ద్వానా శాస్త్రి
జీవిత విశేషాలు
పండితుడు, అధ్యాపకుడు, రచయిత ద్వానాశాస్త్రి (1948 – 2019). 1970లో రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టిన ద్వానాశాస్త్రి విమర్శనా సాహిత్యానికి పెద్దపీట వేస్తూ అనేక వ్యాసాలు, పుస్తకాలు రాశారు. వివిధ పత్రికలు, పుస్తకాల్లో వేలాది వ్యాసాలూ రాశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ద్వానా సొంతం. కవి, పరిశోధకుడు, రచయిత, విమర్శకుడిగా ఎన్నో రచనలు చేసినప్పటికీ దర్పాన్ని ప్రదర్శించని నిగర్వి. గడిచిన 46 ఏండ్లలో ఆయన వేలాది వ్యాసాలు, కథలు, పుస్తకాలు ప్రచురించాడు.