పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16474

  1. గౌతమి గురించి మల్లికార్జున శర్మ దేవరకొండ అభిప్రాయం:

    03/26/2014 4:57 am

    రాధ గార్కి,

    కథ బాగుందని ఇప్పటికే చాలా మంది చెప్పి ఉన్నారు. కథ పేరును ‘జాలారి చెట్టు’అని పెట్టిఉన్నా బాగుండేదేమో! అనిపించేన్ని సార్లు ఆ చెట్టు పేరు ప్రస్తావించబడింది. ఈ చెట్టు యొక్క ప్రాశస్త్యం ఈ కథకు సంబంధించి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం లోనే ఉన్నాను.

  2. కోనసీమ కథలు: శిరోముండనం గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    03/26/2014 12:32 am

    March 26, 2014 12:27 am

    మారుపేర్లతో వచ్చే వ్యాఖ్యలకి జవాబివ్వడం నాకు ఇష్టం వుండదు.
    కానీ ఒక వివరణ ఇవ్వాలనిపించింది. ఈ కోనసీమ కథల పేరుతో ఇంతవరకూ రాసిన కథలు నా చిన్నతనంలో అంటే 70-80ల మధ్య కాలంలో నేను ప్రత్యక్షంగా చూసిన కొంతమంది వ్యక్తుల్లో కనిపించిన కొన్ని ప్రత్యేక గుణాలు నన్నాకట్టుకున్నాయి. వారి విభిన్న ప్రవర్తనలూ చూసాక కథలుగా రాయాలని చిన్నప్పటి నుండీ ఉంది. వామనుడయినా, కన్నబాబయినా, సత్తెవతయినా, శీనుగాడయినా, ఆఖరికి ఈ అమ్మమ్మయినా ఇవి నిజజీవితంలో నేను చూసిన వాస్తవ పాత్రలు. కథల్లో 60-70% వాస్తవయిమయితే కొంత ఫిక్షన్ కూడా వుంది. ఇది కథనం కోసం అల్లుకున్నవి. కోనసీమలో వ్యక్తుల గురించి కాబట్టి ఆ శీర్షిక పెట్టుకున్నాను. అంతే కానీ కోనసీమ యాస, భాషతో కథ రాయడం నా ఉద్దేశ్యం కాదు. ఒక ప్రాంతం కథలంటే అక్కడి యాసా, భాషా ఉండాలన్న నియమాలెక్కడున్నాయి? అయినా ఏ ప్రాంతంలో తెలుగు సంస్కృతి వెల్లి విరుస్తోంది కనక? ప్రస్తుత సాహిత్య వాతావరణంలో ఏ యాసతో రాస్తే ఏ కులం వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయో తెలీదు.

    తమ పేరు ప్రకటనలో నిజాయితీ ఉన్నా లేకపోయినా కథల్లో మాత్రం నిజాయితీ, అమాయకత్వం, తెలివీతేటలూ వెతుక్కోవడం భలే బావుంది. కొంతమంది ఊహించుకున్నట్లు ఇవి కల్పిత పాత్రలు కావు.

  3. బ్లాగుల గురించి – నా మాట గురించి B.jagannadhacharyuli అభిప్రాయం:

    03/25/2014 1:12 pm

    బ్లాగుల భాగవతం బాగుంది.

    డాక్టర్.బెజ్జంకి జగన్నాథాచార్యులు
    మాచర్ల

  4. కోనసీమ కథలు: శిరోముండనం గురించి sri అభిప్రాయం:

    03/25/2014 12:33 pm

    కథ బాగుంది. కాని కోనసీమకి కథకి లింక్ ఏం లేదు. మంచి కథ.

  5. కోనసీమ కథలు: శిరోముండనం గురించి katha murali అభిప్రాయం:

    03/25/2014 5:21 am

    లైలా గారి అభిప్రాయం చదివాను. కోనసీమ కథలు పేరుతొ ఈ రచయిత రాస్తున్న కల్పిత కథలు వంశీ రాసిన గోదావరి కథలకు మల్లె కృతకమైనవి. బివియెస్ రామరావ్ గారు రాసిన గోదావరి కథలకు ఇవి కొరగావు. ఇటీవల ప్రాంతం పేరు చెప్పి రాసిన కథల్లొ భట్టిప్రోలు కథలు కొంత నయం. నిజాయితీ అన్నా వుంది. ఈ కథల్లో అది కూడా లేదు. అమరావతి కథలు అందరూ రాయలేరు. మిట్టూరు కథలు క్లాసిక్స్. దర్గామిట్ట కథలు సరెసరి. స్థానిక కథలు అలా వుండాలి. ఈ కథల్లొ కోనసీమ ప్రాంతం భాష పలుకుబడీ వాతావరణం పాత్రల బిహేవియర్ ఆత్మ యెవీ వ్యక్తం కావడం లేదు. ఇన్నొసెన్స్ లెదు. పోనీ తెలివి కూదా లేదు. అవేవీ లేనప్పుదు ఇంత ఆవేశంతో లైలగారు స్పందించడం అనవసరం అని నా అవసర అభిప్రాయం.

