అలాగే అంతకు ముందు సాహిత్యంలో విఘ్నకారకులుగా, దుష్టులైన భూతగణాలతోపాటు వర్ణించబడ్డ వినాయకులు చివరకు ఒకే వినాయకుడి రూపు దాల్చడం, ఆ వినాయకుడు గజముఖుడైన గణేశునితో విలీనం చెందడం, గణేశుడు పార్వతి పుత్రుడిగా, స్కందుని సోదరుడిగా శివపార్వతుల కుటుంబంలో చేరిపోవడం– ఈ కథనాలన్నీ పురాణాల్లోనే కనిపిస్తాయి.
శీర్షికలు శీర్షికలు
What it means to be a leaf,
would a tree ever understand?
Perhaps not
ఆకుగా ఉండటమంటే ఏంటో
చెట్టుకెప్పుడన్నా అర్ధమవుతుందా?
బహుశా కాదేమో
గంభీరముద్రతో కదులుతున్న ఒంటరితనాలు
చిక్కగా కమ్ముకుంటున్న మబ్బుల గుంపులై,
చివరికి ఎప్పుడో, ఎక్కడో నిష్పూచిగా కురిసేందుకు
సమాయత్తమవుతున్నట్టే ఉన్నాయి!
‘సావిత్రి మంచిదనుకున్నాను. దొంగముండన్న మాట! తాతనాన్న చెప్పులు దొబ్బుకొచ్చేసింది. అందుకేనేమో… నేను రాగానే భయపడి చస్తంది! దాచెయ్యమనేమో అమ్మా అమ్మా అని చీరుకుంటోంది. నాదగ్గరా నీ దొంగేషాలు… హన్నా! ఎవరూ చూడకుండా ఈ చెప్పులు ఇంట్లో వేసుకుని తిప్పుకుంటూ తిరుగుదామనా? పాపం తాతనాన్న చెప్పుల్లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారో… ఎన్ని ముల్లు గుచ్చూ పోయాయో ఏంటో!
‘సార్, మీరు కూడా ఏమన్న చెప్పదలిస్తే చెప్పండి సార్!’- సంగీత దర్శకుడు యస్. రాజేశ్వరరావు, మ్యూసిక్ సిట్టింగ్ గదిలోకి కాఫీలు అందించ పోయిన బోయ్తో- అప్పటికి గదిలో కూర్చున్న నిర్మాత తాలూకూ బంధు గణం తమ వాడు నిర్మించబోయే సినిమా సంగీతం ఎలా ఉండాలన్న విషయంలో ఆయనకు తమకు తోచిన సలహా ఇతోధికంగా అందచేస్తున్న నేపథ్యంలో.
మారిషస్ వంటి బహుభాషీయ దేశంలో భాషా సంపర్కంవల్ల ఇక్కడి తెలుగు భాషలో అనేక మార్పులు వస్తున్నాయి. భాషలో మార్పులు రావటం సహజం. కాని, వివిధ భాషల సంపర్కంవల్ల మారిషస్ దేశంలో తెలుగు భాషా వ్యవహర్తల భాషణంలో, లేఖనంలో ఎన్నో దోషాలు వస్తున్నాయి. సాధారణంగా ఒకభాషలో శిక్షణ పొందేవాళ్ళకు ఆ భాషాప్రయోగం ఎటువంటి సమయ సందర్భాలలో చేయాలో తెలిసి ఉంటుంది కానీ ఆ భాషా ప్రయోగం ఏ విధంగా చేయాలో స్పష్టంగా తెలియదు.
చద్దరు నాలుగు మూలలు
సరిగ్గా వచ్చేలా మడతపెట్టడం కూడా
చాలా పెద్ద విషయం అయినప్పుడు,
ఎంత చిన్న విషయానికైనా
నూటా ముప్పైరెండోసారి బాధపడటం
కొనండి. కొనండి. బొమ్మలు. కిచెన్ వేర్. సైకిళ్ళు. దుప్పట్లు. రగ్గులు. బొగ్గులు. డీల్స్! డీల్స్! భలే మంచి చౌక బేరము. ఆలసించిన ఆశాభంగము. మోడల్స్ ఓసారి ఉంచినవి ఇంకోసారి ఉంచరండీ ఇక్కడ. తర్వాత కొనుక్కుందాం అంటే మళ్ళా దొరకవండీ. మాయావిడ ఇదే పని మీదుంటాది. ఎక్కడెక్కడ ఏం డీల్స్ ఉన్నాయా అని. షీ ఈస్ వెరీ ఇంటెల్లిజెంట్ యూ నో?
