నా ఉద్దేశ్యం లో మంచి కవిత కి ఉండవలసిన లక్షణాలలో ఒకటి పాఠకుడి అనుభవం లోకి రావటం .ఈ అనుభవం లోకి రావటం పాతజ్ఞాపకాలని/పాత అనుభూతులని గుర్తు తేవటం ద్వారా కావచ్చు ,లేదా ఓ కొత్త అనుభూతిని కలుగజేయటం ద్వారా కావచ్చు. పాతజ్ఞాపకాలు ఒకప్పటి కొత్త అనుభూతులే కదా!
కవిత్వం లో అస్పష్టతని గూర్చి
“అది ట్రాన్స్పరెంట్ చీకటై ఉండాలి
దాని అనుభూతి ఆకారం పాఠకుడికి అందాలి,హత్తుకోవాలి”
అని తిలక్ చెప్పింది ఇప్పటికీ నిజమేనేమో అనిపిస్తుంది.
తను సృష్టించిన Common Man గురించి చెబుతూ RK Laxman ఇలా అన్నాడు: “I would say he symbolises the mute millions of India, or perhaps the whole world, a silent spectator of marching time.”
ఆర్. కె. లక్ష్మణ్ గారి కామన్ మాన్ లాంటివాడే వేలూరి గారి సాధారణ పాఠకుడు. పాకశాస్త్రంలో ప్రత్యేక తర్ఫీదు, ప్రావీణ్యత లేకపోయినా ఒక సామాన్య మానవుడు ఎలాగైతే నవవిధ పాకాలని ఆస్వాదించగలుగుతున్నాడో, అలాగే ఏ కవిత్వ తత్త్వ విచారము, సాహితీ సిద్ధాంతాల పరిచయం లేకపోయినా వేలూరి గారి సాధారణ పాఠకుడు — పాత జ్ఞాపకాలే సాధనంగా — కవితాస్వాదన చెయ్యగలడు.
అంటే, ఈ వ్యాసంలో వేలూరి గారిది ద్విపాత్రాభినయనం :-): సిసిఫస్ రాయిలా ఏ సిద్ధాంతాన్ని మోయకుండా, మంచి భోజనాన్ని ఆస్వాదించినట్టే మంచి కవిత్వాన్ని ఆస్వాదించే సాధారణ పాఠకుడు ఒక పాత్ర అయితే, ఆ సాధారణ పాఠకుడు సాహిత్య సేవనం చేస్తునప్పుడు కలిగే అనుభవాన్ని సిద్ధాంతీకరించే సాహితీ సిద్ధాంతకర్తగా, Walter Benjamin, రాజశేఖరుడు, ఆనందవర్థనుడు, వగైరాలను చదివిన వేలూరిగారిది ఇంకో పాత్ర.
కవితలో ఆఖరి చరణం మరొక కొత్త జ్ఞాపకాన్నీ నెమరుకి తెస్తుంది. అది మంచి కవితకి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి.
వేలూరి గారు బహుశా “కొత్త జ్ఞాపకాన్నీ సృష్టించడం ఒక మంచి కవితకి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి” అని రాయాలనుకున్నారని నా అభిప్రాయం.
“2008 లో ఇస్మాయిల్ గారి మాటలగురించి ఆలోచించడడం సబబు కాదని నా నమ్మకం.”
ఎందుకంటా? వందేళ్ళ కిందటి కన్యాశుల్కం గురించి ఆలోచించడంలో లేని “సబబు”, కాసిని పుంజీల యేళ్ళ కిందటి ఇస్మాయిల్ మాటల గురించి ఆలోచిస్తే వచ్చిందా? కాల మాన పరిస్థితులని ఆధారంగా చేసుకుని, విషయాలను ఒక సంబంధంలో చూస్తూ, ఆలోచించడం ఎప్పుడూ సబబే
హనుమంతరావు గారికి
2008 లో ఇస్మాయిల్ గారి మాటలగురించి ఆలోచించడడం సబబు కాదని నా నమ్మకం. ఆధునిక కవిత్వం అని ఆయన అన్నది శ్రీశ్రీ కవిత్వం తరవాత రాసిన వాళ్ళ గురించనే అనుకుంటున్నాను నేను. లేదా కుందుర్తి వారి తరవాత రాసిన వాళ్ళ గురించా? “మో” గారు ఆధునికుడే కాబోలు ఇస్మాయిల్ గారి వ్యాఖ్యతో చూస్తే.
ముందు “మో” గారి కవిత్వం గురించి: నాలాటి “సాధారణ పాఠకులు” చదివీసి ఏవనకుండా వూరుకుంటారు. ఎందుకంటే చదివిన వెంటనే ఏవీఁ అనిపించదు, అర్ధవూఁ అవదు. చేకూరి రామారావు గారు “చేరాతలు” లో “చితి-చింత” గురించి “…తొందరపడకుండా చదివితే కవితానుభవం ఇవ్వగల కవితలున్నాయి అందులో.” అని రాసేరు. Concluding paragraphs లో “అతని (మో) కి చెప్పాల్సిందేమిటంటే తిక్కగా రాస్తేనే కవిత్వం కాదు. కవిత్వం అంటూ వుంటే తిక్కను క్షమిస్తామని.”
ఇక “ఆధునిక” కవిత్వం: ఇప్పుడొస్తున్న కవిత్వాన్ని “ఆధునిక” కవిత్వం అనడం భావ్యం కాదని నా అభిప్రాయం. “గురుజాడ” దగ్గరనుంచీ, హైకూలవరకూ; హైకూల తరవాత ప్రస్తుత కవుల వరకూ, వీళ్ళందరూ “ఆధునికు” ల్లోకొస్తారా? ఎవరు ఆధునికులు? ఇది మీ లాటివారు తేల్చాలి. అందుచేత కవిత్వం అనడం న్యాయం. నిర్వచనాలు out of context లో అనిర్వచనాలయిపోతాయి.
ఇక “అస్పష్టత”: ప్రస్తుతం కవిత్వంలో “కతలు” చెప్పడం మానీసేరు కవులు. అనుభవాల్ని మాత్రమే చెబ్తున్నారు. ఒక కవిగారు అడవుల్లో ప్రయాణం చేస్తూ “ఆకులో ఆకునై….” అంటూ రాసేరు. “యదుకులభూషణ్” గారు థాయ్ లాండ్” వెళ్ళొచ్చి కవిత రాసేరు. ఆయా కవిత్వాల్ని అనుభవించిన పాఠకులు “వహ్వా” అన్నారు. అనుభూతించని పాఠకులు “….చెప్పుచ్చుకు కొట్టండి” అన్నారు. Transmitting station తప్పా? Receiving station తప్పా? “చేరా” గారు “తొందర పడకుండా చదివితే…” అని రాసింది ఇలాటి వాటికేనేమో? నా మట్టుకి నాకు, కవిత్వం చదవగానే, “ప్రతిపదార్థం” రాయడానికి ముందు, చదువరికి ఏదోవొక అనుభూతి కలగాలి. ఆ తరవాతే అందులోని “ఛమక్కులు”, “పన్నులూ”, “పదప్రయోగాలూ” వగైరాలు.
ఈ మాట లో వ్యాసానికి అభిప్రాయం రాయాలి తప్ప సంబంధంలేని విషయాల గురించి రాయకూడదేమో? మళ్ళీ “మో”. ఏమో!
ఎప్పటిలాగానే హనుమగారు శ్రమతో, ఓపికతో మనకు అందించే quotes నుండి, చదివిన ఇస్మాయిల్ గారి quote –
“మనః ప్రపంచంలోనూ, బహిః ప్రపంచం లోనూ ఏక కాలం లో కవి చేసే ఎక్స్ ప్లొరేషనే కవిత్వం”
ఇటువంటివి చదివినప్పుడు ఆశ్చర్యం, ఆవేదన, కొంత అనుమానం కూడా కలుగుతుంది. అలా అన్నారా అని ఆశ్చర్యం. అయ్యో అలా అన్నారా అని ఆవేదన. నిజంగా అలా అన్నారా అని అనుమానం.
