రఘోత్తమరావుగారికీ, సురేశ్గారికీ ఉన్నంత సంస్కృత జ్ఞానం కానీ, Wendy గురించీ, alternative history గురించీ సురేశ్గారి కున్నంత పరిచయం కానీ నాకు లేవు. ఈ వ్యాఖ్య నేనొక సామాన్య హిందువుగా రాస్తున్నాను. (పూర్వకాలంలో ఇలా సామాన్యులు పండితచర్చలలో తలదూర్చే అవకాశం ఉండేదా అనేది అనుమానమే, మంచికో చెడ్డకో యీ కాలంలో అది సాధ్యమయ్యింది!).
1. తాను రాసిన దానికి “Alternative” అనే విశేషణాన్ని స్పష్టంగా శీర్షికలోనే పెట్టారు వెండీ. ఇంక దాన్ని సంప్రదాయ భాష్యాలతో, వ్యాఖ్యానాలతో సరిపోల్చి తప్పుపట్టడంలో అర్థమేముంది? హైందవ వాఙ్మయంపై Wendy కాని, సురేశ్గారు కాని చేస్తున్న వ్యాఖ్యానాలు స్పష్టంగా – an alternative to the established or mainstream commentaries. ఇవి వైదిక ప్రామాణ్యాన్ని అంగీకరించని బౌద్ధ, చార్వాక వాదాలవంటివి. వాటిని శంకరుల, మధ్వాచార్యుల వంటి వారి భాష్యాలతో పోల్చి తప్పనడం ఎంతవరకూ సమంజసం?
2. వెండీ సిద్ధాంతాలను Galileo లేదా ఇతర scientific theoriesతో పోల్చడం సరికాదని నా బుద్ధికి తోస్తోంది. వైజ్ఞానికశాస్త్రం భౌతిక ప్రపంచానికి సంబంధించినది. అందులో సత్యాసత్యాలు భౌతిక ప్రయోగాల ద్వారా నిర్ధారించగలిగేవి. Wendy’s subject is not “science”. అంటే ఇందులో వైజ్ఞానికంగా నిర్ధారించగల సత్యాసత్యాల ప్రమేయం లేదు. వేదాలను కాని, స్మృతి పురాణ ఇతిహాసాలను కాని ఒక ప్రత్యేక కోణంలో చూసి, అన్వయించి, పరిశీలించడం మాత్రమే. కాబట్టి, ఇందులో సంప్రదాయ దృష్టే సత్యమైనదీ, లేదా Wendy దృష్టే సబబైనదీ వంటి నిర్ణయాల ప్రసక్తి అసలు వస్తుందా? కాకపోతే, పూర్వకాలంలో అవైదిక మత సిద్ధాంతాలు ఎదుర్కొన్న ప్రతిఘటనే ఇప్పుడూ ఇలాంటి సిద్ధాంతాలు ఎదుర్కొంటున్నాయని భావించ లేమా? పూర్వం ఆయా మతాలనూ మతసిద్ధాంతాలనూ నిజంగానే చాలా సంయమనంతోనూ ఉదారభావంతోనూ హిందువులందరూ స్వీకరించారా?
3. వెండీ పుస్తకాన్ని హిందువులు కానివారు చదివితే హిందూమతం మీద చాలా గౌరవం కలుగుతుందని సురేశ్గారు అన్నారు. ఇది నిజమే కావచ్చు. కానీ అది 1st person point of view కాదు. ఒక “సామాన్య” హిందువు దృష్టికన్నా అది వేరైనది. కాబట్టి వారికి గౌరవం కలిగించినంత మాత్రాన ఒక హిందువుకి కూడా అదే భావన కలిగించాలని లేదు. ఒక హిందువు అలాంటి దృష్టితో చూడాలంటే, తనని తాను alienate చేసుకొని తటస్థునిగా మారి చూడగలగాలి. బహుశా ఈ కాలంలో చాలామందికి అది అలవడినట్టుగా ఉంది. అయితే అది అంత సులువుగా సాధ్యమయ్యే పని కాదని నా స్వానుభవం. నేను చదువుకున్న చదువు వల్లనో, ఇతర కారణాల వల్లనో నాకూ కొంత అలాంటి దృష్టి అలవడిందని నేను అనుకుంటున్నాను. కాని పూర్తిగా అలవడ లేదు. పూర్తిగా alienate అవ్వగలిస్తే ఎలా ఉంటుందో నాకు తెలీదు కాని, ఈ రెంటికీ చెడ్డ రేవడి స్థితి మాత్రం చాలా బాధాకరంగా ఉంది. ఈ alienated viewకి కొన్ని ఉదాహరణలు చెపుతాను.
సురేశ్గారు రామాయణ, భాగవత కథలను “అల్లిబిల్లి” కథలు అన్నారు. నా దృష్టిలో యిది ఒక చక్కని ఉదాహరణ. చిన్నప్పుడు, నేను వీటిని విన్నప్పుడు, వీటిని “అల్లిబిల్లి” కథలుగా వినలేదు. నిజంగా జరిగిన కథలుగా విన్నాను. అదే నమ్మాను. పెరిగి పెద్దయిన తర్వాత అవన్నీ బహుశా కట్టుకథలు అనే విషయాన్ని విన్నాను. అలాంటి దృష్టి వచ్చిన తర్వాత, అవి నా హృదయంనుండి కొంత దూరంగా జరిగాయి. కేవలం వాటిని కట్టుకథల్లాగా చూసి, వాటిలోని కల్పనా చమత్కారం, శిల్పనైపుణ్యం, లేదా రసానుభూతి వగైరా వగైరాలను చూసి ఆస్వాదించవచ్చు గదా? వచ్చు, ఇప్పుడు నేనుకూడా చాలావరకూ అదే దృష్టితో వాటిని చూస్తున్నాను. కానీ అవేవీ ఇంతకుముందు అవి నిజమైన కథలే అన్న నమ్మకమున్నప్పుడు యిచ్చిన దగ్గరితనాన్నీ, అనుభూతిని ఇవ్వలేకపోతున్నాయి మనసుకు. ఇదే విషయం, భక్తి కీర్తనలకు కూడా వర్తిస్తుంది. చాలామంది వాటిలోని సంగీతసాహిత్యాలను మాత్రమే ఆస్వాదిస్తారు. నేనుకూడా వాటిని ఆస్వాదిస్తాను. అయితే, రామదాసు నేరుగా రామునితో పెట్టుకున్న మొర, లేదా త్యాగయ్య రాముని ఎదురుగా ఆలపించిన కీర్తన అనే నమ్మకం ఉండిన రోజుల్లో, ఆ పాటలను విన్నప్పుడు కలిగిన ప్రత్యేక అనుభూతి నేనిప్పుడు పొందలేకపోతున్నాను. ఇంకా చాలా ఉదాహరణలు ఇవ్వగలను. పండగలు జరుపుకోవడం కూడా అలాంటి alienated viewకి ఉదాహరణే. ఇదంతా “మానసికమైన ఎదుగుదల”లోనో లేదా “సమాజం ఎదుగుదల”లోనో ఒక భాగమా? అయ్యుండవచ్చు, నాకు తెలియదు. కాని ఏదో లోటు మాత్రం చాలా స్పష్టంగా కష్టపెడుతూ ఉంటుంది.
4. మళ్ళీ మొదటికి వస్తాను. పూర్వ కాలంలో సిద్ధాంత చర్చల్లో సామాన్యులు ఎంతవరకూ భాగస్వాములు? సామాన్యులపై వాటి ప్రభావం ఎంత? ఇవి పండితుల వాదప్రతివాదాలకూ, రాజాశ్రయాలకూ మాత్రమే పరిమితమయ్యేవని అనుకుంటున్నాను. అంచేత వాటివల్ల సామాన్యప్రజలకి (అంటే ఆయా సిద్ధాంతాలలో ప్రవేశం లేని వారికి) పెద్దగా ఇబ్బంది లేదు. ఇప్పుడలా కాదు కదా? ఈ గందరగోళానికి అదొక ముఖ్యకారణం కాదా?
ఆఖరిగా, ఈ వ్యాఖ్య నేను ఒకరిని సమర్థించడానికో మరొకరిని వ్యతిరేకించడానికో రాసింది కాదు. కేవలం, కొంత కాలంగా నాలో ఉడుకుతున్న అస్పష్టభావాలను వ్యక్తపరచడానికి మాత్రమే, జరుగుతున్న చర్చకి ఎంతో కొంత సంబంధం ఉందన్న ఉద్దేశంతో. దీని గురించి ఇంతకన్నా చెప్పే సామర్థ్యం నాకు లేదు. కాబట్టి దీనిపై ఇంకేవైనా వ్యాఖ్యలు వచ్చినా మౌనంగా చదువుకుంటాను.
వ్యాసం బాగుంది. ప్రచురణ కర్తలు కోర్టు వెలుపల రాజీకి రావటం చూస్తుంటే దేశంలో ఛాందస వాదం పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. Blasphemy అనేది ఒక అర్థం లేని మాట. ఆ ఇస్లామిక్ దేశాలలా తయారయ్యేలా ఉన్నాం చూస్తుంటే.
సురేశ్ గారూ, మీ వ్యాసం ఎంతో సమగ్రంగా వుంది కానీ పైన చంద్రమోహన్ గారన్నట్లు ఈ వ్యాసంలో రెండు అంశాలు కలగలిసిపోవడం సమస్య.
ఆమె జ్ఞానా, అజ్ఞానా, పక్షపాతంతో రాసిందా లేదా అన్నవాటితో సంబందం లేకుండా మన సంస్కృతి మొదట్నుంచి వాద ప్రతివాదాల్ని ఎలా ప్రోత్సహిస్తూ వచ్చిందో, అన్ని రకాల మతాలకీ ఎలా చోటిస్తూ వచ్చిందో అన్న పార్శ్వాన్నే స్పృశించి వుంటే బావుండేది. అయినా గానీ నా మట్టుకు ఇది రెండు వ్యాసాలనుకొని చదివాను. వెండీ రాసిందాన్ని మీరు సమర్థించిన తీరు, నచ్చకపోయిందాన్ని నిషేధించాలనడాన్ని మీరు నిరసించిన తీరు చాలా తార్కికంగా సోదాహరణంగా వున్నాయి.
ఇక్కడ కొంతమంది హిందూమతాన్ని హిందువే అర్థం చేసుకోగలుగుతాడు అన్నట్లు అర్థంలేని వాదన చేస్తున్నారు. పాశ్చాత్యులకు “పాశ్చాత్య పక్షపాతం” వుంటే మరి మనకు స్వపక్షపాతం వుండదా? ఇక్కడ ఈ వ్యాసాన్ని తప్పుబడుతున్న వారందరూ ఈ “స్వపక్షపాత” వ్యాధితో బాధపడుతున్నవారేనని నాకనిపిస్తున్నది. ఉదాహరణకు దశరధుడి కామాన్ని lustగా పాశ్చాత్యపక్షవాదమనుకుంటే, దాన్ని pleasure and desire, not merely sexual అనేవాళ్లది స్వపక్షవాదమనవద్దా?
వేదం ఏం చెబుతుందో, గీత ఏం చెబుతుందో దానికి భాష్యం ఎలా చెప్పుకోవాలో త్రిమతాచార్యుల బాష్యాలనుంచే తెలుసుకోవాలనడం, బిడ్డ ఎలాంటిదో తల్లినే అడిగి తెలుసుకోవాలన్నట్లుగా వుంది.
“దృక్కోణాల విభేదం, లక్ష్యాల వైవిధ్యం వల్ల ఒకే సంఘటన, ఒకే సత్యం వేర్వేరుగా కనిపిస్తాయన్న సత్యం భారతీయ దార్శనీకులకు ఏనాడో తెలుసు…”
Suresh garu: Could you please elaborate on this? I feel something is terribly wrong with this statement. This seems to be usage of loose vocabulary. I doubt if our Ancient daarsaniks meant it like what you say. May be you can quote a source that says it this way? You might actually mean they recognized the limitations of human rationality (bounded rationality)http://en.wikipedia.org/wiki/Bounded_rationality
Because of this limitation what just “appears” may not be true. Our perception might be wrong. I am sure you know the classic examples of “illusion” that are used by our philosophers. So, I don’t need to elaborate. Therefore what they probably meant is to be cautious about “knowing” and assuming that truth is understood. I believe it is this fundamental approach, that enabled them to be open about new ideas.
Based on your quote above, I am at odds to see that truth can be different just because view points or goals are different. If that is so, it would negate the truth, and the statement becomes invalid, isn’t it?
A wrong understanding of this fundamental approach might lead to agreeing with misinterpretations and falsehoods. Loose vocabulary therefore is dangerous for propagating ideas and has to be challenged.
I would like to know your view point on this. Correct me if I am wrong.
ఇచ్చిన లింకులో తప్పుడు విరుపు అచ్చయ్యింది. “మాయాపి హితులు” కాదు, “మాయాపిహితులు” అని ఉండాలి. మాయ+అపిహితులు. అపిహిత అంటే కప్పబడడం. మాయ చేత కప్పబడినవాళ్ళని అర్థం.
