ముందుగా ఇలాటి పుస్తకాన్ని ప్రచురించిన తానా ప్రచురణల విభాగం వారికి, దానికి భూరి విరాళాన్ని అందించిన హనుమంతరావుగారికి జోహార్లు.
ప్రాచీన సాహిత్యం నిరాదరణకు గురికావడానికి ఒక కారణం దానికి వ్యతిరేకంగా జరిగిన ప్రచారం అనడంలో సందేహం లేదు. అయితే, ప్రాచీన సాహిత్యం మీద అభిమానం, అందులో మంచి పాండిత్యం ఉన్నవాళ్ళు దాన్ని వైజ్ఞానికంగా పరిశోధించకపోవడం కూడా అంతే కారణమని నా అభిప్రాయం. సాంప్రదాయిక సాహిత్యం మీద చర్వితచర్వణమైన పరిశోధక గ్రంథాలు కాకుండా వైజ్ఞానిక విశ్లేషణతో కూడిన పరిశోధక గ్రంథాలు ఎంతవరకూ వచ్చాయి. మన పండితులలో ఎంతమంది పరిశోధకులున్నారు? అటువంటి పరిశోధన జరగనప్పుడు ఆ గ్రంథాల విలువ ఈ కాలంవాళ్ళకి ఎలా తెలుస్తుంది? పండితులు పరిశోధకులు కారు, పరిశోధకులకి తగిన పాండిత్యం లేదు అనే స్థితి ఏర్పడింది.
ఏదైనా గతంగతః కనీసం ఇప్పుడైనా ఉన్న కొద్దిమందినీ వినియోగించుకొని, పండితులు పరిశోధకులు కలిసి ప్రాచీన సాహిత్యంపై వేల్చేరువారు సూచించినట్టు మరింత శాస్త్రీయ అధ్యయనం జరిపితే బావుంటుంది.
ఆధునికత గురజాడతో మొదలవలేదు, వెంకటాధ్వరి గారి లాటి వారితోనో ఇంకా ముందుగానో మొదలయ్యుండొచ్చు లాటి వాదన నిజవేఁ కావొచ్చు. కాకనూ పోవచ్చు. ఆధునికత ఎక్కడ మొదలైతేనేం? ఆధునికం అంటే ఇప్పటికీ వుండాలి. బహుశా అన్నమయ్యని “నొక్కీసినట్టు” వెంకటాధ్వరి గారినీ “నొక్కీసుంటారు” అప్పటి తరం వాళ్ళధ్వనిజం నిలకడ మీద తెలిసిపోతుంది కదూ?
ఈ పుస్తకంలో పరమ రమణీయకరవైఁన కవిత్వం వుందన్నారు. దాని గురించి ఎక్కువ రాయలేదు మీరీ వ్యాసంలో. పోన్లెండి ఎలాగోలాగ చదివి చూస్తాం.”రీడబిలిటీ” వున్న వాళ్ళందర్నీ సామాన్య పాఠకులు నెత్తిన పెట్టుకున్నారు. వుదాహరణకి యం.వీ.నాథ్, మ.వెం.కృష్ణమూర్తి, “షాడో” మధుబాబు వగైరాలు. ఈ పుస్తకం కూడా అలాటిదే అయితే, ఇన్నాళ్ళకి దొరికింది కాబట్టి తప్పకుండా నెత్తిన పెట్టుకుంటాం.
ఇహ భాష విషయం: జనజీవనంలో వుపయోగపడని భాషని ఆ జనులు వదిలేస్తారు. దీనికి అమెరికాలూ, యూరోపులూ వెళ్ళక్కర్లేదు. ఖర్గ్ పూరూ, కలకత్తా, తమిళ్నాడూ, బొంబాయీ వగైరాలు వెళ్తే తెలుస్తుంది. అందులో వాడి, వేడి ఆధునికత్వంతో నిండిపోయిన కవిత్వం రాసినా ఎవరూ పట్టించుకోరు. అంతేకాని సమర్ధులయిన కవులు లేరని ఏ భాషా ఆత్మహత్య చేసుకోదు.
కొడవళ్ళ వారికి: పుస్తక ప్రచురణకి భూరి విరాళం ఇవ్వడం “జయ హో” అని “డేంచు” కట్టవలసిన విషయం. అయితే ఏ మంచికి హాని చేస్తున్నావోఁ, ఏ చెడుకి మంచి చేస్తున్నావోఁ తెలుసుకుంటే హాయి హాయి గా సాగుతుంది ఆమని.
“మేరా జోతా హై జపానీ, యె పత్లోన్ ఇంగ్లిస్తాని, సర్ పైన్ లాల్ టోపి రూసి, ఫిర్ భీ దిల్ హైన్ హిందుస్తానీ” ..పాట అప్రస్తుతం అనుకోకండి! అందులో ఉన్న “టోపి” పదం నాచన సోమన పద్యంలో కూడా ఉందటే, “టోపి” అనే పదం తెలుగులో ఎప్పుడు అడుగుపెట్టిందో అని అనుమానం, ఆశ్చర్యం.
కావ్యం చదివి, అర్థం చేసుకోవడమే కష్టం. అంతచేసినా ఇట్లాంటి విశ్లేషణ చేయడం ఇంకా కష్టం. కృతజ్ఞతాభినందనలతో
విధేయుడు
– Srinivas
కనీసం ఇప్పటికైనా కొన్ని కొత్త సంగతులు — తప్పక ఆలోచించాల్సినవి, చర్చచేయాల్సినవీ –ఈ రివ్యూ వలన ముందుకి రావడం ముదావహం! అయితే ఇటువంటి స్థితి ఇప్పటికిప్పుడే రాలేదే? ఆధునికతకీ, సాహిత్యానికీ మధ్య అనివార్యంగా ఒక లంకె పెట్టిన మొదటి తరం నారాయణరావు గారి కాలానిదే కద? శ్రిశ్రీ కవిత్వం మీద విప్లవాత్మకంగా మొదలైన ఈ మోజు పెరిగి పెరిగి చివరికి పాత సాహిత్యం మీదా, సంస్కృత భాష మీదా కూడా వైముఖ్యంగా మారలేదా?
వాల్మీకి రామాయణాన్ని తెనుగు చేసిన విశ్వనాధని ఎంతగా వెక్కిరించడానికి వీలుందో, అంతగానూ వెక్కిరించిన ఆధునికులూ, విప్లవ వర్గాలూ ఈ విషయంలో చాలా ప్రముఖమైన పాత్ర నే పోషించాయి. మల్లంపల్లి శరభయ్య గారి లాంటి మహా పండితులని ఏం గౌరవించిందీ తెనుగు సమాజం? ఆయన వ్యాఖ్యానాలు ఇప్పటి తరాలకి అర్ధమయ్యే తెనుగులోనే ఉన్నాయే? అంతటి పండితుడూ, ఆఖరి దశలో ఎంత ఇబ్బంది పడ్డారూ? ఎం దక్కిందీ ఆయన కృషికి తెనుగుల నించీ?
నాకు శ్రీశ్రీ ప్రతిభ మీద గౌరవం ఉంది. కానీ ఆయనకి పాత సాహిత్యం విలువ తెలిసికూడా తనని అనుసరించే యువతరానికి దానిమీద వెగటు కల్గించాడు. నారాయణ రావు గారు ఆనాటి యువతరమే! ఆయన ఇవాళ మేలుకోవడం సంతోషమే! కానీ చాలా ఆలస్యం గా మేల్కోన్నారు. ఈ మాటలు ఆయన నలుగురితోనూ పంచుకునే కాలానికి ఆ పాత పండితులు లేరు; కొత్త పండితులు తయారు కాగల వీలులేదు. మరి ఆయన ఈ సందేశం ఎవరినుద్దేశ్యించి ఇస్తున్నారా అని ఆశ్చర్యంగా ఉంది. “గతజల సేతు బంధనం”!
బాగుందండీ.
నిద్ర మేలుకోటానికి సస్పెన్స్ నవల నేను చాలాసార్లు ప్రయత్నించా. పది నిమిషాల కంటే ఎక్కువ చదవకుండానే నిద్ర వచ్చేది అదీ ఆ నవల తాలూకు కలలతో 🙂
– యువ
కవితంతా నిండిన తడి పాఠకుడి కళ్ళలోనూ చేరుతుంది కవిత పూర్తవగానే.. “ఈ ముసలి ఏరెంత ఒంటరిది” అన్న ప్రయోగం ఎంత నచ్చిందో చెప్పలేను. నిజంగా వంశధార ఒడ్డుకి వెళ్ళొచ్చినట్టుంది. తప్పక రాస్తూ ఉండండి.
