ఇది “తమాషా దేఖో” ధారావాహికలో ప్రస్తుతానికి ఆఖరి భాగం. కథ పూర్తిగా పూర్తి కాకపోయినా ఒక నడిమి మజిలీ చేరింది. కనకప్రసాద్ ముందుముందు మళ్ళీ ఇక్కడినుంచి మొదలుపెట్టి నిజమైన ముగింపుకి చేరుస్తారని ఆశిస్తాం.
తెలుగు సాహిత్యంలో ఇలాటి ప్రయోగాలు చాలా అరుదు. పాత్రల్ని, స్థలాల్ని, వర్తమానసమాజాన్ని ప్రతిబింబించటంలో ఈ ధారావాహిక గురజాడ వారి “కన్యాశుల్కం” వారసత్వం తీసుకున్నదని మా విశ్వాసం. ఇలాటి రచనను “ఈమాట”లో ప్రచురించటానికి అవకాశం కలిగించిన శ్రీ కనకప్రసాద్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు.