“నిశ్శబ్దంలో నీ నవ్వులు” తెలుగు సాహిత్యాన్ని ఒక ఊపు ఊపి పదేళ్ళైన సందర్భంగా పుస్తకం.నెట్లో గరికపాటి పవన్ కుమారు గారి సమీక్ష చూసి ఇటొచ్చా. “అరటితొక్క కాలు జారి పడేవాళ్ళ గురించి ఎదురుచూస్తుంది. అగ్గిపుల్ల బుర్ర మండించే వాళ్ళ గురించి బెదురుచూస్తుంది” అబ్బో.. చదివి తరించాల్సిన కవిత్వమే. అనుమానం లేదు. సమీక్షలో గరికపాటి వారు శెలవిచ్చినట్టు హృదయప్రకంపన కాదు. భూకంపమే!
అలా కవితలన్నీ చదువుతూ ఈ కవిత దగ్గరకొచ్చాను. చూస్తే “పవన్” కు అని ఉంది. చిక్కుముడి కాస్త విడిపోయింది. ఎవరీ గరికపాటి పవన్ కుమారు? నక్షత్రాలు రాత్రి మాత్రమే మెరిసినట్టు ఈయన కేవలం తమ్మినేని యదుకుల భూషణు గారికి సంబంధించిన వ్యాసాలు, కవితల్లోనే మెరవడం వెనక కథా కమామిషు ఏవిటి చెప్మా అని చాలా రోజులుగా తలకొట్టుకుంటున్నా. తమ్మినేని వారిపై ఈగ వాలనివ్వని ఇతన్ని చూస్తే చాలా ముచ్చటేసింది. ఈ లింకులో ఇతని పేరు చూసి ఎంత ఆనంద పడ్డానో.
ఆప్యాయతా, అనురాగాలతో కూడిన వీరిద్దరి స్నేహం ఇలాగే పదికాలాల పాటు కొనసాగాలనీ, అరటితొక్కల మీదా, చాక్లెట్ ముచ్చుల మీద, సిగరెట్ పీకల మీదా తమ్మినేని వారు మరెన్నో అద్భుతమైన కవితలు అల్లాలని ఆశిస్తున్నాను.
ఇందులో, ఒక వ్యక్తి, ఇంకో వ్యక్తితో పద్యాల్లో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారా? ఈ పద్యాలు రాసినపుడు అవతలి వ్యక్తి, మధ్యలో మధ్యలో కందంలోనో ఇంకేదైనా పద్యంలోనో, తిరుగు సమాధానాలు రాశారా?
ఈ కంద పద్యాలలో కవిత్వం ఉన్నదా? ఉంటే, అది అన్ని పద్యాల్లోనూ ఉందా? కొన్నిట్లోనే ఉందా? వాటిల్లోనూ వేరు వేరు రకాలుగా ఉందా? ఈ వివరాలు తెలిసిన వారు చెపుతారా?
” మీ అమెరికా ప్రయాణం”….మీరు రాసిన ఐదు సవత్సరాల తర్వాత గానీ నేను దీన్ని చదవలేకపోయినందుకు అయ్యో అని అనుకున్నాను. మీ తెలుగు అమృతంలా ఉంది.మీ శైలి హాయిగా సాగింది. చాలారోజుల తర్వాత తెలిసిన వాడుక పదాలని ఎన్నింటినో చదువుతున్నప్పుడు ప్రాణానికి సుఖంగా అన్పించింది. ఒక్క 50 ఏళ్లలో అమెరికా ప్రయాణం లో ఎన్ని రకాల మార్పులు వచ్చేయో గమనిస్తే భలేగా అన్పించింది. న్యూయార్క్లో దిగడం తోనే ఆపేసారే.??.మరి కొంచెం సంగతులు కూడా రాస్తే బాగుండేది కదా?? మొట్టమొదటి సారి మీ యూనివెర్సిటీ చదువులోని సంగతులు గట్రా.. !! మీ శైలిలోని సొగసులోంచి వాటిని తెలుసుకోవాలని మా సరదాగా ఉంది. ఆ తర్వాతి కధ కూడా చెప్పండి మరి. ఊ( కొడుతూ వినడానికి సిధ్ధంగా ఉంది మనసు.
అందుకే గదండీ దానిని దూరపు ఉదాహరణ అన్నదీ! 🙂 ఆసక్తికరం కాదు, అంతగా అతకని ఉదాహరణ అనుండాల్సింది. ఇకపోతే…
1. వచన కవిత్వం అనేది నియతమైన పద్యం నుండి ఒక క్రమంలో పరిణమించింది అనుకుంటే (అలానే ఆంగ్లంలో వెర్స్ నుంచి ఫ్రీవెర్స్), పాద విభజన వల్ల వచ్చే “స్ఫురణ” కు కారణం అప్పటికే మనం పద్యాలని అచ్చులో చూడడం అని ప్రతిపాదించవచ్చునేమో. ఎందుకంటే, అచ్చులో పద్యకవిత్వమంతానూ పాదబద్ధంగానే ముద్రించబడింది కాబట్టీ కవిత్వం అనగానే పాదాలలో ఉండటమనే భావన ఒకటి అస్థిమూలగతం కావడానికి ఆస్కారముంది. వచన కవిత్వ పాదాలను ఛందోబద్ధమైన నియమాలను ఉల్లంఘించి వ్రాయడం, ఛందోపద్యపు శృంఖలాలనుండి వెలువడ్డంగా కవులు భావించి ఉండవచ్చును.
2. పాదవిభజన కాలగతిలో చెరిగిపోతుందని నేను అనుకోటంలేదు. పాదవిభజనని ఒక ప్రయోజనంతో వాడుకున్నవారూ ఉన్నారు. అప్రయత్నంగా, అనాలోచితంగా చేస్తున్నవారూ ఉన్నారు. అది మౌలిక లక్షణం కాకపోయినా దానినుంచి ఒక ప్రయోజనాన్ని కొందరు కవులు రాబట్టుకోగలిగేరు. అంటే ఇది కవి మీద ఆధారపడ్డ లక్షణం. అందువల్ల (మీ అభిప్రాయం చూడగానే) నాకు కలిగిన ఆలోచన ఇది: పాదవిభజన వల్ల “ఇంకే ప్రయోజనం ఉంది?” అని కాక “ఇంకే ప్రయోజనం లేదు!” అనే ప్రతిపాదనని పరిశీలించడం.
3. పాదవిభజన అనేది ఇలా పరంపరగా వచ్చిన ఒక స్వభావమే తప్ప లక్షణం కాదు అనుకుంటే, ఆ పాదవిభజనకి ఒక ప్రయోజనమూ, లక్షణమూ ఉండాలనే నియమం కూడా ఉండదు. అప్పుడు, కవి తన ఇష్టారాజ్యంగా పాదవిభజన చేసుకోవచ్చు, ఏ కారణమూ లేకుండానే. సకారణంగా చేస్తే మంచిదే కానీ అలా ఎందుకు చేయలేదు అనే నిర్బంధం కవి మీద ఉండదు. అప్పుడు వచన కవిత్వం నిర్మాణ విషయంలో మరింత సులువవుతుంది. కవికి మరింత వెసులుబాటు వస్తుంది. పాదవిభజన అనాలోచితంగా పారంపర్యంగా చేస్తున్నదే కానీ దానిపై స్పష్టత ఉండాలనే నిర్బంధం ఉండదు. వచన కవిత్వానికి నిర్మాణ లక్షణాలు అంటూ ఏమీ ఉండవనే దిశగా మనం పోవలసి ఉంటుంది. అందువల్ల చదువరి ఒక కవితను అనుభవించే తీరు మరింతగా వైయక్తికమవుతుంది. పాదవిభజన అనేది కేవలం ఒక రెలిక్ లాగా ఏ ప్రాధాన్యమూ లేనిదిగా మిగిలిపోతుంది. (ఆలోచిస్తే ఇప్పుడు జరుగుతున్నది చాలామటుకూ అదే అని నాకనిపిస్తుంది).
4. అలా అయిన పక్షంలో , వచన కవిత్వంలో లయ, గతి శబ్ద భావ సౌష్టవమూ తదితరాల వాడకమూ, వాటి ప్రభావమూ కవ్యుద్దిష్టాలే కానీ, వచనకవితా నిర్మాణంలో పాత్ర పోషించవు. వీటి ద్వారా కవిత మరింత పౌష్టికమవుతున్నది అనే అభిప్రాయం చదువరి సాహితీశిక్షణ వల్ల వస్తుండవచ్చు. అప్పుడు, కవితానిర్మాణం ఒక కవితని పాఠకుడు అనుభవించడంపై ప్రభావం చూపుతుంది అని నేనన్నది కేవలం ఈ సాహితీశిక్షణపై ఆధారపడినదానిగా, కేవలం వ్యక్తిగత అభిరుచిగానే తీసుకోవాల్సి వుంటుంది తప్ప ఒక నిర్మాణలక్షణంగా ప్రతిపాదించలేను.
అందువల్ల నిర్మాణ, స్వరూప లక్షణాల గురించి కాకుండా వచన కవిత్వాన్ని వచనం నుంచి వేరు చేసే మర్మమేమిటో ఆలోచించవచ్చునేమో. అలా అని లక్షణచర్చకు ఏ ఉపయోగమూ లేదని నేననుకోను. ఆ చర్చ కవికి తన కవితానిర్మాణంలో సహకరిస్తుందనే (కవి సకారణంగా పాదవిభజనని తన కవితలో వాడుకోదలచుకుంటే) ఇప్పటికీ నాకు అనిపిస్తుంది.
అయ్యా!! కవిత్వానికి పాఠకురాలిగా నాకు మీకొచ్చిన సందేహాలు రాలేదు. అసలు వచనకవిత్వం విషయంలో పాద విభజన లోని ఇబ్బందులు నన్ను ఏనాడూ బాధించలేదు. ఇబ్బందీ పెట్టలేదు. పద్యం అన్న పదాన్ని కవులు కవిత్వపరంగానే వాడుక చేస్తున్నారని మీరు గ్రహించాకా మీకింక లక్షణ చర్చ ఉండనఖ్ఖరలేదు. మీరు ఇంకా ఆ వలయంలోనే భ్రమిస్తూంటే దానికి జవాబు ఎక్కడినించి దొరకాలీ??
పఠాభి పదాలని ముక్కలు ముక్కలుగా విరిచి రాసినప్పుడూ ఇదేం పోకడా అంటూ సాంప్రదాయవాదులు విసుక్కున్నారు. లయ మీద మాంచి పట్టున్న పఠాభి పనిగట్టుకుని లయని ..పదాల అందాలనీ ధ్వంసం చేస్తూ కవిత్వం రాసినప్పుడు అది అసలు కవిత్వమే కాదని అనుకున్న వాళ్ళూ ఉన్నారు. కానీ వాళ్ళ విసుగుని పట్టించుకోలేదు తదనంతర కవులు.
ఇంక మొన్న కనక ప్రసాద్ గారి వ్యాసంలో గానీ లేదా కొంత మాధవ్ అభిప్రాయంలో గానీ అసలు వచన కవిత్వం అన్నదానికి మొదలెట్లా కొనసాగింపు ఎట్లా.. దాన్ని ముగింపు ఎట్లా.. దానికేమన్నా నియతి ఉన్నదా? అన్న సందేహాల చుట్టూ వారి ప్రశ్నలు నడిచాయి. ఈ ప్రశ్నలకి కవులెవరన్నా బదులు చెపుతే మీ అందరితో పాటూ నేనూ ఆసక్తిగానే చదువుతాను. కానీ అసలు అలాంటి ప్రశ్నలకి జవాబులు కవులైన వాళ్ళు చెప్పగలరా అన్నదే నా ప్రశ్న. ఈ ప్రశ్నని ఎవరన్నా ప్రాచీనకవులని వేసారా?? అందుకు వారేమని బదులు ఇచ్చారో మీరేమన్నా చెప్పగలరా?? పాత కవిత్వం అంతా కధా ప్రధానమూ.. వర్ణనల మయమూ చంధోమయమూ కదా?? అసలు అందులో క్వాచిత్కంగా తప్ప కవిత్వం ఉన్న సందర్భాలేవీ?? వారికసలు కధచెప్పడంలో ఉన్న దృష్టి లేదా స్వేచ్చా కవిత్వం రాయడంలో లేనే లేదే?? ఇవాళ గణాల దారిని వదిలి పెట్టి భావానికి పెద్ద పీటవేసి ఏ అంశం మీదనైనా తమతమ భావాలని రాయడానికి చందోరహిత మార్గాలలోంచి వచన పద్యం అనో వచన కవిత అనో పేరు పెట్టి… కవితా వస్తువుని “కధా చట్రం” నించి విడిపించి… ఒక భావస్వేచ్చని సాధించినది ఇవాళ్టి ఆధునిక కవులు కాదా?? మీ అందరి ప్రశ్నలూ లేదా సందేహాలూ గనక ఈ కవిత్వానికి లక్షణ నిర్దేశం చేయడం కోసమే అయితే అందుకు ఈ కవితాప్రక్రియలో చేయితిరిగిన వారి పద్యాలని 🙂 అదే “వచన పద్యాలని” మీలాంటి వారెవ్వరైనా పరిశీలించి కొన్ని లక్షణాలని కనుగొనవచ్చునే?? అందుకు మీకు కవిత్వం కావాలీ గానీ… కవుల సృజన ప్రక్రియ తాలూకు రహస్యాలతో ఏంపనీ?? ఈ ప్రశ్నని కవులని అటుంచండి కాసేపు. అసలు ఏ కళాకారులనైనా మీరడిగినా వాళ్ళు నిజంగా వివరించగలరా అన్నది నాకు సందేహమే!!
ఇంతమంది స్త్రీలు ఇన్ని వేలతరాలుగా పిల్లల్ని కంటున్నా పురిటి నొప్పులు ఇలాంటివని గానీ పిల్లల్ని తొలిగా ముద్దాడినప్పటి అనుభవం ఇలాంటిదనిగానీ విడమరిచి చెప్పగలిగారా?? అందుకు అసలు ఒక భాష ఉందా?? అలాంటి ప్రశ్నలకి వచ్చే జవాబులు నిజంగా మీ సందేహ నివృత్తికి చాలుతాయా?? అసలీ ప్రశ్నలకి జవాబులు ఏ కవికైనా తెలుసునా?? చెప్పగలరా?? మీరే ఆలోచించండి ఒకసారి.
ఇంక లక్షణ నిర్దేశమే చేయజాలని వచన కవితావాక్యంలో మీరు పాద విభజన కోసం చూస్తున్నారు.అసలు మీకు భావ ప్రధానమైన కవితావాక్యంలో భాషకి ముఖ్యమైన వాక్యం తాలూకు రూపాన్ని వెదుకుతున్నారే?? అది కుదిరే పనేనా?? వచన కవితని ఒక్కొక్కరు ఒక్కో రీతిలో చదవ వచ్చునేమో?? దాన్ని ఇక్కడే విరవాలని ఒక నియమంగా ఆ వాక్యాన్ని విభజించనేలేమేమో?? చదివే వారి గొంతుని అనుసరించి భావం ఎప్పుడూ కొత్తగా వినిపించే అవకాశం ఉన్న కవితా ప్రక్రియ వచన కవిత్వం కాగా అది మనకి అలవాటైన వాక్యాల్లో ఉందనే కదా దాన్ని మీరు విభజించను వీలులేదని అనుకుంటున్నారు?? ఇన్ని సమస్యలని ముందుపెట్టుకుని చందస్సుని మనసులో పెట్టుకుని ఆ దృష్టితో వచన కవిత్వానికి కూడా లక్షణ నిర్దేశం చేయచూసినప్పుడు తిప్పలు తప్పవు. వచన కవిత్వంలో పాదవిభజన భాష ప్రకారమో లయ ప్రకారమో జరిగితే మీరన్న చర్చ సులువు. కానీ మీరే వచన పద్యాన్నైనా లోపలో బయటో చదివి చూడండి. అది భావాన్ని అనుసరించి గాని నడవదు. ఎవరి పద్యాన్నైనా సరే !! ఒకరి భాష మరొకరిది కాదు. వాక్యవిన్యాసం ఎప్పుడూ భావస్పోరితంగా మాత్రమే నడుస్తుంది. ఇందుకు మీరు లక్షణ నిర్దేశమే చేయగలిగితే అప్పుడు మీకు ఇప్పటి వరకూ అమలులో ఉన్న నియమాలు పనికిరావు. కొత్త లక్షణ సూత్రాలు అనువర్తిస్తాయి. వాటిని తయారుచేసుకోవాలి. అది ఆలంకారికుల పని. మనకి కొత్త కవిబృందం తయారై ఉంది గానీ మరి ఈ ప్రక్రియకి కొత్త ఆలంకారికులు లేదా అలాంటి వారెవరో వారు మాత్రం ఇంకా తయ్యారవలేదు. సంపత్ కుమార శిక్షణ పాత సంప్రదాయం లోనిది. ఆయన ఆలోచనలు అందులోంచి తయారైనవి. అందుకే ఆయన వ్యాఖ్యానాలు గానీ లేదా ఆ తరహా ఇతరులు వేస్తున్న ప్రశ్నలు గానీ మారిన ఇవాళ్టి కవితావాక్యానికి నప్పడం లేదు. అలాగే మాధవ్ వ్యాసం నిండా కూడా బోలెడన్ని అవకతవక వాక్యాలున్నాయి. అవన్నీ అయోమయమైన ప్రకటనలే చాలావరకూ!! అందువలన వచన కవులనించి వారి సృజనకి సంబంధించిన ప్రశ్నలకి జవాబులనీ రాబట్టే దిశగా కన్నా… ఉన్న కవిత్వానికి కొత్త నియమాలున్నాయేమో అనే దిశగా కొత్త ఆలోచనలు చేస్తే మంచిది బహుశా .