‘When I use a word,’ Humpty Dumpty said, in rather a scornful tone, ‘it means just what I choose it to mean — neither more nor less.’? 🙂
ఈ మధ్య ఒక సంస్కృత పండిత సభ జరిగితే, అందులో సౌమ్యుడు, వినయశీలి అయిన పండితుణ్ణి అధ్యుక్షునిగా ఎన్నుకున్నారట. అధ్యక్షుడు అన్న పదానికి అందరికీ తెలిసిన అర్థం అధి + అక్షః అంటే పైనుండి చూచువాడు, supervisor, పెద్ద- మొదలైన అర్థాలు మనకు తెలుసు కదా. ఆ వినయశీలి లేచి అధ్యక్షుడు అంటే అ + ధి (=బుద్ధి) + అక్ష (=ఇంద్రియాలు), అని చెబుతూ నాకు బుద్ధి, ఇంద్రియాలు లేవు కాబట్టి నన్ను అధ్యక్షుడిదిగా ఎన్నుకున్నారు అని చమత్కరించారట. పక్కనే కూర్చున్నా మహా పండితుడు లేచి “భగవద్గీతలో ‘అక్షరాణాం ఆకారోస్మి’ అని పరమాత్ముడు అన్నాడు కాబట్టి ఆ అ-కారరూపుమైన పరమాత్మ యందు బుద్ధి, ఇంద్రియాలు కలవాడు కాబట్టి ఆయనను అధ్యక్షుని చేయడం సబబే అని హర్షధ్వానాల మధ్య వివరించాడట.
పదనిర్మాణ రీత్యా (morphologically) సంస్కృత భాష ఒక సంలీన భాష (inflectional language). ఒక వాక్యాన్ని, వివిధ పదాలుగా; ఒక పదాన్ని భిన్నమైన పదాంశాలుగా ఎన్నో రకాలుగా విడదీయవచ్చు. ఈ రకమైన సౌలభ్యం వల్ల ఒకే శ్లోకాన్ని వివిధ రీతులుగా విడగొట్టి పరస్పరం వ్యతిరేకమైన అర్థాలు సాధించవచ్చు. ఈ రకమైన పాండిత్య ప్రకర్ష చమత్కారాలకు బాగానే ఉంటుంది కానీ, శాస్త్ర చర్చల్లో అంతగా పొసగదు. అయితే, గత కొన్ని వందల యేళ్లుగా మన పండితులు పదాలకు కొత్త, కొత్త అర్థాలు క్రోంగొత్త రీతిలో సాధిస్తూ మన గ్రంథాలకు సరికొత్త భాష్యాలు రాయడంలోనే తలమునకలయ్యారంటే అతిశయోక్తి కాదేమో.
ఉదాహరణకు, మధ్వాచార్యులవారు మహావాక్యాలలో ఒకటైన “తత్త్వమసి (that art thou)” అన్న దానికి భాష్యం చెబుతూ ఛాందోగ్యోపనిషత్తులో “శ్వేతకేతో తత్త్వమసి (O Svetaketu, thou art that)” అన్న దానిని “శ్వేతకేతో + అతత్త్వమసి = శ్వేతకేతోతత్త్వమసి”(O Svetaketu, thou art not that)” అని విడదీసి ద్వైత సిద్ధాంత అన్వయాన్ని సాధించాడు. ఈ రకమైన పదవిభజనలతోనే ఆయన ఉపనిషత్తులు, భగవద్గీత మొదలైన వన్నీ తన సిద్ధాంతాన్ని బలపరుస్తున్నాయని నిరూపణ చేశాడు. ఈ రకమైన పదవిభజనలు శంకరాచార్యుల, రామానుజాచార్యుల భాష్యాల్లో కూడా కనిపిస్తుంటాయి. అందువల్లే వారు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాలన్నీ తమ, తమ సిద్ధాంతాలను సమర్తిస్తున్నాయని చెప్పుకోగలిగారు.
అయితే, చారిత్రకంగా చూస్తే, వేదానంతర కాలంలో వైదిక కర్మకాండ పట్ల ఒక రకమైన నిరసన ఉండేదని, ఆ నిరసన భావం ఉపనిషత్తులలో, భగవద్గీత వ్రాయబడిన తొలిదశల్లో తీవ్రస్థాయిలో ఉండేదని మనకు లభిస్తున్న ఆధారాలను బట్టి ఊహించవచ్చు. ఆ వాతావరణంలోనే వైదిక కర్మకాండలకు తిరుగుబాటుగా భౌద్ధ మతం, జైన మతం, సాంఖ్య, యోగ, అజీవిక, చార్వాక మతాలు ప్రాచుర్యం చెందాయని చెప్పడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ దృష్టితో చూస్తే, భగవద్గీతలో నేను ఉటంకించిన నాలుగు శ్లోకాలలో వేదాలను తక్కువ చేసి “త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున” అని చెప్పడానికి సులభమైన వివరణ ఇవ్వవచ్చు. అంతేకాని, ఆ శ్లోకాలలో “వేదం” అంటే “వేదం” కాదు అంటూ వితండవాదన చేయడం వల్ల మనకు కొత్త విషయాలేం బోధపడవు.
అలాగే, ముండకోపనిషత్తులో వేదాలను తక్కువస్థాయి విద్యలుని, వాటిని అపరవిద్యలుగా నిర్వచించారని వ్యాసంలో అనుకున్నాం కదా. అదే ఉపనిషత్తులో ద్వితీయఖండంలో అపరవిద్యల గురించి ఇంకా ఇలా అంటారు:
అపరమైన కర్మ పదునెనిమిది అంగాలతో కూడిన యజ్ఞకర్మల పైన ఆధారపడి ఉండును. ఇవన్నియు వాస్తవానికి బలహీనమైన తెప్పల వంటివి. వీటి వల్ల పదే, పదే జరామృత్యువులు తప్పవు.
అజ్ఞానముతో చరించు ఈ మూర్ఖులు తాము ఆప్తకాములైనట్లు చిన్నపిల్లల్లా భావిస్తుంటారు. రాగరతులై ఉన్నందున సత్యమును గ్రహించలేరు. అందువలన పుణ్యకర్మఫలముగా లభించిన స్వర్గాది లోకములు అనుభవించిన పిదప మళ్ళీ క్రిందికి జారుదురు.
కర్మపరులైన ఈ మూర్ఖులు యజ్ఞవిధులు, పుణ్యకార్యములు మాత్రమే శ్రేష్ఠమైనవని భావిస్తూ, అన్యమైన మరే శ్రేయోమార్గమును తెలియలేరు. వీరు ఉన్నతమైన స్వర్గలోకములో పుణ్యఫలము అనుభవించి మఱల ఈ లోకములో గాని, ఇంతకన్నా హీనమైన లోకములో గాని ప్రవేశించుదురు.
అలాగే బృహదారణ్యకోపనిషత్తులోనూ ఇటువంటి వేదనిరసన కనిపిస్తుంది. ఆదిశంకరుని భాష్యాల్లోనూ జ్ఞానాన్ని ఉగ్గడిస్తూ వేదాలను, కర్మకాండను నిరసించే శ్లోకాలు కనిపిస్తాయి. శంకరుడు వేదనింద చేశాడా లేదా అంటూ సుదీర్ఘ చర్చలు మన పండిత లోకంలో మామూలే.
అయితే, వెండీ డానిగర్ రాసిన పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశం ఆధ్యాత్మికం కాదు, చారిత్రాత్మకం. నా వ్యాస ప్రాధాన లక్ష్యం కూడా ఇటువంటి ఆధ్యాత్మిక చర్చల గురించి కాదు. వేదంలో వర్ణించిన మతానికీ, ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో అనుసరిస్తున్న హిందూ మతానికి చాలా తేడాలు ఉన్నాయని, అందువల్ల కేవలం వేదాల ఆధారంగా హిందూ మతం గురించి సంపూర్ణంగా వివరించలేమన్నదే నా వాదన. నా వ్యాసంలో బాత్రా అభియోగానికి బదులుగా ఇలా అన్నాను:
ఋగ్వేదంలో కనిపించే దేవతలు మిత్ర, వరుణ, అర్యమ, భగ, అంశ, ఇంద్ర, అగ్ని, ఉషస్ వంటి ప్రధాన దేవతలు తరువాతి హిందూ మతంలో ప్రాధాన్యత కోల్పోయారు. వేదాలలో ప్రముఖమైన అగ్నిస్తోమ (సోమయాగం), అశ్వమేధ, పురుషమేధ, అగ్నిచయన, చాతుర్మాస్య యజ్ఞాలు తరువాతి కాలంలో కనిపించవు. ప్రస్తుతం హిందూ మతంలో ప్రధానమైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి తత్వం, లక్ష్మి, పార్వతి, సరస్వతి వంటి స్త్రీ దేవతల ప్రస్తావన వేదాలలో కనిపించదు. హిందూ మతానికి ప్రధానమని చాటిచెప్పే దశావతారాల ప్రస్తావన గాని, కర్మ సిద్ధాంతం గాని, పునర్జన్మ సిద్ధాంతం గాని వేదాలలో ఎక్కడా కనిపించదు.
ఇప్పుడు వివిధ మానవీయ, సామాజిక శాస్త్ర (linguistics, epigraphy, archaeology, history, population genetics etc.) పరిశోధనల ద్వారా మనకు లభ్యమౌతున్న సమాచారాన్ని బట్టి మనం మన చరిత్రను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు. ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించుకొని, హిందూ మత చరిత్రలో పరిణామాలను అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాల్లో వెండీ డానిగర్ రాసిన పుస్తకం ఒకటి. కొంత నిష్పాక్షిక దృష్టితో ఆమె పుస్తకాన్ని చదివితే హిందూ మతపరిణామం గురించి కొంతైనా అవగాహన కలుగుతుందని నా అభిప్రాయం.
ఆఫీసు పనుల ఒత్తిడిలో గత రెండురోజులుగా ఈమాటలో నా వ్యాసంపై వచ్చిన అభిప్రాయాలకు సమాధానాలు వెంటనే రాయలేకపోయినందుకు క్షంతవ్యుణ్ణి. ఇతర అభిప్రాయాలకు కూడా ఈ రోజు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
ఒకే ఒక భరద్వాజుడు, ఒకే ఒక జనకుడు కాక పలువురు భరద్వాజులు, పలువురు జనకులు ఉన్నట్లే ఒకే ఒక శివుడు కాక పలువురు, అనేకులు, అనేకానేకులు శివుళ్లు ఉన్నారని నా అభిప్రాయం. లింగం ఊడిపొయిన శివుడూ, జంగం అయిపొయిన శివుడూ ఒకరు కాదన్నది (కాక పోవచ్చన్నది) నా ప్రతిపాదన. ఒకే ఒక ఒకే ఫిజిక్స్ లేదు ఒకే ఒకే మెకానిక్స్ లేదు. (ఒకదాంతో మరొకటి కలుపుకుని కషాయం చేసుకొవచ్చు, అది వేరే విషయం). కాబట్టి ‘శివుడి చరిత్ర’ అంటూ ఉండదు. కాబట్టి శివుడి చరిత్ర ఒకరికి తెలియటమూ, మరొకరికి తెలియక పోవటమూ అన్న ప్రసక్తి లేదు. అకడమీషియన్స్ సృష్టించిన మోడరన్ మిత్ లలొ ఇది ఒకటి. నా శివుడి గురించి నాకు తెలుసు.
“అమంగల్యం శీలం తవభవతు నా మైవ మఖిలం తథాపి స్మర్తౄణాం వరద పరమం మంగళమసి!”
మంచి కథకు రెండు లక్షణాలుంటాయి.
మొదటి లక్షణం హృదయాన్ని స్పృశించటం.
రెండవ లక్షణం బుధ్ధిని ప్రచోదనం చేయటం.
కథ అన్న పేరుకు సార్థకత రావాలంటే పై రెండు లక్షణాలో కనీసం ఒకటైనా పట్టాలి.
ఇందులో రెండు శుభలక్షణాలూ ఉన్నాయి.
కాబట్టి మంచి కథ.
మంచి కథనానికి రెండు లక్షణాలుంటాయి.
మొదటిది స్పష్టత.
రెండవది క్లుప్తత.
మంచికథనం అనిపించుకోవాలంటే పై రెండు లక్షణాలో కనీసం ఒకటైనా పట్టాలి.
ఇందులో రెండు శుభలక్షణాలూ ఉన్నాయి.
కాబట్టి మంచి కథనం.
ఇంకేం కావాలి?
రచయితకు నా హృదయపూర్వకమైన శుభాబినందనలు.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
03/06/2014 2:38 pm
రఘోత్తమరావుగారికీ, సురేశ్గారికీ ఉన్నంత సంస్కృత జ్ఞానం కానీ, Wendy గురించీ, alternative history గురించీ సురేశ్గారి కున్నంత పరిచయం కానీ నాకు లేవు. ఈ వ్యాఖ్య నేనొక సామాన్య హిందువుగా రాస్తున్నాను. (పూర్వకాలంలో ఇలా సామాన్యులు పండితచర్చలలో తలదూర్చే అవకాశం ఉండేదా అనేది అనుమానమే, మంచికో చెడ్డకో యీ కాలంలో అది సాధ్యమయ్యింది!).
