పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16478

  1. సారా మానను గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:

    02/10/2012 3:42 am

    వ్యాసం పెద్దదే అయినా వేళ్ళనుంచి మోచేతికి జారిపోతుంటే నాక్కుంటూ వెళ్ళిపోయాను.

    జాన్ హైడ్ కనుమూరి

  2. అసామాన్య సంగీతదర్శకుడు సి.ఆర్.సుబ్బరామన్ గురించి Rohiniprasad అభిప్రాయం:

    02/10/2012 12:56 am

    సుబ్బరామన్ తొలిసారిగా అవకాశమిచ్చి లైలామజ్‌నూ సినిమాలో పాటపాడించిన సుసర్ల దక్షిణామూర్తి ఆ తరవాత సంగీతదర్శకుడుగా పేరుపొంది మొన్ననే కాలంచేశారు. మాధవపెద్ది సత్యంతో కలిసి ఆయన పాడిన గీతం మనుచుగా తా ఖుదాతోడై.

  3. ఎందుకు పారేస్తాను నాన్నా! కథారచన గురించి rama bharadwaj అభిప్రాయం:

    02/09/2012 3:53 pm

    జంపాల చౌదరికీ తదితరులకీ ఈ కధ అంత గొప్పగా కనిపించిన కారణమేమో నాకు స్పస్టపడ్లేదు. వారి కారణాలు ఏమైనప్పటికీ.. ఈ కధ ఆ పాత కాలంలోని వారిని అసలు ఏ కారణంగా ఆకట్టుకున్నదీ కూడా నాకు అర్ధం కాలేదు. బహుశా జాలి అన్నది ఒక్కటే కారణమ్ కావొచ్చు. కానీ జాలి అన్నది కధా విషయం వలన కలిగే భావం. కధా వస్తువు ఎలా చెప్పబడిందీ అన్నదే ఎప్పుడైనా ఏ కధకైనా ముఖ్యమైన సంగతి అవుతుంది. ఇక్కడ వచ్చిన అభిప్రాయాలు ఏవీ కధ రాసిన పధ్ధతిని గురించి గానీ.. కధా టెక్నిక్ ని గురించి గానీ ఒక్క మాటా మాట్లాడలేదు.

    తెలుగు కధల మీద విమర్శ లోని లోటుబాట్లని చెబుతుంది ఈ ధోరణి. మెహర్ చెప్పినట్లుగా “చాసో కధలు” కధన”రీతి” లో పేలవంగా ఉంటాయి. అవి నిజంగా మనసుని ఏమంత ఆకట్టుకోవు. కధలోని విషయం మాత్రమే కధ కాదు. కధ అంటే అది రాయబడిన విధానం. కధా రచనలోని ముఖ్యమైన అంశమ్ ఎప్పుడూ “టెక్నిక్కే”! అది లేకపోతే ఒక సంఘటన అన్నది కధా రూపాన్ని ధరించనూలేదు. మెప్పించనూలేదు.

    ఈ కధలో చదివించే గుణమ్ లేదు. అదే ప్రధానమైన లోపమ్. కొట్టొచ్చినట్టు కనిపించే లోపమ్ కూడాను. ఆనాటి వాస్తవ పరిస్తితులు అలాంటివి అని ఎవరికి వారు నిట్టూర్పులు విడుస్తూ మెచ్చుకోవడం కధా విమర్శకి సంబంధించినది కాలేదు. అంత చిన్నవాడి మనసులోని అతలాకుతలమవగలంత సంఘర్షణని రచనా పరంగా ఈ కధ నిజంగా పట్టుకోలేదు. సూటిగా కధని పేనుకుపోవడం కధా రచనలో ఎప్పుడైనా నీరసమే! చాసో కధలు ఎక్కువభాగం ఇలాంటివే! ఆమాటకొస్తే తెలుగు కధ శిల్పపరంగా ఎదగని [తొలినాటి ఎందరో ” సీనియర్ల” ]కధలు ఇవాళ చదివితే అవి కూడా ఇలాగే ఉంటాయి. అలాంటి ఒకానొక నీరసమైన కధ ఇది. అంత గొప్పగా చెప్పుకోదగిన కధాలక్షణాలేవీ ఇందులోలేవు మరి.