మీలాంటివారెవరైనా ఇందుకు ప్రయత్నించవచ్చు. ప్రయత్నించండి మరి.
రమగారూ,
నేనసలు కవుల జోలికే పోలేదండి! తమ కవిత్వంలో పదాలని రకరకాల అర్థాలలో ప్రయోగించే స్చేచ్ఛ కవులకి ఎప్పుడూ ఉంది. అది లేకపోతే కవిత్వమే లేదు. నేను చెప్పినది విమర్శలు, లక్షణ చర్చల విషయంలో. అందులోని పరిభాషకి స్పష్టత నిర్దిష్టత అనివార్యం కదా.
ఈ చర్చని ఈనాటి వచన కవులు చదవలేదంటే అది ఆ కవుల తప్పు కాదా? ఇందులోని అభిప్రాయాలని పరిగణించాల్సిన అవసరం లేదు. కాని విషయం ముఖ్యమైనది అనుకున్నప్పుడు, దాని గురించి తమ అభిప్రాయాలని చెప్పాలి కదా. వచనకవిత్వ రూపాన్ని గురించి, పాదవిభజన గురించి మరింత అవగాహన కవులకి, పాఠకులకి అవసరమని మీరు ఒప్పుకుంటున్నారు కదా. అలాంటప్పుడు కనీసం ఈ చర్చ ద్వారానైనా కవులు ముందుకువచ్చి తమ అనుభవాలనూ, ఆలోచనలనూ పంచుకుంటే బాగుంటుంది కదా?
మాధవ్ గారూ,
పద్య నిర్మాణపు చట్రం గురించి మీరు ఆసక్తికరమైన ఉదాహరణ ఇచ్చారు. పాటకి స్వరం మౌలిక లక్షణం. మీరు చెప్పిన ఇతర “గీత” లక్షణాలు “పాట”లన్నిటికీ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ దాన్ని పాటగా “స్ఫురింప”జెయ్యడం అంటూ ఏమీ లేదు. అది ముమ్మాటికీ సిసలైన పాటే! పాదవిభజన కవితకి అలాంటి మౌలిక లక్షణం కాదని నేను భావిస్తాను. అయినా మీరు “స్ఫురణ” విషయంలో చెప్పింది నాకు అర్థమయ్యింది. పాదవిభజన చెయ్యడం వలన అది కవిత అన్న స్ఫురణ ఎందుకు కలుగుతోంది అన్న విషయమై ఆలోచించాలి. కేవలం పరంపరగా కవిత్వం పాదబద్ధం కావడం మూలాన ఆ స్ఫురణ కలుగుతోందంటే, అది అంత విలువైన విషయం కాదు. కాలాగతిలో అది చెరిగిపోతుంది. అంతకన్నా విలువైన ప్రయోజనం ఉందా అని ఆలోచించాలి.
మీరు నా అభిప్రాయం విన్న తర్వాత కూడా “పద్యాన్ని” ఇంకా రూప పరంగా చూస్తున్నారు. వచనకవితా ప్రక్రియ ఆధునిక కాలంలో గణనీయమైన పాత్రనే పోషించిన విషయం ..ఆధునిక కవులు “పద్యాన్ని” రూపపరంగా వాడుక చేయకపోవడం నేను ఈ సరికే ప్రస్తావించి ఉన్నాను. ఇక్కడ మీరు అంటున్న ” అయోమయం” ఈ పదప్రయోగం చేస్తున్న కవులకి లేదు. “శాస్త్రీయత” అని మీరు అనడం నాకు వింతగా అన్పించింది. ఏది శాస్త్రీయతా?? ప్రయోగాలు సృజనకారులే కదా చేస్తారూ?? భాషలో గాని..ఊహల్లో గానీ!! నువ్వు మూడు వక్ర రేఖల్లో ఆడదాని బొమ్మ ని గీస్తావేమయ్యా అని ఎవరన్నా పికాసో ని ప్రశ్నిస్తే పికాసో ఏం జవాబు చెప్పాలీ?? లేదా అసలు ఏమన్నా ఒక జవాబు ఆయన ఇచ్చి ఉండేవాడా?? శాస్త్రాన్ని దాటి తన స్వాతంత్రాన్ని చూపేవాళ్ళే సృజనశీలులు.
అసలింతకీ నాదో సందేహం సుమా !!. ఈ చేరా.. సంపత్కుమారల చర్చని ఎంతమంది ఇవాళ్టి వచన కవులు చదివేరూ?? ఎంతమంది వీరి అభిప్రాయాలని పరిగణించారూ?? ఒక చర్చ నిజంగా అది ఉద్దేశ్యించిన వర్గానికి గనక అందకపోతే చర్చగా అది బోల్తాపడ్డట్టే కదా!! పాయింట్లు చాలని చర్చని ఎంత సాగదీస్తే మాత్రం ఫలితం ఏముందీ??
కామేశ్వర రావు గారూ – నా ఉద్దేశాలని స్పష్టంగా చెప్పనందుకు క్షమించండి.
1. ఒక రచన బారుగా కాకుండా పొట్టీ పొడుగు పాదాలుగా విరక్కొట్టి రాయబడ్డది చూడగానే అది కవిత్వ రచన (లేదా ఈ రచన కవిత అని రచయిత ఉద్దేశిస్తున్నాడు) అనే స్ఫురణ రావడం సహజం. దూరపు ఉదాహరణ ఒకటి: గుల్జార్ పాటలు కొన్ని శుద్ధవచనాలు. అంటే గీతలక్షణాలు – ప్రాస, పల్లవి, చరణం ఇలా – లేనివి. ఏ బర్మనో, రహ్మానో వాటికి స్వరం ఇచ్చి పాటగా వాటిని స్ఫురింపజేశారు. (మేరా కుచ్ సామాన్ పాటకే అనుకుంటాను, ఆ సాహిత్యం చదివి ఆర్.డీ. బర్మన్ గుల్జార్తో “రేపు టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో వార్తలకి నన్ను ట్యూన్ కట్టమంటావు” అని అన్నాడని ఒక పిట్టకథ.) పద్య నిర్మాణ చట్రం అని నేనన్నది ఈ స్ఫురణను కలిగిస్తున్న రూపం. ఈ స్ఫురణనే నేను కవితా లక్షణం అన్నది. ఎందుకంటే ఒక్కసారి ఆ స్ఫురణ కలిగినతర్వాతే గదా మనం ఆ రచనని కవిత అన్న దృష్టితో చదువుతాం. అందువల్లనే పాదవిభజన లేదా బద్ధత వచన కవితకి ఒక నిర్మాణ లక్షణం (ఆభాసమైనది) అని నాకు తోచింది. అయితే ఇది నియతం కాదు. కవి ఇష్టాఇష్టాలపై ఆధారపడింది. పాదబద్ధత అనేది నియతమైన నిర్మాణలక్షణంగా అనిపిస్తున్నదేమో. అందుకని పాదవిభజన అని మాత్రమే వాడతాను.
ఈ పాదవిభజన మీరన్నట్టే కవిత కవితకీ ప్రత్యేకం. అది కేవలం కవ్యుద్దిష్టమే. సందేహమేమీ లేదు. ఉండచ్చూ, ఉండకపోవచ్చు కూడా. చంద్ర దుఃఖం కవిత పాదవిభజన లేకపోవడం వల్ల మరింత తీవ్రమయింది. అదేవిధంగా ఆయన ఇతర కవితల్లో చేసిన పాదవిభజన. అందువల్ల కవికి తన ఏ కవితను ఏ రూపంలో ప్రచురించాలీ అన్న విషయంపై స్పష్టమైన అవగాహన ఉన్నదని తెలుస్తున్నది. మీరుదహరించిన కవితలో భూషణ్ కూడా ఒక కారణం తోటే ఆ పాదవిభజన చేసుండాలి. పాదవిభజన చేస్తున్నప్పుడూ, చేయనప్పుడూ కూడా కవికి తన కవిత నిర్మాణంపై స్పష్టత ఉండాలని మాత్రమే నేనంటున్నది.
