గుడిపాటి వేంకటాచలం


సొంత ఊరు:
మద్రాసు
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

చలంగా ప్రసిద్ధుడైన గుడిపాటి వేంకటాచలం (1894-1979) సుప్రసిద్ధ రచయిత, వేదాంతి, సంఘసంస్కర్త. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్యవ్యక్తుల్లో చలం ఒకరు. చలం రచనలు చాలావరకు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకున్నవి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక, మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానాలను చర్చించాడు. చలం రచనలలో ఇతివృత్తమూ, తాత్వికతా, రచనాశైలీ ఆయనకు ఆధునిక తెలుగు రచనారంగంలో అనన్యమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి.


 

“ప్రియా, ఈ మహావిశ్వంలో ఏ నక్షత్రాల మధ్య ఏ లోకంలో ఉంటావో తెలుసుకోలేకపోయినాను.”
“నేనేం తెలుసు నీకు?”
“..నువ్వెవరో నాకు తెలీకపోతే నువ్వెవరో నీకు కూడా తెలీదు.”