మనః ప్రపంచంలోనూ, బహిః ప్రపంచం లోనూ ఏక కాలం లో exploration చేయని మనిషి ఎవరో, చేయని క్షణమేదో అంతుపట్టదు. ఇది చదవడం సైతం ఇందులో ఏముందో అనే exploration వల్లనే కదా సాధ్యం.. అసలు మాటలు రాని పసిపిల్లాడు సైతం అందుకోవాలనే ఆటవస్తువుకోసం వెతుకులాట, దానికి ప్రేరణ లేక పరిణామంగా మనస్సులో అనుభవించే ఉత్సాహం నిరుత్సాహం వగైరా భావాలెన్నో ఏకకాలంలో జరిగే exploration ఫలితమే కదా!
వారన్న చివర నాలుగు పదాలతో “కవి చేసే exploration కవిత్వం” అంటే సరిపోదా అని కూడా అనుమానం. Scientist చేసే exploration science. Painter చేసే exploration painting. Investor చేసే exploration investing etc, అన్నట్లు.
— ————————–
విధేయుడు
Srinivas
వేలూరి సాధారణ పాఠకుడి గానే రాశారని వదిలేద్దాం. అదంత గొడవపడాల్సిన విషయం కాదని నా ఉద్దేశం. నే వెలిబుచ్చిన అభిప్రాయంలో కొటేషన్లెక్కువ. వాటినన్నిటినీ అవతల పెట్టండి – ఒక్క ఇస్మాయిల్ ది తప్ప.
మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇస్మాయిల్ మాటలు ఆలోచించదగ్గవి. అవి ఆధునిక కవిత్వ స్వరూప స్వభావాల గురించీ, అది సామాన్య పాఠకులకర్థం కాకపోవడం గురించీ కదా. అవి వేలూరి గారన్న దానికి కొంత భిన్నంగా ఉండటాన వాటిని చర్చలోకి దింపాలని నా కోరిక.
మీరు ఎంచుకున్న కవిత్వం లోనే పస లేనప్పుడు, దాన్ని మీరు ఎంత రసంలేదని నిరూపించినా అది వృధా ప్రయాస కాదా? మీకు తెలుగులో మంచి కవిత్వమే కనిపించలేదంటే అది మీరెంచుకున్న కవుల లోపం ఏమో? ఒకసారి ఆలోచించారా?
మీరు మంచి కవిత్వాన్ని పట్టుకోలేని ఒక సాధారణ పాఠకుడు గానే మీ కవితల ఎంపికలో కనిపించారు. మీ కవిత్వపు ఆసక్తి అంతిమంగా అలాంటిదైతే అందుకు కవులేంచేస్తారండీ? మంచి కవిత్వం దేవుడిని చూడగల్గటంలాంటిది. కాస్త రసహృదయం చూపించండి. అక్షరం మీకు దర్శనమిస్తుంది.
రమ.
హెచ్చార్కె గారూ!
చాలా మంచి కవిత రాశారు.
_పొలాల్లో విత్తనాల కన్నా ముందు
రైతులు కలల్ని నాటుతారు_
ఎంత చక్కటి వ్యక్తీకరణ!
చాలా రోజుల తర్వాత ఒక మంచి కవిత చదివాను.
_తవ్వా ఓబుల్ రెడ్డి
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:
11/26/2008 2:42 pm
నా ఉద్దేశ్యం లో మంచి కవిత కి ఉండవలసిన లక్షణాలలో ఒకటి పాఠకుడి అనుభవం లోకి రావటం .ఈ అనుభవం లోకి రావటం పాతజ్ఞాపకాలని/పాత అనుభూతులని గుర్తు తేవటం ద్వారా కావచ్చు ,లేదా ఓ కొత్త అనుభూతిని కలుగజేయటం ద్వారా కావచ్చు. పాతజ్ఞాపకాలు ఒకప్పటి కొత్త అనుభూతులే కదా!
