రచనలు ఎలా ఉండాలి అన్న అంశం మీద సోమర్సెట్ మామ్ (William Somerset Maugham)ఒక మంచి వ్యాసం వ్రాసాడు. ఈ వ్యాసం శీర్షిక “Three aims for writers”. ఈ వ్యాసంలో ముఖ్యంగా చర్చింపబడిన అంశాలు మూడు. అవి “Lucidity, Simplicity and Euphony”. ఒక శిల్పి తన పనిముట్లతో ఒక అందమైన శిల్పాన్ని చెక్కినట్టు, ఒక రచయిత(త్రి) ఈ మూడు పనిముట్లతో ఒక చక్కని రచనని సృష్టింపవచ్చు అని అంటాడు మామ్. అందరూ చదవదగ్గ మంచి వ్యాసం ఇది.
చిన్నయ సూరి తెలుగు వ్యాకరణం మీద పుస్తకం వ్రాయాలని ప్రయత్నించి మూడు సార్లు విఫలమయ్యాడు. నాలుగవ సారి బాల వ్యాకరణం వ్రాయడంలో సఫలీకృతుడయ్యాడు. దీనిని ఆధునీకరించడం అంత తేలిక కాదేమో (though not impoissible for someone like Sri Veluri).
1. 1951-55 మధ్యకాలంలో ఆరుద్ర-శ్రీశ్రీలిరువురూ “జంటకవులు”గా కొన్ని సినిమాలకి పాటలు రాసారు. అమరసందేశం కూడా వాటిలో ఒకటి. ఆ పాటల రికార్డులపైన ఇద్దరి పేర్లుంటాయి. ఎన్నడూ ఈ మాటో, చరణమో, పాటో, నాదంటే నాదని గొప్పలు చెప్పుకున్న దాఖలాలు లేవు. ఇద్దరి మధ్య స్నేహం చెడిన తరువాత కూడా! ఈ పద్యానికొచ్చేసరికి ఇద్దరూ తమదంటే తమదని చెప్పుకున్నారు. (శ్రీశ్రీ ఈ పద్యంలోని 2-3 పంక్తులు చదివే ఒక జనరంజని కార్యక్రమన్ని మరొకసారి వినిపిస్తాను.). శ్రీశ్రీ-తాపీ ధర్మారావులు కలిసి కూడా ఒకట్రెండు పాటలు రాసారు. పై వ్యాసంలో ఒక ఉదాహరణ ఉంది.
2. సీస:
సద సత్కళా …. విలాస
రిపు వ దజ్ఞాన ….. సుకుమారి
గగనా … గీతికాతరంగ
మధుమాధురీ … సదక్ష దామ
గీత:
పరభృత … స్వరకలాప
దరహసన … మకరంద
నిరుపమాన … జనని
సరస … మస్మత్ప్రశంస
బాగా నచ్చింది. ఆనందో బ్రహ్మ అంటారు. భగవంతుడు ఆనంద స్వరూపుడు. నిస్వార్ధంగా ఎవరు ఆనందాన్ని అందిస్తారో వారు భగవంతులే. ఆ పిల్ల ఇన్ని ఆలోచించలేదు కానీ ఆమె నమస్కరించడానికి కారణం అదే.
ముందుగా నా పేరు కూడా ప్రస్తావించినందుకు కృతజ్ఞతలు.
భలే ఉంది. నేనెక్కడెక్కడ బొక్కబోర్లా పడ్డానో తెలిసింది. (రింగ్ అనే మాటను ఘంటారావం అనే అర్ధంలో అనువదించాను. మీరు ఉంగరం అన్నారు. మీరే కరక్ట్ . ఇంకా చాలాచోట్ల 🙂 కవిత్వానికి క్లుప్తత ఎంత అవసరమో ఇప్పుడు తెలుస్తూంది.
కొన్ని సందేహాలు
with bakers white as angels, = గంధర్వ గాయకుల మూగబోయిన గాత్రాలు – అన్నారు ఎందుకు అందంకోసమా? లేక మరేమైనా అర్ధాలున్నాయా?
like a shoe without a foot, like a suit without a man, = ఈ వాక్యాన్ని మొత్తం వర్జించారు. కారణం తెలుసుకోవాలని ఉంది.
ఇదే చిత్రంలో శ్రీశ్రీ, ఆరుద్రలిరువురూ తమ రచనగా గొప్పగా చెప్పుకున్న ‘సదసత్కళా’ అనే సీసపద్యం చాలా చక్కనిది.
