ఆ మాటలలో తెలుగు వానికి అస్థిమూలగతమై ఒనరెడు సినిమాల పిచ్చి అతగానికీ గలదని, చిరంజీవి నట కుటుంబమన్న ఒళ్ళు మరచునని తెలిసికొని నవ్వితిని. చిరంజీవి సినిమా పాటలన్న ప్రాణమని, ఆ పాటలు చెవుల బడినంతనే అశక్తుడై ఆనందము ఆపుకొనలేక బ్రేక్‌నృత్యము కూడా చేయబూనునని తెలిసి అమేజ్మెంటు నొందితిని.

విష్ణువు అంటాడు కదా, ‘నువ్వు నన్ను వదిలిపోయినప్పటి నుంచీ, ఇదిగో ఈ పుట్టలో నిన్నే తలుచుకుంటూ కూర్చున్నాను. పశులకాపరి నా తల పగలగొట్టినప్పుడు ఆ బాధకు ఓర్చి నేనిలా ఉన్నానంటే అది నీ మహిమే. నీ పాతివ్రత్య నిష్ఠ చేతనే నేనింకా బతికున్నాను. అదలా ఉంటే, ఈ ఆకాశరాజ కన్య నన్ను మోహించి నా వెంటపడింది. అందుకామెను పెళ్ళిచేసుకోవలసి వచ్చింది. అది కూడా నువ్వు ఒప్పుకొంటేనే సుమా! నువ్వు కాదంటే నాకీ పెళ్ళి వద్దు.’ ఇవీ ఆయనగారి మాటలు! అయినా అమ్మవారి దగ్గరా ఆయన మాయలు?

“నువ్వు స్వర్ణకమలం సినిమా చూశావు కదా? అందులో శ్రీలక్ష్మి వినాయకుని పటానికి హారతి పడుతూ- శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అంటూ ఆంజనేయ దండకం చదువుతుంది గుర్తుందా? అది గుర్తుకు వచ్చి నవ్వుతున్నాను.”

“అదేమిటి, నేను చదివింది ఆంజనేయ దండకం కాదుగా? శుక్లాంబరధరం వినాయకుడి స్తోత్రమే కదా!”

ఎడిటింగ్ పని మొట్టమొదటిగా ‘శ్రీరస్తు’ రాసి కాగితం మీద కలం పెట్టినప్పుడే మొదలవుతుంది. (రాతకోతలని కావాలనే జంటకట్టారేమో ఆ పనులని!) కాగితం మీద జరిగే ప్రతీ ఒక కొట్టివేత, ఒక రచయిత కూర్పరి భూమికను భరించి చేస్తున్న పనే. క్లుప్తతకీ ప్రభావానికీ మధ్య సమన్వయం కలిపించడమే కూర్పరి పని.

ఆత్మహత్య గురించి ఆలోచన వచ్చినప్పుడల్లా వాడికి సోమాలీ గుర్తొస్తాడు. ఇటలీలో మిలానో స్టేషన్‌‌లో వాడిని ఆకలితో చనిపోనివ్వకుండా కాపాడినది సోమాలీనే. సోమాలీ అన్ని దేశాలూ తిరిగాడు కాబట్టి ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ఆత్మహత్య శ్రేష్టమైనదన్నట్టుగా కొంత పరిశోధన చేసిపెట్టుకున్నాడు. బెల్జియంలో డ్రగ్స్; ఇటలీలో తుపాకీతో కాల్చుకోవడం; ప్యారిస్ అంటే ఇంకేముంటుందీ? ఈఫిల్ టవర్ ఎక్కిదూకడమే!

యాత్రల్లో పరాయివాళ్ళు సొంతవారయిపోతారని, దూరం దగ్గరవుతుందని, మన మనసులు విశాలమవుతాయనీ తెలుసుకొన్నారట. 2009లో మొట్టమొదటిసారి విదేశీ ప్రయాణం చేస్తూ నేపాల్ వెళ్ళినపుడు కొత్త మిత్రులతో, ఐయామ్ ఫ్రం ఇండియా! అని అంటూ వింత అనుభూతికి లోనయిన మనిషి కాస్తా 2016లో బ్రెజిల్ దేశంలో ఎవరో ‘ఇండియన్‌వా?’ అని అడిగినపుడు, ‘కాదు. గ్లోబియన్ని!’ అని చెప్పారట.

