiran timmireddy అభిప్రాయం:
08/27/2008
2:17 pm
ఇక్కడ వ్యక్తులూ, వ్యక్తిత్వమూ, వస్తువూ వేర్వేరు గా చూడ్డం కుదరని పని.
బహుశా జె యు బి వి గారికీ ( నాక్కూడా ) దీనితోనే అభ్యంతరం అనుకుంటాను.
మంచిది నీతిమంతులారా, మహా ప్రస్థానాన్ని విశాఖ సముద్రంలోకి విసిరెయ్యండి, గుయెర్నికాని కాల్చెయ్యండి. అక్కడతో ఆగకండి, ప్రాచీన కళా కారులు, సాహితీకారులేం మడి కట్టుకోని కూర్చోలేదు వారి చిత్రాల్ని, రచనల్ని సైతం సమిధలు చేసెయ్యండి. ఐతే వొక మనవి ఆ మంట వెలుగులో మీవెనక భాగాలు మాత్రం ఎవరికీ కనపడకుండా కప్పి పెట్టుకోండి, లేకపోతే ఎవరో మిమ్మల్ని కూడా ఆ మంటల్లోకి దోశెయ్యగలరు.
నీతులు చెప్పడం సాహిత్యం కాదు. బ్రతుకుని చిత్రించడం సాహిత్యం. ఆ జీవిత చిత్రణ ఎవరి కలంనుంచొస్తేనెవి. అక్ష్రర రూపం తీసుకున్న ఆ అంతరంగ వుప్పెన కి దానికంటూ వొక అస్థిత్వం ఏర్పడుతుంది. రచయితతో సృష్టికర్తతో సంబంధంలేని వ్యక్తిత్వం ఆ రచనకి అబ్బుతుంది. రేఖా మాత్రంగా రచయిత రచనలో కనిపడొచ్చేవో but by itself it will be an independent entity. Like any of us who inherited a few characteristics from our parents. Still we grow up to be independent human beings and we will not and do not want to be judged by personalities of our parents. రచనలు, రచయితల మధ్య కూడా అదేవిధవైన సంబంధం వుందని నా నమ్మకం.
జారుడుబండ మీద కాలేస్తే ఏమవుతుందో తెలిసీ, పెద్దగా పట్టించుకోని రచయితలు మనకు కావాలని ఎవరైనా కోరుకుంటే ‘చదివే సమాజం’ పరిధి పెరగాలి. మనమున్న బావి, కాదు ఇంకుడు గుంత, లోంచి కనీసం తలైనా పైకెత్తి ప్రపంచాన్ని చూద్దాం అని చదివే వాళ్ళకుండాలి. చదివే వాళ్ళకు అర్హత అవసరం అన్నది కొంతవరకూ కరెక్ట్. అది ఎట్లాంటి అర్హత అనేదగ్గరే కొద్ది పేచీలు. వాటిని తీర్చడానికి కొంత అర్హత కలిగిన వాళ్ళే రాయాలి. వాటి మీద మళ్ళీ చదవటానికి, రాయటానికి “క్వాలిఫై” అయిన వాళ్ళే కావాలి.
విషయం తీవ్రబడి, చిక్కబడ్డప్పుడు అర్హత అనేది ముఖ్యమవుతుంది. కొడవళ్ళ కోట్ చేసిన, ఆయన ఫేవరైట్ రచయిత మాటలు ఆ దాంట్లోకే వస్తాయి. అది డిఫెండ్ చేయగలిగే మాట.
విషయానికున్న తీవ్రతను రచయితకన్నా అర్హత కలిగిన పాఠకుడే బాగా గ్రహిస్తాడేమో అని నా అనుమానం.
ఇక మళ్ళీ ఒకసారి ముందునించే మొదలు పెడితే:
సరే, మీరన్న రాయటానికి అర్హత అక్కర్లేదు అన్నది “ఛందస్సు గురించీ, లక్షణ గ్రంధాలు చదవడం గురించీ, నన్నయాది కవుల కావ్యాలని ఔపోసన పట్టడం గురించీ వగైరాల గురించి” అయినా కూడా ఆయా విషయాలకు ఉన్న తీవ్రత ఏ అర్హతా లేని వాళ్ళకు తెలవదు, రాయలేరు. (తెలుస్తుందని, రాయగలరని మీకు అనిపిస్తే, “ప్రూఫులు కావాలి” బాబ్జీలు గారూ అంటాన్నేను :)). “తెలవటం” ఒక అర్హత.
