యుగంధర్ గారూ, సూర్య గారూ,
వాగుడు కాయల్నీ, moral police ల గురించీ అభిప్రాయాలు రాసే బదులు పై పెట్టె లో నున్న కవితాత్మను ఆవిష్కరింపచేయొచ్చు కదా? గరికపాటి వారు బాధపడ్డది ఇలాటి అభిప్రాయాలపై అభిప్రాయాలకే అనుకుంటాను. ఇయన్నీ వొగ్గేసి పైనున్న బోడి పద్యం మీద ఏటైనా సెప్పండి. అప్పుడు వాగుడుకాయలూ, “మోరల్” రక్షకభటులూ సిగ్గుపడిపోయి, తప్పైపోనాదని లెంపలేసుకుని బుద్దిగుంటారు.
ఇప్పటివరకు, ఏ విశ్వబడుల పరిశోధక వ్యాసాల్లో కథల వర్గీకరణ మీద ఎవరూ ప్రచురించకపొయ్యుంటే మీ వ్యాసం ఖచ్చితంగా ఆ దిశలో ఒక ముందడుగే. అందుకు మిమ్మల్ని అభినందించాల్సిన అవసరం వుంది. ఈ వర్గీకరణ ఎంత ప్రాధమిక స్థాయిలో వున్నా, ఆ దిశలో అదొక ముందడుగే నని నా అభిప్రాయం.
“మన కథలన్నీ ఎదో ఒక విషయం (వస్తువు, కథాంశం) గురించే ఉంటాయి.” మన కథ కానీ, ఇంకేదైనా కథ కానీండీ, కథే ఎందుకు, ఏరకవైన కళ కానీయండి, ఏదో ఒక అంశం గురించే కదా ఉంటాయి. అవి భౌతికం కానీయండి, మానసికం కానీయ్యండి, సిద్దాంతాలు కానియ్యండి. జీవితానుభవం, సంఘటన వస్తువుకి భిన్నవైనవా? భిన్నవైనవే అయితే ఏవిధంగా భిన్నవైనవో కూడా మీరు తెలిపితే బాగుండేది. ఆ తెలుపడానికి ముందు, మీరు ప్రస్తావించిన వస్తువు లేదా కథాంశాన్ని నిర్వచించి వుంటే బావుండేదేవో. మీరు చెప్పిన అనుభూతి, కథాంశం, లేదా వస్తువు కాదా? ఆ ఫలాని బావ, ఆయన మరిదితో తిరిగిన చెట్లూ, పుట్తలు, చూసిన పూలు, బండలు అవన్నీ కథలో ఏవి చేస్తున్నట్టు. కథా వస్తువో, కథాంశాలో ఏవైనా అవి పాఠకుడిలో నిద్రపోతున్న ఎప్పటి గుర్తుల్నో, లేకపోతే పాఠకుడిలో ముడుక్కుపోయున్న ఎప్పటి కలల్నో తట్టి లేపడానికే కదా ఆ కథ. ఇక్కడ వస్తువు లేకపోవడవెక్కడ. కళ్ళకు కనిపించి, స్పర్శకు తెలిసే వస్తువయితేనేం, మనసుకు వినిపించి, గుండెకు తెలిసే వస్తువయితేనేం. వస్తువులో చిన్న, పెద్ద బేధాలు చూడాలా?
ఎప్పుడో అప్పుడు, ప్రతి ఇల్లు ఒక కథల ఖార్ఖానా అయ్యుంటుంది. ప్రతి అమ్మ, అక్కడక్కడా కొందరు నానలు కూడా లెక్కలేనన్ని కథలు కల్పించుంటారు. ఇంకెన్నో పాత కథల్ని చిత్రికపట్టి కొత్త కథలుగా మార్చుంటారు. వీటిలో రెక్కల గుర్రాలు, మాట్లాడే జంతువులు, పోట్లాడే కపాలాలు, మాంత్రికులు, రాకుమారులు, చూడ చక్కని రాకుమార్తెలు వుంటారు. ఈ కథల్లో వస్తువు లేదా? ప్రపంచం తెలియని పిలకాయలకి, అసలలేని కలల ప్రపంచం ఈ కథల వస్తువు కాదా? కలలు, ఊహలు, కథాంశాలు కావని, వాటి చుట్టు అల్లిన కథల్లో కథా వస్తువు లేదని మీ వర్గీకరణ బట్టి అర్థంచేసుకోవలసి వుంటుంది.
కలలైనా, ఊహలైనా, జీవితానుభవాలైనా, మీరు చెప్పిన సంఘటనలైనా, సిద్దాంతాలైనా, ఇంకా వాటి రాద్దాంతాలైనా, అన్నీ బతుకులో ఒక భాగవే సీతారామయ్య గారు. అసలు వస్తువు లేని కథంటూ వుండదు. ఆ వస్తువు కల కావొచ్చు, శిల కావొచ్చు, మనసుకి మాత్రవే తెలిసే అనుభూతుల అల కావొచ్చు. ఆ వస్తువు, సిద్దాంత రాద్దాంతం కావొచ్చు, సామాజిక స్పృహ కావొచ్చు, సందేశం కావొచ్చు, స్వంత వ్యాఖ్యానం కావొచ్చు అన్నీ బతుకులో ఒక భాగవే కదా.
కథ అనేక కోణాలనుండి బతుకుని ప్రతిఫలిస్తుంది. కథ బాగుండడానికి ,బాగలేకపోడానికి, కథా వస్తువు చుట్టూ అల్లడవా, అల్లకపోవడవా కారణం కాదు, కథ చెప్పడంలో పాఠకుడిని ఆకట్టుకుందా లేదా అనేదే ముఖ్యం. అదికూడా, పాఠకులందరూ ఒకటి కాదు. రకరాకాల మనుషులు, రకరకాల పాఠకులు. ఏ కథా కూడా అందర్నీ స్పర్శించలేదు. ఏ కథా కూడా భౌగోలికవైన, సామాజికవైన, మానసికవైన, కాలానుగుణవైన పరిధులకిలోబడి మాత్రవే మంచి కథ అనిపించుకుంటుంది.
మీరు ఉదాహరణలుగా ఇచ్చిన కథల్లో లోపాలు, ఆ కథ చెప్పడంలో లోపాలే గాని, కథలో వస్తువు వల్ల వచ్చిన లోపాలు కాదు. సూటిగా చెప్పదలచుకున్నప్పుడు వ్యాసాలు రాసుకోవచ్చు కదా అన్నారు, వ్యాసాలు రాసుకోవచ్చు, కానీ కథలు కూడా సూటిగా చెప్పడానికి ఉపయోగించే మాద్యమాల్లో ఒకటని నా మనవి. చక్కగా అరటిపండొలచి చేతులో పెట్టినట్టు సూటిగా సిదాంతాన్ని వివరించే కథలు చాలానే వున్నాయి (పిపీలకం). ఎటూ చెప్తాం కదా అని కథని సరిగ్గా అల్లకపోవడం, కథకు చెప్పదలుచుకున్న విషయానికి సంబంధంలేకపోవటం, స్వయం వ్యాఖానంతో పాఠకుడ్ని బోరు కొట్టించడం ఇవన్నీ కథకునిలోపాలే గాని, దానికి, కథాంశానికి, కథకుడు చెప్పదలుచుకున్న సందేశానికి సంబంధం వుందని నేననుకోను.
కథ నచ్చకపోవడానికి కథకుని లోపవే కాదు, పాఠకుల పరిధులు కూడా (సామాజికవైన, సిద్దాంతపరవైన, కాలాణుగుణవైన) ఒక అంశవే. చిన్నప్పుడు అమ్మ చెప్పిన కథలు, అప్పుడు అడిగి అడిగి మరీ చెప్పించుకున్న కథలు ఈరొజు ఈ వయసులో మనసుకి అంత పట్టకపోవచ్చు. దాచుకుని, దాచుకుని చదివిన డిటెక్టివ్ నవలలు ఇప్పుడు చెత్త బోరుకొట్టొచ్చు, ఆవురావురు మంటూ ఎదురు చూసిన ప్రేమ కథలు ఇప్పుడు తమాషాగా అనిపించొచ్చు. కొందరు మహానుభావులకి కన్యాశుల్కం అనవసరపు రాద్దాంతంలా కనిపించొచ్చు. గోవులొస్తున్నాయి జాగ్రత్త సిద్దాంత రగడలా స్పురించొచ్చు. వీటిల్లో కలలు, కల్పనలు, సంఘ సంస్కరణలు, సిద్దాంతాలు అన్నీ వున్నయి వాటితోపాటు చదివించే గుణం ఈ వీటన్నికీ వుంది. కాబట్టి కథ చెప్పడానికి వస్తువు అడ్దం కాదు. ఏ వస్తువైనా చేవ వున్న కథకుడు మంచి కథగా అల్లగలడు. అంతే కాదు, కవితల్ని స్పురింపజేసే కథలు, కథల్ని చెప్పే కవితలు, రెంటినీ గుర్తుతెచ్చే కరపత్రాలు వీటి సంగతేవిటి?
బాబ్జీ,
ఇదేవిటి, విరసం వల్ల కథలు వ్యాసాలైపోవటవేవిటి. విరసం ముందు అరసం, దాని ముందు సంఘ సంస్కరణ, స్వాతంత్ర పోరాటం, దాని ముందు మరింకేదో మార్పు, ఆ మార్పు కోసం ప్రయత్నించే వాళ్ళు వుండడవనేది సహజం కదా. విరసం మాత్రమే కథనెందుకు నాశనం చేసింది, లేకపోతే మూసలోకెందుకు నెట్టింది. ఐనా నువ్వుదాహరించిన రావీ శాస్త్రి, కోకు, కారా విరసంతో సరసం చేసిన వాళ్ళే కదా! రచయితల నిజాయితో నీకేం పని, వాళ్ళు వ్రాసిన కథలతో పని కాని. దీనికి వ్యతిరేకంగా ఈ నడవ నువ్వే ఒక అభిప్రాయం వ్రాసినట్టు గుర్తు.
కళ, కళకోసవే అనే వాదాన్ని తమ్మినేని గారు మరొక అడుగు ముందుకి తీసుకెళ్ళేరు, కళలో కల తప్ప నిజం (బుద్ది) వుందకూదదంటున్నారు. కథ బుద్దిని తాకకూడదంటారు. ఐతే మీరు చెప్పింది మాత్రం బాగుంది, సరి ఐన వాతావరణం లేని కథ, నిజవే పాఠకుడ్ని తాకదు. బుద్దిని తాకే కథల్లో ఆ వాతావరణం ఉంటే అవి మంచి కథలే కదా తమ్మినేని గారు.