కవిత్వం లో అస్పష్టతని గూర్చి
అని తిలక్ చెప్పింది ఇప్పటికీ నిజమేనేమో అనిపిస్తుంది.
My humblest two cents.
కుతంత్రం గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:
11/26/2008 1:41 pm
Very well written story with pleasant and beautiful narration.
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
11/26/2008 1:02 pm
తను సృష్టించిన Common Man గురించి చెబుతూ RK Laxman ఇలా అన్నాడు: “I would say he symbolises the mute millions of India, or perhaps the whole world, a silent spectator of marching time.”
ఆర్. కె. లక్ష్మణ్ గారి కామన్ మాన్ లాంటివాడే వేలూరి గారి సాధారణ పాఠకుడు. పాకశాస్త్రంలో ప్రత్యేక తర్ఫీదు, ప్రావీణ్యత లేకపోయినా ఒక సామాన్య మానవుడు ఎలాగైతే నవవిధ పాకాలని ఆస్వాదించగలుగుతున్నాడో, అలాగే ఏ కవిత్వ తత్త్వ విచారము, సాహితీ సిద్ధాంతాల పరిచయం లేకపోయినా వేలూరి గారి సాధారణ పాఠకుడు — పాత జ్ఞాపకాలే సాధనంగా — కవితాస్వాదన చెయ్యగలడు.
అంటే, ఈ వ్యాసంలో వేలూరి గారిది ద్విపాత్రాభినయనం :-): సిసిఫస్ రాయిలా ఏ సిద్ధాంతాన్ని మోయకుండా, మంచి భోజనాన్ని ఆస్వాదించినట్టే మంచి కవిత్వాన్ని ఆస్వాదించే సాధారణ పాఠకుడు ఒక పాత్ర అయితే, ఆ సాధారణ పాఠకుడు సాహిత్య సేవనం చేస్తునప్పుడు కలిగే అనుభవాన్ని సిద్ధాంతీకరించే సాహితీ సిద్ధాంతకర్తగా, Walter Benjamin, రాజశేఖరుడు, ఆనందవర్థనుడు, వగైరాలను చదివిన వేలూరిగారిది ఇంకో పాత్ర.
వేలూరి గారు బహుశా “కొత్త జ్ఞాపకాన్నీ సృష్టించడం ఒక మంచి కవితకి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి” అని రాయాలనుకున్నారని నా అభిప్రాయం.
పాఠకుడిగా,
సురేశ్.
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి పాఠకుడు అభిప్రాయం:
11/26/2008 10:35 am
ఎందుకంటా? వందేళ్ళ కిందటి కన్యాశుల్కం గురించి ఆలోచించడంలో లేని “సబబు”, కాసిని పుంజీల యేళ్ళ కిందటి ఇస్మాయిల్ మాటల గురించి ఆలోచిస్తే వచ్చిందా? కాల మాన పరిస్థితులని ఆధారంగా చేసుకుని, విషయాలను ఒక సంబంధంలో చూస్తూ, ఆలోచించడం ఎప్పుడూ సబబే
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి baabjeelu అభిప్రాయం:
11/26/2008 7:52 am
హనుమంతరావు గారికి
2008 లో ఇస్మాయిల్ గారి మాటలగురించి ఆలోచించడడం సబబు కాదని నా నమ్మకం. ఆధునిక కవిత్వం అని ఆయన అన్నది శ్రీశ్రీ కవిత్వం తరవాత రాసిన వాళ్ళ గురించనే అనుకుంటున్నాను నేను. లేదా కుందుర్తి వారి తరవాత రాసిన వాళ్ళ గురించా? “మో” గారు ఆధునికుడే కాబోలు ఇస్మాయిల్ గారి వ్యాఖ్యతో చూస్తే.