నా కలల వాకిట్ల ముగ్గుబెట్టి
దినాం రంగులద్దిపోయే అమ్మ
పరిగేరటం ఆపి ఉరుక్కుంటావచ్చి
గుడ్లల్ల నీళ్ళు తీసుకున్నట్టే అనిపిత్తది
వీపు నిమిరి దగ్గరకు దీస్కుని ధైర్నం జెప్పే
నాయిన కళ్ళముందు మెదిలినట్టే ఉంటది
సోపతి గాళ్ళందరు మతిల కొచ్చి సొదబెట్టినట్టే ఉంటది

మేం వుంటున్న యింటి యజమానురాలు శాకాహారి కాదు. అయినా శర్మకు అభ్యంతరం కలిగేలా ఏనాడూ ప్రవర్తించకపోవటాన మేం మరో చోటికి పోవల్సిన అవసరం కలగలేదు. ఆవిడకి బంగారపు బొమ్మలాంటి కూతురు వుండేది. రోహిణి ఆ అమ్మాయి పేరు. అప్పటికే వివాహితుడు కావటం మూలానా, పైగా పరస్త్రీని చూడకూడదనే నియమం కలవాడు కావటం మూలానా శర్మ ఆ అమ్మాయి సంగతే పట్టించుకునేవాడు కాదు. నాకు మాత్రం ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా నరాలు జివ్వుమనేవి.

మరణముఖమును అరయుచున్నను ఇంత చక్కగ, నింత భావస
మంచితంబుగ నల్లినాడవు మేదినీసుర! నీదు కవితను

నీదుమహిమను నేనెఱుంగక నీకు వేసితి నిధనశిక్షను.
నాదు సుతపై నీదు ప్రేమము ఉత్తమాశయయుత మద్వితీయము.

ఈ మునిమాపు వేళ
గుబురుకున్న పొదలమధ్యలోంచి
తాటిచెట్ల నీడలు మొలిచినట్టున్న
వూరి అంచులోకి
నా నడకకు
సందిగ్ధంగా దారిగీస్తూ
అక్కడేదో ఓ మలుపు –

ఈ పాటలను ఎలా పాడాలి, ఎవరైనా పాడియున్నారా అనే విషయము నాకు తెలియదు. కాని ఇట్టి పాటలను అందఱు పాడే విధముగా ఒక స్థాయి కన్న తక్కువగా ఒక half octaveలో ఇమిడేటట్లు పాడుకొంటారు. అందు వలన సంగీతములో తరిఫీదు ఉన్నవారు, మంచి శారీరము ఉన్నవారు మాత్రమే వీటిని పాడుటకు అర్హులు అని భావించరాదు.

గడినుడి 10కి ఈసారి చాలా ఆలస్యంగా ఇద్దరు మాత్రమే తప్పుల్లేని పరిష్కారాలు పంపగలిగారు. అన్ని సమాధానాలూ సరిగా పంపిన ఈ ఇద్దరు విజేతలకు అభినందనలు: […]

గడినుడి 10కి ఈసారి చాలా ఆలస్యంగా ఇద్దరు మాత్రమే తప్పుల్లేని పరిష్కారాలు పంపగలిగారు: 1. రవిచంద్ర ఇనగంటి, 2. శ్రీవల్లీ రాధిక. అన్ని సమాధానాలూ సరిగా పంపిన ఈ ఇద్దరు విజేతలకు అభినందనలు.

గడి నుడి – 10 సమాధానాలు, వివరణ.