కోడవళ్ళ గారు, మీ అభిప్రాయాల్లో, పెద్ద, పెద్ద పేర్లినిపిస్తాయి, చాలా కోట్స్ కనిపిస్తాయి, కానీ మీరు మాత్రం మీ మాటల్లో కనిపించరు ఎప్పుడో తప్ప. పుస్తకాల్లేకపోతే హాయిగా వుండగలవా? తెలీదు, కానీ పుస్తకాల్లేందెప్పుడు? కాగితం లేనప్పుడు, తాటేకులో, మరో చెట్టు బెరళ్ళో, లోహాలో, అవీ కానప్పుడు, నోటిమాటగా తరాన్నుంచి తరానికి సాగే కథలు, పాటలు అవన్నీ ఏవిటి? మనిషి మాటల్తోబాటు కథ కూడా పుట్టుందడంటారా. అది ఏరూపంలో భద్ర పరిస్తేనేవి.
గడ్దగట్టిన సముద్రాలెక్కడవి, ప్రవహించే నదులు తప్ప, అప్పుడప్పుడూ ఆ నదులెండి పోవచ్చు, గడ్డకట్టి పోవచ్చు. కానీ కొద్ది కాలవే. మార్పు మనిషికి సహజ గుణం కదా. కథ, కవిత ఇవేవి గొడ్డళ్ళు కావేవో, మహా అయితే మట్టి బెడ్డలాగా కాసేపు నదిలో చిన్న అలల్ని రేపుతాయేవో. కాఫ్కానే చెప్పుండొచ్చు గానీ గడ్డకట్టిన సముద్రవే అయితే మెటామార్ఫొసిస్లో ఆ గుమస్తా అంత హింస పడివుండడు కదా?
వెల్చేరు వారు పరిచయం చేసిన గ్రంథానికి పండితుల వ్యాఖ్యలు కావాలా? మధ్యలో ఈ పండితులెవరు? వీళ్ళ అర్హతలేవిటి? వెల్చేరు వారికన్నా వీరుధ్ధరించినదేమిటి? మంచి గతమున కొంచెమే. ఆ కొద్ది మంచితనాన్ని మంచిగా చెప్పేవారెవరు? “పన్”డితులు అంటే అట్నించిటూ ఇట్నించటూ కూడా చెప్పగలిగినవాళ్ళా?
వరంగల్లు
సాహితీ బంధువులకు నమస్సుమాంజలి.
మీరు వెలువరిస్తున్న ఈ మాట చూస్తుంటేనే కనువిందుగా ఉంది. మీ సైటుకు పుస్తకాలు ఎలా పంపాలి.. తెలుగు సాహిత్య లోకానికి అవసరమైన మరింత సమాచారాన్ని పొందుపరిస్తే బాగుంటుందని నా ఆలోచన.. ఇంత మంది సాహితీ మిత్రులు కలిసి చేసే సమిష్టి యాగంలో మీకు పూర్ణ ఫలం అందాలని నా ఆకాంక్ష..
ధన్యవాదాలతో,
రంగనాథ్ మిద్దెల
ఎన్ టీవి
ఇది “మోహన” గారి అభిప్రాయం పై అభిప్రాయం. రాయొచ్చో, రాయకూడదో తెలియదు. వేస్తారో, వేయరో తెలియదు. అయినా సరే త్యాగరాజు రాసిన ఉత్సవ సంప్రదాయ కీర్తన గురించే, త్యాగరాజు సంగీతం, సాహిత్యం గురించే.
బాలమురళీ పాడిన వరస “మోహన” గారు చెప్పిన పధ్ధతికి సరిపోతుంది.
శతమఖాహిత విభంగ, శ్రీ రామ
శమనరిపు సన్నుతాంగ
శ్రితమానవాంతరంగ, జనకజ
శృంగార జలజభృంగ
అయితే ఈ వరస, నా చిన్నప్పట్నించీ వింటున్నదే
కస్తూరి రంగ రంగ, మాయన్న
కావేటి రంగ రంగ…
త్యాగరాజు “కాపీ” కొట్టేరా? బాలమురళీ “కాపీ” కొట్టేడా? లేదా “కస్తూరి…” వాళ్ళు త్యాగరాజుని “కాపీ” కొట్టేరా?
సరైన వ్యాఖ్య రాయడానికే జుత్తు పీక్కో వలసి వస్తోందే! ఇంతంత పెద్ద వ్యాసాలు, అదీ అసందర్భపు వాక్యాలు మచ్చుకైనా కనబడని విధంగా ఎలా రాయగలుగుతున్నారు సార్. టోపీ రహిత ప్రణామాలు. ఈ మాటకి ధన్యవాదాలు. మీరన్నట్టు ఇంటర్నెట్టుది వర్ణనకందని మహాత్యం. జావా మొహం తెలీని కుర్రాళ్ళని మా కంపెనీ రిక్రూట్ చేసుకుని వాళ్ళ చేతులో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ పెట్టి ఆర్నెల్లయినా కాకుండానే వాళ్ళంతా “జావగార” దొడగారంటే ఆ కీర్తి “అంతరవల” దే ననడంలో సందేహం లేదు.