ముందు “మో” గారి కవిత్వం గురించి: నాలాటి “సాధారణ పాఠకులు” చదివీసి ఏవనకుండా వూరుకుంటారు. ఎందుకంటే చదివిన వెంటనే ఏవీఁ అనిపించదు, అర్ధవూఁ అవదు. చేకూరి రామారావు గారు “చేరాతలు” లో “చితి-చింత” గురించి “…తొందరపడకుండా చదివితే కవితానుభవం ఇవ్వగల కవితలున్నాయి అందులో.” అని రాసేరు. Concluding paragraphs లో “అతని (మో) కి చెప్పాల్సిందేమిటంటే తిక్కగా రాస్తేనే కవిత్వం కాదు. కవిత్వం అంటూ వుంటే తిక్కను క్షమిస్తామని.”
ఇక “ఆధునిక” కవిత్వం: ఇప్పుడొస్తున్న కవిత్వాన్ని “ఆధునిక” కవిత్వం అనడం భావ్యం కాదని నా అభిప్రాయం. “గురుజాడ” దగ్గరనుంచీ, హైకూలవరకూ; హైకూల తరవాత ప్రస్తుత కవుల వరకూ, వీళ్ళందరూ “ఆధునికు” ల్లోకొస్తారా? ఎవరు ఆధునికులు? ఇది మీ లాటివారు తేల్చాలి. అందుచేత కవిత్వం అనడం న్యాయం. నిర్వచనాలు out of context లో అనిర్వచనాలయిపోతాయి.
కవిత్వాన్ని ఖచ్చితంగా నిర్ణయించడం “అనంతాన్ని” నిర్ణయించడం లాటిది. గుడ్డివాళ్ళు ఏనుగుని తెలుసుకోడం లాటిది, తెలుసుకుని “సాధారణ” పాఠకులికి విపులీకరించి విశ్లేషించడం లాటిది.
ఇక “అస్పష్టత”: ప్రస్తుతం కవిత్వంలో “కతలు” చెప్పడం మానీసేరు కవులు. అనుభవాల్ని మాత్రమే చెబ్తున్నారు. ఒక కవిగారు అడవుల్లో ప్రయాణం చేస్తూ “ఆకులో ఆకునై….” అంటూ రాసేరు. “యదుకులభూషణ్” గారు థాయ్ లాండ్” వెళ్ళొచ్చి కవిత రాసేరు. ఆయా కవిత్వాల్ని అనుభవించిన పాఠకులు “వహ్వా” అన్నారు. అనుభూతించని పాఠకులు “….చెప్పుచ్చుకు కొట్టండి” అన్నారు. Transmitting station తప్పా? Receiving station తప్పా? “చేరా” గారు “తొందర పడకుండా చదివితే…” అని రాసింది ఇలాటి వాటికేనేమో? నా మట్టుకి నాకు, కవిత్వం చదవగానే, “ప్రతిపదార్థం” రాయడానికి ముందు, చదువరికి ఏదోవొక అనుభూతి కలగాలి. ఆ తరవాతే అందులోని “ఛమక్కులు”, “పన్నులూ”, “పదప్రయోగాలూ” వగైరాలు.
ఈ మాట లో వ్యాసానికి అభిప్రాయం రాయాలి తప్ప సంబంధంలేని విషయాల గురించి రాయకూడదేమో? మళ్ళీ “మో”. ఏమో!
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
11/25/2008 9:30 pm
ఎప్పటిలాగానే హనుమగారు శ్రమతో, ఓపికతో మనకు అందించే quotes నుండి, చదివిన ఇస్మాయిల్ గారి quote –
“మనః ప్రపంచంలోనూ, బహిః ప్రపంచం లోనూ ఏక కాలం లో కవి చేసే ఎక్స్ ప్లొరేషనే కవిత్వం”
ఇటువంటివి చదివినప్పుడు ఆశ్చర్యం, ఆవేదన, కొంత అనుమానం కూడా కలుగుతుంది. అలా అన్నారా అని ఆశ్చర్యం. అయ్యో అలా అన్నారా అని ఆవేదన. నిజంగా అలా అన్నారా అని అనుమానం.