ఒకే పద్యాన్ని ప్రఖ్యాతులైన ఇద్దరు మహా కవులు తమ రచనగా ఎలా చెప్పుకోగలిగారు. ఆ సందర్భం వివరించగలరా. అలాగే సప్త స్వరాలను ముఖం-పాదాంతంలో నిలుపుకున్న ఆ సీస పాదాలను తెలుపగలరా?
కృష్ణా ముకుందా మురారీ అనే పాటను అత్యంతంగా అభిమానించే నేను అదే శైలి దైన “చూడుమదే చెలియా” అనే పాట కూడా ఘంటసాలే పాడితే చాలా బాగుండేదని చాలా సార్లు అనుకునే వాడిని. ఎవరి వైశిష్ట్యం వైవిధ్యం వారిదే ఐనా రాజా గారిని ఘంటసాలకు సమవుజ్జీగా భావించలేము. Survival of the fittest పరిణామ సూత్రం వలన రాజా గారు తెలుగు సీమకు దూరం అయ్యారని అనుకుంటాను.
ఎడిటర్ గారికి
మీరు చెప్పిన విషయాలు సమంజసంగానే అనిపిస్తున్నాయి.
నామట్టుకు చాలా సార్లు వాదప్రతివాదనలు మాంచి థ్రిల్లింగుగానూ, భిన్న విషయాలపట్ల అవగాహన కల్గించేవిగానూ అనిపించాయి. చాలా సందర్భాలలో అసలు రచనలకు మించి కూడా.
ఏకో రసః కరుణ ఏవ. తెలుగులో కరుణారసపోషణలో కంకంటి పాపరాజు గారు వ్రాసిన ఈ ఘట్టం పరాకాష్ట. ఈ సందర్భంలో ఆయన వ్రాసిన ప్రతి పద్యం కంట నీరొలికించక మానదు. నచ్చిన దేదో ఒక పద్యమే ఎన్నుకొని వ్రాయాలనే నిబంధనలేకపోతే ఈ ఘట్టంలోని ప్రతి పద్యం ఒక ఆణిముత్యమే.
ఇటువంటి సందర్భాలలోనే (లేదా ఈఒక్కసందర్భంలోనే) “నాకు నచ్చిన పద్యం” అనే శీర్షిక క్రింద గాక “నాకు నచ్చిన ఘట్టం” అనే శీర్షిక క్రింద ఈ సందర్భంలోని అన్ని పద్యాలను వ్రాస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఈ పద్యంతో ఈ ఘట్టం అంతా గుర్తుకు తెచ్చి మనస్సు వికలం చేసి రాముని పైన అనంత కోపం మరొక్కసారి తెప్పించిన మీకు కృతజ్ఞతలు.
పతంజలి గురించి ఎవరేమి మాట్లాడినా గుండె కలుక్కుమంటోంది. ఒక గొప్ప రచయితనీ, గొప్ప పాత్రికేయుణ్నీ, గొప్ప మనిషినీ పోగొట్టుకున్నాం. చివరిసారిగా పతంజలిబావును చూడగలిగిన మీరంతా అదృష్టవంతులు.
ఒక తెలుగు పుస్తకం కావాలి గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:
05/02/2009 7:50 am
రచనలు ఎలా ఉండాలి అన్న అంశం మీద సోమర్సెట్ మామ్ (William Somerset Maugham)ఒక మంచి వ్యాసం వ్రాసాడు. ఈ వ్యాసం శీర్షిక “Three aims for writers”. ఈ వ్యాసంలో ముఖ్యంగా చర్చింపబడిన అంశాలు మూడు. అవి “Lucidity, Simplicity and Euphony”. ఒక శిల్పి తన పనిముట్లతో ఒక అందమైన శిల్పాన్ని చెక్కినట్టు, ఒక రచయిత(త్రి) ఈ మూడు పనిముట్లతో ఒక చక్కని రచనని సృష్టింపవచ్చు అని అంటాడు మామ్. అందరూ చదవదగ్గ మంచి వ్యాసం ఇది.
చిన్నయ సూరి తెలుగు వ్యాకరణం మీద పుస్తకం వ్రాయాలని ప్రయత్నించి మూడు సార్లు విఫలమయ్యాడు. నాలుగవ సారి బాల వ్యాకరణం వ్రాయడంలో సఫలీకృతుడయ్యాడు. దీనిని ఆధునీకరించడం అంత తేలిక కాదేమో (though not impoissible for someone like Sri Veluri).