ఇది గుడిపాటి అడిగిన “మన కవులు అక్షరాస్యులేనా!” దగ్గరికే తీసుకు రావచ్చు. లేదా “ఎటొచ్చీ రాసే వాళ్ళ అర్హత తోనే పేచీ” అని రాజా శంకర్ గారన్న దగ్గరే మొదలు పెట్టొచ్చు. “కవికి కావలసిన కనీస అర్హత గురించి కవులే చెప్పాలి” అని నేనూ ఒక పెద్ద సారును తల్చుకుని ఇప్పటి మటుకు వదిలించుకోవచ్చు. ఇవి రాయటానికి నాకేం అర్హత ఉందీ అని నన్నే అడిగితే మాత్రం జవాబు “అది చదివే వాళ్ళు డిసైడ్ చేయాల”ని చెప్పటం తప్ప మరో మాట లేదు.
అర్హత కలిగిని చదివే వాళ్ళు, రాసే వాళ్ళ అర్హతను నిర్ణయిస్తారు అని మరోవిధంగా చెప్పొచ్చేమో, మన ఆంజనేయ స్వామి గుడిమెట్ల మీద — చెప్పుకునే విషయంగా. “రచ్చబండ” అయితే మాత్రం ఇంకా స్పష్ఠంగా చెప్పాల్సి ఉంటుంది.
అసలు నేను రాసింది వెనక్కు తీసుకుందామనుకున్నాను. కానీ కాలు పెట్టింతర్వాత అది తీయటం కష్టం అనిపించి మాట్లాడలేదు. ఒక కాలే కదా అని ఊరుకుంటే ఇప్పుడు రెండోది కూడా పెట్టి చూడమన్నందుకు మీకు ధన్యవాదాలు.
ఇక ముందుకెళ్ళి, మిగతావి కూడా చూద్దాం:
(వీటిని పెద్దగా కాంటెక్స్ట్ లో పెట్టి, అంటే వెనక్కెళ్ళి, భూతద్దం అప్పుతెచ్చుకుని, చూడకండి, దేనికదే అన్నట్టు చదవండి, వీలైతే)
“రాసిన వాక్యం అందరికీ అదే భావాన్నివ్వాలి. యివ్వకపోతే రాసినినోడిది తప్పు.” కాదు, చదివే వాడి అర్హత ఇక్కడ ప్రశ్నార్ధకం.
“నిజాయితీతో సెప్పు. ఆ యెనక నీతితో సెప్పు. అంతెగానీ వొల్లకోకు.” వొల్లకుంతానికి నానేవన్నా పెండ్లి సేసుకున్న సీతాల్నా! అవుసరవైతే అయిదారుగురికి ఒక్క సారే గురెట్టి, ఒకల సిగలొకలకు ముడివెట్టి కొత్త భారతవేదైనా పుట్టి చస్తుందేవో అని సూసే వోడికి ఇదేం లెక్క?
నీతులు చెప్పటానికే కాని వినటానికి బాగుండవు అని ఎవరో పెద్దతలకాయ అనగా విన్నాను. నిజాయితీ అనే అర్హత మాత్రం ఏది రాయాలన్నా కావాలి.
వేమన గురించి “అంత సెండాలం మనిషి అలాటి కబుర్లాడితే మన్లాటోళ్ళం వొప్పుతావేటి?” అని అడిగినందుకు: కాలాన్ని, ప్రాంతాన్ని బట్టి ‘నీతి’ మారుతుంది. ‘నిజాయితీ’ మారదు. ఇవాల్టి నీతి రేపుండక పోవచ్చు. నేను రాసిన ఒక బేవార్స్ ఎక్సాంపుల్ ‘నిజాయితీ’ గురించి, నీతి గురించి కాదు. మన దగ్గర (ఇప్పటికీ) పది పదమూడు ఏండ్ల పిల్లలను పెండ్లీలు చేసుకునే వాళ్ళున్నరు, వాళ్ళంతా ఛైల్డ్ మాలెస్టర్సే మరో ప్రాంతపు నీతిని బట్టి చూస్తే. అట్లాంటి క్వాలిఫికేషన్స్ కాకుండా, నిజాయితీ గురించి మాత్రమే నేను రాసింది.
రవీంద్ర బాబు గారూ,
ఈ వ్యాసం రెండో భాగం కామెంట్లలో విష్ణుభొట్ల లక్ష్మన్న గారితో నేను చేసిన చర్చ చూడండి. అలాగే నాలుగో భాగం (సెప్టెంబరు 1 న వెలువడుతుంది)లో కూడా దీనిమీద కొంత చర్చ ఉంటుంది.
నమస్కారాలతో,
నాగమురళి.
ఛందోధర్మము గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
08/28/2008 5:22 pm
చక్కగా సత్య గారు సత్యాన్నే చెప్పారు.