    శ్రీ ఆదిభట్ల విద్యాసాగరూ! మీరు గమనించారో లేదో.. కధకుడు చాసో తనకధలోనే ..కొడుకు ఇల్లుకదలక పోవడాన్ని గురించి చెబుతూ.. ‘మొగుడుచచ్చిన ఆడదానిలా’ కృష్ణుడు ఇంట్లోనే ఉంటున్నాడని అన్నాడు. బహుశా లైలా వాడిన “ముండమోపి” దాని ఆధారంగా వచ్చిన భావ ప్రకటన కావొచ్చు.

    రమ.

  4. నాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు గురించి Satya అభిప్రాయం:

    02/09/2012 12:13 pm

    చాల చక్కని విశ్లేషణ! అర్జునుడి వినయంతో కూడిన పరాక్రమం స్పష్టం అయిన సన్నివేశం. అయితే సినిమాలో పూర్తి గా చూపించబడనిది ఏమిటంటే, కర్ణుడు యుద్ధం నుండి అర్జునుడి ధాటికి భయపడి చేతకాని వాడికి మల్లే రారాజుని విడిచి పారిపోతాడు. స్నేహం కోసం ప్రాణం ఇస్తాను అన్న పెద్దమనిషి చివరకి చేసిన నిర్వాకం ఇదే. కర్ణుడి స్వభావం పరిశీలిస్తే, అతను చాల సందర్భాలలో నిజానిజాలని పరిశీలించకుండా రాజుని శత్రుత్వం వైపే ప్రేరేపిస్తాడు. కారణం అతనిలో ఉన్న మత్సరమే! కర్ణుని పరాక్రమం, శౌర్యం గుర్తెరిగే భీష్ముడు అతనిని మహా రధుడిగా నిర్ణయించడు. ఇదే విషయం కర్ణుడు అంపశయ్య మీద ఉన్న భీష్ముడి దగ్గర అంగీకరిస్తాడు కూడా. కాగా, ఖాండవ దహనంలో అర్జునుడికి ప్రాప్తం అయిన శత్రువుల ద్వారా కర్ణుడికి పరోక్షంగా కొంత బలం ఏర్పడింది. ఇదే కారణంగా అతనితో యుద్ధం కొంత కష్టతరం అయ్యింది.

  5. వేణునాదం ఆగింది! గురించి TahaTaha అభిప్రాయం:

    02/09/2012 5:19 am

    గొల్ల పిల్లనగ్రొవి మళ్ళీ తెలుగు వాళ్ళకు దొరికేనా!

  6. వేణునాదం ఆగింది! గురించి Sujatha అభిప్రాయం:

    02/09/2012 12:25 am

    విజయ రాఘవ రావు గారి గురించి మరి కొన్ని విశేషాలు, అరుదైన ఫొటోలు నా బ్లాగు లో చూడండి

    http://narasaraopet-bloggers.blogspot.in/2012/01/blog-post.html
    http://narasaraopet-bloggers.blogspot.in/2012/02/2.html

  7. ఎందుకు పారేస్తాను నాన్నా! కథారచన గురించి vidyasagar sriadibhatla అభిప్రాయం:

    02/08/2012 2:38 am

    లైలా గారి అభిప్రాయం చదివాను. ముండమోపి చదువు అని ఎందుకనవలసి వచ్చిందో వివరించాలి. నిరక్షరాస్యత ప్రధాన సమస్యగా ఉన్నకలంలొ చదువు గురించి, చదువు విలువను గురించి రచయత వ్రాయాలనుకోవడం ఒక అభ్యుదయకరమైన ఆలోచన అవుతుంది. బోధనా రుసుము చెల్లించలేక పసివాళ్లు చదువుకోలేకపోవడం అనేది బాల్యానికి శాపం అని రచయత గుర్తించారు. తన కంటిఎదురుగా కనిపిస్తున్న ఒక వాస్తవాన్ని మనముందుంచే ప్రయత్నం చేసారు.
    మనం ఆనాటికి వలస పాలనలో ఉన్నాం. ఆ పాలకులు విద్యని కల్పించడం ఒక సామాజిక బాధ్యతగా గుర్తించని స్థితి ఉన్నది. రచయత ఈకోణంలొ పరిష్కారాన్ని ఆలోచిస్తే ఇంకా బాగుండేది. నిజానికి ఈపాటి చదువుకూడ అగ్రవర్ణాలవారికే అందుబాటులో ఉండేదనేది ఒక వాస్తవం.
    సామాజిక సమస్యకి వ్యక్తిగత స్థాయిలో పరిష్కారం వెదకడం ఒక్కటే లోపం కావచ్చు.
    vidyasagar sriadibhatla

