కాని, ఈ దేశపు విద్యను ఆధునికీకరించడానికి అనుసరించవలసిన పద్ధతులు ఏమిటీ అనే విషయం మనం ఇప్పటికీ చర్చించలేదు. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా – మనకున్న పాత సంప్రదాయమంతా గొప్పదే, అంచేత గురుకులాల్ని మళ్ళీ పునరుద్ధరించాలని నేను కోరడం లేదు. మన విద్యల్ని ఆధునికీకరించడానికి మనకు నప్పే పద్ధతుల్ని అన్వేషించాలి. గుడ్డిగా అనుకరించనూ కూడదు. మనదంతా గొప్పదని పిచ్చిగా నమ్మనూ కూడదు. చివరిగా ఓ మాట చెప్పనివ్వండి – జ్ఞానానికి భౌగోళికమైన సరిహద్దులు లేవు. అజ్ఞానానికి మాత్రం వుంటాయి.
ఎన్. గోపి
జీవిత విశేషాలు
ఆచార్య ఎన్. గోపి తెలుగు పండితుడు, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగానికి అధ్యక్షుడిగా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపసంచాలకునిగా పని చేశారు. నాలుగు పంక్తుల్లో మొత్తం 20 నుండి 25 అక్షరాలతో సాగే నానీలు అనే సూక్ష్మ కవితా పద్ధతిని తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టారు. అధ్యాపక వృత్తిలో చాలా ఏళ్లు పనిచేశాడు. ఇతని భార్య ఎన్.అరుణ కుడా పేరు పొందిన కవయిత్రి. పదవీ విరమణ చేసేటప్పడికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగంలో డీన్ గా పనిచేశాడు. 11 కవితా సంకలనాలతో సహా దాదాపు ముప్ఫై పుస్తకాలు ప్రచురించారు.