పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. రాగమాలిక గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    07/12/2009 11:41 pm

    ప్రసాదు గారూ,

    మీరిలా పద్యాలు కట్టి మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏదో నాకు తెలిసింది రాసానంతే! వ్యాసం నచ్చిందని చెప్పారు. సంతోషం. నే పడ్డ కష్టాన్ని తీసేయడానికి ఆ రెండు ముక్కలు చాలు. మీలాగ నేనూ సంగీత విద్యార్థినే! కాబట్టి అంతేసి పెద్ద మాటలనవసరం.

    ఇహ, మీరడిగిన ప్రశ్న – కృష్ణా ముకుందా మురారి పాట గురించి. తెలుసున్నది చెబుతాను. రాగమాలిక ప్రధాన లక్ష్యం వివిధ రసాలని వివిధ రాగాలతో సంయమనం చేయడం. రస ప్రధాన రాగాలనెన్నుకొని పాట కట్టడం. ఇక్కడ రసమే పాటకి దిశానిర్దేశకం చేస్తుంది. కాబట్టి రసం మారినప్పుడల్లా పాటకి సంబంధిచిన శృతీ, లయా తదనుగుణగా మార్చుకోవచ్చు. అది సంగీత దర్శకుడి ప్రతిభ మీదే ఆధారపడుంటుంది. చరణాంతం పల్లవి మొదలుపెట్టిన శృతిలోనే వుండాలన్న నియమం రాగమాలికకి లేదు. సాంబమూర్తి గారు ఒక రాగమాలిక రాసారు. పేరు గుర్తురావడంలేదు. అందులో రాగం మారినప్పుడల్లా పల్లవి కూడా అదే రాగంలో మారుతూ వస్తుంది. ఇదేవిధంగా మీరుదహరించిన పాటా కట్టుండే అవకాశముంది. ఆ పాటలో శృతి మార్చడానికి కారణం సన్నివేశానికనుగుణంగా జరిగిందనే అనుకుంటున్నాను. ఎక్కడైనా దొరికితే బాలమురళి స్వరపరిచిన శృతి భేద రాగమాలిక వినండి. మీకు మరింతగా అర్థమవుతుంది.
    సినిమా పాటలో రాగమాలిక నాకు నచ్చిన రాగమాలికల్లో ఇదొకటి.

  2. రాగమాలిక గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    07/12/2009 11:14 pm

    రమ గారూ,

    మీరు చెప్పిన అన్నమయ్య “దేశ సూళాది” రాగమాలిక, తాళమాలిక నాకు లభ్యం కాలేదు. మీ వ్యాఖ్య చూసాక, అన్నమయ్య కీర్తనల పుస్తకాలన్నీ తిరగేసినా దొరకలేదు. మీదగ్గరుంటే పంపగలరా? లేదా ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. తెప్పించుకుంటాను.
    అన్నమయ్య రాగమాలికని గుర్తుచేసినందుకు మరోసారి ధన్యవాదాలు.

  3. రాగమాలిక గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    07/12/2009 11:08 pm

    మోహన రావు గారూ,

    మీకు శ్రీనివాసన్ గారి వ్యాస దొరికితే నాకూ ఒక కాపీ పంపించండి. కర్ణాటక సంగీతంలో గణితం/ధ్వని శాస్త్రం గురించి రాయాలని ఎప్పటినుండో ఉన్న కోరిక. వీలయితే చెప్పండి. ఇద్దరం కలిసి రాద్దాం.
    మీకు రాగమాలిక నచ్చినందుకు సంతోషం.

  4. పడమట సంధ్యారాగం గురించి Maddipati Krishna Rao అభిప్రాయం:

    07/12/2009 7:56 pm

    చైతన్యస్రవంతి శైలిలో సాగిన కథపై ఉత్తర, దక్షిణ ధృవాల్లాంటి అభిప్రాయాలు రావడం వింత కాదనుకుంటాను. ఇలాంటి కథలు బాగా నచ్చనైనా నచ్చుతాయి లేకపోతే అసలు అర్ధంకాక చిరాకైనా కలిగిస్తాయి. శైలిని సరిగా నిర్వహించలేకపోతే రెండవ రియాక్షన్‌కు రచయిత బాధ్యత అవుతుంది. కానీ, సరిగా అర్ధం చేసుకోవడంలో పాఠకుల బాధ్యత కూడా చాలానే ఉంటుంది. ఉదాహరణకు, ఈ కథను అర్ధం చేసుకోవడానికి/అనుభవించడానికి పాఠకులు సుందరం పాత్రలో పరకాయ ప్రవేశం చెయ్యాలి. కథకు నాయకుడు, పరమార్ధం, ముగింపు, నీతి, వగైరా సూత్రాలు (లక్షణాలు?) ఖచ్చితంగా ఇలా ఉండాలి అనుకునే పాఠకులకు ఈ కథ నచ్చకపోవచ్చు. కానీ సుందరం ‘మొరాలిటీ జారుడు బల్ల’పై ప్రయాణం అతని వ్యక్తిత్వాన్ని ఊహింపజేస్తుంది. దానికి సాపేక్షంగా సఫూరా, సంధ్య ల వ్యక్తిత్వాలనూ విశదీకరిస్తుంది. కథలో చెప్పినదానికంటే పాఠకుల ఊహకు ఒదిలేసిందే ఎక్కువ. ఐతే ఆ ఊహలను నడిపించే మార్గాన్ని ఎన్నెన్నో పొరల్లో చూపిస్తున్నారు రచయిత. ఇంతకన్నా ఎక్కువ చెప్పుంటే కథ క్షీణించిపోయుండేదని నా అభిప్రాయం. తిరిగి చదివినకొద్దీ పొరల్లో దాక్కున్న కథ కనిపిస్తూంది. చక్కటి డయాస్ఫోరా కథనిచ్చినందుకు హేట్సాఫ్ మాష్టారూ!

    కథలో రెండు చిన్న టెక్నికల్ తప్పులున్నాయని నాకనిపించింది. మొదటిది ఫోన్ 30 సార్లు మ్రోగడం. నాకు గుర్తున్నంత వరకూ, ఉత్తర అమెరికా టెలిఫోన్లు ఇదివరలో 15 సార్లకంటే ఎక్కువ రింగయ్యేవి కాదు. (ఇప్పటి సంగతి నాకు తెలియదుగాని, ఇదివరలో కొన్ని ఆన్సరింగు మెషీన్లు ఆపేసి ఉంటే 15వ రింగుకి ఆటోమేటిగ్గా ఆన్ అయ్యి, మెసేజి తీసుకునేవి!). ఇప్పుడూ అంతేనో కాదో టెస్టు చెయ్యాలి! రెండవది, హేండ్ కారీ మరచిపోయి విమాన ప్రయాణం చెయ్యడం. సాధారణంగా టిక్కెట్లు అందులోనేగా ఉంచేది. పోనీ టిక్కేట్టు కోటు జేబులో ఉన్నాయనుకుందామంటే, మరీ చేతులూపుకుంటూ విమానం ఎక్కే వాళ్ళనెంతమందిని చూశాం? ఇవి పెద్ద లోపాలని అనలేను గాని, కథా గమనంలో పంటికింద రాయై అనవసరంగా భూమార్గం పట్టించాయి నన్ను!

    కృష్ణారావు

  5. పడమట సంధ్యారాగం గురించి అఫ్సర్ అభిప్రాయం:

    07/12/2009 4:32 pm

    వేలూరి కథ మీద జరుగుతున్న చర్చలో వొక ముఖ్యమయిన అంశాన్ని గుర్తు చెయ్యడానికి ఈ రెండు ముక్కలూ రాస్తున్నాను. కథలో వర్ణనాత్మకత , నాటకీయతల మీద ఇంకా మనకి చాలా మోజు వుంది. తెలుగు కథ తక్షణం వదిలించుకోవాల్సిన లక్షణాలు ఇవి రెండూను. వేలూరి కథ గొప్ప కథ అవుతుందా లేదా అన్నది కాసేపు పక్కన పెట్టి, ఈ కథ శిల్ప పరంగా వొక అనాటకీయ/ అవర్ణనాత్మక శిల్పాన్ని మన ముందు పెడుతుంది. వస్తువు పరంగా డయాస్పోరా కథ అంటే నాస్టాల్జియా మాత్రమే అన్న పరిమితిని దాటి, ప్రవాస జీవితంలోని ఇప్పటి సంక్లిష్టతని ఈ కథ తాకుతుంది. ఇందులో సఫూరా ముస్లిం దేశం నించి రావడం ఈ కథలో అదనపు సంక్లిష్టత. ఈ కథలో రచయిత వర్ణించిన సెట్టింగు నించి , ఇంకా నాటకీయతనీ, వర్ణనల్ని గుప్పించి దీన్ని వొక అనుభూతి కళా ఖండంగా మార్చవచ్చు. ఆ అవకాశాన్ని రచయిత చేజేతులా వదులుకున్నట్టు మనకి అర్ధం అవుతూనే వుంది.

