వలస పాలన సమయంలొ రచించినప్పటికీ, ఫకీర్ మోహన్ సేనాపతి నవల ఛ మన అఠ గుంట అన్యాపదేశ ప్రస్తావనల ద్వారా, వ్యంగ్యం ద్వారా ఆనాటి భారతీయ సమాజాన్ని, సంస్కృతిని, విశ్లేషణాపూరితంగా వర్ణిస్తుంది. అందువలన, ఫకీర్ మోహన్ సేనాపతి వాస్తవిక ధోరణిలో వ్రాసినప్పటికీ ఆయనను ఒక ఉత్తరాధునిక రచయితగా కూడా చూడవచ్చును.

చుట్టు పక్కలంతా దీపాలు వెలిగినప్పుడు,
కొండెక్కలేని ఒత్తి రెపరెపలు లీలగా…
అతనికి ఉన్నపళాన బెంబేలౌతుంది
‘వెళ్ళొస్తా’ అనడానికి తడారిన నోరు పెగలదు.
వయసు తరుముతున్నవాడిలా
చకచకా, ఒక్క విసురుతో
మెట్లపైకి దూకి పలాయిస్తాడు…

పుప్పొడి అనే కవితలో పంక్తుల సంఖ్య ఆఱు మాత్రమే. కాని అది చదివినప్పుడు కలిగిన అనుభూతి అపారమైనది. 25 సంవత్సరాలకు ముందు కార్ల్ సేగన్ మనమంతా, అంటే ఆ ఆకాశము, అందులోని ఎన్నో పాలవెల్లులు, మన సౌర కుటుంబము, దానిలోని మన భూమి, అందులో అన్ని జీవజాలాలు అంతా ఆ ఖగోళ బీజము నుండి పుట్టిన అణువులు అని చెప్పిన మాట స్మృతిలో నిద్దుర లేచింది.

చుక్కలను తాకకుండ వాటి చుట్టు ముగ్గుపొడితో, తడి పిండితో చిత్రవిచిత్రములైన ఆకారములను సృష్టించుటకు వీలవుతుంది. వీటిని మెలిక ముగ్గులు లేక మువ్వల ముగ్గులు అంటారు. వీటిని జాగ్రత్తగా వేసినప్పుడు ఇందులో ముడులు కనబడుతాయి. ఇవి త్రాటితో లేక త్రాళ్ళతో నేసిన తివాచీలలా కూడ ఉంటాయి. ఇవియే నిజమైన మెలిక ముగ్గులు.

సహజీవన మంటే
అడుగునున్నవా
ళ్ళరుపులు లేకుండా
అడుక్కుంటూ
అడుక్కు, అడుక్కు
మరీ మరీ అడుక్కు
-మరీ మరీ అడక్కు-
ఉండిపోవటం

మూలభారత కథలో దుష్యంతుడు కొద్ది గడియల సేపు మాత్రమే కణ్వాశ్రమంలో ఉండి శకుంతలను లోబరుచుకొని – కణ్వ మహర్షి వచ్చేలోగా వెళ్ళిపోతాడు. కాళిదాసు నాటకంలో దుష్యంతుడు మున్యాశ్రమంలో కొన్ని రోజులుండి, మునులకు రాక్షస బాధ లేకుండా చేసి, శకుంతలతో ప్రణయ కథ నడిపి వెళ్ళిపోతాడు. పిన వీరన దుష్యంతుణ్ణి చాలా రోజులు అక్కడ వుంచి – ప్రణయానికీ విరహానికీ, చంద్రోదయ వర్ణనకూ, యుద్ధ వర్ణనకూ – అన్నిటికీ అవకాశం ఆ సమయంలో కల్పించుకున్నాడు.

కథ అని అనిపించుకోటానికి ఒక రచనకి ఉండవలసిన సహజమైన లక్షణాలు మనకి, పాశ్చాత్యులకీ ఒకటే! ఆ మాట కొస్తే, కథకి ఉండే లక్షణాలు, పాశ్చాత్యుల దగ్గిరనుంచే మనం నేర్చుకున్నాం. కాని, ఆ లక్షణాలని ఒక బిగువైన చట్రంలో బంధించి కథని చూడటం, విమర్శించడం మనం ఇంకా మానేయలేదు. అంతే కాకుండా, కథ లక్షణాలుగా మనం భావిస్తూ, ప్రచారం చేస్తున్నవి బాగా పాతపడిన పద్ధతులని మనం తెలుసుకోవడం అవసరం.

ఏయే దారులంట మళ్ళాలో తెలియని ఎన్నో జీవులు గతి తప్పడం నన్ను అయోమయపరిచేది. గతి ఏమిటని నేను నదిని అడిగాను. ప్రవహించడం మాత్రమే నాకు తెలిసిన విషయం అంది సౌపర్ణిక. గతి ఎవరని మేము శూన్యాన్ని అడిగాము. చుక్కల్ని అడిగాము. సూర్యచంద్రుల్ని అడిగాము. జననమేమిటీ? మరణమేమిటీ? జీవనమేమిటీ? అని మేము చరాచరాల్నీ అడిగాము.