2. “పాఠకుడికి ఒక విరామం ఇవ్వడం గురించే, అది ఎలా ఇవ్వాలనే గదా భావగణాల ప్రస్తావనంతా!” – ఈ వాక్యం రాస్తున్నప్పుడే ఇది అపోహకి తావిస్తుందనే అనుమానం నాకొచ్చింది. అప్పుడే సరిదిద్దుకోపోవడం నేను చేసిన తప్పు. నా ఉద్దేశం సంపత్కుమార భావగణాలు చదువరికి విరామం ఇవ్వడానికి ఉద్దేశించారని కాదు. భావగణాలను ఆయన ఏ రకంగా ఉద్దేశించారో అర్థం చేసుకుంటే ఆ రకంగా కూడా ఆలోచించడం ద్వారా కవికి తన పాదాల విరుపులో (కవిత నిర్మాణంలో) మరికొంత స్పష్టత రావడానికి ఆస్కారముంది, అని నా ఊహ. కేవలం అంతే.
3. సాధారణీకరణ గుఱించి ఆలోచించే కన్నా, ఒక కవితలో సౌష్టవం తగినంత పాళ్ళలో ఉందా లేదా, కవితా నిర్మాణం అందులోని భావాన్ని పాఠకులకి అందించడానికి సహాయపడుతోందా లేదా అన్నదే ఆలోచించడం మేలని నేననుకుంటున్నాను.
కవితానిర్మాణం – పాదవిభజనతోనో, లేకుండానో, సౌష్టవం, లయ, గతులతోనో, అవేమీ లేకుండానో, మరేదైనానో – ఒక కవితని పాఠకుడు అనుభవించడంపై ప్రభావం చూపుతుందని నా అభిప్రాయం. అందువల్ల కవులు ఈ నిర్మాణంపై మరింత శ్రద్ధ చూపాలని, అందులో మెళకువలు అర్థం చేసుకోవాలనే నేనంటున్నది కూడా. అయితే, ఈ లక్షణాలని సాధారణీకరించమనిగాదు నా ఉద్దేశం. సాటి కవులు లేదా విమర్శకులు, ఏ కవి తన ఏ కవితలో ఎటువంటి నిర్మాణాన్ని వినియోగించాడు, అందువల్ల కవితకి మేలు జరిగిందా, హాని జరిగిందా? ఎలా? అని చర్చిస్తే, ఒక నిర్ధారణకు వచ్చినా లేకున్నా, ఆ చర్చలు ఈ విషయంలో ఇతర కవులకి, ఔత్సాహికులకీ ఉపయోగపడతాయని నేనన్నది. కవిత్వ విమర్శలో ఈ నిర్మాణ ప్రసక్తి లేకపోవడం ఒక లోటే (రూపవాదులని ఆక్షేపిస్తారని భయం కాబోలు). ఆ లోటు తీరాలనే నా కోరిక.
రమగారూ,
“పద్యం” అన్న పదాన్ని “కవిత” అనే అర్థంలో కొంతమంది కవులు, విమర్శకులు వాడారన్న విషయం నాకు తెలుసు. అయితే అది శాస్త్రీయం కాదన్నదే నా అభిప్రాయం, దానికే నా ముందు వ్యాఖ్యలో హేతువులు చూపెట్టాను. ముఖ్యంగా అలాంటి వాడుక అయోమయానికి దారితీసే అవకాశం ఉంది. ఇప్పటి చర్చాంశమైన వ్యాస పరంపరలో, “వచన పద్యం” అన్న పదంలో పద్యం అంటే పాదబద్ధత ఉన్న రచన అనే ఉద్దేశ్యంలోనే తీసుకున్నారు కాని కేవలం “కవిత” అనే అర్థంలో తీసుకోలేదు. వచనకవితలని వచనపద్యాలు అనుంటున్నాం కాబట్టి అవి కచ్చితంగా పాదబద్ధం కావలసిందేనని సంపత్కుమారగారన్నారు. దాన్ని చేరాగారు కూడా ఖండించ లేదు! కవిత అనే అర్థంలో మాత్రమే “వచనపద్యాలు” అని, అవి వచనపద్యాలు కాబట్టి వాటికి పాదబద్ధత ఉండాలనడం సరైన వాదన కాదు కదా!
వచనకవితా స్వరూపాన్ని గురించి వచనకవులు మరింతగా చర్చించాలన్న విషయమై మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. నా వ్యాఖ్యలోకూడా అదే అన్నాను. అలాంటి చర్చ చెయ్యడానికి అడ్డంకి ఏముంది? ఈమాటలో వ్రాసే/ఈమాటని చదివే వచనకవులు/కవయిత్రులు ఇప్పటికీ ఈ చర్చలో ఎందుకు పాల్గొనటం లేదో మరి!
మాధవ్ గారూ,
“ఎంత అకవిత్వమైనా, పద్య నిర్మాణపు చట్రంలో ఉండటంతో దానికి కొంత కవితాలక్షణం వస్తుంది.” ఇక్కడ “పద్య నిర్మాణపు చట్రం” అంటే ఏమిటన్నది నాకు పూర్తిగా అర్థమవ్వలేదు. పాదబద్ధతా? లేక అక్షర, గణ, మాత్రా ఛందస్సా? అలాగే ఆ చట్రంలో ఉండటం వల్ల వచ్చే “కవితాలక్షణం” ఏమిటన్నది కూడా స్పష్టం కాలేదు.
“పాఠకుడికి ఒక విరామం ఇవ్వడం గురించే, అది ఎలా ఇవ్వాలనే గదా భావగణాల ప్రస్తావనంతా!”. రెండిటికీ తేడా ఉంది. ఎక్కడ విరామం ఇవ్వాలన్నది కవి ఊహబట్టి, కవిత బట్టి ఉంటుంది. దాన్ని భావము, భావాంశము అనే చట్రంలో బిగించడం సాధ్యం కాదు. ఒక కవితలో ఒక భావం పూర్తి కాకుండానే సగంలో పాఠకుణ్ణి హఠాత్తుగా ఆపాలని కవి అనుకుంటే, అక్కడ మధ్యలో పాదాన్ని ఆపవచ్చు. అది సంపత్కుమారగారు నిర్వచించిన “భావాంశం” అని చెప్పలేం. ఉదాహరణకి ఈ నెల ఈమాటలో వచ్చిన భూషణ్ గారి “శిశిరచిత్రాలు” కవితలో ఈ పంక్తులు చూడండి.
కలిసిన రోజుల
రంగురంగుల
జ్ఞాపకాల ఆకులను
పెళుసు కొమ్మలతో
దులుపు కోవడమే
మేలు.
…
ప్రేమగా వీచినా అసలు
ఆకులు రాల్చనంది
ఇక్కడ “రంగురంగుల” అన్నది ఏ కోశానైనా భావాంశం అవుతుందా? “ప్రేమగా వీచినా అసలు” అన్న వాక్యంలో భావం కాని భావాంశం కాని పూర్తయ్యిందా? అయినా కవి పాదాలని అక్కడ విరిచాడంటె ఎందుకు? సంపత్కుమారగారు ఇలాంటి వాటిని exceptionsగా లేదా ఛందోదోషాలుగా పరిగణించారు. ఒక చట్రాన్ని ఊహించి దానికి లొంగని వాటిని దోషాలుగా పరిగణించడం కన్నా, ప్రతి కవితకీ తనదైన చట్రం కవి గీసుకుంటాడని అనుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీరు ప్రస్తావించిన సౌష్టవం విషయమై కూడా నాదిదే అభిప్రాయం. సాధారణీకరణ గుఱించి ఆలోచించే కన్నా, ఒక కవితలో సౌష్టవం తగినంత పాళ్ళలో ఉందా లేదా, కవితా నిర్మాణం అందులోని భావాన్ని పాఠకులకి అందిచడానికి సహాయపడుతోందా లేదా అన్నదే ఆలోచించడం మేలని నేననుకుంటున్నాను. ఇంగ్లీషు సాహిత్యంలో కవితా నిర్మాణం గురించి సాధారణీకరణలేమైనా చేసారేమో అందులో పరిచయమున్నవారెవరైనా చెప్పాలి. అది మనకి ఉపయోగపడే అవకాశం ఉంది.
కలిశాం గురించి Narayana అభిప్రాయం:
01/29/2011 3:58 am
“నిశ్శబ్దంలో నీ నవ్వులు” తెలుగు సాహిత్యాన్ని ఒక ఊపు ఊపి పదేళ్ళైన సందర్భంగా పుస్తకం.నెట్లో గరికపాటి పవన్ కుమారు గారి సమీక్ష చూసి ఇటొచ్చా. “అరటితొక్క కాలు జారి పడేవాళ్ళ గురించి ఎదురుచూస్తుంది. అగ్గిపుల్ల బుర్ర మండించే వాళ్ళ గురించి బెదురుచూస్తుంది” అబ్బో.. చదివి తరించాల్సిన కవిత్వమే. అనుమానం లేదు. సమీక్షలో గరికపాటి వారు శెలవిచ్చినట్టు హృదయప్రకంపన కాదు. భూకంపమే!