  6. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    03/24/2014 2:08 am

    ఎంతో శ్రమతో ఎన్నో వివరాలతో అందించిన వ్యాసానికి, మిత్రుడు సురేశ్ కు చాలా కృతజ్ఞతలు.

    రెండు మూడు అభిప్రాయాలను పంచుకోవడం.

    “హిందూమత చరిత్రలో ప్రత్యమ్నాయ కథనాలకు ఆస్కారం లేదా” అన్న శీర్షికే కొంత స్పష్టపరుచుకోవాలి.

    “హిందూమతం” అన్నదే సనాతనధర్మానికి కొత్త మాట, అతకని మాట. సనాతన ధర్మంలో శైవ మతం ఉంది, శాక్తేయ మతం ఉంది, వైష్ణవ మతం ఉంది అని అంటాం. కాని అదే కొత్తమాటను వాడుతూ “హిందూ మతం” లో శైవ మతం ఉంది, శాక్తేయ మతం ఉంది, వైష్ణవ మతం ఉంది, అని అనడం ఏదో అతకని మాటల గుంపు లాగ ఉంటుంది. సరే, సనాతన ధార్మాన్నే ఇవ్వాళ హిందూ “మతం” అంటున్నాం అనుకుంటే, “మతం” అన్నది కూడా విచారించుకోవాలి. “మతి”కి సంబంధించిందే మతం. ఇప్పటి తెలుగులో సైతం “అభిమతం” అని, ఫలానాది ఆయన మతం లెండి, అని, అభిప్రాయానికి “మతం” పర్యాయపదంగా వడడం ఉంది. మరి అటువంటి “మతం” కు చరిత్ర ఏమిటి అని ప్రశ్నించుకుంటే, మతులున్నప్పటినుంచీ చరిత్ర అనిపిస్తుంది కదా. సరే, “సనాతనధర్మాన్ని ఆచరించే మతుల యొక్క చరిత్ర” అని అనుకుంటే, చరిత్రలో “కథనాల” ఆస్కారం అర్థం కాదు. చరిత్ర అంటే కథనం కాదు, కథనం చరిత్ర కాదు. మరి ఈ హిందూమత చరిత్రలో కథనాలకు ఆస్కారం అసంబద్ధంగా కనిపిస్తుంది.

    Wendy Doniger గారు పద్యం ఉటంకించారో లేదో కాని, పోతన పద్యం చూడగానే సంతోషం కలిగింది.
    ఎబ్బెట్టుగా ఉన్న ముఖ చిత్రానికి పోతన పద్యం సమర్థనా కాదు, సమాధానమూ కాదు. ఆ పద్యం తరువాతనే పోతన భాగవతంలో

    “ఇట్లు భగవంతుండైన కృష్ణుం డాత్మారాముండయ్యును గోపసతులెంద ఱందఱకు నందఱై నిజప్రతి బింబంబులతోడం గ్రీడించు బాలు పోలికె రాసకేలి సలిపిన” అని ఉంటుంది.

    “ఈ విధముగా షడ్గుణైశ్వర్య సంపన్నుడైన శ్రీ కృష్ణమూర్తి ఆత్మలయందు క్రీడించునట్టి పరమాత్ముడుగానుండియు, ఎందఱు గోపికాస్త్రీలో అందఱు కృష్ణులుగా తాను ఏర్పడి, సొంత నీడలనే చూచి ఇతర బాలురు అని అనుకొని ఆడుకొనునట్టి బాలురవలె, రాసక్రీడ చేయగా” అని తాత్పర్యం. అంతటి భావాన్ని ఇంతగా అందించిన పోతన వర్ణనకు Wendy గారి వట్టి రెచ్చగొట్టే తప్పుదోవ పట్టించే ముఖచిత్రానికి ఏ పోలిక లేదు. ఆ పాటి ముఖచిత్రానికి అంత పరిశోధనల పరిశ్రమల అవసరం లేదు. సరిగ్గా అర్థం చేసుకోవడనికే పరిశోధనలు, ఉడుకెత్తించడానికి కాదు.

    అట్లాగే వేదాలు అపరవిద్యలు అని, వాటికి అవతల ఉన్న వేద-అంతంలోని, అక్షర బ్రహ్మ గూర్చి తెల్పేదే పరా విద్య అని ముండకోపనిషత్తు మంత్రం అన్నంత మాత్రాన వేదాలను నిరసించినట్టు కాదు.

    జ్ఞానం గురించి ఒక మాట. Academic డిగ్రీలు, పరిశోధనలు ఆధ్యాత్మిక జ్ఞానానికి అవరోధాలు కాకపోయినా, ఏ మాత్రం అవసరం లేదన్నదే భారతీయ- “హిందూ” కాదు- “భారతీయ దార్శనిక సాంప్రదాయం” విశిష్టత. వేమన ఎంతో అందంగా అన్నట్లు
    స్వానుభూతిలేక శాస్త్రవాసనలచే
    సంశయంబు విడదు సాధకునకు
    చిత్రదీపమునకు చీకట్లు పోనట్లు
    విశ్వదాభిరామ వినుర వేమ ||

    అందుకే, డిగ్రీలు కాదు, కనీసం kindergarten పోని అయిదేళ్ళ నచికేతుడి ప్రశ్నలకు చెప్పిన కఠోపనిషత్తు నుంచి, కబీర్ నుంచి, అక్షరాస్యతలేని రామకృష్ణ పరమహంస, డిగ్రీలులేని రమణ మహర్షి, ఇటీవలి పాన్‌డబ్బా వాలా నిసర్గదత్త మహరాజ్ దాకా – ఎందరివో మాటలు, చేతలు వెలుగులీనుతునే ఉన్నాయి.

    చివరిగా, ఎట్లా రాసినా, ఎట్లా చిత్రించి అచ్చేసినా, పుస్తక నిషేధం, రోగాన్ని మించి బలహీనపరిచే మందు.

    నిషేదిస్తే ఇంకొకరు, ఇంకో పేరుతో ఇటువంటిదే ఇంకోసారి మళ్ళీ రాయొచ్చు. మళ్ళీ కథ మొదటికే. కాని, పుస్తకాన్ని సమర్థవంతంగా విశ్లేషించి, విమర్శించి, లోపాలను ఎత్తి చూపితే, విషయ ఆవిష్కరణకు, సత్యాన్వేషణకు, సనాతన ధర్మ లక్ష్యానికి మేలే కలిగేది అనిపిస్తుంది.
    ==============
    విధేయుడు
    _శ్రీనివాస్

  7. కలైన గోర్వెచ్చని పాట గురించి తః తః అభిప్రాయం:

    03/23/2014 5:16 am

    శ్రీ కనుమూరి :
    నాలుగు కాదు నలభై సంవత్సరాలైనా ఈ గేయం గుండెకు అతుక్కునేఉంటుంది.
    నమస్కారాల తో
    తః తః

  8. కలైన గోర్వెచ్చని పాట గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:

    03/22/2014 12:32 pm

    నాలుగు సంవత్సరాల తర్వాత కూడా మంచి పద్యం అన్పించడం సంతోషం

  9. నాకు నచ్చిన పద్యం: పల్లవడోలలో పసిబాలుడు గురించి lyla yerneni అభిప్రాయం:

    03/22/2014 10:49 am

    “ధాత్రీజాతములే స్వయంగా పాడాయని అనుకోవాలా!”

    అవునండీ చంద్రమోహన్! The songs are their rustling sounds.

    Have a nice spring day!

    Lyla

  10. నాకు నచ్చిన పద్యం: పల్లవడోలలో పసిబాలుడు గురించి చంద్ర మోహన్ అభిప్రాయం:

    03/22/2014 6:05 am

    దమయంతి గారు:

    పాట యొక్క పల్లవి అనువాదం ఇస్తున్నాను (మిగిలిన చరణాలు అంత గొప్పగా ఏమీ లేవు):

    “మలర్దుం మలరాద పాది మలర్ పోల మలరుం విழிవణ్ణమే
    వందు విడిందుం విడియాద కాలైప్పొழுదాగ విడింద కలైయన్నమే

    నదియిల్ విళైయాడి కొడియిల్ తలైశీవి నడంద ఇళం తెండ్రలే
    వళర్ పొదిగై మలై తోండ్రి మదురై నగర్ కండు పొలింద తమిழ் మండ్రమే”

    విరిసీ విరియని అరవిచ్చిన పువ్వులాంటి కన్నులున్నవాడా/దానా
    పొడిచీ పొడవని తొలిపొద్దులా వచ్చిన కలహంసవే
    నదిలో జలకాలాడి, పూదీవెల తలలుదువ్వి నడచిన పిల్లతెమ్మెరవే
    పొదిగై పర్వతంపై ఉదయించి, మదురై నగరంలో వికసించిన తమిళ పండితసభవే

    ఒక తల్లి తన బిడ్డను లాలిస్తూ పాడిన పాట. కణ్ణదాసన్ మధురమైన కలంనుండి జాలువారిన పాట. నదిలో జలకాల వలన చల్లదనం, తీగలతో తలదువ్వుకోవడం వలన పూల పరిమళం సంతరించుకొన్న పిల్ల తెమ్మెర అని కవి భావన!

    తన బిడ్డను తమిళ అకాడమీ అని పిలవడంలో గల భాషాప్రియత్వంకూడా నాకు చాలా ఇష్టం. తన శిశువును ప్రేమించినంతగా తన భాషను ప్రేమిస్తే ఏ భాష వృద్ధి చెందదు!

    ఆ పాట లంకె ఇక్కడ: http://goo.gl/9LFSRw