సాహిత్యం – విజ్ఞానం రెందూ నాకత్యంత అభిమాన రంగాలు. దురదృష్ట వశాత్తు రెండిట్లో నాకు అభిరుచే తప్ప అభినివేశం ప్రజ్ఞ చాల స్వల్పం. ఇలాంటి వైజ్ఞానిక వ్యాసాలు చదివి నా అల్ప మేధస్సు ఆకళింపు చేసుకోగలిగినంత చేసుకుని ఆనందిస్తూంటాను. మీ వ్యాసం చాలా బాగుంది బోధ్యంగా వుంది. తరువాతి వ్యాసానికై ఎదురు చూస్తూంటాను.
పండిత వ్యాఖ్యానాలు పక్కన లేకుండా ప్రాచీన సాహిత్యం పూర్తిగా అర్థం చేసుకోవదం, గురుముఖతః గాక ఔత్సాహికంగా సంస్కృతాంధ్రాలని స్వయం కృషితో అభ్యసించిన మా బోటి వారికి సాధ్యం కాదు. సాహిత్య ఎకాడమీ వారు ప్రచురించిన వసుచరిత్ర, మనుచరిత్రాదులను పఠించినా అవి ఏవీ 20్ సంవత్సరాల క్రింద శరదాగమ వ్యాఖ్యా సహితంగా చదివిన చంద్రికా పరిణయం అంత సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. రామరాజభూషణుడితో సమానమైన లేదా అంతకు మించిన విద్వత్కవితా పాటవాలు కలిగిన సురభి మాధవరాయని ప్రజ్ఞ నాకా వ్యాఖ్య లేకుందా అవగతమయ్యేది కాదు. అందుకే నేను పండిత వ్యాఖ్యాసహిత కావ్యాలను స్వాగతిస్తాను, ఎదురుచూస్తాను ఆదరిస్తాను. ఇంతకీ మీరు పరిచయం చేసిన పుస్తకం ఎక్కడ ఎంతకు లభ్యమౌతుందో వివరించలేదు.
నియమాలూ, సూత్రలూ తెలీవు కానీ, సంగీతంలో చరణాలకి ద్వితీయాక్షర ప్రాస వాడడం అనేది అనాదిగా వుంది. దీనికి ఆద్యులెవరో చెప్పలేం. ఒకటీ రెండు సందర్భాల్లో తప్ప, నూటికి తొంభైతొమ్మిది శాతం, అన్నమయ్య, క్షేత్రయ్య రచనల్లో ఇది స్పష్టంగా ఉంది. పురందర దాసు కీర్తనల్లోనూ కనిపిస్తుంది. త్యాగరాజూ ఇదే పద్దతనుసరించాడు. వీరి కొన్ని రచనల్లో అంత్య ప్రాసుంది. శ్రావ్యత కోసం శబ్ద ప్రాస పాటించారనే అనుకుంటున్నాను.
తాళ ఆవృతాన్ని బట్టే చరణంలో పాదాలు నిర్ధారించారని నా నమ్మకం. నాకు తెలుసున్నంత వరకూ ఇదే ఒరవడి అందరూ పాటిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు సంగీతజ్ఞుల్ని సంప్రదిస్తే ఇలాగే చెప్పారు.
యుగంధర్ గారూ – “ఒక తాళ ఆవృత్తం ఒక పాదమనే సూత్రం కూడా ఏమీ లేదు” అన్నది ఏ ఆధారంతో చెప్పారు? కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? ప్రాస నియమం పాటించేది చరణాలకే. పల్లవి, అనుపల్లవులకి కాదు.
కేవలం ఛందస్సు కోసం నాలుగు చరణాలని రెండుగా భావించడమన్న ప్రతిపాదన అన్ని కృతులకీ, కీర్తనలకీ అన్వయించబడితే అదొక సిధ్ధాంతమవుతుంది. ఇలాంటి పరిశోధనలు మోహన రావు గారి వల్లే సాధ్యం.
చివరగా – త్యాగరాజు రాసిన కొన్ని పద్యాలలో ఛందస్సు భంగమయ్యిందన్న విషయం పండితులు నిర్ధారించారు. నౌకాచరిత్రం, ప్రహ్లాద విజయం సంగీత రూపకాల్లో వాడిన పద్యాల్లో ఇది చక్కగా కనిపిస్తుంది.
బోడి పద్యం గురించి baabjeelu అభిప్రాయం:
03/19/2009 10:20 am
యుగంధర్ గారూ, సూర్య గారూ,
వాగుడు కాయల్నీ, moral police ల గురించీ అభిప్రాయాలు రాసే బదులు పై పెట్టె లో నున్న కవితాత్మను ఆవిష్కరింపచేయొచ్చు కదా? గరికపాటి వారు బాధపడ్డది ఇలాటి అభిప్రాయాలపై అభిప్రాయాలకే అనుకుంటాను. ఇయన్నీ వొగ్గేసి పైనున్న బోడి పద్యం మీద ఏటైనా సెప్పండి. అప్పుడు వాగుడుకాయలూ, “మోరల్” రక్షకభటులూ సిగ్గుపడిపోయి, తప్పైపోనాదని లెంపలేసుకుని బుద్దిగుంటారు.
