పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. గాన సూర్యకాంతి: బాలమురళి గురించి rama bharadwaj అభిప్రాయం:

    11/07/2011 12:39 pm

    బ్రహ్మానందమ్ గారూ!! మీరు భావించిన “ముద్దు వేంకటమఖి” చతుర్దండి ప్రకాశికాకర్త అయిన వేంకటమఖికి [ఈయన అసలు పేరు వేంకట దీక్షితులు] మనవడో లేక మునిమనవడో అవుతాడు. ఈ ముద్దు వేంకటమఖి కూడా సంగీతంలో చాలా కృషి చేసినవాడే!! సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులి తండ్రి రామస్వామి దీక్షితులికి సంగీతం నేర్పినది ఈ “ముద్దు వేంకటమఖి” గారే!! ఈయన గారి ద్వారానే రామస్వామి దీక్షితారు గారు చతుర్దండిప్రకాశికని గ్రహించి తన కుమారునికీ అతడి సమకాలీకులైన త్యాగరాజాదులకీ మేళకర్త పధ్ధతిని అందించడమూ జరిగింది. మీరు ఇద్దరు వేంకటమఖిల మధ్య ఉన్న తేడాని గ్రహించలేదు.

    ఇకపోతే గోవిందదీక్షితులు వేంకటమఖి గారి తండ్రి. ఈయన అచ్యుతప్పనాయకునికి మంత్రిగా తంజావూరు నాయక రాజుల మన్నన గౌరవాలని పొందిన వారు. సంగీతంలో “సంగీతసుధ” అన్న గ్రంధాన్ని సంస్కృతంలో రచన చేసినవారు. గోవిందదీక్షితులవారికి [దాదాపుగా కృష్ణదేవరాయలకి అప్పాజీకీ ఉన్న బంధం లాంటిదే] అచ్యుతప్పనాయకునికీ రఘునాధనాయకునికీ మధ్యనున్న అనుబంధం కూడా!! తంజావూరు నాయక రాజులు గోవిందదీక్షితుల వారిని గౌరవంగా ” అయ్యా!” అని పిలిచేవారు. గోవిందదీక్షితులు తంజవూరు నాయక రాజ్యానికి ముఖ్య ప్రధాని. సరిగ్గా వేంకటమఖి, అలాగే ఆయన అన్నగారైన యజ్ఞ నారాయణ దీక్షితులు, ఇద్దరూ తమ తండ్రిగారి లాగే విజయరాఘవ నాయకుని కొలువులో ముఖ్య భూమికని పోషించినవారు.

    అయితే మీరు ఏ కారణంగా వీరిని తెలుగు వారిగా భావించారో నాకు తెలియదు గానీ వీరిని కన్నడ స్మార్త బ్రాహ్మణులుగా ఇతరులు పేర్కొనడం జరిగింది. ఇందుకు గోవిందదీక్షితులవారి దౌహిత్రుల తరుపువారు శాసనస్థ ఆధారాలు సైతమ్ చూపించడం, కంచి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి సైతమ్ తమ తల్లి తరుపువారు గోవిందదీక్షితులికి కుమార్తె తరుపు వంశంవారని చెప్పుకోవడం మరొక ఉదాహరణ. వీరెవ్వరూ తెలుగు వారు కారు.

    ఇంక భాషల విషయం వస్తే… నాయక రాజులు తెలుగు వారు. వారి కాలంలో తెలుగు రాజభాష. తెలుగున అత్యధిక సంఖ్యాకులు రచనలు చేసిన వారు మనకి కనిపిస్తారు. తెలుగున కీర్తనలు రాయడం అంటారా? స్వాతి తిరుణాల్ నించి పాపనాశనమ్ శివం గారి నించి మైసూర్ వాసుదేవాచార్ ల దాకా తెలుగున కీర్తనలు రాసినవారే! తెలుగు సంగీత రచనకి అనువైన భాషగా వారంతా గుర్తించిన వారు. తెలుగువారే కాక బయటి వారు సైతమ్ తెలుగున కీర్తనలు రాయడమ్ ఇందుకు ఉదాహరణే! అదీకాక ఆనాడూ విజయ నగర రాజ్యం నించి మిగిలిన రాజ్యాల దాకా ప్రజలలో చాలా మందికి అన్ని దక్షిణాది భాషలూ వచ్చేవి. కన్నడం వారికి తెలుగు, తెలుగు వారికి మిగిలిన భాషలూను. భాషలలో సంయమనం ఆదాన ప్రదానాలూ విరివిగా జరిగిన కాలమ్ అది.