1. తాను రాసిన దానికి “Alternative” అనే విశేషణాన్ని స్పష్టంగా శీర్షికలోనే పెట్టారు వెండీ. ఇంక దాన్ని సంప్రదాయ భాష్యాలతో, వ్యాఖ్యానాలతో సరిపోల్చి తప్పుపట్టడంలో అర్థమేముంది? హైందవ వాఙ్మయంపై Wendy కాని, సురేశ్గారు కాని చేస్తున్న వ్యాఖ్యానాలు స్పష్టంగా – an alternative to the established or mainstream commentaries. ఇవి వైదిక ప్రామాణ్యాన్ని అంగీకరించని బౌద్ధ, చార్వాక వాదాలవంటివి. వాటిని శంకరుల, మధ్వాచార్యుల వంటి వారి భాష్యాలతో పోల్చి తప్పనడం ఎంతవరకూ సమంజసం?
2. వెండీ సిద్ధాంతాలను Galileo లేదా ఇతర scientific theoriesతో పోల్చడం సరికాదని నా బుద్ధికి తోస్తోంది. వైజ్ఞానికశాస్త్రం భౌతిక ప్రపంచానికి సంబంధించినది. అందులో సత్యాసత్యాలు భౌతిక ప్రయోగాల ద్వారా నిర్ధారించగలిగేవి. Wendy’s subject is not “science”. అంటే ఇందులో వైజ్ఞానికంగా నిర్ధారించగల సత్యాసత్యాల ప్రమేయం లేదు. వేదాలను కాని, స్మృతి పురాణ ఇతిహాసాలను కాని ఒక ప్రత్యేక కోణంలో చూసి, అన్వయించి, పరిశీలించడం మాత్రమే. కాబట్టి, ఇందులో సంప్రదాయ దృష్టే సత్యమైనదీ, లేదా Wendy దృష్టే సబబైనదీ వంటి నిర్ణయాల ప్రసక్తి అసలు వస్తుందా? కాకపోతే, పూర్వకాలంలో అవైదిక మత సిద్ధాంతాలు ఎదుర్కొన్న ప్రతిఘటనే ఇప్పుడూ ఇలాంటి సిద్ధాంతాలు ఎదుర్కొంటున్నాయని భావించ లేమా? పూర్వం ఆయా మతాలనూ మతసిద్ధాంతాలనూ నిజంగానే చాలా సంయమనంతోనూ ఉదారభావంతోనూ హిందువులందరూ స్వీకరించారా?
3. వెండీ పుస్తకాన్ని హిందువులు కానివారు చదివితే హిందూమతం మీద చాలా గౌరవం కలుగుతుందని సురేశ్గారు అన్నారు. ఇది నిజమే కావచ్చు. కానీ అది 1st person point of view కాదు. ఒక “సామాన్య” హిందువు దృష్టికన్నా అది వేరైనది. కాబట్టి వారికి గౌరవం కలిగించినంత మాత్రాన ఒక హిందువుకి కూడా అదే భావన కలిగించాలని లేదు. ఒక హిందువు అలాంటి దృష్టితో చూడాలంటే, తనని తాను alienate చేసుకొని తటస్థునిగా మారి చూడగలగాలి. బహుశా ఈ కాలంలో చాలామందికి అది అలవడినట్టుగా ఉంది. అయితే అది అంత సులువుగా సాధ్యమయ్యే పని కాదని నా స్వానుభవం. నేను చదువుకున్న చదువు వల్లనో, ఇతర కారణాల వల్లనో నాకూ కొంత అలాంటి దృష్టి అలవడిందని నేను అనుకుంటున్నాను. కాని పూర్తిగా అలవడ లేదు. పూర్తిగా alienate అవ్వగలిస్తే ఎలా ఉంటుందో నాకు తెలీదు కాని, ఈ రెంటికీ చెడ్డ రేవడి స్థితి మాత్రం చాలా బాధాకరంగా ఉంది. ఈ alienated viewకి కొన్ని ఉదాహరణలు చెపుతాను.
సురేశ్గారు రామాయణ, భాగవత కథలను “అల్లిబిల్లి” కథలు అన్నారు. నా దృష్టిలో యిది ఒక చక్కని ఉదాహరణ. చిన్నప్పుడు, నేను వీటిని విన్నప్పుడు, వీటిని “అల్లిబిల్లి” కథలుగా వినలేదు. నిజంగా జరిగిన కథలుగా విన్నాను. అదే నమ్మాను. పెరిగి పెద్దయిన తర్వాత అవన్నీ బహుశా కట్టుకథలు అనే విషయాన్ని విన్నాను. అలాంటి దృష్టి వచ్చిన తర్వాత, అవి నా హృదయంనుండి కొంత దూరంగా జరిగాయి. కేవలం వాటిని కట్టుకథల్లాగా చూసి, వాటిలోని కల్పనా చమత్కారం, శిల్పనైపుణ్యం, లేదా రసానుభూతి వగైరా వగైరాలను చూసి ఆస్వాదించవచ్చు గదా? వచ్చు, ఇప్పుడు నేనుకూడా చాలావరకూ అదే దృష్టితో వాటిని చూస్తున్నాను. కానీ అవేవీ ఇంతకుముందు అవి నిజమైన కథలే అన్న నమ్మకమున్నప్పుడు యిచ్చిన దగ్గరితనాన్నీ, అనుభూతిని ఇవ్వలేకపోతున్నాయి మనసుకు. ఇదే విషయం, భక్తి కీర్తనలకు కూడా వర్తిస్తుంది. చాలామంది వాటిలోని సంగీతసాహిత్యాలను మాత్రమే ఆస్వాదిస్తారు. నేనుకూడా వాటిని ఆస్వాదిస్తాను. అయితే, రామదాసు నేరుగా రామునితో పెట్టుకున్న మొర, లేదా త్యాగయ్య రాముని ఎదురుగా ఆలపించిన కీర్తన అనే నమ్మకం ఉండిన రోజుల్లో, ఆ పాటలను విన్నప్పుడు కలిగిన ప్రత్యేక అనుభూతి నేనిప్పుడు పొందలేకపోతున్నాను. ఇంకా చాలా ఉదాహరణలు ఇవ్వగలను. పండగలు జరుపుకోవడం కూడా అలాంటి alienated viewకి ఉదాహరణే. ఇదంతా “మానసికమైన ఎదుగుదల”లోనో లేదా “సమాజం ఎదుగుదల”లోనో ఒక భాగమా? అయ్యుండవచ్చు, నాకు తెలియదు. కాని ఏదో లోటు మాత్రం చాలా స్పష్టంగా కష్టపెడుతూ ఉంటుంది.
4. మళ్ళీ మొదటికి వస్తాను. పూర్వ కాలంలో సిద్ధాంత చర్చల్లో సామాన్యులు ఎంతవరకూ భాగస్వాములు? సామాన్యులపై వాటి ప్రభావం ఎంత? ఇవి పండితుల వాదప్రతివాదాలకూ, రాజాశ్రయాలకూ మాత్రమే పరిమితమయ్యేవని అనుకుంటున్నాను. అంచేత వాటివల్ల సామాన్యప్రజలకి (అంటే ఆయా సిద్ధాంతాలలో ప్రవేశం లేని వారికి) పెద్దగా ఇబ్బంది లేదు. ఇప్పుడలా కాదు కదా? ఈ గందరగోళానికి అదొక ముఖ్యకారణం కాదా?