మనః ప్రపంచంలోనూ, బహిః ప్రపంచం లోనూ ఏక కాలం లో exploration చేయని మనిషి ఎవరో, చేయని క్షణమేదో అంతుపట్టదు. ఇది చదవడం సైతం ఇందులో ఏముందో అనే exploration వల్లనే కదా సాధ్యం.. అసలు మాటలు రాని పసిపిల్లాడు సైతం అందుకోవాలనే ఆటవస్తువుకోసం వెతుకులాట, దానికి ప్రేరణ లేక పరిణామంగా మనస్సులో అనుభవించే ఉత్సాహం నిరుత్సాహం వగైరా భావాలెన్నో ఏకకాలంలో జరిగే exploration ఫలితమే కదా!
వారన్న చివర నాలుగు పదాలతో “కవి చేసే exploration కవిత్వం” అంటే సరిపోదా అని కూడా అనుమానం. Scientist చేసే exploration science. Painter చేసే exploration painting. Investor చేసే exploration investing etc, అన్నట్లు.
— ————————–
విధేయుడు
Srinivas
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
11/25/2008 8:22 pm
బాభ్జీలు గారికి,
వేలూరి సాధారణ పాఠకుడి గానే రాశారని వదిలేద్దాం. అదంత గొడవపడాల్సిన విషయం కాదని నా ఉద్దేశం. నే వెలిబుచ్చిన అభిప్రాయంలో కొటేషన్లెక్కువ. వాటినన్నిటినీ అవతల పెట్టండి – ఒక్క ఇస్మాయిల్ ది తప్ప.
మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇస్మాయిల్ మాటలు ఆలోచించదగ్గవి. అవి ఆధునిక కవిత్వ స్వరూప స్వభావాల గురించీ, అది సామాన్య పాఠకులకర్థం కాకపోవడం గురించీ కదా. అవి వేలూరి గారన్న దానికి కొంత భిన్నంగా ఉండటాన వాటిని చర్చలోకి దింపాలని నా కోరిక.
కొడవళ్ళ హనుమంతరావు
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి rama అభిప్రాయం:
11/25/2008 10:42 am
ఏమండీ వేలూరి గారూ!
మీరు ఎంచుకున్న కవిత్వం లోనే పస లేనప్పుడు, దాన్ని మీరు ఎంత రసంలేదని నిరూపించినా అది వృధా ప్రయాస కాదా? మీకు తెలుగులో మంచి కవిత్వమే కనిపించలేదంటే అది మీరెంచుకున్న కవుల లోపం ఏమో? ఒకసారి ఆలోచించారా?
మీరు మంచి కవిత్వాన్ని పట్టుకోలేని ఒక సాధారణ పాఠకుడు గానే మీ కవితల ఎంపికలో కనిపించారు. మీ కవిత్వపు ఆసక్తి అంతిమంగా అలాంటిదైతే అందుకు కవులేంచేస్తారండీ? మంచి కవిత్వం దేవుడిని చూడగల్గటంలాంటిది. కాస్త రసహృదయం చూపించండి. అక్షరం మీకు దర్శనమిస్తుంది.
రమ.
తరువాతేమిటి? గురించి tavva obul reddy అభిప్రాయం:
11/25/2008 9:33 am
హెచ్చార్కె గారూ!
చాలా మంచి కవిత రాశారు.
_పొలాల్లో విత్తనాల కన్నా ముందు
రైతులు కలల్ని నాటుతారు_
ఎంత చక్కటి వ్యక్తీకరణ!
చాలా రోజుల తర్వాత ఒక మంచి కవిత చదివాను.
_తవ్వా ఓబుల్ రెడ్డి
మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి tavva obul reddy అభిప్రాయం:
11/25/2008 9:13 am
మా కడప జిల్లా లో ఇలాంటి పల్లె ఒకటి గుర్తొచ్చింది, ఈ కవిత చదివాక!
చాలా బాగుంది. అభినందనలు!
_ తవ్వా ఓబుల్ రెడ్డి