  8. నన్ను ఎవరో చదివారు గురించి Vijaya Bhanu Kote అభిప్రాయం:

    02/07/2012 1:47 am

    చాలా బావుంది…. లోతైన భావన… హృద్యమైన పదాలు….

  9. నన్ను ఎవరో చదివారు గురించి Praveena అభిప్రాయం:

    02/05/2012 2:57 am

    లోతైన బావన. చాలా బాగుంది.

  10. కాల్వీనో కథల నుంచి – 1 గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    02/05/2012 12:51 am

    గుండె గోడల మీద వ్రేలాడే చిత్ర పటాలు ఈ చిన్ని కథలు!
    ****
    అంతులేని శాఖోప శాఖలుగా భూమిన పరచుకున్న పేరు తెలీని ఓ మహా వృక్షం లాంటిది – ఈ సమాజము, ఈ జన సమూహమూ! విభిన్న మానవ మనుగడలను, జీవన వైవిధ్యాలను, విచిత్ర మనస్తత్వ విధానాలను గురించి తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరుతూ వుంటాం. ఐతే, ఈ అంశాలని రచయిత – ఏ దృక్కోణం నుంచి పరిశీలించి, పరిశోధించి, చెబుతున్నాడా.. అనేదే రచనలో ఆసక్తిని రేకెత్తించే అసలైన విషయం అవుతుంది. నిజమైన పాఠకుని ఉత్సకత, తపన కూడా ఇదే. సరిగ్గా ఇలాంటి సందర్భాలలోనే ఆ రచయిత సామాజిక శాస్త్రవేత్త గా మారిపోతాడు( మారాలి కూడా). ‘రచయిత కి సామాజిక బాధ్యత వుంటుంది.’ అనే ఒక నైతిక శాసనానికి బహుశా ఇదే పునాది అనుకుంటా!

    ఈ కథలు చదువుతున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక గొంతు వినిపిస్తూ వుంటుంది. పూర్తిగా చదివాక అదొక మనిషిదని గుర్తిస్తాం.

    మనం మనుషులం. సందేహాల చిచ్చులం. లేకపొతే – మనకింత జ్ఞాన, విజ్ఞాన శా స్త్ర భాండాగారాలు లభించి వుండేవి కావు. ఒక్కోసారి డౌటేస్తూ వుంటుంది. వాచీ సరిగ్గానే తిరుగుతోందా, లేదాని! అప్పుడప్పుడు ఓ గొప్ప చిక్కు ప్రశ్నెదురౌతూ వుంటుంది. అసలీ జీవితం నిజమా? అబద్ధమా? అని. నవ్వుతూ మాట్లాడుతున్న మన ఎదుటి వాడి మనసులో ఏముందో తెల్సుకోవాలనే కుతూహలం కలుగుతూ వుంటుంది. కానీ, ఎలా తెలుసుకోడం ఈ నిజాల్నీ? తెల్సుకోవాలనే జిజ్ఞాస, తెలియరాక నిరాశా కలుగుతూ వుంటాయి. ఐతే, మనిషికి ఈ తపనంతా ఎందుకంటే – ఒక నిజం తెలుసుకోడం కోసం. నిర్ధారించుకోడం కోసం. అంతే. అదెలాంటి విషయమైనా సరే మనకి సందిగ్ధాలుండకూడదు. సందేహాలకి శాస్త్రీయ పరమైన నిరూపణ వుండాలని కోరుకుంటాం.