రచనకు వన్నె తెచ్చేది విమర్శకుడని విన్నాను. మన భాగ్యమేమోగానీ, తెలుగులో విమర్శ ఎక్కువగా దూషణ భూషణాలకే పరిమితమైపోయింది. కథను ఆస్వాదించడంలో పాఠకుడి పాత్ర ఎంతో ఉన్నా ఆ పాత్ర నిర్వహణకు తర్ఫీదునిచ్చే వ్యాసాలు నాకున్న పరిమిత అనుభవంలో చాలా తక్కువ చూశాను. చాలా సంవత్సరాల క్రితం నాదగ్గర పనిచేసిన ఒక స్టూడెంటు music appreciation class తీసుకుంటున్నాను అంటే తేలిగ్గా గ్రేడు సంపాదించడానికనుకున్నాను, అప్పట్లో. “నా కళ్ళతో చూడ”మన్నట్టు పాఠకులకు మంచి సులోచనాలందించిన మాధవ్ కు ధన్యవాదాలు.
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి Kameswara Rao అభిప్రాయం:
03/02/2009 10:36 am
ముందుగా ఇలాటి పుస్తకాన్ని ప్రచురించిన తానా ప్రచురణల విభాగం వారికి, దానికి భూరి విరాళాన్ని అందించిన హనుమంతరావుగారికి జోహార్లు.
ప్రాచీన సాహిత్యం నిరాదరణకు గురికావడానికి ఒక కారణం దానికి వ్యతిరేకంగా జరిగిన ప్రచారం అనడంలో సందేహం లేదు. అయితే, ప్రాచీన సాహిత్యం మీద అభిమానం, అందులో మంచి పాండిత్యం ఉన్నవాళ్ళు దాన్ని వైజ్ఞానికంగా పరిశోధించకపోవడం కూడా అంతే కారణమని నా అభిప్రాయం. సాంప్రదాయిక సాహిత్యం మీద చర్వితచర్వణమైన పరిశోధక గ్రంథాలు కాకుండా వైజ్ఞానిక విశ్లేషణతో కూడిన పరిశోధక గ్రంథాలు ఎంతవరకూ వచ్చాయి. మన పండితులలో ఎంతమంది పరిశోధకులున్నారు? అటువంటి పరిశోధన జరగనప్పుడు ఆ గ్రంథాల విలువ ఈ కాలంవాళ్ళకి ఎలా తెలుస్తుంది? పండితులు పరిశోధకులు కారు, పరిశోధకులకి తగిన పాండిత్యం లేదు అనే స్థితి ఏర్పడింది.
ఏదైనా గతంగతః కనీసం ఇప్పుడైనా ఉన్న కొద్దిమందినీ వినియోగించుకొని, పండితులు పరిశోధకులు కలిసి ప్రాచీన సాహిత్యంపై వేల్చేరువారు సూచించినట్టు మరింత శాస్త్రీయ అధ్యయనం జరిపితే బావుంటుంది.
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి baabjeelu అభిప్రాయం:
03/02/2009 9:31 am
వెల్చేరు నారాయణ రావు గారికి నమస్కారములు.
ఆధునికత గురజాడతో మొదలవలేదు, వెంకటాధ్వరి గారి లాటి వారితోనో ఇంకా ముందుగానో మొదలయ్యుండొచ్చు లాటి వాదన నిజవేఁ కావొచ్చు. కాకనూ పోవచ్చు. ఆధునికత ఎక్కడ మొదలైతేనేం? ఆధునికం అంటే ఇప్పటికీ వుండాలి. బహుశా అన్నమయ్యని “నొక్కీసినట్టు” వెంకటాధ్వరి గారినీ “నొక్కీసుంటారు” అప్పటి తరం వాళ్ళధ్వనిజం నిలకడ మీద తెలిసిపోతుంది కదూ?