ఇంకొక్క ఆలోచన. రచయిత వివరాలేమీ తెలియకుండానే రచనను ఆదర్శవంతం అని అనుకున్నట్లే, రచయిత నడవడి తెలిసింతరువాత, అది రచన యొక్క ప్రధానాంశానికి పచ్చి విరుద్ధంగా ఉన్నప్పుడు, అయ్యో రచన అందించిన ఆదర్శం రచయితకే ఎంత దూరంగా ఉంది అనుకొని, ఆ రచన యొక్క ఆదర్శ స్ఫూర్తితోనే ఆ రచయితను సైతం బేరీజు వేసుకోవడం సహజమూ, సమంజసమే అనుకుంటాను. అంతమాత్రాన రచన గుణాలు తగ్గాయని కాదు. రచన చూపించే వెలుగుతోనే రచయితను కూడా నిగ్గుదేల్చి, స్పష్టంగా చూడడం మాత్రమే.
ఇది కేవలం రచన, రచయితలకే పరిమితం అయిన విషయం కాదని కూడా అనిపిస్తుంది. ఎటుచూస్తే అటు అంతటా ఉన్న విషయమేనేమో!
ఎకరాలకెకరాలు భూకబ్జాలు చేసి, గజాలకొద్ది మాత్రం గుడికో, ఆసుపత్రికో విరాళం ఇవ్వడం, ప్రశంసనీయమా, “విచార”ణీయమా! భారీగా పన్నులు ఎగ్గొట్టి, ప్రభుత్వ నియమాలను నేలరాసి, ప్రకృతి ఉపద్రవాలొచ్చినప్పుడు ప్రధాన మంత్రి relief fund కు కొన్ని పైసలివ్వడం గొప్పనా, దారుణమా! ఇట్లా ఎన్నో!
ఆధునిక తెలుగు సాహితీలోకంలోనే మన ముందున్న ఒక ప్రముఖ ఉదాహరణ. శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి అవధాన ప్రజ్ఞను, పాండితిని ప్రశంసించిన అభిమాన సంఘాలు, సంస్థలే ఆయన వ్యక్తిగత అంశాలను తెలుసుకున్నాక ఆయనలోని కళాకౌశలాన్ని దూరం నుంచి మాత్రమే అందుకోవడానికి ముందుకురావడం చూస్తునే ఉన్నాం. దూరంగా ఉంచింది రచనను, కళను కాదు, రచయితనో, కళాకారున్నో మాత్రమే. ఇది ఏదో నా అభిప్రాయం కాదు, కళ్ళెదుటున్న వాస్తవం.
విధేయుడు
Srinivas
వినాయక చవితి కథ గురించి phani DokkA అభిప్రాయం:
08/28/2008 1:19 pm
ఎర్రమిల్లి ఫణీ,
నేను డొక్కా శ్రీను అన్నమాట. నాకు తెలిసి నా తోటివాళ్ళు ముగ్గురు
ఫణులున్నారు. బాలాంత్రపు ఫణి, ఎర్రమిల్లి ఫణి, కొంచెం చిన్నవాడు చావలి ఫణీను. నాపేరులో ఫణున్నా అందరూ చిన్నప్పుడు శ్రీను అనే పిలిచేవారు. నా ఈమెయిలు ఫణిడొక్కా ఎట్ యాహూ డాట్ కాం. వీలుచూసుకుని మెయిలు పంపించు.
మళ్ళీ వినాయకచవితొచ్చేస్తోంది, మీ సీతాఫలం చెట్టు జాగర్త 🙂
డొక్కా ఫణి.
ఛందోధర్మము గురించి పామర్తి సత్యనారాయణ అభిప్రాయం:
08/28/2008 12:39 pm
నాకు చందమామ పుస్తకాలంటే చాలా ఇష్టం. నేను తెలుగులో ఈ మాత్రం వెలగ బెట్టగలుగుతున్నానంటే వాటి తోడ్పాటు వల్లే నని ఒప్పుకోక తప్పదు.
హనుమంతరావుగారన్న మాటలు చదివాక నాకు ఎవరి టీ షర్టు మీదో చదివిన వాక్యం గుర్తుకొచ్చింది. “Please take my advice. I don’t use it anyway!”
వారు “నమ్మకాలు బ్రతుకుతెరువు” అన్న శీర్షిక కింద రాసిన విషయాలు నమ్మదగినట్టే వున్నాయి. కానీ మనము ఇలా కూడా ఆలోచించవచ్చేమో!
ఒక స్థూలకాయుడో స్థూలకాయురాలో నేను మీ బరువు తగ్గిస్తానని ఆర్భాటంగా ఏదైనా పత్రికలో ప్రకటన ఇచ్చారనుకుందాం. దానికి ప్రజల స్పందన ఎలావుంటుంది?