    అయితే మీరన్నట్టూ తెలుగు వారు సంగీత సంప్రదాయానికి ఎనలేని సేవ చేసిన వారు. సంగీతానికి సిధ్ధాంత భూమికని సమకూర్చినవారూ ఎందరో ఉన్నారు విజయనగర కాలం నించీ. రామామాత్యుల వారి “స్వరమేళ కళానిధి” -ఒక రకంగా “చతుర్దండి ప్రకాశిక”కి దారి చూపిన పుస్తకం ఇదే! ఈ పుస్తకం ఆనాడు ఎంతో ప్రచారంలో ఉండేది. అచ్యుతదేవరాయల పేర రామామాత్యులు “అచ్యుతరాజేంద్రమేళ వీణ” ని రూపొందించడానికీ, వేంకటమఖి “రఘునాయకమేళ వీణ” ని రూపొందించడానికీ ఉన్న స్వామ్యాన్ని గమనించండి. అలాగే తొలిగా మేళకర్తల విభజనని మొదలు పెట్టినదీ జన్య జనక రాగాల పధ్ధతిని చేసినదీ రామామాత్యులవారే!!

    మీ అభిప్రాయానికి ఈ విషయంలో విపులమైన వివరణ అవసరమని భావించాను. మీకు ఇంకా వేంకటమఖి విషయంలో సందేహం ఉంటే కన్నడిగులని ఎవరినైనా సంప్రదించి తెలుసుకోవచ్చును.

    మన దురదృష్టమ్ ఏమంటే – కర్నాటక సంగీత సంప్రదాయానికి సంబంధించి ఎన్నో గ్రంధాలూ, ఎందరో విద్వాంసులూ, మధ్య యుగాల నించీ కూడా చాలా కృషి చేసినప్పటికీ ఆయా పుస్తకాలు అచ్చులో విరివిగా దొరకక పోవడమూ చాలామందికి వాటిని గురించిన కనీసమైన సమాచారం కూడా తెలియకపోవడమూను. ఇందుకు శాస్త్రీయ సంగీత రంగం లోని వారు బాధ్యత వహించాలి. కానీ అసలు వారికి ఆ స్పృహ కనిపించదు. మనం ఏమీ చేయలేం.

    రమ.

  2. గాన సూర్యకాంతి: బాలమురళి గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    11/07/2011 11:04 am

    “త్యాగరాజు కృతుల్లో భక్తి తప్ప ఇంకేవీ ఉండదు. నేను దానికి భిన్నంగా కృతుల్లో కవిత్వం జోడించాను. విప్లవ సందేశాలు జతచేసాను. స్ఫూర్తి సందేశాలు నింపాను,” అంటూ తన రచనలపై ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారాయన.”

    ఒకసారి రవీంద్ర భారతిలో “…స్వాతంత్ర్యమన్నా…” అని బాలమురళి గారు పాడగా విన్నాను. సాహిత్యమే కాదు, సంగీతమూ పెద్దగా ఆకట్టుకోలేదు.

    భక్తి, శృంగారాలు కాకుండా మిగతా రసాలను పట్టించుకుని కచేరీలలో పాడి ఒప్పించి, మెప్పించిన కర్ణాటక సంగీతకారులున్నారా?

    మరో ప్రశ్న: బాలమురళి ప్రభృతులు సమకాలీన/పూర్వ కవుల రచనలను ప్రచారంలోకి తెచ్చేందుకు ప్రయత్నించలేదా (భక్తి చట్రానికి అవతల)?

    సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదా?

  3. అనుభవం గురించి Aditya Bhagavan Dhulipala అభిప్రాయం:

    11/07/2011 7:49 am

    ఇలా అంటున్నా అని ఏమనుకోవద్దు మాస్టారు…మీరేం రాద్దామనుకున్నారో మీకైనా clarity ఉందా?

  4. జనరంజని: మహానటి సావిత్రి గురించి Bhaskara Sarma అభిప్రాయం:

    11/06/2011 2:56 pm

    Sir
    magazine is excellent (beyond doubt).
    I have a request. Can you send me the interview (audio) with Smt.Savitri of November 2008.
    Please…

    Bhaskara Sarma

  5. గాన సూర్యకాంతి: బాలమురళి గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    11/06/2011 12:49 am