ఆయన అన్నగారు ఇప్పుడెలా అని అడిగితే, కంగారు అవసరం లేదని చెప్పి తన గదిలోకి వెళ్ళి గడియ వేసుకొని శారదాపీఠం ముందు కూర్చొని సరస్వతీ ధ్యాన నిమగ్నుడయ్యాడట పినవీరన. అతను ధ్యానంలో ఉండగా సరస్వతి ప్రత్యక్షమై శతఘంటాలతో కావ్యాన్ని వ్రాయడం మొదలుపెడుతుంది. ఇంచుమించు పూర్తి అవుతోందనగా, ఆ గదినుండి వస్తున్న దివ్యకాంతులను చూసి అన్న తలుపు సందునుండి చూసేసరికి, ‘బావగారు వచ్చారు’ అంటూ సరస్వతి అదృశ్యమవుతుంది.
ఈనాటి కథను తలచుకొంటే ఆనాటి ఒరవడి కొనసాగడం లేదేమోనన్న ఆందోళన. బెంగ. నిజమేనా? మంచి కథలు రావడంలేదా? కొత్త కథకులు కలం పట్టడంలేదా? గత ఏడెనిమిదేళ్ళుగా, స్థూలంగా 2010 తర్వాత- కాలక్షేపం కోసమో పేరు కోసమో పోటీల కోసమో రాసేవాళ్ళని పక్కన పెట్టి- కథలు రాస్తోన్నవాళ్ళను చూసినట్టయితే ఆ నిర్వేదమూ నిస్పృహ అనవసరం అన్న భావన కలుగుతుంది. కొత్త కథకులు, యువ కథకులు వస్తున్నారు. మంచి కథలు రాస్తున్నారు అన్న ఆశ కలుగుతుంది.
డాక్టర్ వీళ్ళు లోపలికి నడిచి రావడాన్ని శ్రద్ధగా గమనించాడు. అతని వృత్తిలో పేషంట్ల నడకనీ బాడీ లాంగ్వేజ్నీ గమనించడం అతి కీలకమైన విషయం. కొన్ని సార్లు వచ్చినవాళ్ళ సమస్య ఏంటన్నది కూడా అందులోనే అర్థం అయిపోతుంటుంది. భర్తకి నలబైయేళ్ళుంటాయి. భార్య నాలుగేళ్ళు చిన్నదైయుండచ్చు అనిపించింది. వాళ్ళు వేసుకున్న ఓవర్కోట్ తియ్యలేదు. వాటిమీద మంచు ఇంకా పూర్తిగా కరిగిపోలేదు.
కంఠవశమయే గుణం కవిత్వం యొక్క అతిముఖ్యమైన లక్షణాలలో ఒకటి. సాపేక్షంగా చెప్పాలంటే ఛందోబద్ధమైన కవిత్వానికి కంఠవశమయే గుణం ఎక్కువగా వుంటుంది. ఆ కవి గొప్పవాడు కావచ్చు, కాకపోవచ్చు. ఆ పద్యం గొప్ప పద్యం అవొచ్చు, అవకపోవచ్చు. ఛందోభంగం కాకుండా వ్రాయబడితే చాలు కంఠవశమవుతుంది.
వేశ్య అంటే వైశికీకళలో నిష్ణాతురాలైనట్టి స్త్రీ అని అర్థం. వైశికీకళ వాత్సాయన కామసూత్రాలలో వివరించబడిన ఒక ప్రత్యేక అంశం అంటూ రచయిత పేర్కొంటూ అదే పేరా చివరలో ‘ఇలాంటి ప్రత్యేకమైన శాస్త్రపరిజ్ఞానం ప్రాచీన కాలంలో వేశ్యలకు విశేషంగా ఉండడం వలన ఈ కళ వైశికీ కళగా ప్రసిద్ధి చెందింది’ అంటారు.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం.
ముందుగా ఒక సినిమా రికార్డు. ఇది అక్కినేని నాగేశ్వరరావు నటించిన శ్రీ సీతారామజననం (1944) అన్న సినిమాలోనిది. కోరస్లో ఆయన కూడా గొంతు కలుపుతారు. అక్కినేని అంతకు మూడేళ్ళ ముందు ధర్మపత్ని (1941) అన్న సినిమాలో ఒక చిన్న పాత్ర ధరించినా శ్రీ సీతారామజననం సినిమాతోనే అందరికీ పరిచయమయ్యారు.