అలాగే మనము కొన్ని సార్లు టీవీ లో చూస్తూ ఉంటాము. ఏదో ఒక ఇంద్రలుప్తకుడు ఇతరుల కేశసంపదనీ సౌందర్యాన్నీ పెంపొందిస్తానని (సంకోచం ఏమాత్రమూ లేకుండా) అనర్గళంగా వ్యాఖ్యానించి నిష్క్రమిస్తారు. అది ఎలా వుంటుంది?
స్థూలంగా ఉండటమో, బట్టతల కలిగి ఉండటమో అపరాధాలు కావు. నేను కూడా కొద్దిగా స్థూలంగానూ, బట్టతలతోనూ వున్నానని అనుకుంటున్నాను. 🙂
కానీ ఇలాంటి ప్రకటనలకీ వ్యాఖ్యానాలకీ ప్రజలు ఎలా స్పందిస్తారో అదే విధంగానే రచయితల రచనలక్కూడా స్పందిస్తారని ఊహించడం అసమంజసం కాదనుకుంటాను.
ఇకపోతే నమ్మకాలనూ, స్వభావాలానూ సులభంగా కప్పిపుచ్చవచ్చు. తమ తమ ఆశయ ఆకాంక్ష, నమ్మకాలకు వ్యతిరేకంగా రచయితలు తమ రచనలను సాగించవచ్చు. రచయితలందరూ నీతిమంతులుగా ఉండాలన్నది లేదు.
జైళ్ళల్లో కూరుచుని రాసే/రాసేసిన రచయితలు లేరా?
ఎవరి ఇష్టం వారిది. ఎవరి జీవితం వారిది. రచయితలు భ్రష్టులతే అభ్యంతరం చెప్పవలిసిన అవసరం ఉందో లేదో నాకు తెలియదు. లేదనే నేననుకుంటున్నాను. రాయడం సవ్యంగా వస్తే చాలు. చెత్త రచనలకి వెల ఎంతైనా ఎక్కువే, విలువ ఎంతైనా తక్కువే అని వేరే చెప్పవలసిన అవసరం లేదని అనుకుంటున్నాను.
వారేమి రాసినా దాని గతో దుర్గతో నిర్గతో నిర్ణయించడాన్ని పాఠకులే చూసుకుంటారు.
మరి చివరి విషయం. రచయితలలో రెండు రకాలు. తెలివైన వారూ, తెలివితక్కువవారు. అదేలాగా పాఠకులు కూడా రెండు విధాలు. తెలివైన వారూ, తెలివితక్కువవారు.
రచయితలందరూ తెలివైన వారైతే బాధ లేదు. అలాగే పాఠకులందరూ తెలివైన వారైనా బాధ ఏమాత్రమూ లేదు.
పాఠకులు కొందరు మాత్రమే తెలివైన వాళ్ళైతే రచయితలు భ్రష్టులైనా నీతిమంతులైనా ఒక్కటే. అటువంటి పాఠకులు చదివిన ప్రతిదానినీ విచక్షణా దృక్పథంతో చూచి తమకు నచ్చినది మాత్రం ఏరుకుంటారు. మిగిలిన చెత్తని విసర్జిస్తారు.
ఇక పోతే మిగిలినది బుద్ధితక్కువ పాఠకుల విషయం.
పాఠకులు బుద్ధి హీనులైతే బుద్ధిహీనుల రచనలనే సమర్థిస్తారు. అవే వారికి నచ్చుతాయి. వారు చాదస్తపు మొగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు అన్న ధోరణిలో ఉంటారు. వారికి ఏమీ చెప్పకుండా, వారిని ఎక్కడా గిల్లకుండా ఉంటే ఏ బాధా లేదు.
ఇందులో ఇంకో విచిత్రం ఏమిటంటే తెలివితక్కువ వారికి తెలివిగలవాళ్ళు తెలివితక్కువ వాళ్ళుగా కనిపిస్తారు. తెలివిగలవాళ్ళకి తెలివి తక్కువవారు తెలివితక్కువ వారుగానే కనిపిస్తారు.
అంటే ఒక విధంగా అందరూ తెలివితక్కువ వాళ్ళే. ఇంకో విధంగా అందరూ తెలివిగలవాళ్ళే. కాబట్టి అస్సలు బాధే లేదు.
మీరెవరైనా చెప్పే ముందే ఒప్పేసుకుంటాను. నేను తెలివి తక్కువ వాణ్ణేను.
