ఇసుకపల్లి లక్ష్మీనరసింహశాస్త్రి


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

ఇసుకపల్లి లక్ష్మీనరసింహశాస్త్రి తెలుగు సాహిత్యంలోని ఆధునిక యుగానికి చెందిన ప్రముఖ రచయిత. ఆయన ప్రసిద్ధ రచనలలో 1967లో ప్రచురితమైన “స్వప్నవాసం” నవల, “ఇంటి దయ్యాలు”, “ఉత్తమా యిల్లాలు” వంటి కథలు ప్రముఖమైనవి. ఆయన రాసిన కథలు ‘భారతి’, ‘జయశ్రీ’ వంటి పత్రికలలో ప్రచురితమయ్యాయి.


 

తెల్లారిన తర్వాత కూడా రాగిణి అట్లాగే మూలుగుతూ ఉంది. దాసు దగ్గరకు వెళ్ళదామంటే మనస్సొప్పటంలేదు. తనను ఏమన్నా అంటాడేమోనని అభిమానంతోనే ఉండిపోయింది. డాక్టరు వచ్చి చూసిపోయాడు. ఫీజు క్రింద మూడు రూపాయలు చెల్లించుకుంది. నోటు మారిస్తే ఇంకా రెండు రూపాయలే మిగిలినాయి. మందు వ్రాసి ఇచ్చాడు కొనుక్కుని రమ్మనమని. ఆదుర్దాగా బజారు వెళ్ళి కనుక్కుంటే, నాలుగున్నర చెప్పాడు. అలాంటివి మూడు ఇవ్వాలిట కూడాను. అంబిక కంగారుపడిపోయింది. ‘ఎట్లాగు?’ అని గాభరా పడిపోతోంది.