అలా కవితలన్నీ చదువుతూ ఈ కవిత దగ్గరకొచ్చాను. చూస్తే “పవన్” కు అని ఉంది. చిక్కుముడి కాస్త విడిపోయింది. ఎవరీ గరికపాటి పవన్ కుమారు? నక్షత్రాలు రాత్రి మాత్రమే మెరిసినట్టు ఈయన కేవలం తమ్మినేని యదుకుల భూషణు గారికి సంబంధించిన వ్యాసాలు, కవితల్లోనే మెరవడం వెనక కథా కమామిషు ఏవిటి చెప్మా అని చాలా రోజులుగా తలకొట్టుకుంటున్నా. తమ్మినేని వారిపై ఈగ వాలనివ్వని ఇతన్ని చూస్తే చాలా ముచ్చటేసింది. ఈ లింకులో ఇతని పేరు చూసి ఎంత ఆనంద పడ్డానో.
ఆప్యాయతా, అనురాగాలతో కూడిన వీరిద్దరి స్నేహం ఇలాగే పదికాలాల పాటు కొనసాగాలనీ, అరటితొక్కల మీదా, చాక్లెట్ ముచ్చుల మీద, సిగరెట్ పీకల మీదా తమ్మినేని వారు మరెన్నో అద్భుతమైన కవితలు అల్లాలని ఆశిస్తున్నాను.
విధేయుడు,
నారాయణ
చేరా కు ఒక శతమానం గురించి lyla yerneni అభిప్రాయం:
01/28/2011 7:41 pm
ఇందులో, ఒక వ్యక్తి, ఇంకో వ్యక్తితో పద్యాల్లో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారా? ఈ పద్యాలు రాసినపుడు అవతలి వ్యక్తి, మధ్యలో మధ్యలో కందంలోనో ఇంకేదైనా పద్యంలోనో, తిరుగు సమాధానాలు రాశారా?
ఈ కంద పద్యాలలో కవిత్వం ఉన్నదా? ఉంటే, అది అన్ని పద్యాల్లోనూ ఉందా? కొన్నిట్లోనే ఉందా? వాటిల్లోనూ వేరు వేరు రకాలుగా ఉందా? ఈ వివరాలు తెలిసిన వారు చెపుతారా?
థాంక్స్
లైలా
నా అమెరికా ప్రయాణం గురించి rama bharadwaj అభిప్రాయం:
01/28/2011 1:49 pm
వేమూరి వేంకటేశ్వర రావు గారూ !!
” మీ అమెరికా ప్రయాణం”….మీరు రాసిన ఐదు సవత్సరాల తర్వాత గానీ నేను దీన్ని చదవలేకపోయినందుకు అయ్యో అని అనుకున్నాను. మీ తెలుగు అమృతంలా ఉంది.మీ శైలి హాయిగా సాగింది. చాలారోజుల తర్వాత తెలిసిన వాడుక పదాలని ఎన్నింటినో చదువుతున్నప్పుడు ప్రాణానికి సుఖంగా అన్పించింది. ఒక్క 50 ఏళ్లలో అమెరికా ప్రయాణం లో ఎన్ని రకాల మార్పులు వచ్చేయో గమనిస్తే భలేగా అన్పించింది. న్యూయార్క్లో దిగడం తోనే ఆపేసారే.??.మరి కొంచెం సంగతులు కూడా రాస్తే బాగుండేది కదా?? మొట్టమొదటి సారి మీ యూనివెర్సిటీ చదువులోని సంగతులు గట్రా.. !! మీ శైలిలోని సొగసులోంచి వాటిని తెలుసుకోవాలని మా సరదాగా ఉంది. ఆ తర్వాతి కధ కూడా చెప్పండి మరి. ఊ( కొడుతూ వినడానికి సిధ్ధంగా ఉంది మనసు.
అనేక వందనాలు మీకు,
రమ.
ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి Madhav అభిప్రాయం:
01/28/2011 11:14 am
అందుకే గదండీ దానిని దూరపు ఉదాహరణ అన్నదీ! 🙂 ఆసక్తికరం కాదు, అంతగా అతకని ఉదాహరణ అనుండాల్సింది. ఇకపోతే…
1. వచన కవిత్వం అనేది నియతమైన పద్యం నుండి ఒక క్రమంలో పరిణమించింది అనుకుంటే (అలానే ఆంగ్లంలో వెర్స్ నుంచి ఫ్రీవెర్స్), పాద విభజన వల్ల వచ్చే “స్ఫురణ” కు కారణం అప్పటికే మనం పద్యాలని అచ్చులో చూడడం అని ప్రతిపాదించవచ్చునేమో. ఎందుకంటే, అచ్చులో పద్యకవిత్వమంతానూ పాదబద్ధంగానే ముద్రించబడింది కాబట్టీ కవిత్వం అనగానే పాదాలలో ఉండటమనే భావన ఒకటి అస్థిమూలగతం కావడానికి ఆస్కారముంది. వచన కవిత్వ పాదాలను ఛందోబద్ధమైన నియమాలను ఉల్లంఘించి వ్రాయడం, ఛందోపద్యపు శృంఖలాలనుండి వెలువడ్డంగా కవులు భావించి ఉండవచ్చును.
2. పాదవిభజన కాలగతిలో చెరిగిపోతుందని నేను అనుకోటంలేదు. పాదవిభజనని ఒక ప్రయోజనంతో వాడుకున్నవారూ ఉన్నారు. అప్రయత్నంగా, అనాలోచితంగా చేస్తున్నవారూ ఉన్నారు. అది మౌలిక లక్షణం కాకపోయినా దానినుంచి ఒక ప్రయోజనాన్ని కొందరు కవులు రాబట్టుకోగలిగేరు. అంటే ఇది కవి మీద ఆధారపడ్డ లక్షణం. అందువల్ల (మీ అభిప్రాయం చూడగానే) నాకు కలిగిన ఆలోచన ఇది: పాదవిభజన వల్ల “ఇంకే ప్రయోజనం ఉంది?” అని కాక “ఇంకే ప్రయోజనం లేదు!” అనే ప్రతిపాదనని పరిశీలించడం.
3. పాదవిభజన అనేది ఇలా పరంపరగా వచ్చిన ఒక స్వభావమే తప్ప లక్షణం కాదు అనుకుంటే, ఆ పాదవిభజనకి ఒక ప్రయోజనమూ, లక్షణమూ ఉండాలనే నియమం కూడా ఉండదు. అప్పుడు, కవి తన ఇష్టారాజ్యంగా పాదవిభజన చేసుకోవచ్చు, ఏ కారణమూ లేకుండానే. సకారణంగా చేస్తే మంచిదే కానీ అలా ఎందుకు చేయలేదు అనే నిర్బంధం కవి మీద ఉండదు. అప్పుడు వచన కవిత్వం నిర్మాణ విషయంలో మరింత సులువవుతుంది. కవికి మరింత వెసులుబాటు వస్తుంది. పాదవిభజన అనాలోచితంగా పారంపర్యంగా చేస్తున్నదే కానీ దానిపై స్పష్టత ఉండాలనే నిర్బంధం ఉండదు. వచన కవిత్వానికి నిర్మాణ లక్షణాలు అంటూ ఏమీ ఉండవనే దిశగా మనం పోవలసి ఉంటుంది. అందువల్ల చదువరి ఒక కవితను అనుభవించే తీరు మరింతగా వైయక్తికమవుతుంది. పాదవిభజన అనేది కేవలం ఒక రెలిక్ లాగా ఏ ప్రాధాన్యమూ లేనిదిగా మిగిలిపోతుంది. (ఆలోచిస్తే ఇప్పుడు జరుగుతున్నది చాలామటుకూ అదే అని నాకనిపిస్తుంది).
4. అలా అయిన పక్షంలో , వచన కవిత్వంలో లయ, గతి శబ్ద భావ సౌష్టవమూ తదితరాల వాడకమూ, వాటి ప్రభావమూ కవ్యుద్దిష్టాలే కానీ, వచనకవితా నిర్మాణంలో పాత్ర పోషించవు. వీటి ద్వారా కవిత మరింత పౌష్టికమవుతున్నది అనే అభిప్రాయం చదువరి సాహితీశిక్షణ వల్ల వస్తుండవచ్చు. అప్పుడు, కవితానిర్మాణం ఒక కవితని పాఠకుడు అనుభవించడంపై ప్రభావం చూపుతుంది అని నేనన్నది కేవలం ఈ సాహితీశిక్షణపై ఆధారపడినదానిగా, కేవలం వ్యక్తిగత అభిరుచిగానే తీసుకోవాల్సి వుంటుంది తప్ప ఒక నిర్మాణలక్షణంగా ప్రతిపాదించలేను.