కథ దేని గురించి? గురించి ravikiran timmireddy అభిప్రాయం:
03/19/2009 9:55 am
సీతారామయ్య గారు,
ఇప్పటివరకు, ఏ విశ్వబడుల పరిశోధక వ్యాసాల్లో కథల వర్గీకరణ మీద ఎవరూ ప్రచురించకపొయ్యుంటే మీ వ్యాసం ఖచ్చితంగా ఆ దిశలో ఒక ముందడుగే. అందుకు మిమ్మల్ని అభినందించాల్సిన అవసరం వుంది. ఈ వర్గీకరణ ఎంత ప్రాధమిక స్థాయిలో వున్నా, ఆ దిశలో అదొక ముందడుగే నని నా అభిప్రాయం.
“మన కథలన్నీ ఎదో ఒక విషయం (వస్తువు, కథాంశం) గురించే ఉంటాయి.” మన కథ కానీ, ఇంకేదైనా కథ కానీండీ, కథే ఎందుకు, ఏరకవైన కళ కానీయండి, ఏదో ఒక అంశం గురించే కదా ఉంటాయి. అవి భౌతికం కానీయండి, మానసికం కానీయ్యండి, సిద్దాంతాలు కానియ్యండి. జీవితానుభవం, సంఘటన వస్తువుకి భిన్నవైనవా? భిన్నవైనవే అయితే ఏవిధంగా భిన్నవైనవో కూడా మీరు తెలిపితే బాగుండేది. ఆ తెలుపడానికి ముందు, మీరు ప్రస్తావించిన వస్తువు లేదా కథాంశాన్ని నిర్వచించి వుంటే బావుండేదేవో. మీరు చెప్పిన అనుభూతి, కథాంశం, లేదా వస్తువు కాదా? ఆ ఫలాని బావ, ఆయన మరిదితో తిరిగిన చెట్లూ, పుట్తలు, చూసిన పూలు, బండలు అవన్నీ కథలో ఏవి చేస్తున్నట్టు. కథా వస్తువో, కథాంశాలో ఏవైనా అవి పాఠకుడిలో నిద్రపోతున్న ఎప్పటి గుర్తుల్నో, లేకపోతే పాఠకుడిలో ముడుక్కుపోయున్న ఎప్పటి కలల్నో తట్టి లేపడానికే కదా ఆ కథ. ఇక్కడ వస్తువు లేకపోవడవెక్కడ. కళ్ళకు కనిపించి, స్పర్శకు తెలిసే వస్తువయితేనేం, మనసుకు వినిపించి, గుండెకు తెలిసే వస్తువయితేనేం. వస్తువులో చిన్న, పెద్ద బేధాలు చూడాలా?
ఎప్పుడో అప్పుడు, ప్రతి ఇల్లు ఒక కథల ఖార్ఖానా అయ్యుంటుంది. ప్రతి అమ్మ, అక్కడక్కడా కొందరు నానలు కూడా లెక్కలేనన్ని కథలు కల్పించుంటారు. ఇంకెన్నో పాత కథల్ని చిత్రికపట్టి కొత్త కథలుగా మార్చుంటారు. వీటిలో రెక్కల గుర్రాలు, మాట్లాడే జంతువులు, పోట్లాడే కపాలాలు, మాంత్రికులు, రాకుమారులు, చూడ చక్కని రాకుమార్తెలు వుంటారు. ఈ కథల్లో వస్తువు లేదా? ప్రపంచం తెలియని పిలకాయలకి, అసలలేని కలల ప్రపంచం ఈ కథల వస్తువు కాదా? కలలు, ఊహలు, కథాంశాలు కావని, వాటి చుట్టు అల్లిన కథల్లో కథా వస్తువు లేదని మీ వర్గీకరణ బట్టి అర్థంచేసుకోవలసి వుంటుంది.
కలలైనా, ఊహలైనా, జీవితానుభవాలైనా, మీరు చెప్పిన సంఘటనలైనా, సిద్దాంతాలైనా, ఇంకా వాటి రాద్దాంతాలైనా, అన్నీ బతుకులో ఒక భాగవే సీతారామయ్య గారు. అసలు వస్తువు లేని కథంటూ వుండదు. ఆ వస్తువు కల కావొచ్చు, శిల కావొచ్చు, మనసుకి మాత్రవే తెలిసే అనుభూతుల అల కావొచ్చు. ఆ వస్తువు, సిద్దాంత రాద్దాంతం కావొచ్చు, సామాజిక స్పృహ కావొచ్చు, సందేశం కావొచ్చు, స్వంత వ్యాఖ్యానం కావొచ్చు అన్నీ బతుకులో ఒక భాగవే కదా.
కథ అనేక కోణాలనుండి బతుకుని ప్రతిఫలిస్తుంది. కథ బాగుండడానికి ,బాగలేకపోడానికి, కథా వస్తువు చుట్టూ అల్లడవా, అల్లకపోవడవా కారణం కాదు, కథ చెప్పడంలో పాఠకుడిని ఆకట్టుకుందా లేదా అనేదే ముఖ్యం. అదికూడా, పాఠకులందరూ ఒకటి కాదు. రకరాకాల మనుషులు, రకరకాల పాఠకులు. ఏ కథా కూడా అందర్నీ స్పర్శించలేదు. ఏ కథా కూడా భౌగోలికవైన, సామాజికవైన, మానసికవైన, కాలానుగుణవైన పరిధులకిలోబడి మాత్రవే మంచి కథ అనిపించుకుంటుంది.
