ఒకరితో ఒకరు
గొడవ పడవలసిన అవసరం
అంతకన్నా లేదు
గోడమీద పిల్లిలాంటివారు
పంచన చేరితే చాలు
అంతరాలెరుగని ఆత్మీయుల మధ్య
తీరని అగాధం ఏర్పడడానికి-
తేళ్ళపురి సుధీర్ కుమార్
జీవిత విశేషాలు
అనేక పురస్కారాలు అందుకున్న తేళ్ళపురి సుధీర్ కుమార్ గారు ప్రముఖ కవి, రచయిత, విశ్లేషకులు. సామాజిక అంశాలు, జీవన శైలి, సమకాలీన రాజకీయాలపై స్పందిస్తూ విభిన్న కవితలు, వ్యాసాలు రాస్తున్నారు. ఆయన కవితలలో “త్యాగాల నిలయం” వంటివి పాఠకుల ప్రశంసలను అందుకున్నాయి. అక్షరాల ద్వారా తన భావాలను స్పష్టంగా, లోతుగా వ్యక్తపరిచే రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.