నమస్కారములతో
పామర్తి సత్యనారాయణ
ఛందోధర్మము గురించి mOhana అభిప్రాయం:
08/28/2008 12:13 pm
రచయితల పేరులను తొలగించి వారి “మంచి” రచనలను
మన ముందు ఎవరైనా ఉంచితే, అందులో ఏ రచన
నిజాయితీ ఉన్న రచయిత రాసింది, ఏ రచన నిజాయితీ
లేని రచయిత రాసింది అనే విషయాన్ని చెప్పడం సులభం
కాదనుకొంటాను. రచయిత దుర్బలుడుగా ఉండవచ్చు,
అంత మాత్రాన అతడు (ఆమె) రాసిన రచనలు ఆదర్శవంతముగా
ఎందుకు ఉండరాదు? రచయిత వ్యక్తిగత జీవితానికి
ఆ రచయిత రాసిన రచనకు లంకె పెట్టడం సబబు కాదు.
విధేయుడు – మోహన
ఛందోధర్మము గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
08/28/2008 11:32 am
It is unfair to take a dig at Vemana’s past. He wrote padyams after, not before, overcoming his past. Same thing with Valmiki et.al.
శ్రీశ్రీ భక్తి రచనలు ఉపాధికోసం రాసాను అనడం వాస్తవికతనే కాక అతని నిజాయితీని కూడా చెప్పుతుంది. అయితే ఈ చర్చ కేవలం రచనలు, రచయితలకే పరిమితం చేయడం అన్యాయం!
“తిట్టొద్దు, కొట్టొద్దు, (లేదా మీకిష్టమొచ్చిన తప్పిదాన్ని ఇరికించండి)
అని చెప్పుతూ, నువ్వు అవ్వే చేయొచ్చు, కాని నేను అవి చేస్తే తప్పేంటి నాన్నా” అని అనడం, వినడం తెలియని వారెవ్వరు! మాటకు, చేతకు అదే సంబంధం. చేత మనిషి వ్యక్తిత్త్వం అయితే మాటలు ఆ వ్యక్తి రచనలు కావచ్చు.
తప్పిదాలగురించి కాదు, వొప్పిదాల గురించి అయితే కూడా ఇదే పరిస్థితా అని అడుగొచ్చు.
అందరికి తెలిసిన కథ గుర్తుకొచ్చింది.
గాందీజీ దగ్గరకు ఒక తల్లి బిడ్డను తీసుకొచ్చి వీడికి చక్కెర ఎక్కువ తినొద్దని చెప్పమని వేడుకుందట. తల్లి ఎంత చెప్పినా వినలేదు కాబట్టి గాంధీజీ దగ్గరకు తీసుకొచ్చింది ఆయన చెపితేనన్నా వింటాడేమో అని ఆశతో.
ఏముంది! ఇప్పుడు కాదు, వారం రోజులయింతరువాత తిరిగి రమ్మన్నారట గాంధీజీ. మళ్ళీ వారం తరువాత వెళ్ళితే, గాంధీజీ పిల్లవాడిని ప్రేమతో దగ్గరకు చేర్చుకొని చక్కెర ఎక్కువగా తినకు అని చెప్పాడట. ఈ మాత్రం ముక్క చెప్పడానికి వారం తరువాత ఎందుకు రమ్మన్నారు అని ఆ తల్లి ఆడిగిందట. వారం రోజుల క్రితం వరకు నేను కూడా చక్కెర ఎక్కువగా తినేవాడిని. నేను తగ్గించిన తరువాత ఇప్పుడు చెప్పాను అని వివరించాడట గాంధీజీ. కథ కంచికి.
రచయిత అకారణంగానో, సకారణంగానో, ఒకరి దుకాణంకోసమో,లేక సవాలక్షల కారణాలతో రాయొచ్చు. ఎందుకు రాయకూడదు? అందంగా, అధ్భుతంగా కూడా ఆ రచనలు రావొచ్చు. అవార్డులు కూడా పొందొచ్చు. అయితే నిజాయితీ లోపించే రచనలు ఆ తల్లి చెప్పిన మంచి మాటల్లాగానే మిగిలిపోతాయేమో.
నిజాయితీతో చెప్పిన మాటలు పెద్ద రచయితవి అయినా కాకపోయినా, అవార్డులు రివార్డులేవి వచ్చినా రాకపోయినా, అసలు రాయడం చదవడం కూడా రాని వాడివైనా కూడా గుండెకు తగులుతాయి. మార్పుకు ఊపిరి ఇస్తాయి.
విధేయుడు
-Srinivas
రచయితలకు సూచనలు గురించి Nirmala Kondepudi అభిప్రాయం:
08/28/2008 8:38 am
మీ పత్రిక బావుంది చాలా చాలా….అభినందనలు.
ఛందోధర్మము గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
08/27/2008 11:30 pm
నమ్మకాలు – బ్రతుకుతెరువు
సాయి గారికి,
చండీదాస్ అన్న మాట చాలా సబబయినదే కాదు, ఉదాత్తమైనది కూడా. ముందు తన రచనని చదవమన్నాడు. అది విలువైనదయితే, తను నలుగురూ తెలుసుకోదగ్గ రచయితయితే, తన జీవితం – దాంట్లో అల్పత్వాలున్నా మహత్వాలున్నా – అందరి ముందరా పెడతానన్నాడు.
