వలసపోతున్న మందహాసం

మరోమజిలీకి ముందు
ఆ ఏటి ఒడ్డున
కాసేపు సేదదీరాం

సముద్రమంటే ఏంటో
చూపిస్తా రమ్మంటూ..

అలల గుడ్డతో
కడలి కళ్ళుకప్పి
ఏవో లోతుల్లోకి
తీసుకుపోయేవారు

రెండు తీరాల మధ్య
కవిత్వానికి మించిన
వారధి లేదని తెలిసింది
ఆయన్ని కలిసాకే

ఎన్నో అనుభవాలతో నిండిన
ఒక పుస్తకన్నిచ్చి
ఎవరున్నా లేకున్నా
చదువుకుంటూ ఉండమని
ఇక శెలవంటూ
ఆయన లేచారు

సంధ్య మసక వెలుగులో
మందహాసం
వలసపోతోంది
నిజంగానే…

( రిటైరై బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్న ముకుంద రామా రావు గారికి….)

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: 2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. \"ఏటి ఒడ్డున\" కవితా సంపుటి (2006), \"ఆత్మనొక దివ్వెగా\" నవల (2019), \"సెలయేటి సవ్వడి\" కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు. ...