మీరు ఉదాహరణలుగా ఇచ్చిన కథల్లో లోపాలు, ఆ కథ చెప్పడంలో లోపాలే గాని, కథలో వస్తువు వల్ల వచ్చిన లోపాలు కాదు. సూటిగా చెప్పదలచుకున్నప్పుడు వ్యాసాలు రాసుకోవచ్చు కదా అన్నారు, వ్యాసాలు రాసుకోవచ్చు, కానీ కథలు కూడా సూటిగా చెప్పడానికి ఉపయోగించే మాద్యమాల్లో ఒకటని నా మనవి. చక్కగా అరటిపండొలచి చేతులో పెట్టినట్టు సూటిగా సిదాంతాన్ని వివరించే కథలు చాలానే వున్నాయి (పిపీలకం). ఎటూ చెప్తాం కదా అని కథని సరిగ్గా అల్లకపోవడం, కథకు చెప్పదలుచుకున్న విషయానికి సంబంధంలేకపోవటం, స్వయం వ్యాఖానంతో పాఠకుడ్ని బోరు కొట్టించడం ఇవన్నీ కథకునిలోపాలే గాని, దానికి, కథాంశానికి, కథకుడు చెప్పదలుచుకున్న సందేశానికి సంబంధం వుందని నేననుకోను.
కథ నచ్చకపోవడానికి కథకుని లోపవే కాదు, పాఠకుల పరిధులు కూడా (సామాజికవైన, సిద్దాంతపరవైన, కాలాణుగుణవైన) ఒక అంశవే. చిన్నప్పుడు అమ్మ చెప్పిన కథలు, అప్పుడు అడిగి అడిగి మరీ చెప్పించుకున్న కథలు ఈరొజు ఈ వయసులో మనసుకి అంత పట్టకపోవచ్చు. దాచుకుని, దాచుకుని చదివిన డిటెక్టివ్ నవలలు ఇప్పుడు చెత్త బోరుకొట్టొచ్చు, ఆవురావురు మంటూ ఎదురు చూసిన ప్రేమ కథలు ఇప్పుడు తమాషాగా అనిపించొచ్చు. కొందరు మహానుభావులకి కన్యాశుల్కం అనవసరపు రాద్దాంతంలా కనిపించొచ్చు. గోవులొస్తున్నాయి జాగ్రత్త సిద్దాంత రగడలా స్పురించొచ్చు. వీటిల్లో కలలు, కల్పనలు, సంఘ సంస్కరణలు, సిద్దాంతాలు అన్నీ వున్నయి వాటితోపాటు చదివించే గుణం ఈ వీటన్నికీ వుంది. కాబట్టి కథ చెప్పడానికి వస్తువు అడ్దం కాదు. ఏ వస్తువైనా చేవ వున్న కథకుడు మంచి కథగా అల్లగలడు. అంతే కాదు, కవితల్ని స్పురింపజేసే కథలు, కథల్ని చెప్పే కవితలు, రెంటినీ గుర్తుతెచ్చే కరపత్రాలు వీటి సంగతేవిటి?
బాబ్జీ,
ఇదేవిటి, విరసం వల్ల కథలు వ్యాసాలైపోవటవేవిటి. విరసం ముందు అరసం, దాని ముందు సంఘ సంస్కరణ, స్వాతంత్ర పోరాటం, దాని ముందు మరింకేదో మార్పు, ఆ మార్పు కోసం ప్రయత్నించే వాళ్ళు వుండడవనేది సహజం కదా. విరసం మాత్రమే కథనెందుకు నాశనం చేసింది, లేకపోతే మూసలోకెందుకు నెట్టింది. ఐనా నువ్వుదాహరించిన రావీ శాస్త్రి, కోకు, కారా విరసంతో సరసం చేసిన వాళ్ళే కదా! రచయితల నిజాయితో నీకేం పని, వాళ్ళు వ్రాసిన కథలతో పని కాని. దీనికి వ్యతిరేకంగా ఈ నడవ నువ్వే ఒక అభిప్రాయం వ్రాసినట్టు గుర్తు.
కళ, కళకోసవే అనే వాదాన్ని తమ్మినేని గారు మరొక అడుగు ముందుకి తీసుకెళ్ళేరు, కళలో కల తప్ప నిజం (బుద్ది) వుందకూదదంటున్నారు. కథ బుద్దిని తాకకూడదంటారు. ఐతే మీరు చెప్పింది మాత్రం బాగుంది, సరి ఐన వాతావరణం లేని కథ, నిజవే పాఠకుడ్ని తాకదు. బుద్దిని తాకే కథల్లో ఆ వాతావరణం ఉంటే అవి మంచి కథలే కదా తమ్మినేని గారు.
మీతో ఏకీభవిస్తాను రమ గారు, గురూ గారన్నట్టు, నవ్వేది, నవ్వించేది, కదిలేది, కదిలించేదే కదా, కవితైనా, కథైనా.