ఈ పుస్తకంలో పరమ రమణీయకరవైఁన కవిత్వం వుందన్నారు. దాని గురించి ఎక్కువ రాయలేదు మీరీ వ్యాసంలో. పోన్లెండి ఎలాగోలాగ చదివి చూస్తాం.”రీడబిలిటీ” వున్న వాళ్ళందర్నీ సామాన్య పాఠకులు నెత్తిన పెట్టుకున్నారు. వుదాహరణకి యం.వీ.నాథ్, మ.వెం.కృష్ణమూర్తి, “షాడో” మధుబాబు వగైరాలు. ఈ పుస్తకం కూడా అలాటిదే అయితే, ఇన్నాళ్ళకి దొరికింది కాబట్టి తప్పకుండా నెత్తిన పెట్టుకుంటాం.
ఇహ భాష విషయం: జనజీవనంలో వుపయోగపడని భాషని ఆ జనులు వదిలేస్తారు. దీనికి అమెరికాలూ, యూరోపులూ వెళ్ళక్కర్లేదు. ఖర్గ్ పూరూ, కలకత్తా, తమిళ్నాడూ, బొంబాయీ వగైరాలు వెళ్తే తెలుస్తుంది. అందులో వాడి, వేడి ఆధునికత్వంతో నిండిపోయిన కవిత్వం రాసినా ఎవరూ పట్టించుకోరు. అంతేకాని సమర్ధులయిన కవులు లేరని ఏ భాషా ఆత్మహత్య చేసుకోదు.
కొడవళ్ళ వారికి: పుస్తక ప్రచురణకి భూరి విరాళం ఇవ్వడం “జయ హో” అని “డేంచు” కట్టవలసిన విషయం. అయితే ఏ మంచికి హాని చేస్తున్నావోఁ, ఏ చెడుకి మంచి చేస్తున్నావోఁ తెలుసుకుంటే హాయి హాయి గా సాగుతుంది ఆమని.
నాచన సోమన చతుర వచో విలాసం గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
03/02/2009 9:21 am
చక్కని వ్యాసం, ఎప్పటిలాగానే.
“మేరా జోతా హై జపానీ, యె పత్లోన్ ఇంగ్లిస్తాని, సర్ పైన్ లాల్ టోపి రూసి, ఫిర్ భీ దిల్ హైన్ హిందుస్తానీ” ..పాట అప్రస్తుతం అనుకోకండి! అందులో ఉన్న “టోపి” పదం నాచన సోమన పద్యంలో కూడా ఉందటే, “టోపి” అనే పదం తెలుగులో ఎప్పుడు అడుగుపెట్టిందో అని అనుమానం, ఆశ్చర్యం.
కావ్యం చదివి, అర్థం చేసుకోవడమే కష్టం. అంతచేసినా ఇట్లాంటి విశ్లేషణ చేయడం ఇంకా కష్టం. కృతజ్ఞతాభినందనలతో
విధేయుడు
– Srinivas
ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I గురించి vrdarla అభిప్రాయం:
03/02/2009 9:14 am
వ్యాసం బాగుంది. పరిశోధన దృష్టి ఉంది.
ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I గురించి baabjeelu అభిప్రాయం:
03/02/2009 8:47 am
జయహో! సురేష్ కొలిచాల గారూ.
వచ్చే సంచికలో వచ్చే “గ్యాఁపకాల” కోసం ఎదురు చూస్తూ….
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి rama bharadwaj అభిప్రాయం:
03/02/2009 4:16 am
కనీసం ఇప్పటికైనా కొన్ని కొత్త సంగతులు — తప్పక ఆలోచించాల్సినవి, చర్చచేయాల్సినవీ –ఈ రివ్యూ వలన ముందుకి రావడం ముదావహం! అయితే ఇటువంటి స్థితి ఇప్పటికిప్పుడే రాలేదే? ఆధునికతకీ, సాహిత్యానికీ మధ్య అనివార్యంగా ఒక లంకె పెట్టిన మొదటి తరం నారాయణరావు గారి కాలానిదే కద? శ్రిశ్రీ కవిత్వం మీద విప్లవాత్మకంగా మొదలైన ఈ మోజు పెరిగి పెరిగి చివరికి పాత సాహిత్యం మీదా, సంస్కృత భాష మీదా కూడా వైముఖ్యంగా మారలేదా?