    కొండంత కృషి చేసిన తెలుగువారు ప్రస్తుతం శాస్త్రీయ సంగీతంపై పట్టుకోల్పోతున్నారన్న బాధే, నేను వ్యక్తపరిచిన నిరాశా, నిస్పృహాలకి కారణం రమగారూ! సాహిత్యంలో పసవుంటే దాని కాళ్ళమీద అదే నిలబడుతుంది. ఎవరి భుజాల ఆసరా అవసరం లేదు. కాదనను. అన్నమయ్యని మినహాయిస్తే, మిగతా వాగ్గేయకారులు ఎంతో కొంత భావ సౌందర్యం సంగీతంలో చూపించారనే నా భావన. అవి అత్యంత రమణీయాలు కాకపోయినా పాడుకుంటూ భావాన్ని అస్వాదించడానికి ఆస్కారం ఉన్నాయి. కేవలం వచనం ఒక్కటే ఇరికించ లేదు. బాలమురళిగారి రచనలు చూసాకా నాకలా అనిపించలేదు. అదే రాసాను. ముందు కాలాన్ని నిర్వచించలేమని తెలుసు. త్యాగరాజు తర్వాత అంత ప్రతిభగల మరో తెలుగు విద్వాంసుడు పుట్టడానికి వందేళ్ళ పైనే పట్టింది. రాను రానూ సంగీతం పట్ల తెలుగువారికి శ్రద్ధ తగ్గుతోంది. మరలా పుడితే మంచిదే! నా నిస్పృహా కాలం ఎంత సాగుతుందో చూద్దాం. అంతవరకూ బాలమురళే మనుకున్న వాగ్గేయకారుడు. ఇది చెప్పడానికి సంకోచించనవసరం లేదు.

    ఇహ అన్నమయ్య సాహిత్య స్థాయి వేరన్నది అందరికీ తెలుసున్నదే! నా పోలిక మిగతా వాగ్గేయకారుల గురించి: వేంకట మఖి తెలుగువాడేనని చెప్పడానికి కొన్ని ఆధారాలున్నాయి. ఆయన రచనలు “చతుర్దండి ప్రకాశిక”, “రాగలక్షణమ్” సంస్కృతంలో రాయవచ్చుగాక. కానీ ఆయన తండ్రి గోవింద దీక్షితులది తిరుపతి సమీపంలో ఉన్న గ్రామం. ఆయన సుమారు 1575 ప్రాంతంలో అచ్యుతప్ప నాయకునికి మంత్రిగా చేసాడు. తరువాత రఘునాధనాయకుడి వద్ద కొంతకాలం చేసాక చనిపోయాడు. తదనంతరం ఆయన కొడుకులెవరూ మంత్రి పదవులు చేపట్టకపోయినా రాజాస్థానంలోనే గడిపారు. వేంకటమఖి 1620 ప్రాంతంలో చత్రుర్దండి ప్రకాశిక రాసాడు. సుమారు ఆ కాలానికే రఘునాధ నాయకుడు రాజయ్యాడు. ఆయన పేరున వేంకటమఖి ఒక వీణ కూడా చేసాడు.

    కానీ మీరు చెప్పిన శరభోజి ఆ కాలంనాటి వాడు కాదు. మరాఠా నాయకులు 1675 ప్రాంతంలో తంజావూరుని పాలించారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, వేంకటమఖి లక్షణ గీతాలు రాసాడు. ఇవి కొన్ని సంస్కృతంలోనూ, తెలుగులోనూ ఉన్నాయి. లక్షణ గీతాలు పిళ్లారి గీతాల తరువాత అప్పట్లో నేర్పేవారు. ఇప్పుడు సరిగమలు వచ్చీ రాగానే, సరాసరి కృతుల్లోకే దూకేస్తున్నారనుకోండి. అది వేరే విషయం. వేంకటమఖి తెలుగువాడని చెప్పడానికింకో ఆధారం కూడా వుంది. ఆయన సంగీతం మీద చేసిన కృషికి వాళ్ళ వంశీకులు ఆయన మీద కొన్ని పాటలు రాసారు. అందులో “ముద్దు వేంకటమఖి” ముద్రతో కొన్ని తెలుగు పాటలు కట్టారు. ముద్దు అన్నది తెలుగు పిలుపే కదా? ఇవన్నీ చూసాక ఆయన తెలుగువాడనే చెప్పవచ్చు? అలాగే నాయకరాజుల కాలంలో తెలుగు, తమిళం రెండూ అధికార భాషలే కూడా!

    ఇహ మన తెలుగు వారి గౌరవాలూ, పురస్కారాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అర్హులకి దండేయడం మనకి చేతకాని పని.

    -సాయి బ్రహ్మానందం

  6. ప్రేమికుల దినం గురించి TADEPALLI అభిప్రాయం:

    11/05/2011 11:29 pm

    చాలా బాగున్నది.
    పద ప్రయోగము బావున్నది.

  7. ఒక (అ)నాగరిక ఆనందం గురించి nArAyaNa అభిప్రాయం:

    11/05/2011 5:36 pm

    అందరికీ ధన్యవాదాలు.

    రామకృష్ణ గారు, మీకు వేరే శీర్షిక స్ఫురిస్తే చెప్పండి.

    నారాయణ.

  8. కినిమా మాసపత్రిక: హాస్యనటుల అనుభవాలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    11/05/2011 10:52 am

    ఇది బహుశా పరుచూరి శ్రీనివాస్ మాత్రమే చెప్పగలిగిన విషయం. పూనా ఫిల్మ్ ఇన్స్‌స్టిట్యూట్ film archivesలో కూడా ప్రయత్నించవచ్చు.

