ఏడుస్తోందని ఎత్తుకుని
చందమామను చూపించాను
రెట్టింపు ఏడుపుతో ఆ చందమామ కావాలంది
శీర్షికలు శీర్షికలు
యుగాలుగా దిగబడ్డ
ప్రశ్నార్థకాలన్నీ
పెకిలించాకా
చిల్లులు పడ్డ ఆకాశం
పెల్లుబికిన సముద్రం
కుంచించుకొన్న భూఖండం
నిర్జీవమవుతున్న నిఖిలం
“ఇదేమన్నా రాఖీ పండగ అనుకున్నావా, భయపడి ఇంట్లో దాక్కోవడానికి? ఈ రోజు బయట పడకపోతే ఇంకెప్పుడు?” అంటూ తెగ ఏడిపించారు.
తనకు మొహాన ఒక మచ్చ కావాలనుకుంటే పెట్టుకోనివ్వచ్చు గదా? మీ మాటే నెగ్గాలనే పట్టుదల మీకెందుకు?
రాబోయే సర్వధారి ఉగాదికి, తెలుగు లలిత కళా సమితి (Telugu Fine Arts Society, NJ, USA ) తెలుగుజ్యోతి పత్రికావర్గం ఒక విశేష సంచికని మీ ముందరికి తీసుకు రాబోతోంది. ఈ విశేష సంచికలో ప్రచురించడానికి దేశవిదేశాల్లో వున్న తెలుగు భావుకులందరికీ ఈ ఆహ్వానం.
ఏవీ ఆరుబైట మంచు బొమ్మలు?
ఏవీ ఆ చిత్రవిచిత్ర ఆకుల ఇంద్రధనస్సులు?
ఏవీ ఆ రెడ్కార్డినల్స్ స్వరఝరులు?
ఏవీ ఆ పడిలేచే అల్లరి తరంగాలు?
ఏవీ ఆ లేక్మెండోటా గుసగుసలు?
మరోసారి కొరికేలోపే
జారిపోయిన బందరు మిఠాయిని.
ప్రపంచమంతటా సామాన్యంగా సితార్ అనగానే రవిశంకర్ పేరును తలుచుకుంటారు. ఒక భారతీయ శాస్త్రీయసంగీతజ్ఞుడు ఎంతటి ఖ్యాతిని పొందవచ్చునో నిరూపించిన మేధావి రవిశంకర్ అనడంలో సందేహమేమీ లేదు. అయితే ప్రతి అర్జునుడికీ సరితూగే ఒక కర్ణుడు ఉంటాడనుకుంటే అందుకు సరిగ్గా సరిపోయే వ్యక్తి ఉస్తాద్ విలాయత్ఖాన్. సితార్ చేత “పాడించి”, సితార్ వాయిద్యపు పరిధిని అపారంగా విస్తరింపజేసి, సితార్ శైలికే కొత్త భాష్యం చెప్పిన విలాయత్ఖాన్కు మరెవరూ సాటిరారని భావించేవారూ ఉన్నారు.
మెరుపుల ఓణీతో, ఉరుముల గజ్జెలతో తాండవం చేస్తుంది వాన
ఆకాశానికి భూమికి మధ్య పేనిన తాడుల వాన
ఎప్పటిలాగే తెల్ల మంచు చీరని కట్టుకొని
ఈ నగరం క్రొత్త సంవత్సరం కోసం ముస్తాబవుతుంది
తే.గీ. పాత కొత్తల కలిపెడి సేతు వవగ
పిన్నపెద్దతరములకభిన్నమవగ
రెండుభాషలనందునుద్దండులవగ
నడిమి వయసు కత్తిపయిన నడక! నరుడ!
ప్రకృతి రంగులన్నిటినీ
దోచేసుకుని రాత్రి
ఎటో పారిపోతోంది
తీర్థం తాగి చెయ్యి నెత్తిమీద ఎందుకు రాసుకుంటారో అర్థం కాదు నారాయణకి. యింకా చాలా విషయాలు అతనికి అంతు పట్టవు. సంస్కృతంలో సుప్రభాతం, ఆనక వేద మంత్రాలూ చదివి, అరవంలో తిరుప్పావయ్యో మరేదో చదువుతారు కదా, మరి తెలుగులో ఏవీ చదవరెందుకు? యింతకీ వెంకటేశ్వర స్వామిది యే భాష?
నువ్వు చేయమన్నదల్లా
చేస్తూనే వున్నా
నువ్వు చూపిందల్లా
చూస్తూనే వున్నా
“ఈ తీరని ప్రశ్న గురించి ఎంతమందికి తెలుసు? కంప్యూటర్ సైన్సు లోకెల్లా ఇంతకన్నా తెలుసుకోదగ్గ విషయం మరేముంది? దీని గురించి నలుగురికీ తెలిసే విధంగా ఓ వ్యాసం రాస్తే బాగుంటుంది గదా,” అని అనిపించింది.
తన జైత్రయాత్రల సందర్భంగా కృష్ణా తీరంలోని శ్రీకాకుళం అనే వూరిలో ఒక రాత్రి ఉండగా, ఆ వూరి గుడి లోని శ్రీ ఆంధ్రమహావిష్ణువు కలలో కనిపించి ఆముక్తమాల్యద వ్రాయమని ఆదేశించినట్లు ఆయనే ఆ కావ్యంలో చెప్పుకున్నాడు. చెప్పినది తెలుగుదేశం లోని గుళ్ళో దేవుడు. వ్రాసినది కర్నాటక చక్రవర్తి. కథ జరిగినది తమిళ దేశంలో – ఎంత మంచి సన్నివేశమో గమనించండి.
మా బెడ్ పక్కనే ఏడాది క్రితం వచ్చిన బెస్ట్ కపుల్ అవార్డు ట్రోఫీ ఒక్కటే ప్రపంచానికి కనబడే నిజం!
అతడిని అంతకు ముందు ఎక్కడ చూసానో గుర్తొస్తోంది! సాయంత్రం సన్మాన సభలో నేను చేయ బోయే ప్రసంగానికి పీయ్యే సహాయం అంతగా అవసరం లేదు. పాతికేళ్ళ క్రితం నేను చదువుకునే రోజుల్లో, నా స్కాలర్షిప్ పని మీద కలుసుకున్న వీయస్సార్, ఈ వీధుల సుబ్బరామయ్యా ఒక్కరే!