ఆఖరిగా, ఈ వ్యాఖ్య నేను ఒకరిని సమర్థించడానికో మరొకరిని వ్యతిరేకించడానికో రాసింది కాదు. కేవలం, కొంత కాలంగా నాలో ఉడుకుతున్న అస్పష్టభావాలను వ్యక్తపరచడానికి మాత్రమే, జరుగుతున్న చర్చకి ఎంతో కొంత సంబంధం ఉందన్న ఉద్దేశంతో. దీని గురించి ఇంతకన్నా చెప్పే సామర్థ్యం నాకు లేదు. కాబట్టి దీనిపై ఇంకేవైనా వ్యాఖ్యలు వచ్చినా మౌనంగా చదువుకుంటాను.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి vicky అభిప్రాయం:
03/06/2014 2:17 pm
వ్యాసం బాగుంది. ప్రచురణ కర్తలు కోర్టు వెలుపల రాజీకి రావటం చూస్తుంటే దేశంలో ఛాందస వాదం పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. Blasphemy అనేది ఒక అర్థం లేని మాట. ఆ ఇస్లామిక్ దేశాలలా తయారయ్యేలా ఉన్నాం చూస్తుంటే.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి ప్రసాద్ అభిప్రాయం:
03/06/2014 2:09 pm
సురేశ్ గారూ, మీ వ్యాసం ఎంతో సమగ్రంగా వుంది కానీ పైన చంద్రమోహన్ గారన్నట్లు ఈ వ్యాసంలో రెండు అంశాలు కలగలిసిపోవడం సమస్య.
ఆమె జ్ఞానా, అజ్ఞానా, పక్షపాతంతో రాసిందా లేదా అన్నవాటితో సంబందం లేకుండా మన సంస్కృతి మొదట్నుంచి వాద ప్రతివాదాల్ని ఎలా ప్రోత్సహిస్తూ వచ్చిందో, అన్ని రకాల మతాలకీ ఎలా చోటిస్తూ వచ్చిందో అన్న పార్శ్వాన్నే స్పృశించి వుంటే బావుండేది. అయినా గానీ నా మట్టుకు ఇది రెండు వ్యాసాలనుకొని చదివాను. వెండీ రాసిందాన్ని మీరు సమర్థించిన తీరు, నచ్చకపోయిందాన్ని నిషేధించాలనడాన్ని మీరు నిరసించిన తీరు చాలా తార్కికంగా సోదాహరణంగా వున్నాయి.
ఇక్కడ కొంతమంది హిందూమతాన్ని హిందువే అర్థం చేసుకోగలుగుతాడు అన్నట్లు అర్థంలేని వాదన చేస్తున్నారు. పాశ్చాత్యులకు “పాశ్చాత్య పక్షపాతం” వుంటే మరి మనకు స్వపక్షపాతం వుండదా? ఇక్కడ ఈ వ్యాసాన్ని తప్పుబడుతున్న వారందరూ ఈ “స్వపక్షపాత” వ్యాధితో బాధపడుతున్నవారేనని నాకనిపిస్తున్నది. ఉదాహరణకు దశరధుడి కామాన్ని lustగా పాశ్చాత్యపక్షవాదమనుకుంటే, దాన్ని pleasure and desire, not merely sexual అనేవాళ్లది స్వపక్షవాదమనవద్దా?
వేదం ఏం చెబుతుందో, గీత ఏం చెబుతుందో దానికి భాష్యం ఎలా చెప్పుకోవాలో త్రిమతాచార్యుల బాష్యాలనుంచే తెలుసుకోవాలనడం, బిడ్డ ఎలాంటిదో తల్లినే అడిగి తెలుసుకోవాలన్నట్లుగా వుంది.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Yoga అభిప్రాయం:
03/06/2014 1:58 pm
“దృక్కోణాల విభేదం, లక్ష్యాల వైవిధ్యం వల్ల ఒకే సంఘటన, ఒకే సత్యం వేర్వేరుగా కనిపిస్తాయన్న సత్యం భారతీయ దార్శనీకులకు ఏనాడో తెలుసు…”
Suresh garu: Could you please elaborate on this? I feel something is terribly wrong with this statement. This seems to be usage of loose vocabulary. I doubt if our Ancient daarsaniks meant it like what you say. May be you can quote a source that says it this way? You might actually mean they recognized the limitations of human rationality (bounded rationality)http://en.wikipedia.org/wiki/Bounded_rationality
Because of this limitation what just “appears” may not be true. Our perception might be wrong. I am sure you know the classic examples of “illusion” that are used by our philosophers. So, I don’t need to elaborate. Therefore what they probably meant is to be cautious about “knowing” and assuming that truth is understood. I believe it is this fundamental approach, that enabled them to be open about new ideas.
Based on your quote above, I am at odds to see that truth can be different just because view points or goals are different. If that is so, it would negate the truth, and the statement becomes invalid, isn’t it?
A wrong understanding of this fundamental approach might lead to agreeing with misinterpretations and falsehoods. Loose vocabulary therefore is dangerous for propagating ideas and has to be challenged.
I would like to know your view point on this. Correct me if I am wrong.
Sincerely
Yoga
ఉరి: కధ నచ్చిన కారణం గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
03/06/2014 1:48 pm
>>మాయాపిహితులు అంటే అర్థం ఏమిటో తెలియలేదు.
ఇచ్చిన లింకులో తప్పుడు విరుపు అచ్చయ్యింది. “మాయాపి హితులు” కాదు, “మాయాపిహితులు” అని ఉండాలి. మాయ+అపిహితులు. అపిహిత అంటే కప్పబడడం. మాయ చేత కప్పబడినవాళ్ళని అర్థం.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
03/06/2014 1:47 pm
‘When I use a word,’ Humpty Dumpty said, in rather a scornful tone, ‘it means just what I choose it to mean — neither more nor less.’? 🙂
ఈ మధ్య ఒక సంస్కృత పండిత సభ జరిగితే, అందులో సౌమ్యుడు, వినయశీలి అయిన పండితుణ్ణి అధ్యుక్షునిగా ఎన్నుకున్నారట. అధ్యక్షుడు అన్న పదానికి అందరికీ తెలిసిన అర్థం అధి + అక్షః అంటే పైనుండి చూచువాడు, supervisor, పెద్ద- మొదలైన అర్థాలు మనకు తెలుసు కదా. ఆ వినయశీలి లేచి అధ్యక్షుడు అంటే అ + ధి (=బుద్ధి) + అక్ష (=ఇంద్రియాలు), అని చెబుతూ నాకు బుద్ధి, ఇంద్రియాలు లేవు కాబట్టి నన్ను అధ్యక్షుడిదిగా ఎన్నుకున్నారు అని చమత్కరించారట. పక్కనే కూర్చున్నా మహా పండితుడు లేచి “భగవద్గీతలో ‘అక్షరాణాం ఆకారోస్మి’ అని పరమాత్ముడు అన్నాడు కాబట్టి ఆ అ-కారరూపుమైన పరమాత్మ యందు బుద్ధి, ఇంద్రియాలు కలవాడు కాబట్టి ఆయనను అధ్యక్షుని చేయడం సబబే అని హర్షధ్వానాల మధ్య వివరించాడట.