    నా ప్రశ్న ఏమిటంటే: కథలో వర్ణన/ నాటకీయత పరిమితులు ఏమిటి? తెలుగు కథ ఆ రెండిటి మధ్య ఆడుతున్న దాగుడు మూతల్లో చాలా కాలంగా అసలయిన వాస్తవికతకి దూరం అవుతోంది. వొక్క అనవసరమయిన వాక్యమూ లేకుండా కథ రాయడం ఇవాల్టి అవసరం. వేలూరి కథ ఆ అవసరాన్ని గుర్తు చేసింది. ఈ లక్షణం ఇంకా కొంత పరిపక్వ దశలో ఇదే సంచికలోని మాచిరాజు సావిత్రి కథలో కనిపిస్తుంది.
    ఈ కథకి పెట్టిన శీర్షిక గురించి నాకూ అభ్యంతరం వుంది. మొదట: అది డయాస్పోరా మీద వచ్చిన వొక సినిమా పేరు కావడం. రెండు: ఈ కథ పరిధిని ‘సంధ్యా పాత్రకి మాత్రమే పరిమితం చేస్తుంది ఈ శీర్షిక. ఇందులో సంధ్య ఎంత ముఖ్యమో, సఫూర కూడా అంతే ముఖ్యం. సుందరం యాంటీ- హీరో లక్షణం అంత కంటే ముఖ్యం.

    యాంటీ హీరో తనం ఈ కథలోని వర్ణనా , నాటకీయతల వ్యతిరేకతలో భాగమే. పెట్టె బయటి నించి ఆలోచిస్తే ఈ కథ కొంత అర్ధం అవుతుందేమో? ఈమాట పాఠకులకు ఆ మాత్రం సహనం వుందని నా నమ్మిక.

    అఫ్సర్

  6. అచ్చులో పత్రికలు అంతరిస్తాయా? గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:

    07/12/2009 10:19 am

    మొదటివిషయం:

    తెలుగునాడి పత్రిక నిర్వాహకులు ఆంధ్రదేశంలో రచయితలకు పారితోషికం ఇస్తూనే ఉన్నారు. తెలుగునాడి డైజెస్ట్ పద్ధతిలో పత్రిక. ఆంటే, అందులో అచ్చయిన చాలా వ్యాసాలు, చాలా కథలు — ఇవన్నీ రెండవసారి ప్రచురించబడ్డాయి. ఒకసారి ప్రచురితమైన ప్రచురణలు తిరిగి ప్రచురించి తెలుగుదేశంలో పత్రికలతో సమానంగా ( అంతకన్నా ఎక్కువగానే అని విన్నట్టు గుర్తు) తెలుగునాటి రచయితలకు వాళ్ళు పారితోషికం ఇస్తున్నారు. అయినా తెలుగునాడి మూతపడింది. అచ్చుపత్రికలు మూతపడటానికి కొన్ని ముఖ్యకారణాలు నేను సంపాదకీయంలో ముచ్చటించాను.

    రెండో విషయం :
    I request the eemaaTa readers to read an article by Malcolm Gladwell, titled, Priced To Sell, in the most recent issue of The New Yorker
    (The New Yorker, July 6 & 13, 2009) . I wish I had the issue at hand when I was writing my editorial.

    అభివాదాలతో,

    వేలూరి వేంకటేశ్వర రావు.

  7. హాయిహాయిగా ఆమని సాగే గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/12/2009 4:40 am

    బాబ్జీలుగారి కష్టాలను మరింత పెంచుతాను!

    హంసానందితో పోలిస్తే సోహనీ రాగంలో స్వరాలన్నీ ‘సమానం’గా ఉండవు. వాది, సంవాది స్వరాలైన ధైవతం, గాంధారం ఎక్కువగా వినిపిస్తాయి. ఉత్తరాంగప్రధానమైన రాగం. అంటే మంద్రస్థాయిలో ఎక్కువసేపు సంచారం జరగదు. అదుకే పల్లవి ఎత్తుగడలోనే తారషడ్జమానికి చేరడం కనిపిస్తుంది. హంసానంది ఆరోహణ, అవరోహణ ఒకలాగే ఉటాయి. (సరిగమధనిస). సోహనీ వివరాలకు ఇది పనికొస్తుంది:
    http://www.swarganga.org/raaga_details.php?raagid=172

  8. హాయిహాయిగా ఆమని సాగే గురించి baabjeelu అభిప్రాయం:

    07/12/2009 12:22 am

    లక్ష్మన్న గారూ,
    హాయిగా పాడుకునే సినిమా పాటని హాయి హాయిగా పాడుకోనీకుండా చేసీసేరండీ. స్నానిస్తూ, మనసు హాయిగా వున్నప్పుడూ, హాయిగా పాడుకునే వాడిని ఈ పాటని. ఇప్పుడు మీరు “నోట్సు” రాసి ప్రాణం మీదకి తెచ్చేరు.
    అందుకే వ్యాకరణం అంటే మాలాటివాళ్ళకి చాలామందికి భయం. అందులోనూ మాతృభాషావ్యాకరణం అంటే మరీనూ. ఎందుకంటే “ఇంగ్లీషు” అయితే వ్యాకరణం రాకపోతే ఆ భాష రాదని “పెద్దలు” తిడితే వ్యాకరణం నేర్చుకుని ఆ యొక్క భాష నేర్చుకుంటాం. మరి తెనుగో??? అలాగే సినిమా పాట కదా?
    “హాయి హాయిగా ఆమని సాగె” అని పాడ్డంలో వున్న హాయి “సాస సమగమా ధానిధ సాస” అని పాడ్డంలో ఇబ్బందిగా వుంటోంది. శిక్షణ, సాధన లేని మా(రోయల్ వి)లాటి వాళ్ళం దూరంగా పారిపోవాఁ? ఆ యొక్క “శిక్ష” మరియూ “సాధింపులూ” పడకపోవడం మా తప్పే.
    సావిత్రీ ఘంటసాల గారు రాసిన “మా మామయ్య ఘంటసాల” అనే పుస్తకంలో ఈ పాట గురించి:”……. ఈ పాట వరస కుదరక రఫీ గారు మొదట కొంచెం ఇబ్బంది పడ్డారు. తెలుగులో మావయ్య పాడిన పాటవిని లతా గారు ఎంతో మెచ్చుకున్నారు. హిందీ రిహార్సల్స్ జరుగుతున్నపుడు మావయ్య వేరే రికార్డింగ్ కోసం అక్కడికి వెళ్ళేరు. ఈయనని లతాగారు చూసి “”ఒక్కసారి ఈ పాటని నాతో పాడండి” అన్నారు. ఆయన పాడనన్నారు….”” ఏవో కుంటి సాకులు చెప్పి ఘంటసాల తప్పించుకున్నారు.””రఫీ గారు పాడటానికి వచ్చినపుడు నేను పాడకూడదు. అది సభ్యత కాదు. అలా పాడి ఆయనని కించపరచలేను. నేను వెళ్ళను.”” అలాగే వెళ్ళలేదు.”
    హిందీ పాటే ఎందుకో హాయిగా వుంటుంది. ఎందుకో తెలీదు. తెలుగు వాళ్ళకున్న తెగులు వల్లనేమో? తెలుగు కన్నా ఇంగ్లీషు, హిందీ మరియూ సంస్కృతం చాలా బావుంటాయి. తెలుగు “తల్లి” కాబట్టి బావుంటుంది. కానీ, ఇంగ్లీషూ, హిందీ “గుడ్”, “బెటర్” లు పంచుకుంటే “సంస్కృతం” మాత్రం “బెష్టు”. ఇది మా(మళ్ళీ రోయల్ వి) లాటి వాళ్ళ తెలుగా. క్షమించాలి తెగులా???
    విధేయుడు
    రాబడి రాపిడి బడి తీరుబడి లేని పాఠకుడు.

  9. హాయిహాయిగా ఆమని సాగే గురించి M.S.Prasad అభిప్రాయం:

    07/11/2009 10:25 am

    సోహినీ రాగంలో వున్న సాగర సంగమం పాట “వేదం – అణువణువున నాదం”. ఐతే ఈ పాట నాకు పాడడం ద్వారానో, వినడం ద్వారానొ తెలియలేదు. కీ బోర్డ్ మీద పలికిన స్వరాలను గమనించి తెలుసుకున్నాను. రెండు పాటలు ఒకే రాగంలో వున్నాయన్న విషయం వాటిని కీ బోర్డ్ మీద గమనిస్తే తప్ప తెలుసుకోలేని స్థితి. కాబట్టి మాలాంటి ప్రారంభకులకు నేనడిగిన సహకారం అవసరం. ఆపైన మీ దయ మా ప్రాప్తం.

    భవదీయుడు

  10. హాయిహాయిగా ఆమని సాగే గురించి మందాకిని అభిప్రాయం:

    07/11/2009 1:11 am

    నమస్కారం లక్ష్మన్న గారూ!
    హాయి హాయిగా పాటలు విని ఆనందిచడమే గాని, రాగాల గురించి ఏమీ తెలీదు.
    తెలిసిన వాళ్ళ నోటివెంట ఏమైనా వినాలనే ఆశ ఉంది.
    మీ వ్యాసము చదివి ఎంతో ఆనందము కలిగింది. ధన్యవాదములు.
    ఇక మీరు సంధించిన ప్రశ్న- సాగర సంగమము లో వేదం అణువణువన నాదం అనే పాటలో చరణం చివర హంసానందీ రాగాలే అని వస్తుంది.
    ఆ పాట హంసానంది రాగమేనా?
    విజ్ఞుల మధ్య చొరవ చేసి వచ్చినందుకు మన్నించాలి.