గడినుడి 11ఎంతో సులభంగా కనిపిస్తూనే ఎంతో కష్టంగా అయింది పూరకులకు. ఎవరూ చివరిదాకా పూర్తిగా చేయలేకపోయారు, సరిచూపు ఆప్షన్ ఇచ్చేదాకా. చివరకు గడి పూర్తిగా చేసి పంపిన రవిచంద్ర ఇనగంటి, శ్రీవల్లీ రాధిక, భమిడిపాటి సూర్యలక్ష్మి, సుభద్ర వేదుల – ఈ నలుగురు విజేతలకు మా అభినందనలు.
సాహిత్య విమర్శ అనేది (మనం ప్రస్తుతం వాడుతున్న అర్థంలో) తెలుగు సాహిత్య రంగానికి స్వతస్సిద్ధమైన లక్షణం కాదు. ఇది పాశ్చాత్య ప్రభావం వల్ల వచ్చినది కావడంతో ఆ ఆధునిక విమర్శాపద్ధతులు మనకు సరిగా బోధపడలేదు, మనం అలవర్చుకోలేదు కూడా. విమర్శ సాహిత్యాన్ని నిర్వచించబూనుకోదు. ఎందుకంటే నిర్వచనాలు సాహిత్యాన్ని సంకుచితం చేస్తాయి. సిసలైన విమర్శ సాహిత్యాన్ని వివరించి విస్తరిస్తుంది. పాఠకులలో సాహిత్యాభినివేశం కలిగిస్తుంది, పెంచుతుంది. ప్రస్తుత సాహిత్యరంగంలో—పొగడ్తలు తప్ప మరేమీ స్వీకరించలేని రచయితలు; ఏ రచననైనా పొగడడం లేదా తెగడడం అన్న రెండే పద్ధతులు పాటిస్తూ, రచన ఏం చెప్తున్నదో కూడా పూర్తిగా చూడకుండా వస్తువునో, శైలినో, వచనాన్నో– ఇలా తమకు నచ్చిన ఏవొక్క అంశనే ఎంచుకుని, తమ అభిప్రాయాలనే సాహిత్యసత్యాలుగా ప్రకటించే విశ్లేషకులు; రచయితల మనసులు నొప్పించకుండా వారి సాహిత్యాన్ని కేవలం ‘పరిచయం’ చేసే సమీక్షకులు, కొల్లలుగా కనిపిస్తూ—విమర్శ అన్న పదానికి, ఒక రచనను దాని సాహిత్యలక్షణ పరిథులలో వైయక్తికాభిరుచులకావలగా విశ్లేషించడం అనే అర్థం పూర్తిగా మాయమయిపోయింది. ఈ సమయంలో, సాహిత్యంలో విమర్శ అవసరాన్ని గుర్తించి ‘సాహిత్య విమర్శ ఎలా ఉండాలి?’ అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించి, ఆ దిశగా మొదటి అడుగు వేసిన డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ (DTLC) వారికి ధన్యవాదాలు. ఈ పోటీలో పాల్గొని బహుమతులు గెల్చుకున్న–చామర్తి మానస, జిజ్ఞాస సోమనాథం (ప్రథమ); జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి(ద్వితీయ); రెంటాల శ్రీవేంకటేశ్వర రావు (తృతీయ)–రచయితలకు ఈమాట తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. విజేతల వ్యాసాలు, మరి కొందరు తెలుగు ప్రముఖులు ఇదే అంశంపై ప్రత్యేకంగా రాసిన వ్యాసాలు కలిపి ఒక పుస్తకంగా డిటిఎల్సి వారు త్వరలో తేబోతుండడం సాహితీప్రియులందరికి సంతోషం కలిగించే విషయం.
ఒకానొక కాలంలో ఒక వీరుడు ధీరుడు శూరుడు ఉండేవాడు. అతని కత్తికి ఎదురు లేదు, బాణానికి తిరుగు లేదు, అతను గెలవని యుద్ధం లేదు. రాజు మెచ్చి ఆదరించి పదవులు ఇచ్చాడు. పురజనులు అతని పరాక్రమాన్ని వేనోళ్ళ పొగిడేవారు. అతన్ని పెళ్ళాడాలని ఎంతమంది యువతులో కలలు కనేవారు. కానీ అతను ఆమెని చూడగానే మోహంలో పడిపోయాడు. పెళ్ళి చేసుకుని ప్రేమలో మునిగిపోయారు.