  9. ప్రజాపతి గురించి Bhavani అభిప్రాయం:

    11/05/2011 4:21 am

    కథనం చాలా బాగుంది. ఐతే తనమీద విప్లవించిన బౌద్ధాన్ని కూడా తన ధృతరాష్ట్రకౌగిలి లోనికి లాక్కున్న హిందూసామ్రాజ్యవాద ధోరణిని కూడా బహుశా తెలియకుండానే రచయిత ప్రదర్శించారు.

  10. గాన సూర్యకాంతి: బాలమురళి గురించి rama bharadwaj అభిప్రాయం:

    11/05/2011 1:50 am

    “ఆఖరి తెలుగు సంగీత వాగ్గేయకారుడేమో కూడానూ” లాంటి నిస్పృహని ప్రకటించడం చాలా తప్పు బ్రహ్మానందమ్ గారూ! ఆగామి కాలాన్ని మనం నిర్వచించలేము ఎప్పుడూ!! మన కళ్ళముందు కనిపించేదే స్థిరమూ శాశ్వతమూ ఎప్పుడూ కావు. బాల మురళికి ఉన్న పేరు కారణంగా ఆయన రచనలు [వాటిల్లో సాహిత్యం ఏమీ లేక పోయినా] అచ్చుపడడం జరిగింది. ఇందుకూ ఆయన తెలుగువాడు అయినందువల్ల అన్నది కారణం కానఖ్ఖరలేదు. సాహిత్యం అమోఘమైనది అయితే అదే నిలబడుతుంది. లేనప్పుడూ ఆయన శిష్య గణం వరకే అది పరిమితమైపోతుంది. దానికేం? అంత మాత్రాన ఆయన ప్రతిభకి కొరతా లేదు. ప్రతీ వాళ్ళకీ కొన్ని “లౌల్యాలు” ఉంటాయి. అందులో “కవి” ని అన్పించుకోవాలనే లౌల్యం ఉన్న వాళ్లని మనం ఎందరినో చూస్తూంటాం!! చిన్నాచితకా వాళ్ళే దీనికోసం తాపత్రయపడి ప్రయత్నాలు చేసుకుంటూండగా మరి సంగీతంలో గొప్ప మేధావి అయిన బాలమురళి ఒక్క “సూర్యకాంతి” వైపు అయినా వెళ్ళడా??:)

    ఇంక ఆయన చెప్పిన ఒక మాట ఆయన విషయలోనే కాదు తెలుగునాట చాలమంది విషయంలో పరమ సత్యం. అది ఏ గొప్పవ్యక్తికీ వాళ్ళ జీవితకాలంలో వాళ్ళకి దక్కవలసిన పురస్కారం గానీ ఆదరణ గానీ తెలుగునేల మీద దక్కకపోవడం అన్నది సత్యదూరం కాదు. తెలుగులో తెలిసి తెలిసీ కావాలనే మీడియోకర్ టాలెంట్ ని నెత్తికెత్తుకోవడం చేస్తూంటారు. ఇందులో వాళ్ళవాళ్ళ ప్రయోజనాలుంటాయి. ఇటువంటివి కళాకారులకి వికృతిగా కన్పిస్తాయి. బాలమురళీ చికాకు ఈ విషయలో చాలా నిజం మరి. డబ్బులున్న వాళ్లకి అభిరుచి ఉండదు. అభిరుచి ఉన్నవాళ్ళు రాజకీయాలు కూడా చేయగలిగిన వాళ్ళై ఉండాలి. చాలావరకూ ఈ రెండూ కలిసి ఉండేవే కావు.

    మీరు వాగ్గేయకారులనించి సాహిత్యాన్ని ఆశించకూడదని అంటారు. అని అన్నారు. కానీ అన్నమయ్య సంకీర్తనలు ఈ అభిప్రాయాన్ని తోసిరాజన్నాయి కదా?? తెలుగున గొప్ప సాహిత్యవేత్త ఎవరన్నా ఉంటే అది ముందు అన్నమయ్యే!! వేంకటమఖిని కూడా మీరు తెలుగువాడిని చేసేసేరు. కానీ చతుర్దండి ప్రకాశికని రాసిన వేంకటమఖి కన్నడిగుడు. తళ్ళికోట యుధ్ధానంతరం విజయనగర పట్టణం నేలకూలాకా మిగిలిన ప్రజ వలసలు పోయినప్పుడు సంగీత విద్వాంసులు కొందరు మైసూరు, మరి కొందరు తంజావూరు రాజ్యాలకి వలస వెళ్ళిపోయారు. అలా శరభోజి ఆస్థానం లోకి వెళ్ళిన వాళ్ళలో వేంకటమఖి తండ్రి కూడా ఉన్నాడు.

    రమ.