రేపో మాపో చండీదాస్ స్వీయచరిత్ర వెలువడితే, ఆయనొక యోగిలా బ్రతికాడని తెలిస్తే, అనుక్షణికం విలువ ఓ పిసరు పెరగొచ్చు. భ్రష్టుడనిపిస్తే ఓ పిసరు తగ్గొచ్చు. కాని మౌలికంగా నవల విలువలో మార్పుండదు. ఉంటే మనం సాహిత్యాన్ని వెలకట్టడానికి వాడే తూనికరాళ్ళని తనిఖీ చెయ్యాలి.
శ్రీశ్రీ భక్తి రచనలు జీవనోపాధి కోసం రాశానన్న సమర్థన దబాయింపు గానూ లేదు, సంజాయిషీ గానూ లేదు. కఠోరమైన వాస్తవికతతో కూడి ఉంది. మహాప్రస్థానం తోనో విప్లవ రచనలతోనో వచ్చే డబ్బుతో పొట్ట గడుస్తుందంటారా? గడవకపోతే ఏమాయె, “సతుల్, సుతుల్, హితుల్ పోతే పోనీ, … తిట్లూ, రాట్లూ, పాట్లూ రానీ,” అన్న కళా రవి, ఆ మాత్రం నిజజీవితంలో ఆటుపోట్లకి తట్టుకోలేనివాడు, కవిత్వం, కాకరకాయా రాయడమెందుకు అంటారా?
నాస్తికులు పురాణకథని చెప్తే ప్రశ్నించే హక్కు పాఠకులకుండొచ్చు. కొడవటిగంటి కుటుంబరావుకి నివాళులర్పిస్తూ చలసాని ప్రసాదరావు చందమామ నిర్వాహకులు సమర్పించిన శ్రద్ధాంజలిని ప్రస్తావించారు:
“తన విశ్వాసాలు, నమ్మకాలూ ఎలాంటివైనా చందమామ పాఠకుల కోసం ఆయన విశేషమైన కృషి చేసి, సేకరించి, అందజేసిన ప్రాచీన ఇతిహాసాలూ, పౌరాణిక గాథలూ, ఆ శైలీ మరువరానివి. స్వర్గీయ శ్రీ చక్రపాణి ఆశయాలకు రూపం కల్పించి, తన శైలితో పాఠకలోకాన్నీ, తక్కిన పత్రికలనూ ఆకర్షించిన మేధావి శ్రీ కుటుంబరావు.”
అంటే కుటుంబరావు తన నమ్మకాలతో సంబంధంలేని రచనలకి మెరుగులు దిద్దే పనికి అంకితమయ్యేడనే కదా! ఎందువలన? అని చలసానే కుటుంబరావుని సూటిగా ఆయన బ్రతికుండగనే అడిగారు:
“మీరు – నేనూ ఒకే వృత్తిలో ఉన్నాం. ఎడిటర్ గిరీ అనేది ఒక వృత్తి. బతుకుతెరువు. మనం ఎడిటర్లగా కాక ఏ ఆఫీసర్ గానో, లెక్చరర్ గానో, బ్యాంకు ఉద్యోగిగానో వుంటే, ఆఫీసులో మనం చేసే పని గురించిగానీ, దాని స్వభావం గురించిగానీ ఎవరూ ప్రశ్నించరు, విమర్శించరు. కానీ, ఎడిటర్ అనీగాన అందరూ అతను పనిచేసే పత్రికలోని భావాలన్నింటికీ అతన్నే బాధ్యుడిగా భావిస్తారు, విమర్శిస్తారు. మీరు చందమామ లో వేసే కథల స్వభావం గురించి, వాటిలో రాక్షసులు, భూతాలు, దయ్యాలు, దేవుళ్ళు మున్నగు వాటిలో గల ఔచిత్యాన్ని గురించి చాలా మంది ప్రశ్నిస్తున్నారు…. దీనిని మీరు ఎలా సమర్థిస్తారు?” (రసన, పేజీ 133.)
కుటుంబరావు దీనికి సమాధానం ఇవ్వలేదు కాని, నేనూహించుకోగలను – కుటుంబరావుకీ పోషించాల్సిన కుటుంబమొకటుంది. శ్రీశ్రీ, కుటుంబరావు, ఇంకా అనేకమంది, పొట్టపోషణ కోసం తమ నమ్మకాలతో పూర్తిగా కాకపోయినా కొంతయినా పొసగని పనిలో ఉండి ఉండొచ్చు. వాళ్ళు తమ నమ్మకాలని వదిలెయ్యాలా? లేక వేరే బ్రతుకుతెరువు చూసుకోవాలా? మీరయితే ఏం చేస్తారు?