    మనిషి తన నీడని చూసి తాను మొదట భయపడి పోయాడుట. ఆ తర్వాత కొన్ని క్షణాలకి.. ఆలోచనలో పడిపోయాడట. ఏమనంటే – తనకు కనిపించని ఈ నల్ల మనిషి తన వెనక మాత్రమే వస్తున్నాడా లేక అందరి వెంటా వస్తాడా అని. ఆ తక్షణమే తన తోటి వాళ్ళని తన పక్కనే నిలబెట్టుకుని, అందరి నీడల్ని పరిశీలించి ‘నీడ సహజమైన గుణమనీ, అది మనిషినుంచి విడ దీయ లేనిది’ అనీ కనుగొని తేలిక పడ్డాడట.
    బ్ర్హమల్ని తొలగించుకుని, వాస్తవాల్ని నిర్ధారించుకున్నాక, కలిగే స్థిమితం పేరే శాంతి! దీని వల్ల మనకేం తెలుస్తుందంటే – తను కలసి జీవిస్తున్న జాతి వారిలో ఏక గుణ లక్షణాలు, స్వభావాలూ (అవి సహజమైనవైనా సరె, అసహజమైనవైనా సరే ) వుండాలని – మనిషి వాంఛిస్తాడు. ఇప్పటికీ ఈ మనిషి వాంఛ తీరడం లేదు.
    పట్ట పగలే – కాగడాలు పట్టుకు తిరుగుతున్న ఓ ప్రఖ్యాత తత్వవేత్తని ‘నీకిదేం పిచ్చయ్యా?’ అని అడిగితే చెప్పాడట. ‘ఎక్కడైనా మనిషి కనిపిస్తాడేమో వెతుకుతున్నానని. ఆయన మాటల్లో – ఎంత గొప్ప అర్థం ద్యోతకమౌతుందో కదూ!?

    ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. మాధవ్ గారి కాల్వినో అనువాద కథలు చదువుతున్నప్పుడు – గుప్ఫున గుర్తొచ్చాయి నాకివన్నీ!

    చిన్న చిన్న కథలెప్పుడూ పెద్ద పెద్ద సత్యాలే చెబుతాయి. ఇవీ అలాంటివే. మనకు అర్థమైనా, కాకున్నా – మన జీవితాలకున్న అర్థాలు కేవలం రెండు. రెండే రెండు. కథ కైనా అంతే. “The ultimate meaning to which all stories refer has two faces: 1. the continuity of life, 2. the inevitability of death.” అని అంటాడు ఈ రచయిత. ఎంత బాగా చెప్పాడూ!, అనిపించింది నాకు – చదవగానే!

    నాకీ కథలు బాగా నచ్చడానికి మరో కారణం. ఇవి అనువాద కథల్లా లేకపోవడం! కథల్లొ పూర్తిగా తెలుగు వాతావరణం నెలకొని వుండటం వల్ల.. మంచి తెలుగు కథలు చదువుతున్నఅనుభూతి కలిగింది. ‘ఇవి అనువాదాలు’ అని చెపితే తప్ప తెలీనంత సహజంగా వున్నాయి. ముఖ్యంగా చదివింపచేసే చక్కని శైలి వల్ల ఆసక్తి కరంగా వున్నాయి. కథలు చదవడమంటే నాకు చాలా ఇష్టం. మంచి కథలు – బాల్యం నాటి జ్ఞాపకాల్లా.. గుండె గోడల మీద ఫ్రేములు కట్టిన చిత్రాలై కూర్చుంటాయి. నిజానికి షార్ట్ స్టోరీస్ రాయడం కష్టం. చదవడం తేలిక. కాని, మర్చిపోవడం మాత్రం అంత సులభం కాదు.

    మాధవ్ గారూ! మీరు పరిచయం చేయడం వల్ల నేనీ రచయిత గురించి మరింతగా చదివి తెలుసుకోగలిగాను. ఈ సందర్భంగా మీకూ, ఈ మాటవారికి నా అభినందనలు తెలియ చేసుకుంటున్నాను. మరిన్ని కాల్వినో రచనలతో బాటు, మరెందరో మంచి రచయితలని మాకు పరిచయం చేయగలరని ఆశిస్తూ…
    శుభాభినందనలతో-
    ఆర్.దమయంతి.