గాయపడిన కాకి చుట్టూ
జాతిప్రేమ గొంతు చించుకుంటుంది
తేనెటీగల సమష్టి ప్రేమబంధం
నెనరింకిన నాలుకలమీద తీపి సంతకం చేస్తుంది
తోకల రాజేశం
జీవిత విశేషాలు
తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, విద్యావేత్త తోకల రాజేశంగారు 9వ తరగతి నుంచే పద్యాలు రాయడం ప్రారంభించారు. కవితలు, విమర్శనాత్మక వ్యాసాలు, సాహిత్య సమీక్షలు రాయడంలో మంచి పేరు తెచ్చుకున్నారు. తన స్వగ్రామంలోని పాఠశాలలో చదువుతున్న ఇరవైమంది విద్యార్థులతో స్వయంగా శతక పద్యాలు రాయించి, వారిలో సాహిత్య స్పూర్తిని నింపారు.