కోడవళ్ళ గారు, మీ అభిప్రాయాల్లో, పెద్ద, పెద్ద పేర్లినిపిస్తాయి, చాలా కోట్స్ కనిపిస్తాయి, కానీ మీరు మాత్రం మీ మాటల్లో కనిపించరు ఎప్పుడో తప్ప. పుస్తకాల్లేకపోతే హాయిగా వుండగలవా? తెలీదు, కానీ పుస్తకాల్లేందెప్పుడు? కాగితం లేనప్పుడు, తాటేకులో, మరో చెట్టు బెరళ్ళో, లోహాలో, అవీ కానప్పుడు, నోటిమాటగా తరాన్నుంచి తరానికి సాగే కథలు, పాటలు అవన్నీ ఏవిటి? మనిషి మాటల్తోబాటు కథ కూడా పుట్టుందడంటారా. అది ఏరూపంలో భద్ర పరిస్తేనేవి.
గడ్దగట్టిన సముద్రాలెక్కడవి, ప్రవహించే నదులు తప్ప, అప్పుడప్పుడూ ఆ నదులెండి పోవచ్చు, గడ్డకట్టి పోవచ్చు. కానీ కొద్ది కాలవే. మార్పు మనిషికి సహజ గుణం కదా. కథ, కవిత ఇవేవి గొడ్డళ్ళు కావేవో, మహా అయితే మట్టి బెడ్డలాగా కాసేపు నదిలో చిన్న అలల్ని రేపుతాయేవో. కాఫ్కానే చెప్పుండొచ్చు గానీ గడ్డకట్టిన సముద్రవే అయితే మెటామార్ఫొసిస్లో ఆ గుమస్తా అంత హింస పడివుండడు కదా?
రవికిరణ్ తిమ్మిరెడ్డి
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి baabjeelu అభిప్రాయం:
03/19/2009 9:49 am
ఎమ్. ఎస్. ప్రసాదు గారూ,
వెల్చేరు వారు పరిచయం చేసిన గ్రంథానికి పండితుల వ్యాఖ్యలు కావాలా? మధ్యలో ఈ పండితులెవరు? వీళ్ళ అర్హతలేవిటి? వెల్చేరు వారికన్నా వీరుధ్ధరించినదేమిటి? మంచి గతమున కొంచెమే. ఆ కొద్ది మంచితనాన్ని మంచిగా చెప్పేవారెవరు? “పన్”డితులు అంటే అట్నించిటూ ఇట్నించటూ కూడా చెప్పగలిగినవాళ్ళా?
About eemaata గురించి RANGANATH MIDDELA అభిప్రాయం:
03/19/2009 9:39 am
వరంగల్లు
సాహితీ బంధువులకు నమస్సుమాంజలి.
మీరు వెలువరిస్తున్న ఈ మాట చూస్తుంటేనే కనువిందుగా ఉంది. మీ సైటుకు పుస్తకాలు ఎలా పంపాలి.. తెలుగు సాహిత్య లోకానికి అవసరమైన మరింత సమాచారాన్ని పొందుపరిస్తే బాగుంటుందని నా ఆలోచన.. ఇంత మంది సాహితీ మిత్రులు కలిసి చేసే సమిష్టి యాగంలో మీకు పూర్ణ ఫలం అందాలని నా ఆకాంక్ష..
ధన్యవాదాలతో,
రంగనాథ్ మిద్దెల
ఎన్ టీవి
మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి baabjeelu అభిప్రాయం:
03/19/2009 7:48 am
ఇది “మోహన” గారి అభిప్రాయం పై అభిప్రాయం. రాయొచ్చో, రాయకూడదో తెలియదు. వేస్తారో, వేయరో తెలియదు. అయినా సరే త్యాగరాజు రాసిన ఉత్సవ సంప్రదాయ కీర్తన గురించే, త్యాగరాజు సంగీతం, సాహిత్యం గురించే.
బాలమురళీ పాడిన వరస “మోహన” గారు చెప్పిన పధ్ధతికి సరిపోతుంది.
శతమఖాహిత విభంగ, శ్రీ రామ
శమనరిపు సన్నుతాంగ
శ్రితమానవాంతరంగ, జనకజ
శృంగార జలజభృంగ
అయితే ఈ వరస, నా చిన్నప్పట్నించీ వింటున్నదే
కస్తూరి రంగ రంగ, మాయన్న
కావేటి రంగ రంగ…
త్యాగరాజు “కాపీ” కొట్టేరా? బాలమురళీ “కాపీ” కొట్టేడా? లేదా “కస్తూరి…” వాళ్ళు త్యాగరాజుని “కాపీ” కొట్టేరా?
ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I గురించి surya అభిప్రాయం:
03/19/2009 6:41 am
సరైన వ్యాఖ్య రాయడానికే జుత్తు పీక్కో వలసి వస్తోందే! ఇంతంత పెద్ద వ్యాసాలు, అదీ అసందర్భపు వాక్యాలు మచ్చుకైనా కనబడని విధంగా ఎలా రాయగలుగుతున్నారు సార్. టోపీ రహిత ప్రణామాలు. ఈ మాటకి ధన్యవాదాలు. మీరన్నట్టు ఇంటర్నెట్టుది వర్ణనకందని మహాత్యం. జావా మొహం తెలీని కుర్రాళ్ళని మా కంపెనీ రిక్రూట్ చేసుకుని వాళ్ళ చేతులో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ పెట్టి ఆర్నెల్లయినా కాకుండానే వాళ్ళంతా “జావగార” దొడగారంటే ఆ కీర్తి “అంతరవల” దే ననడంలో సందేహం లేదు.
ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I గురించి M.S.Prasad అభిప్రాయం:
03/19/2009 3:03 am
సాహిత్యం – విజ్ఞానం రెందూ నాకత్యంత అభిమాన రంగాలు. దురదృష్ట వశాత్తు రెండిట్లో నాకు అభిరుచే తప్ప అభినివేశం ప్రజ్ఞ చాల స్వల్పం. ఇలాంటి వైజ్ఞానిక వ్యాసాలు చదివి నా అల్ప మేధస్సు ఆకళింపు చేసుకోగలిగినంత చేసుకుని ఆనందిస్తూంటాను. మీ వ్యాసం చాలా బాగుంది బోధ్యంగా వుంది. తరువాతి వ్యాసానికై ఎదురు చూస్తూంటాను.
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి M.S.Prasad అభిప్రాయం:
03/19/2009 2:28 am
పండిత వ్యాఖ్యానాలు పక్కన లేకుండా ప్రాచీన సాహిత్యం పూర్తిగా అర్థం చేసుకోవదం, గురుముఖతః గాక ఔత్సాహికంగా సంస్కృతాంధ్రాలని స్వయం కృషితో అభ్యసించిన మా బోటి వారికి సాధ్యం కాదు. సాహిత్య ఎకాడమీ వారు ప్రచురించిన వసుచరిత్ర, మనుచరిత్రాదులను పఠించినా అవి ఏవీ 20్ సంవత్సరాల క్రింద శరదాగమ వ్యాఖ్యా సహితంగా చదివిన చంద్రికా పరిణయం అంత సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. రామరాజభూషణుడితో సమానమైన లేదా అంతకు మించిన విద్వత్కవితా పాటవాలు కలిగిన సురభి మాధవరాయని ప్రజ్ఞ నాకా వ్యాఖ్య లేకుందా అవగతమయ్యేది కాదు. అందుకే నేను పండిత వ్యాఖ్యాసహిత కావ్యాలను స్వాగతిస్తాను, ఎదురుచూస్తాను ఆదరిస్తాను. ఇంతకీ మీరు పరిచయం చేసిన పుస్తకం ఎక్కడ ఎంతకు లభ్యమౌతుందో వివరించలేదు.
మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి సాయి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:
03/18/2009 6:53 am
నియమాలూ, సూత్రలూ తెలీవు కానీ, సంగీతంలో చరణాలకి ద్వితీయాక్షర ప్రాస వాడడం అనేది అనాదిగా వుంది. దీనికి ఆద్యులెవరో చెప్పలేం. ఒకటీ రెండు సందర్భాల్లో తప్ప, నూటికి తొంభైతొమ్మిది శాతం, అన్నమయ్య, క్షేత్రయ్య రచనల్లో ఇది స్పష్టంగా ఉంది. పురందర దాసు కీర్తనల్లోనూ కనిపిస్తుంది. త్యాగరాజూ ఇదే పద్దతనుసరించాడు. వీరి కొన్ని రచనల్లో అంత్య ప్రాసుంది. శ్రావ్యత కోసం శబ్ద ప్రాస పాటించారనే అనుకుంటున్నాను.
తాళ ఆవృతాన్ని బట్టే చరణంలో పాదాలు నిర్ధారించారని నా నమ్మకం. నాకు తెలుసున్నంత వరకూ ఇదే ఒరవడి అందరూ పాటిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు సంగీతజ్ఞుల్ని సంప్రదిస్తే ఇలాగే చెప్పారు.
యుగంధర్ గారూ – “ఒక తాళ ఆవృత్తం ఒక పాదమనే సూత్రం కూడా ఏమీ లేదు” అన్నది ఏ ఆధారంతో చెప్పారు? కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? ప్రాస నియమం పాటించేది చరణాలకే. పల్లవి, అనుపల్లవులకి కాదు.
కేవలం ఛందస్సు కోసం నాలుగు చరణాలని రెండుగా భావించడమన్న ప్రతిపాదన అన్ని కృతులకీ, కీర్తనలకీ అన్వయించబడితే అదొక సిధ్ధాంతమవుతుంది. ఇలాంటి పరిశోధనలు మోహన రావు గారి వల్లే సాధ్యం.
చివరగా – త్యాగరాజు రాసిన కొన్ని పద్యాలలో ఛందస్సు భంగమయ్యిందన్న విషయం పండితులు నిర్ధారించారు. నౌకాచరిత్రం, ప్రహ్లాద విజయం సంగీత రూపకాల్లో వాడిన పద్యాల్లో ఇది చక్కగా కనిపిస్తుంది.
బోడి పద్యం గురించి surya అభిప్రాయం:
03/18/2009 6:33 am
అంటే వ్యాఖ్య రాసిన వాళ్ళందరూ వాగుడు కాయలన్న మాట. అయినా ఈ మధ్య ఈ మాటలో ఇలాంటి moral policing వాగుడు అధికమవ్వటం బాధాకరం.