అందువల్ల నిర్మాణ, స్వరూప లక్షణాల గురించి కాకుండా వచన కవిత్వాన్ని వచనం నుంచి వేరు చేసే మర్మమేమిటో ఆలోచించవచ్చునేమో. అలా అని లక్షణచర్చకు ఏ ఉపయోగమూ లేదని నేననుకోను. ఆ చర్చ కవికి తన కవితానిర్మాణంలో సహకరిస్తుందనే (కవి సకారణంగా పాదవిభజనని తన కవితలో వాడుకోదలచుకుంటే) ఇప్పటికీ నాకు అనిపిస్తుంది.
మాధవ్
ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి rama bharadwaj అభిప్రాయం:
01/28/2011 10:22 am
అయ్యా!! కవిత్వానికి పాఠకురాలిగా నాకు మీకొచ్చిన సందేహాలు రాలేదు. అసలు వచనకవిత్వం విషయంలో పాద విభజన లోని ఇబ్బందులు నన్ను ఏనాడూ బాధించలేదు. ఇబ్బందీ పెట్టలేదు. పద్యం అన్న పదాన్ని కవులు కవిత్వపరంగానే వాడుక చేస్తున్నారని మీరు గ్రహించాకా మీకింక లక్షణ చర్చ ఉండనఖ్ఖరలేదు. మీరు ఇంకా ఆ వలయంలోనే భ్రమిస్తూంటే దానికి జవాబు ఎక్కడినించి దొరకాలీ??
పఠాభి పదాలని ముక్కలు ముక్కలుగా విరిచి రాసినప్పుడూ ఇదేం పోకడా అంటూ సాంప్రదాయవాదులు విసుక్కున్నారు. లయ మీద మాంచి పట్టున్న పఠాభి పనిగట్టుకుని లయని ..పదాల అందాలనీ ధ్వంసం చేస్తూ కవిత్వం రాసినప్పుడు అది అసలు కవిత్వమే కాదని అనుకున్న వాళ్ళూ ఉన్నారు. కానీ వాళ్ళ విసుగుని పట్టించుకోలేదు తదనంతర కవులు.
ఇంక మొన్న కనక ప్రసాద్ గారి వ్యాసంలో గానీ లేదా కొంత మాధవ్ అభిప్రాయంలో గానీ అసలు వచన కవిత్వం అన్నదానికి మొదలెట్లా కొనసాగింపు ఎట్లా.. దాన్ని ముగింపు ఎట్లా.. దానికేమన్నా నియతి ఉన్నదా? అన్న సందేహాల చుట్టూ వారి ప్రశ్నలు నడిచాయి. ఈ ప్రశ్నలకి కవులెవరన్నా బదులు చెపుతే మీ అందరితో పాటూ నేనూ ఆసక్తిగానే చదువుతాను. కానీ అసలు అలాంటి ప్రశ్నలకి జవాబులు కవులైన వాళ్ళు చెప్పగలరా అన్నదే నా ప్రశ్న. ఈ ప్రశ్నని ఎవరన్నా ప్రాచీనకవులని వేసారా?? అందుకు వారేమని బదులు ఇచ్చారో మీరేమన్నా చెప్పగలరా?? పాత కవిత్వం అంతా కధా ప్రధానమూ.. వర్ణనల మయమూ చంధోమయమూ కదా?? అసలు అందులో క్వాచిత్కంగా తప్ప కవిత్వం ఉన్న సందర్భాలేవీ?? వారికసలు కధచెప్పడంలో ఉన్న దృష్టి లేదా స్వేచ్చా కవిత్వం రాయడంలో లేనే లేదే?? ఇవాళ గణాల దారిని వదిలి పెట్టి భావానికి పెద్ద పీటవేసి ఏ అంశం మీదనైనా తమతమ భావాలని రాయడానికి చందోరహిత మార్గాలలోంచి వచన పద్యం అనో వచన కవిత అనో పేరు పెట్టి… కవితా వస్తువుని “కధా చట్రం” నించి విడిపించి… ఒక భావస్వేచ్చని సాధించినది ఇవాళ్టి ఆధునిక కవులు కాదా?? మీ అందరి ప్రశ్నలూ లేదా సందేహాలూ గనక ఈ కవిత్వానికి లక్షణ నిర్దేశం చేయడం కోసమే అయితే అందుకు ఈ కవితాప్రక్రియలో చేయితిరిగిన వారి పద్యాలని 🙂 అదే “వచన పద్యాలని” మీలాంటి వారెవ్వరైనా పరిశీలించి కొన్ని లక్షణాలని కనుగొనవచ్చునే?? అందుకు మీకు కవిత్వం కావాలీ గానీ… కవుల సృజన ప్రక్రియ తాలూకు రహస్యాలతో ఏంపనీ?? ఈ ప్రశ్నని కవులని అటుంచండి కాసేపు. అసలు ఏ కళాకారులనైనా మీరడిగినా వాళ్ళు నిజంగా వివరించగలరా అన్నది నాకు సందేహమే!!
ఇంతమంది స్త్రీలు ఇన్ని వేలతరాలుగా పిల్లల్ని కంటున్నా పురిటి నొప్పులు ఇలాంటివని గానీ పిల్లల్ని తొలిగా ముద్దాడినప్పటి అనుభవం ఇలాంటిదనిగానీ విడమరిచి చెప్పగలిగారా?? అందుకు అసలు ఒక భాష ఉందా?? అలాంటి ప్రశ్నలకి వచ్చే జవాబులు నిజంగా మీ సందేహ నివృత్తికి చాలుతాయా?? అసలీ ప్రశ్నలకి జవాబులు ఏ కవికైనా తెలుసునా?? చెప్పగలరా?? మీరే ఆలోచించండి ఒకసారి.
ఇంక లక్షణ నిర్దేశమే చేయజాలని వచన కవితావాక్యంలో మీరు పాద విభజన కోసం చూస్తున్నారు.అసలు మీకు భావ ప్రధానమైన కవితావాక్యంలో భాషకి ముఖ్యమైన వాక్యం తాలూకు రూపాన్ని వెదుకుతున్నారే?? అది కుదిరే పనేనా?? వచన కవితని ఒక్కొక్కరు ఒక్కో రీతిలో చదవ వచ్చునేమో?? దాన్ని ఇక్కడే విరవాలని ఒక నియమంగా ఆ వాక్యాన్ని విభజించనేలేమేమో?? చదివే వారి గొంతుని అనుసరించి భావం ఎప్పుడూ కొత్తగా వినిపించే అవకాశం ఉన్న కవితా ప్రక్రియ వచన కవిత్వం కాగా అది మనకి అలవాటైన వాక్యాల్లో ఉందనే కదా దాన్ని మీరు విభజించను వీలులేదని అనుకుంటున్నారు?? ఇన్ని సమస్యలని ముందుపెట్టుకుని చందస్సుని మనసులో పెట్టుకుని ఆ దృష్టితో వచన కవిత్వానికి కూడా లక్షణ నిర్దేశం చేయచూసినప్పుడు తిప్పలు తప్పవు. వచన కవిత్వంలో పాదవిభజన భాష ప్రకారమో లయ ప్రకారమో జరిగితే మీరన్న చర్చ సులువు. కానీ మీరే వచన పద్యాన్నైనా లోపలో బయటో చదివి చూడండి. అది భావాన్ని అనుసరించి గాని నడవదు. ఎవరి పద్యాన్నైనా సరే !! ఒకరి భాష మరొకరిది కాదు. వాక్యవిన్యాసం ఎప్పుడూ భావస్పోరితంగా మాత్రమే నడుస్తుంది. ఇందుకు మీరు లక్షణ నిర్దేశమే చేయగలిగితే అప్పుడు మీకు ఇప్పటి వరకూ అమలులో ఉన్న నియమాలు పనికిరావు. కొత్త లక్షణ సూత్రాలు అనువర్తిస్తాయి. వాటిని తయారుచేసుకోవాలి. అది ఆలంకారికుల పని. మనకి కొత్త కవిబృందం తయారై ఉంది గానీ మరి ఈ ప్రక్రియకి కొత్త ఆలంకారికులు లేదా అలాంటి వారెవరో వారు మాత్రం ఇంకా తయ్యారవలేదు. సంపత్ కుమార శిక్షణ పాత సంప్రదాయం లోనిది. ఆయన ఆలోచనలు అందులోంచి తయారైనవి. అందుకే ఆయన వ్యాఖ్యానాలు గానీ లేదా ఆ తరహా ఇతరులు వేస్తున్న ప్రశ్నలు గానీ మారిన ఇవాళ్టి కవితావాక్యానికి నప్పడం లేదు. అలాగే మాధవ్ వ్యాసం నిండా కూడా బోలెడన్ని అవకతవక వాక్యాలున్నాయి. అవన్నీ అయోమయమైన ప్రకటనలే చాలావరకూ!! అందువలన వచన కవులనించి వారి సృజనకి సంబంధించిన ప్రశ్నలకి జవాబులనీ రాబట్టే దిశగా కన్నా… ఉన్న కవిత్వానికి కొత్త నియమాలున్నాయేమో అనే దిశగా కొత్త ఆలోచనలు చేస్తే మంచిది బహుశా .