వాల్మీకి రామాయణాన్ని తెనుగు చేసిన విశ్వనాధని ఎంతగా వెక్కిరించడానికి వీలుందో, అంతగానూ వెక్కిరించిన ఆధునికులూ, విప్లవ వర్గాలూ ఈ విషయంలో చాలా ప్రముఖమైన పాత్ర నే పోషించాయి. మల్లంపల్లి శరభయ్య గారి లాంటి మహా పండితులని ఏం గౌరవించిందీ తెనుగు సమాజం? ఆయన వ్యాఖ్యానాలు ఇప్పటి తరాలకి అర్ధమయ్యే తెనుగులోనే ఉన్నాయే? అంతటి పండితుడూ, ఆఖరి దశలో ఎంత ఇబ్బంది పడ్డారూ? ఎం దక్కిందీ ఆయన కృషికి తెనుగుల నించీ?
నాకు శ్రీశ్రీ ప్రతిభ మీద గౌరవం ఉంది. కానీ ఆయనకి పాత సాహిత్యం విలువ తెలిసికూడా తనని అనుసరించే యువతరానికి దానిమీద వెగటు కల్గించాడు. నారాయణ రావు గారు ఆనాటి యువతరమే! ఆయన ఇవాళ మేలుకోవడం సంతోషమే! కానీ చాలా ఆలస్యం గా మేల్కోన్నారు. ఈ మాటలు ఆయన నలుగురితోనూ పంచుకునే కాలానికి ఆ పాత పండితులు లేరు; కొత్త పండితులు తయారు కాగల వీలులేదు. మరి ఆయన ఈ సందేశం ఎవరినుద్దేశ్యించి ఇస్తున్నారా అని ఆశ్చర్యంగా ఉంది. “గతజల సేతు బంధనం”!
రమ.
బోడి పద్యం గురించి rama bharadwaj అభిప్రాయం:
03/02/2009 3:13 am
మీ అశ్లీలమైన పద్యం మీ బలవంతపు బాధ లాగే..బోడి గా ఉంది.
రమ.
శ్రీ ఆంజనేయ రక్షా కవచం గురించి యువ అభిప్రాయం:
03/01/2009 11:03 am
బాగుందండీ.
నిద్ర మేలుకోటానికి సస్పెన్స్ నవల నేను చాలాసార్లు ప్రయత్నించా. పది నిమిషాల కంటే ఎక్కువ చదవకుండానే నిద్ర వచ్చేది అదీ ఆ నవల తాలూకు కలలతో 🙂
– యువ
భ్రంశధార గురించి Subrahmanyam Mula అభిప్రాయం:
03/01/2009 9:00 am
మౌని చేవ్రాలు
మున్నీటి పాలు.
కవితంతా నిండిన తడి పాఠకుడి కళ్ళలోనూ చేరుతుంది కవిత పూర్తవగానే.. “ఈ ముసలి ఏరెంత ఒంటరిది” అన్న ప్రయోగం ఎంత నచ్చిందో చెప్పలేను. నిజంగా వంశధార ఒడ్డుకి వెళ్ళొచ్చినట్టుంది. తప్పక రాస్తూ ఉండండి.
అతడు, నేను, అతడి కథ గురించి Maddipati Krishna Rao అభిప్రాయం:
03/01/2009 8:46 am
రచనకు వన్నె తెచ్చేది విమర్శకుడని విన్నాను. మన భాగ్యమేమోగానీ, తెలుగులో విమర్శ ఎక్కువగా దూషణ భూషణాలకే పరిమితమైపోయింది. కథను ఆస్వాదించడంలో పాఠకుడి పాత్ర ఎంతో ఉన్నా ఆ పాత్ర నిర్వహణకు తర్ఫీదునిచ్చే వ్యాసాలు నాకున్న పరిమిత అనుభవంలో చాలా తక్కువ చూశాను. చాలా సంవత్సరాల క్రితం నాదగ్గర పనిచేసిన ఒక స్టూడెంటు music appreciation class తీసుకుంటున్నాను అంటే తేలిగ్గా గ్రేడు సంపాదించడానికనుకున్నాను, అప్పట్లో. “నా కళ్ళతో చూడ”మన్నట్టు పాఠకులకు మంచి సులోచనాలందించిన మాధవ్ కు ధన్యవాదాలు.
కృష్ణారావు