కొడవళ్ళ హనుమంతరావు
ఛందోధర్మము గురించి ravikiran timmireddy అభిప్రాయం:
08/27/2008 2:17 pm
మంచిది నీతిమంతులారా, మహా ప్రస్థానాన్ని విశాఖ సముద్రంలోకి విసిరెయ్యండి, గుయెర్నికాని కాల్చెయ్యండి. అక్కడతో ఆగకండి, ప్రాచీన కళా కారులు, సాహితీకారులేం మడి కట్టుకోని కూర్చోలేదు వారి చిత్రాల్ని, రచనల్ని సైతం సమిధలు చేసెయ్యండి. ఐతే వొక మనవి ఆ మంట వెలుగులో మీవెనక భాగాలు మాత్రం ఎవరికీ కనపడకుండా కప్పి పెట్టుకోండి, లేకపోతే ఎవరో మిమ్మల్ని కూడా ఆ మంటల్లోకి దోశెయ్యగలరు.
నీతులు చెప్పడం సాహిత్యం కాదు. బ్రతుకుని చిత్రించడం సాహిత్యం. ఆ జీవిత చిత్రణ ఎవరి కలంనుంచొస్తేనెవి. అక్ష్రర రూపం తీసుకున్న ఆ అంతరంగ వుప్పెన కి దానికంటూ వొక అస్థిత్వం ఏర్పడుతుంది. రచయితతో సృష్టికర్తతో సంబంధంలేని వ్యక్తిత్వం ఆ రచనకి అబ్బుతుంది. రేఖా మాత్రంగా రచయిత రచనలో కనిపడొచ్చేవో but by itself it will be an independent entity. Like any of us who inherited a few characteristics from our parents. Still we grow up to be independent human beings and we will not and do not want to be judged by personalities of our parents. రచనలు, రచయితల మధ్య కూడా అదేవిధవైన సంబంధం వుందని నా నమ్మకం.
ఛందోధర్మము గురించి విప్లవ్ అభిప్రాయం:
08/27/2008 1:06 pm
మై డియర్ బాబ్జీలు,
జారుడుబండ మీద కాలేస్తే ఏమవుతుందో తెలిసీ, పెద్దగా పట్టించుకోని రచయితలు మనకు కావాలని ఎవరైనా కోరుకుంటే ‘చదివే సమాజం’ పరిధి పెరగాలి. మనమున్న బావి, కాదు ఇంకుడు గుంత, లోంచి కనీసం తలైనా పైకెత్తి ప్రపంచాన్ని చూద్దాం అని చదివే వాళ్ళకుండాలి. చదివే వాళ్ళకు అర్హత అవసరం అన్నది కొంతవరకూ కరెక్ట్. అది ఎట్లాంటి అర్హత అనేదగ్గరే కొద్ది పేచీలు. వాటిని తీర్చడానికి కొంత అర్హత కలిగిన వాళ్ళే రాయాలి. వాటి మీద మళ్ళీ చదవటానికి, రాయటానికి “క్వాలిఫై” అయిన వాళ్ళే కావాలి.
విషయం తీవ్రబడి, చిక్కబడ్డప్పుడు అర్హత అనేది ముఖ్యమవుతుంది. కొడవళ్ళ కోట్ చేసిన, ఆయన ఫేవరైట్ రచయిత మాటలు ఆ దాంట్లోకే వస్తాయి. అది డిఫెండ్ చేయగలిగే మాట.
విషయానికున్న తీవ్రతను రచయితకన్నా అర్హత కలిగిన పాఠకుడే బాగా గ్రహిస్తాడేమో అని నా అనుమానం.
ఇక మళ్ళీ ఒకసారి ముందునించే మొదలు పెడితే:
సరే, మీరన్న రాయటానికి అర్హత అక్కర్లేదు అన్నది “ఛందస్సు గురించీ, లక్షణ గ్రంధాలు చదవడం గురించీ, నన్నయాది కవుల కావ్యాలని ఔపోసన పట్టడం గురించీ వగైరాల గురించి” అయినా కూడా ఆయా విషయాలకు ఉన్న తీవ్రత ఏ అర్హతా లేని వాళ్ళకు తెలవదు, రాయలేరు. (తెలుస్తుందని, రాయగలరని మీకు అనిపిస్తే, “ప్రూఫులు కావాలి” బాబ్జీలు గారూ అంటాన్నేను :)). “తెలవటం” ఒక అర్హత.