ఏదో పెద్ద ఆఫీసర్ లాగ స్కూలుకు తనకి ఇష్టం ఉంటే వస్తుంది. అలా వచ్చినప్పుడైనా స్టూడెంట్ లాగా వస్తోందా? ఛ!ఛ! నా నోటితో ఎలా చెప్పను? సైకిల్ మీద మగరాయడిలా ధీమాగా పేంట్ వేసుకొని వస్తుంది. బిగుతుగా, ఉన్నదున్నట్లు అందరికీ తెలిసేలా, ఎప్పుడు కుట్లు ఊడి పోతాయేమోనని మనకి భయం కలిగించేటట్లుగా. షర్ట్ వేసుకొని వస్తుంది కదా? పై రెండు బటన్లు పెట్టుకోకుండా అలాగే వదిలేయడం ఎందుకట?

ఆలిండియా రేడియో 1965లో ప్రసారం చేసిన భాస మహాకవి ప్రతిమా నాటకం నుంచి ఒక సన్నివేశం ఆడియో, సంస్కృత, తెలుగు పాఠ సహితంగా ఈమాట పాఠకుల కోసం పరుచూరి శ్రీనివాస్ అందిస్తున్నారు.

!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!

వెల్చేరు నారాయణ రావు (జననం: ఫిబ్రవరి 1, ప్రతి ఏడు కొత్తగా) ఈమాటకి ఆప్తుడు, ఆత్మీయుడు, అంతకంటే ముందు మామంచి నేస్తం. పుస్తకాలు చదువుకోడమన్నా, అందరితో కలిసి కూర్చుని వాటి కబుర్లు చెప్పుకోడమన్నా ఆయనకు గొప్ప సరదా. కానీ అదే సరదా ఇలా ఎనభయ్యో వడిలో పడిపోడంలో చూపిస్తాడని మేం అనుకున్నామా! ఈ సాహిత్యపు రాలుగాయి తెలుగు సారస్వతానికి ఏం చేశాడో, చేస్తున్నాడో స్థాలీపులాక న్యాయంగా మీకు రుచి చూపిద్దామని పది మెతుకులు (ఒకటి చాలదు గదా మరి!) పట్టుకొచ్చేసరికి ఏడాది పడుతుందని మాకు తట్టలేదు. ఆయన మాకోసం పెరగకుండా ఆగనూ లేదు. అందుకే, కాస్త ఆలస్యంగా అయినా అంతే ఆప్యాయంగా నారాయణ రావు విశేష సంచికగా ఈ ఈమాటను అందిస్తున్నాం. ఈయన లాంటి వాడు ఇప్పటి దాకా లేడు, ఇంకొకడు వస్తాడనే నమ్మకమూ లేదు. అందుకే తప్పని సరై అడగడం, “వీఎన్నారూ, వయసు మీద వేసుకోడం మీరు కాస్త ఆపుతారూ?” అని. వింటే ఎంత బాగుణ్ణు.


“The number of citizens capable of reading and understanding the texts and documents of the classical era … will very soon approach a statistical zero. India is about to become the only major world culture whose literary patrimony, and indeed history, are in the custodianship of scholars outside the country: in Berkeley, Chicago, and New York, Oxford, Paris, and Vienna. This would not be healthy either for India or for the rest of the world that cares about India.”

-Sheldon Pollock (‘Crisis in Classics‘, 2011.)


పరుచూరి శ్రీనివాస్‌కి పదివేల నూటపదహారు; పప్పు నాగరాజుకి ఐదువేల నూటపదహారు; భైరవభట్ల కామేశ్వరరావుకి వెయ్యి నూటపదహారు; సురేశ్ కొలిచాలకు ఉత్తి నూటపదహారు – కృతజ్ఞతలు, ప్రత్యేకంగా!

I first met Narayana Rao at a conference in Israel. His infectious laughter and love of literature were absolutely contagious. I came away from our conversations renewed and eager to plunge into some new idea, some new project, from our casual chats.

“మనకంటూ స్వర్ణ యుగం అనేది ఉండేదో లేదో మనకిక ఎప్పుడూ తెలియదు. వేల సంవత్సరాల భారతీయ సంస్కృతి మనది అని గొప్పలు చెప్పుకోడానికి బాగున్నా, మన సంస్కృతి గురించి మనం తెలుసుకోగలిగినది గత ఐదు లేదా ఆరు శతాబ్దాల దాకానే. అంతకు ముందు చరిత్ర అని మనం అనుకుంటున్నది కేవలం మన ఊహాసృష్టి.”

ఇంతటి విజ్ఞానాన్ని పదిమందికీ తెలియపరచటం ఎంతో కష్టమైన పని. వీఎన్నార్‌ను కేవలం తెలుగు భాషలో ఒక మూల పడున్న సాహిత్యాన్ని తర్జుమా చేసేవాడుగా తీసిపారేయడం, ప్రత్యేకించి పాశ్చాత్య విద్యాసంస్థలలో, ఎంతో సులభంగా జరిగే పని.

భారత సాహిత్యంలో చారిత్రక రచన ఏ ఒక్క సాహిత్యవర్గానికో పరిమితమై ఉండలేదు. అటువంటి విభజనలకి అతీతంగా పద్య మహాకావ్యం నుంచి తెలుగు వచన చారిత్రము దాకా సాహిత్యంలో ఎన్నో రూపాలలో అది విస్తరించింది. ఈ సాహిత్య రూపాలేవీ కూడా స్వతస్సిద్ధంగా చారిత్రక రచనలు కావు; ఆ రకంగా అవి ఎప్పుడూ ఆ సమాజంలో చూడబడలేదు.