“నేను ఒంటరిని. మీరు ఒంటరి. మనం పరస్పరం స్పర్శించుకున్న క్షణాల్లో కూడా మనతో మన ఒంటరితనం.” అని ముగిస్తాడు నడచి వెళ్ళిన దారి అనే కథను డా. వి. చంద్రశేఖరరావు. వర్తమాన తెలుగు సాహిత్యంలో అతనిది ఒక విభిన్నమైన పంథా. ఒక ప్రత్యేకమైన కథనం. కథనం గురించి ఏ వొక్కమాట అనబోయినా రూపవాదులని ముద్ర వేస్తున్న ప్రతికూల వాతావరణంలో కూడా ఆయన ప్రపంచ సాహిత్యాన్ని, ప్రత్యేకించి లాటిన్ అమెరికన్ సాహిత్యాన్ని, లోతుగా చదువుకుని తనదంటూ ఒక అద్భుతమైన కథన పద్ధతి సృష్టించుకుని గొప్పగా కథారచన చేశాడు. కాఫ్కా తన రచనల్లో ఎక్కడా ఒక్క మాట కూడా చెప్పకపోయినా ఆ లోకమంతా ఒక చీజీకటి, వ్యాకులతతో ఒక అర్థరహితమైన వాతావారణం పరచుకుని ఉండడం కాఫ్కా పాఠకులందరికీ అనుభవమైన విషయం. తెలుగులో చంద్రశేఖరరావు ఆ పని చేయగలిగాడు. తన రచనల్లో ఎక్కడా ఒక్క మాట కూడా అనకుండా ఒక భయోద్విగ్న విషాద వాతావరణాన్ని పాఠకులకు అనుభవైకవేద్యం చేశాడు. నిజజీవితంలో ఎంతో మృదుస్వభావి అయిన చంద్రశేఖరరావు “నా కథలు, నాలోపలి నిశ్శబ్దాలు, సంచలనాలు, నిలువనీయని ఉద్వేగాలు. నేను నడచి వచ్చిన కాలాన్ని, దాని నడకల్ని, మనుషుల్ని, మనుషుల కలల్ని, గాథల్ని, వాళ్ళ గాయాల్ని రికార్డు చేశాయి.” అని చెప్పుకున్నాడు. తనదంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెలుగు సాహిత్యంలో రికార్డ్ చేసి తాను మాయమైపోయాడు.

మాజిక్ రియలిజంను – మాంత్రిక వాస్తవికత – నిర్దుష్టంగా నిర్వచించడం సాధ్యంకాదు. వేర్వేరు రచయితల మాజిక్ రియలిజం పద్ధతుల మధ్య చాలా తేడాలు కనబడతాయి. చంద్రశేఖరరావు కూడా తనదైన చిత్రమైన మాంత్రిక వాస్తవికతను క్రమంగా సృజించుకోగలిగారు. ఆ తర్వాత ఆయన రాసిన కథలన్నింటిలోనూ అదే మౌర్నింగ్ వాతావరణం, గుడ్డసంచి భుజానికి తగిలించుకుని తిరిగే మోహనసుందరం, పూర్ణమాణిక్యం, మోహిని, పార్వతిలాంటి అవే పాత్రలూ, అదే విషాదభరిత కథనమూ…

“హైదరాబాదు జర్నలిస్టు కాలనీలో (ఇప్పుడది అపోలో హాస్పిటల్ దగ్గర వుంది.) చిన్న ఇల్లు కట్టుకున్నాను. దానికి సీతమ్మ గడప అని పేరుపెట్టుకున్నాను. బావుందా?” అని అడిగారు. “చాలా బావుంది. మొత్తానికి విశాఖ వాసన వుంది. గడపలు, వలసలు అక్కడివే కదా…” అన్నాను. ఆనందించారు. కాని పాపం ఆ ఇల్లు నిలుపుకోలేకపోయారు.

చాలామందికి పెయింటింగ్ అంటే కేన్వాస్ మీద ఆయిల్ కలర్స్‌తోనో ఆక్రిలిక్ రంగులతోనో వెలుగునీడలు చూపెట్టడంతోనే చిత్రంలోని ఆకారంలో చైతన్యం వస్తుంది. ఇది రేఖలతో సాధ్యం కాదనుకుంటారు; రేఖలు ‘కళ’ కిందికి రావనీ గీతలు, రేఖలనే స్ట్రోక్‌లతో నిండిన ఆకారాలను వట్టి ‘ఇలస్ట్రేషన్’ అనుకుంటారు. నిజానికి చిత్రకళకి అలాటి నియమం ఏదీ లేదు.

హరికి ఎందుకో కంగారుగా ఉంది. ముఖం నిండా చెమటలు పడుతున్నాయి. ఏదో చెడ్డవార్త వినాల్సి వస్తుందనే భావం లోలోపల గుబగుబలాడుతోంది. అతని గుండెల్లో పదేపదే భయంలాంటి కంగారు లాంటి భావం. “తీతువు అరుపులాగా నా గుండెల్లో ఈ శబ్దం ఏమిటి? ఏ ఉపద్రవం రానుందో?” అని దిగులుపడ్డాడు.