రాజాశంకర్ కాశీనాథుని.
మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి పరుచూరి శ్రీనివాస్ అభిప్రాయం:
05/02/2009 7:16 am
1. 1951-55 మధ్యకాలంలో ఆరుద్ర-శ్రీశ్రీలిరువురూ “జంటకవులు”గా కొన్ని సినిమాలకి పాటలు రాసారు. అమరసందేశం కూడా వాటిలో ఒకటి. ఆ పాటల రికార్డులపైన ఇద్దరి పేర్లుంటాయి. ఎన్నడూ ఈ మాటో, చరణమో, పాటో, నాదంటే నాదని గొప్పలు చెప్పుకున్న దాఖలాలు లేవు. ఇద్దరి మధ్య స్నేహం చెడిన తరువాత కూడా! ఈ పద్యానికొచ్చేసరికి ఇద్దరూ తమదంటే తమదని చెప్పుకున్నారు. (శ్రీశ్రీ ఈ పద్యంలోని 2-3 పంక్తులు చదివే ఒక జనరంజని కార్యక్రమన్ని మరొకసారి వినిపిస్తాను.). శ్రీశ్రీ-తాపీ ధర్మారావులు కలిసి కూడా ఒకట్రెండు పాటలు రాసారు. పై వ్యాసంలో ఒక ఉదాహరణ ఉంది.
2. సీస:
సద సత్కళా …. విలాస
రిపు వ దజ్ఞాన ….. సుకుమారి
గగనా … గీతికాతరంగ
మధుమాధురీ … సదక్ష దామ
గీత:
పరభృత … స్వరకలాప
దరహసన … మకరంద
నిరుపమాన … జనని
సరస … మస్మత్ప్రశంస
— శ్రీనివాస్
ఒక తెలుగు పుస్తకం కావాలి గురించి sUryuDu అభిప్రాయం:
05/02/2009 6:50 am
బాగుంది, అనుకోకుండా నిన్న బ్లాగులో కామెంటులో ఈ పుస్తకాన్ని ప్రస్తావించాను, దానికి 50 సంవత్సరాలు నిండాయని చూసుకోలేదు. చాలా మంచి పుస్తకం.
సూర్యుడు 🙂
గాలిపటం గురించి M.S.Prasad అభిప్రాయం:
05/02/2009 3:40 am
బాగా నచ్చింది. ఆనందో బ్రహ్మ అంటారు. భగవంతుడు ఆనంద స్వరూపుడు. నిస్వార్ధంగా ఎవరు ఆనందాన్ని అందిస్తారో వారు భగవంతులే. ఆ పిల్ల ఇన్ని ఆలోచించలేదు కానీ ఆమె నమస్కరించడానికి కారణం అదే.
ఒక్కతే… మృత్యువు గురించి bollojubaba అభిప్రాయం:
05/02/2009 1:25 am
ముందుగా నా పేరు కూడా ప్రస్తావించినందుకు కృతజ్ఞతలు.
భలే ఉంది. నేనెక్కడెక్కడ బొక్కబోర్లా పడ్డానో తెలిసింది. (రింగ్ అనే మాటను ఘంటారావం అనే అర్ధంలో అనువదించాను. మీరు ఉంగరం అన్నారు. మీరే కరక్ట్ . ఇంకా చాలాచోట్ల 🙂 కవిత్వానికి క్లుప్తత ఎంత అవసరమో ఇప్పుడు తెలుస్తూంది.
కొన్ని సందేహాలు
with bakers white as angels, = గంధర్వ గాయకుల మూగబోయిన గాత్రాలు – అన్నారు ఎందుకు అందంకోసమా? లేక మరేమైనా అర్ధాలున్నాయా?
like a shoe without a foot, like a suit without a man, = ఈ వాక్యాన్ని మొత్తం వర్జించారు. కారణం తెలుసుకోవాలని ఉంది.
మొత్తంమీద అనువాదం బాగా వచ్చింది.
బొల్లోజు బాబా
మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి M.S.Prasad అభిప్రాయం:
05/02/2009 1:21 am
ఇదే చిత్రంలో శ్రీశ్రీ, ఆరుద్రలిరువురూ తమ రచనగా గొప్పగా చెప్పుకున్న ‘సదసత్కళా’ అనే సీసపద్యం చాలా చక్కనిది.
ఒకే పద్యాన్ని ప్రఖ్యాతులైన ఇద్దరు మహా కవులు తమ రచనగా ఎలా చెప్పుకోగలిగారు. ఆ సందర్భం వివరించగలరా. అలాగే సప్త స్వరాలను ముఖం-పాదాంతంలో నిలుపుకున్న ఆ సీస పాదాలను తెలుపగలరా?
కృష్ణా ముకుందా మురారీ అనే పాటను అత్యంతంగా అభిమానించే నేను అదే శైలి దైన “చూడుమదే చెలియా” అనే పాట కూడా ఘంటసాలే పాడితే చాలా బాగుండేదని చాలా సార్లు అనుకునే వాడిని. ఎవరి వైశిష్ట్యం వైవిధ్యం వారిదే ఐనా రాజా గారిని ఘంటసాలకు సమవుజ్జీగా భావించలేము. Survival of the fittest పరిణామ సూత్రం వలన రాజా గారు తెలుగు సీమకు దూరం అయ్యారని అనుకుంటాను.
మనకు తెలియని మన త్యాగరాజు – 5 గురించి M.S.Prasad అభిప్రాయం:
05/01/2009 11:27 pm
వ్యాసకర్తగారికి అనేకానేక ధన్యవాదాలు. ఈ వ్యాసం ద్వారా మాకు తెలియని ఎన్నో విషయాలు జగదారాధ్యులైన త్యాగబ్రహ్మం గారి గురించి తెలుసుకున్నాము.
బ్రహ్మ జ్ఞానము గలుగగ
బ్రహ్మానందంబు గలుగు భాతిని త్యాగ
బ్రహ్మజ్ఞానము గూర్చిరి
బ్రహ్మాండంబైన శైలి బ్రహ్మానందా!
దశ సహస్ర శత కోటి వందనాలతో
భవదీయుడు
ఈమాట పాఠకులకు… గురించి bollojubaba అభిప్రాయం:
05/01/2009 11:06 pm
ఎడిటర్ గారికి
మీరు చెప్పిన విషయాలు సమంజసంగానే అనిపిస్తున్నాయి.
నామట్టుకు చాలా సార్లు వాదప్రతివాదనలు మాంచి థ్రిల్లింగుగానూ, భిన్న విషయాలపట్ల అవగాహన కల్గించేవిగానూ అనిపించాయి. చాలా సందర్భాలలో అసలు రచనలకు మించి కూడా.
నాకు నచ్చిన పద్యం: ఉత్తర రామాయణంలో సీత గురించి M.S.Prasad అభిప్రాయం:
05/01/2009 9:43 pm
ఏకో రసః కరుణ ఏవ. తెలుగులో కరుణారసపోషణలో కంకంటి పాపరాజు గారు వ్రాసిన ఈ ఘట్టం పరాకాష్ట. ఈ సందర్భంలో ఆయన వ్రాసిన ప్రతి పద్యం కంట నీరొలికించక మానదు. నచ్చిన దేదో ఒక పద్యమే ఎన్నుకొని వ్రాయాలనే నిబంధనలేకపోతే ఈ ఘట్టంలోని ప్రతి పద్యం ఒక ఆణిముత్యమే.
ఇటువంటి సందర్భాలలోనే (లేదా ఈఒక్కసందర్భంలోనే) “నాకు నచ్చిన పద్యం” అనే శీర్షిక క్రింద గాక “నాకు నచ్చిన ఘట్టం” అనే శీర్షిక క్రింద ఈ సందర్భంలోని అన్ని పద్యాలను వ్రాస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఈ పద్యంతో ఈ ఘట్టం అంతా గుర్తుకు తెచ్చి మనస్సు వికలం చేసి రాముని పైన అనంత కోపం మరొక్కసారి తెప్పించిన మీకు కృతజ్ఞతలు.
వెంటాడుతున్న ఊడుగపూత పరిమళం గురించి దుప్పల రవికుమార్ అభిప్రాయం:
05/01/2009 9:05 pm
పతంజలి గురించి ఎవరేమి మాట్లాడినా గుండె కలుక్కుమంటోంది. ఒక గొప్ప రచయితనీ, గొప్ప పాత్రికేయుణ్నీ, గొప్ప మనిషినీ పోగొట్టుకున్నాం. చివరిసారిగా పతంజలిబావును చూడగలిగిన మీరంతా అదృష్టవంతులు.