పదనిర్మాణ రీత్యా (morphologically) సంస్కృత భాష ఒక సంలీన భాష (inflectional language). ఒక వాక్యాన్ని, వివిధ పదాలుగా; ఒక పదాన్ని భిన్నమైన పదాంశాలుగా ఎన్నో రకాలుగా విడదీయవచ్చు. ఈ రకమైన సౌలభ్యం వల్ల ఒకే శ్లోకాన్ని వివిధ రీతులుగా విడగొట్టి పరస్పరం వ్యతిరేకమైన అర్థాలు సాధించవచ్చు. ఈ రకమైన పాండిత్య ప్రకర్ష చమత్కారాలకు బాగానే ఉంటుంది కానీ, శాస్త్ర చర్చల్లో అంతగా పొసగదు. అయితే, గత కొన్ని వందల యేళ్లుగా మన పండితులు పదాలకు కొత్త, కొత్త అర్థాలు క్రోంగొత్త రీతిలో సాధిస్తూ మన గ్రంథాలకు సరికొత్త భాష్యాలు రాయడంలోనే తలమునకలయ్యారంటే అతిశయోక్తి కాదేమో.
ఉదాహరణకు, మధ్వాచార్యులవారు మహావాక్యాలలో ఒకటైన “తత్త్వమసి (that art thou)” అన్న దానికి భాష్యం చెబుతూ ఛాందోగ్యోపనిషత్తులో “శ్వేతకేతో తత్త్వమసి (O Svetaketu, thou art that)” అన్న దానిని “శ్వేతకేతో + అతత్త్వమసి = శ్వేతకేతోతత్త్వమసి”(O Svetaketu, thou art not that)” అని విడదీసి ద్వైత సిద్ధాంత అన్వయాన్ని సాధించాడు. ఈ రకమైన పదవిభజనలతోనే ఆయన ఉపనిషత్తులు, భగవద్గీత మొదలైన వన్నీ తన సిద్ధాంతాన్ని బలపరుస్తున్నాయని నిరూపణ చేశాడు. ఈ రకమైన పదవిభజనలు శంకరాచార్యుల, రామానుజాచార్యుల భాష్యాల్లో కూడా కనిపిస్తుంటాయి. అందువల్లే వారు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాలన్నీ తమ, తమ సిద్ధాంతాలను సమర్తిస్తున్నాయని చెప్పుకోగలిగారు.
అయితే, చారిత్రకంగా చూస్తే, వేదానంతర కాలంలో వైదిక కర్మకాండ పట్ల ఒక రకమైన నిరసన ఉండేదని, ఆ నిరసన భావం ఉపనిషత్తులలో, భగవద్గీత వ్రాయబడిన తొలిదశల్లో తీవ్రస్థాయిలో ఉండేదని మనకు లభిస్తున్న ఆధారాలను బట్టి ఊహించవచ్చు. ఆ వాతావరణంలోనే వైదిక కర్మకాండలకు తిరుగుబాటుగా భౌద్ధ మతం, జైన మతం, సాంఖ్య, యోగ, అజీవిక, చార్వాక మతాలు ప్రాచుర్యం చెందాయని చెప్పడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ దృష్టితో చూస్తే, భగవద్గీతలో నేను ఉటంకించిన నాలుగు శ్లోకాలలో వేదాలను తక్కువ చేసి “త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున” అని చెప్పడానికి సులభమైన వివరణ ఇవ్వవచ్చు. అంతేకాని, ఆ శ్లోకాలలో “వేదం” అంటే “వేదం” కాదు అంటూ వితండవాదన చేయడం వల్ల మనకు కొత్త విషయాలేం బోధపడవు.
అలాగే, ముండకోపనిషత్తులో వేదాలను తక్కువస్థాయి విద్యలుని, వాటిని అపరవిద్యలుగా నిర్వచించారని వ్యాసంలో అనుకున్నాం కదా. అదే ఉపనిషత్తులో ద్వితీయఖండంలో అపరవిద్యల గురించి ఇంకా ఇలా అంటారు:
ప్లవాహ్యేతే అదృఢా యజ్ఞరూపా అష్టాదశోక్త మపరం యేషుకర్మ
ఏ తచ్ఛ్రేయో యేఽభినందంతి మూఢా జరామృత్యుం తే పునరేవాపి యంతి ||7||
అపరమైన కర్మ పదునెనిమిది అంగాలతో కూడిన యజ్ఞకర్మల పైన ఆధారపడి ఉండును. ఇవన్నియు వాస్తవానికి బలహీనమైన తెప్పల వంటివి. వీటి వల్ల పదే, పదే జరామృత్యువులు తప్పవు.
అవిద్యాయా మంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః
జంఘన్యమానాః పరియంతి మూఢా అంధేనైవ నీయమానా యథాంధాః ||8||
అజ్ఞానములో చరిస్తూ, తామే ధీరపురుషులని, ప్రజ్ఞావంతులని ఆత్మస్తుతి ఒనర్చుకొను మందమతులు శోకగ్రస్తులై, అంధునిచే నడిపించబడు అంధునివలె దిక్కుతోచక పరిభ్రమిస్తుంటారు.
అవిద్యాయాం బహుధా వర్తమానా వయం కృతార్థా ఇత్యభిమన్యంతి బాలాః
యత్కర్మిణో న ప్రవేదయంతి రాగాత్ తేనతురాః క్షీణలోకా శ్ఛ్యవంతు ||9||
అజ్ఞానముతో చరించు ఈ మూర్ఖులు తాము ఆప్తకాములైనట్లు చిన్నపిల్లల్లా భావిస్తుంటారు. రాగరతులై ఉన్నందున సత్యమును గ్రహించలేరు. అందువలన పుణ్యకర్మఫలముగా లభించిన స్వర్గాది లోకములు అనుభవించిన పిదప మళ్ళీ క్రిందికి జారుదురు.