ఇది గుడిపాటి అడిగిన “మన కవులు అక్షరాస్యులేనా!” దగ్గరికే తీసుకు రావచ్చు. లేదా “ఎటొచ్చీ రాసే వాళ్ళ అర్హత తోనే పేచీ” అని రాజా శంకర్ గారన్న దగ్గరే మొదలు పెట్టొచ్చు. “కవికి కావలసిన కనీస అర్హత గురించి కవులే చెప్పాలి” అని నేనూ ఒక పెద్ద సారును తల్చుకుని ఇప్పటి మటుకు వదిలించుకోవచ్చు. ఇవి రాయటానికి నాకేం అర్హత ఉందీ అని నన్నే అడిగితే మాత్రం జవాబు “అది చదివే వాళ్ళు డిసైడ్ చేయాల”ని చెప్పటం తప్ప మరో మాట లేదు.
అర్హత కలిగిని చదివే వాళ్ళు, రాసే వాళ్ళ అర్హతను నిర్ణయిస్తారు అని మరోవిధంగా చెప్పొచ్చేమో, మన ఆంజనేయ స్వామి గుడిమెట్ల మీద — చెప్పుకునే విషయంగా. “రచ్చబండ” అయితే మాత్రం ఇంకా స్పష్ఠంగా చెప్పాల్సి ఉంటుంది.
అసలు నేను రాసింది వెనక్కు తీసుకుందామనుకున్నాను. కానీ కాలు పెట్టింతర్వాత అది తీయటం కష్టం అనిపించి మాట్లాడలేదు. ఒక కాలే కదా అని ఊరుకుంటే ఇప్పుడు రెండోది కూడా పెట్టి చూడమన్నందుకు మీకు ధన్యవాదాలు.
ఇక ముందుకెళ్ళి, మిగతావి కూడా చూద్దాం:
(వీటిని పెద్దగా కాంటెక్స్ట్ లో పెట్టి, అంటే వెనక్కెళ్ళి, భూతద్దం అప్పుతెచ్చుకుని, చూడకండి, దేనికదే అన్నట్టు చదవండి, వీలైతే)
“రాసిన వాక్యం అందరికీ అదే భావాన్నివ్వాలి. యివ్వకపోతే రాసినినోడిది తప్పు.” కాదు, చదివే వాడి అర్హత ఇక్కడ ప్రశ్నార్ధకం.
“నిజాయితీతో సెప్పు. ఆ యెనక నీతితో సెప్పు. అంతెగానీ వొల్లకోకు.” వొల్లకుంతానికి నానేవన్నా పెండ్లి సేసుకున్న సీతాల్నా! అవుసరవైతే అయిదారుగురికి ఒక్క సారే గురెట్టి, ఒకల సిగలొకలకు ముడివెట్టి కొత్త భారతవేదైనా పుట్టి చస్తుందేవో అని సూసే వోడికి ఇదేం లెక్క?
నీతులు చెప్పటానికే కాని వినటానికి బాగుండవు అని ఎవరో పెద్దతలకాయ అనగా విన్నాను. నిజాయితీ అనే అర్హత మాత్రం ఏది రాయాలన్నా కావాలి.
వేమన గురించి “అంత సెండాలం మనిషి అలాటి కబుర్లాడితే మన్లాటోళ్ళం వొప్పుతావేటి?” అని అడిగినందుకు: కాలాన్ని, ప్రాంతాన్ని బట్టి ‘నీతి’ మారుతుంది. ‘నిజాయితీ’ మారదు. ఇవాల్టి నీతి రేపుండక పోవచ్చు. నేను రాసిన ఒక బేవార్స్ ఎక్సాంపుల్ ‘నిజాయితీ’ గురించి, నీతి గురించి కాదు. మన దగ్గర (ఇప్పటికీ) పది పదమూడు ఏండ్ల పిల్లలను పెండ్లీలు చేసుకునే వాళ్ళున్నరు, వాళ్ళంతా ఛైల్డ్ మాలెస్టర్సే మరో ప్రాంతపు నీతిని బట్టి చూస్తే. అట్లాంటి క్వాలిఫికేషన్స్ కాకుండా, నిజాయితీ గురించి మాత్రమే నేను రాసింది.
నిజాయితీ మరో అర్హత రాయటానికి.
సెలవ్.
విప్లవ్
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి నాగమురళి అభిప్రాయం:
08/27/2008 12:04 pm
రవీంద్ర బాబు గారూ,
ఈ వ్యాసం రెండో భాగం కామెంట్లలో విష్ణుభొట్ల లక్ష్మన్న గారితో నేను చేసిన చర్చ చూడండి. అలాగే నాలుగో భాగం (సెప్టెంబరు 1 న వెలువడుతుంది)లో కూడా దీనిమీద కొంత చర్చ ఉంటుంది.
నమస్కారాలతో,
నాగమురళి.