మీలాంటివారెవరైనా ఇందుకు ప్రయత్నించవచ్చు. ప్రయత్నించండి మరి.
రమ.
నా అమెరికా ప్రయాణం గురించి Giri అభిప్రాయం:
01/28/2011 7:46 am
గురువు గారు,
నమస్కారము. మీరు ఏమి రాసినా చాలా బాగుంటుంది. చాలా ఆత్మీయంగా ఉంటూంది. నా మైల్ ఈడ్ కి మీ ఫొటొ పంపించగలరా?
ఇట్లు
బందా గిరి బాబు
ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి Kameswara Rao అభిప్రాయం:
01/28/2011 2:20 am
రమగారూ,
నేనసలు కవుల జోలికే పోలేదండి! తమ కవిత్వంలో పదాలని రకరకాల అర్థాలలో ప్రయోగించే స్చేచ్ఛ కవులకి ఎప్పుడూ ఉంది. అది లేకపోతే కవిత్వమే లేదు. నేను చెప్పినది విమర్శలు, లక్షణ చర్చల విషయంలో. అందులోని పరిభాషకి స్పష్టత నిర్దిష్టత అనివార్యం కదా.
ఈ చర్చని ఈనాటి వచన కవులు చదవలేదంటే అది ఆ కవుల తప్పు కాదా? ఇందులోని అభిప్రాయాలని పరిగణించాల్సిన అవసరం లేదు. కాని విషయం ముఖ్యమైనది అనుకున్నప్పుడు, దాని గురించి తమ అభిప్రాయాలని చెప్పాలి కదా. వచనకవిత్వ రూపాన్ని గురించి, పాదవిభజన గురించి మరింత అవగాహన కవులకి, పాఠకులకి అవసరమని మీరు ఒప్పుకుంటున్నారు కదా. అలాంటప్పుడు కనీసం ఈ చర్చ ద్వారానైనా కవులు ముందుకువచ్చి తమ అనుభవాలనూ, ఆలోచనలనూ పంచుకుంటే బాగుంటుంది కదా?
మాధవ్ గారూ,
పద్య నిర్మాణపు చట్రం గురించి మీరు ఆసక్తికరమైన ఉదాహరణ ఇచ్చారు. పాటకి స్వరం మౌలిక లక్షణం. మీరు చెప్పిన ఇతర “గీత” లక్షణాలు “పాట”లన్నిటికీ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ దాన్ని పాటగా “స్ఫురింప”జెయ్యడం అంటూ ఏమీ లేదు. అది ముమ్మాటికీ సిసలైన పాటే! పాదవిభజన కవితకి అలాంటి మౌలిక లక్షణం కాదని నేను భావిస్తాను. అయినా మీరు “స్ఫురణ” విషయంలో చెప్పింది నాకు అర్థమయ్యింది. పాదవిభజన చెయ్యడం వలన అది కవిత అన్న స్ఫురణ ఎందుకు కలుగుతోంది అన్న విషయమై ఆలోచించాలి. కేవలం పరంపరగా కవిత్వం పాదబద్ధం కావడం మూలాన ఆ స్ఫురణ కలుగుతోందంటే, అది అంత విలువైన విషయం కాదు. కాలాగతిలో అది చెరిగిపోతుంది. అంతకన్నా విలువైన ప్రయోజనం ఉందా అని ఆలోచించాలి.
ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి rama bharadwaj అభిప్రాయం:
01/27/2011 1:03 pm
కామేశ్వరరావు గారూ !!
మీరు నా అభిప్రాయం విన్న తర్వాత కూడా “పద్యాన్ని” ఇంకా రూప పరంగా చూస్తున్నారు. వచనకవితా ప్రక్రియ ఆధునిక కాలంలో గణనీయమైన పాత్రనే పోషించిన విషయం ..ఆధునిక కవులు “పద్యాన్ని” రూపపరంగా వాడుక చేయకపోవడం నేను ఈ సరికే ప్రస్తావించి ఉన్నాను. ఇక్కడ మీరు అంటున్న ” అయోమయం” ఈ పదప్రయోగం చేస్తున్న కవులకి లేదు. “శాస్త్రీయత” అని మీరు అనడం నాకు వింతగా అన్పించింది. ఏది శాస్త్రీయతా?? ప్రయోగాలు సృజనకారులే కదా చేస్తారూ?? భాషలో గాని..ఊహల్లో గానీ!! నువ్వు మూడు వక్ర రేఖల్లో ఆడదాని బొమ్మ ని గీస్తావేమయ్యా అని ఎవరన్నా పికాసో ని ప్రశ్నిస్తే పికాసో ఏం జవాబు చెప్పాలీ?? లేదా అసలు ఏమన్నా ఒక జవాబు ఆయన ఇచ్చి ఉండేవాడా?? శాస్త్రాన్ని దాటి తన స్వాతంత్రాన్ని చూపేవాళ్ళే సృజనశీలులు.
అసలింతకీ నాదో సందేహం సుమా !!. ఈ చేరా.. సంపత్కుమారల చర్చని ఎంతమంది ఇవాళ్టి వచన కవులు చదివేరూ?? ఎంతమంది వీరి అభిప్రాయాలని పరిగణించారూ?? ఒక చర్చ నిజంగా అది ఉద్దేశ్యించిన వర్గానికి గనక అందకపోతే చర్చగా అది బోల్తాపడ్డట్టే కదా!! పాయింట్లు చాలని చర్చని ఎంత సాగదీస్తే మాత్రం ఫలితం ఏముందీ??
రమ.
ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి Madhav అభిప్రాయం:
01/27/2011 12:21 pm
కామేశ్వర రావు గారూ – నా ఉద్దేశాలని స్పష్టంగా చెప్పనందుకు క్షమించండి.
1. ఒక రచన బారుగా కాకుండా పొట్టీ పొడుగు పాదాలుగా విరక్కొట్టి రాయబడ్డది చూడగానే అది కవిత్వ రచన (లేదా ఈ రచన కవిత అని రచయిత ఉద్దేశిస్తున్నాడు) అనే స్ఫురణ రావడం సహజం. దూరపు ఉదాహరణ ఒకటి: గుల్జార్ పాటలు కొన్ని శుద్ధవచనాలు. అంటే గీతలక్షణాలు – ప్రాస, పల్లవి, చరణం ఇలా – లేనివి. ఏ బర్మనో, రహ్మానో వాటికి స్వరం ఇచ్చి పాటగా వాటిని స్ఫురింపజేశారు. (మేరా కుచ్ సామాన్ పాటకే అనుకుంటాను, ఆ సాహిత్యం చదివి ఆర్.డీ. బర్మన్ గుల్జార్తో “రేపు టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో వార్తలకి నన్ను ట్యూన్ కట్టమంటావు” అని అన్నాడని ఒక పిట్టకథ.) పద్య నిర్మాణ చట్రం అని నేనన్నది ఈ స్ఫురణను కలిగిస్తున్న రూపం. ఈ స్ఫురణనే నేను కవితా లక్షణం అన్నది. ఎందుకంటే ఒక్కసారి ఆ స్ఫురణ కలిగినతర్వాతే గదా మనం ఆ రచనని కవిత అన్న దృష్టితో చదువుతాం. అందువల్లనే పాదవిభజన లేదా బద్ధత వచన కవితకి ఒక నిర్మాణ లక్షణం (ఆభాసమైనది) అని నాకు తోచింది. అయితే ఇది నియతం కాదు. కవి ఇష్టాఇష్టాలపై ఆధారపడింది. పాదబద్ధత అనేది నియతమైన నిర్మాణలక్షణంగా అనిపిస్తున్నదేమో. అందుకని పాదవిభజన అని మాత్రమే వాడతాను.
ఈ పాదవిభజన మీరన్నట్టే కవిత కవితకీ ప్రత్యేకం. అది కేవలం కవ్యుద్దిష్టమే. సందేహమేమీ లేదు. ఉండచ్చూ, ఉండకపోవచ్చు కూడా. చంద్ర దుఃఖం కవిత పాదవిభజన లేకపోవడం వల్ల మరింత తీవ్రమయింది. అదేవిధంగా ఆయన ఇతర కవితల్లో చేసిన పాదవిభజన. అందువల్ల కవికి తన ఏ కవితను ఏ రూపంలో ప్రచురించాలీ అన్న విషయంపై స్పష్టమైన అవగాహన ఉన్నదని తెలుస్తున్నది. మీరుదహరించిన కవితలో భూషణ్ కూడా ఒక కారణం తోటే ఆ పాదవిభజన చేసుండాలి. పాదవిభజన చేస్తున్నప్పుడూ, చేయనప్పుడూ కూడా కవికి తన కవిత నిర్మాణంపై స్పష్టత ఉండాలని మాత్రమే నేనంటున్నది.