ఇష్టాపూర్తం మన్యమానా వరిష్ఠం నాన్యచ్ఛ్రేయో వేదయన్తే ప్రమూఢాః
నాకస్య పృష్ఠే తే సుకృతేఽనుభూత్వే మం లోకం హీనతరం వా విశంతి ||10||
కర్మపరులైన ఈ మూర్ఖులు యజ్ఞవిధులు, పుణ్యకార్యములు మాత్రమే శ్రేష్ఠమైనవని భావిస్తూ, అన్యమైన మరే శ్రేయోమార్గమును తెలియలేరు. వీరు ఉన్నతమైన స్వర్గలోకములో పుణ్యఫలము అనుభవించి మఱల ఈ లోకములో గాని, ఇంతకన్నా హీనమైన లోకములో గాని ప్రవేశించుదురు.
అలాగే బృహదారణ్యకోపనిషత్తులోనూ ఇటువంటి వేదనిరసన కనిపిస్తుంది. ఆదిశంకరుని భాష్యాల్లోనూ జ్ఞానాన్ని ఉగ్గడిస్తూ వేదాలను, కర్మకాండను నిరసించే శ్లోకాలు కనిపిస్తాయి. శంకరుడు వేదనింద చేశాడా లేదా అంటూ సుదీర్ఘ చర్చలు మన పండిత లోకంలో మామూలే.
అయితే, వెండీ డానిగర్ రాసిన పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశం ఆధ్యాత్మికం కాదు, చారిత్రాత్మకం. నా వ్యాస ప్రాధాన లక్ష్యం కూడా ఇటువంటి ఆధ్యాత్మిక చర్చల గురించి కాదు. వేదంలో వర్ణించిన మతానికీ, ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో అనుసరిస్తున్న హిందూ మతానికి చాలా తేడాలు ఉన్నాయని, అందువల్ల కేవలం వేదాల ఆధారంగా హిందూ మతం గురించి సంపూర్ణంగా వివరించలేమన్నదే నా వాదన. నా వ్యాసంలో బాత్రా అభియోగానికి బదులుగా ఇలా అన్నాను:
ఇప్పుడు వివిధ మానవీయ, సామాజిక శాస్త్ర (linguistics, epigraphy, archaeology, history, population genetics etc.) పరిశోధనల ద్వారా మనకు లభ్యమౌతున్న సమాచారాన్ని బట్టి మనం మన చరిత్రను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు. ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించుకొని, హిందూ మత చరిత్రలో పరిణామాలను అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాల్లో వెండీ డానిగర్ రాసిన పుస్తకం ఒకటి. కొంత నిష్పాక్షిక దృష్టితో ఆమె పుస్తకాన్ని చదివితే హిందూ మతపరిణామం గురించి కొంతైనా అవగాహన కలుగుతుందని నా అభిప్రాయం.
ఆఫీసు పనుల ఒత్తిడిలో గత రెండురోజులుగా ఈమాటలో నా వ్యాసంపై వచ్చిన అభిప్రాయాలకు సమాధానాలు వెంటనే రాయలేకపోయినందుకు క్షంతవ్యుణ్ణి. ఇతర అభిప్రాయాలకు కూడా ఈ రోజు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి తః తః అభిప్రాయం:
03/06/2014 1:16 pm
ఒకే ఒక భరద్వాజుడు, ఒకే ఒక జనకుడు కాక పలువురు భరద్వాజులు, పలువురు జనకులు ఉన్నట్లే ఒకే ఒక శివుడు కాక పలువురు, అనేకులు, అనేకానేకులు శివుళ్లు ఉన్నారని నా అభిప్రాయం. లింగం ఊడిపొయిన శివుడూ, జంగం అయిపొయిన శివుడూ ఒకరు కాదన్నది (కాక పోవచ్చన్నది) నా ప్రతిపాదన. ఒకే ఒక ఒకే ఫిజిక్స్ లేదు ఒకే ఒకే మెకానిక్స్ లేదు. (ఒకదాంతో మరొకటి కలుపుకుని కషాయం చేసుకొవచ్చు, అది వేరే విషయం). కాబట్టి ‘శివుడి చరిత్ర’ అంటూ ఉండదు. కాబట్టి శివుడి చరిత్ర ఒకరికి తెలియటమూ, మరొకరికి తెలియక పోవటమూ అన్న ప్రసక్తి లేదు. అకడమీషియన్స్ సృష్టించిన మోడరన్ మిత్ లలొ ఇది ఒకటి. నా శివుడి గురించి నాకు తెలుసు.
“అమంగల్యం శీలం తవభవతు నా మైవ మఖిలం తథాపి స్మర్తౄణాం వరద పరమం మంగళమసి!”
బల్లి ఫలితం గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
03/06/2014 12:00 pm
అభిసారం అని “appointment” అనే ఆంగ్లపదానికి భాషాంతరీకరణం అంత సబబుగా తోచదు.
కాని వైజ్ఞానిక కల్పన అని “science fiction” అనే మాటను భాషాంతరం చేయటం బాగుంది.
ఇటువంటి కథలు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి. ఐనా, ఇది కూడా చక్కగా ఉంది. ఇలాంటి కథ చదివినప్పుడు చలంగారి దోషగుణం కథ గుర్తుకు వస్తుంది.
కాని ప్రథానంగా ప్రస్తావించిన వైజ్ఞానిక కల్పన ఏమీ ఈ కథలో నాకు కనపడ లేదు మరి.
కోనసీమ కథలు: శిరోముండనం గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
03/06/2014 11:41 am
మంచి కథకు రెండు లక్షణాలుంటాయి.
మొదటి లక్షణం హృదయాన్ని స్పృశించటం.
రెండవ లక్షణం బుధ్ధిని ప్రచోదనం చేయటం.
కథ అన్న పేరుకు సార్థకత రావాలంటే పై రెండు లక్షణాలో కనీసం ఒకటైనా పట్టాలి.
ఇందులో రెండు శుభలక్షణాలూ ఉన్నాయి.
కాబట్టి మంచి కథ.
మంచి కథనానికి రెండు లక్షణాలుంటాయి.
మొదటిది స్పష్టత.
రెండవది క్లుప్తత.
మంచికథనం అనిపించుకోవాలంటే పై రెండు లక్షణాలో కనీసం ఒకటైనా పట్టాలి.
ఇందులో రెండు శుభలక్షణాలూ ఉన్నాయి.
కాబట్టి మంచి కథనం.
ఇంకేం కావాలి?
రచయితకు నా హృదయపూర్వకమైన శుభాబినందనలు.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి రఘోత్తమరావు అభిప్రాయం:
03/06/2014 11:39 am
//రామారావు కన్నెగంటి అభిప్రాయం: March 6, 2014 8:21 అం//
Actually, no one took a notice of what you have said Sir. All the 3 conclusions that you have drawn are part of your free speech & nothing more 🙂
[Our stats, on the other hand, show that quite a few took notice. But if you believe no one did… – Ed.]