2. “పాఠకుడికి ఒక విరామం ఇవ్వడం గురించే, అది ఎలా ఇవ్వాలనే గదా భావగణాల ప్రస్తావనంతా!” – ఈ వాక్యం రాస్తున్నప్పుడే ఇది అపోహకి తావిస్తుందనే అనుమానం నాకొచ్చింది. అప్పుడే సరిదిద్దుకోపోవడం నేను చేసిన తప్పు. నా ఉద్దేశం సంపత్కుమార భావగణాలు చదువరికి విరామం ఇవ్వడానికి ఉద్దేశించారని కాదు. భావగణాలను ఆయన ఏ రకంగా ఉద్దేశించారో అర్థం చేసుకుంటే ఆ రకంగా కూడా ఆలోచించడం ద్వారా కవికి తన పాదాల విరుపులో (కవిత నిర్మాణంలో) మరికొంత స్పష్టత రావడానికి ఆస్కారముంది, అని నా ఊహ. కేవలం అంతే.
3. సాధారణీకరణ గుఱించి ఆలోచించే కన్నా, ఒక కవితలో సౌష్టవం తగినంత పాళ్ళలో ఉందా లేదా, కవితా నిర్మాణం అందులోని భావాన్ని పాఠకులకి అందించడానికి సహాయపడుతోందా లేదా అన్నదే ఆలోచించడం మేలని నేననుకుంటున్నాను.
కవితానిర్మాణం – పాదవిభజనతోనో, లేకుండానో, సౌష్టవం, లయ, గతులతోనో, అవేమీ లేకుండానో, మరేదైనానో – ఒక కవితని పాఠకుడు అనుభవించడంపై ప్రభావం చూపుతుందని నా అభిప్రాయం. అందువల్ల కవులు ఈ నిర్మాణంపై మరింత శ్రద్ధ చూపాలని, అందులో మెళకువలు అర్థం చేసుకోవాలనే నేనంటున్నది కూడా. అయితే, ఈ లక్షణాలని సాధారణీకరించమనిగాదు నా ఉద్దేశం. సాటి కవులు లేదా విమర్శకులు, ఏ కవి తన ఏ కవితలో ఎటువంటి నిర్మాణాన్ని వినియోగించాడు, అందువల్ల కవితకి మేలు జరిగిందా, హాని జరిగిందా? ఎలా? అని చర్చిస్తే, ఒక నిర్ధారణకు వచ్చినా లేకున్నా, ఆ చర్చలు ఈ విషయంలో ఇతర కవులకి, ఔత్సాహికులకీ ఉపయోగపడతాయని నేనన్నది. కవిత్వ విమర్శలో ఈ నిర్మాణ ప్రసక్తి లేకపోవడం ఒక లోటే (రూపవాదులని ఆక్షేపిస్తారని భయం కాబోలు). ఆ లోటు తీరాలనే నా కోరిక.
ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి Kameswara Rao అభిప్రాయం:
01/27/2011 5:37 am
రమగారూ,
“పద్యం” అన్న పదాన్ని “కవిత” అనే అర్థంలో కొంతమంది కవులు, విమర్శకులు వాడారన్న విషయం నాకు తెలుసు. అయితే అది శాస్త్రీయం కాదన్నదే నా అభిప్రాయం, దానికే నా ముందు వ్యాఖ్యలో హేతువులు చూపెట్టాను. ముఖ్యంగా అలాంటి వాడుక అయోమయానికి దారితీసే అవకాశం ఉంది. ఇప్పటి చర్చాంశమైన వ్యాస పరంపరలో, “వచన పద్యం” అన్న పదంలో పద్యం అంటే పాదబద్ధత ఉన్న రచన అనే ఉద్దేశ్యంలోనే తీసుకున్నారు కాని కేవలం “కవిత” అనే అర్థంలో తీసుకోలేదు. వచనకవితలని వచనపద్యాలు అనుంటున్నాం కాబట్టి అవి కచ్చితంగా పాదబద్ధం కావలసిందేనని సంపత్కుమారగారన్నారు. దాన్ని చేరాగారు కూడా ఖండించ లేదు! కవిత అనే అర్థంలో మాత్రమే “వచనపద్యాలు” అని, అవి వచనపద్యాలు కాబట్టి వాటికి పాదబద్ధత ఉండాలనడం సరైన వాదన కాదు కదా!
వచనకవితా స్వరూపాన్ని గురించి వచనకవులు మరింతగా చర్చించాలన్న విషయమై మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. నా వ్యాఖ్యలోకూడా అదే అన్నాను. అలాంటి చర్చ చెయ్యడానికి అడ్డంకి ఏముంది? ఈమాటలో వ్రాసే/ఈమాటని చదివే వచనకవులు/కవయిత్రులు ఇప్పటికీ ఈ చర్చలో ఎందుకు పాల్గొనటం లేదో మరి!
మాధవ్ గారూ,
“ఎంత అకవిత్వమైనా, పద్య నిర్మాణపు చట్రంలో ఉండటంతో దానికి కొంత కవితాలక్షణం వస్తుంది.” ఇక్కడ “పద్య నిర్మాణపు చట్రం” అంటే ఏమిటన్నది నాకు పూర్తిగా అర్థమవ్వలేదు. పాదబద్ధతా? లేక అక్షర, గణ, మాత్రా ఛందస్సా? అలాగే ఆ చట్రంలో ఉండటం వల్ల వచ్చే “కవితాలక్షణం” ఏమిటన్నది కూడా స్పష్టం కాలేదు.
“పాఠకుడికి ఒక విరామం ఇవ్వడం గురించే, అది ఎలా ఇవ్వాలనే గదా భావగణాల ప్రస్తావనంతా!”. రెండిటికీ తేడా ఉంది. ఎక్కడ విరామం ఇవ్వాలన్నది కవి ఊహబట్టి, కవిత బట్టి ఉంటుంది. దాన్ని భావము, భావాంశము అనే చట్రంలో బిగించడం సాధ్యం కాదు. ఒక కవితలో ఒక భావం పూర్తి కాకుండానే సగంలో పాఠకుణ్ణి హఠాత్తుగా ఆపాలని కవి అనుకుంటే, అక్కడ మధ్యలో పాదాన్ని ఆపవచ్చు. అది సంపత్కుమారగారు నిర్వచించిన “భావాంశం” అని చెప్పలేం. ఉదాహరణకి ఈ నెల ఈమాటలో వచ్చిన భూషణ్ గారి “శిశిరచిత్రాలు” కవితలో ఈ పంక్తులు చూడండి.
కలిసిన రోజుల
రంగురంగుల
జ్ఞాపకాల ఆకులను
పెళుసు కొమ్మలతో
దులుపు కోవడమే
మేలు.
…
ప్రేమగా వీచినా అసలు
ఆకులు రాల్చనంది
ఇక్కడ “రంగురంగుల” అన్నది ఏ కోశానైనా భావాంశం అవుతుందా? “ప్రేమగా వీచినా అసలు” అన్న వాక్యంలో భావం కాని భావాంశం కాని పూర్తయ్యిందా? అయినా కవి పాదాలని అక్కడ విరిచాడంటె ఎందుకు? సంపత్కుమారగారు ఇలాంటి వాటిని exceptionsగా లేదా ఛందోదోషాలుగా పరిగణించారు. ఒక చట్రాన్ని ఊహించి దానికి లొంగని వాటిని దోషాలుగా పరిగణించడం కన్నా, ప్రతి కవితకీ తనదైన చట్రం కవి గీసుకుంటాడని అనుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీరు ప్రస్తావించిన సౌష్టవం విషయమై కూడా నాదిదే అభిప్రాయం. సాధారణీకరణ గుఱించి ఆలోచించే కన్నా, ఒక కవితలో సౌష్టవం తగినంత పాళ్ళలో ఉందా లేదా, కవితా నిర్మాణం అందులోని భావాన్ని పాఠకులకి అందిచడానికి సహాయపడుతోందా లేదా అన్నదే ఆలోచించడం మేలని నేననుకుంటున్నాను. ఇంగ్లీషు సాహిత్యంలో కవితా నిర్మాణం గురించి సాధారణీకరణలేమైనా చేసారేమో అందులో పరిచయమున్నవారెవరైనా చెప్పాలి. అది మనకి ఉపయోగపడే అవకాశం ఉంది.