So good to be forewarned. For safety – Ajantha, Tripura, Mo – I will be avoiding all three. Under conceited poets I now got to divide them up into -secretly conceited, openly conceited, grandly conceited, humbly conceited, ruly conceited, unruly conceited, conceited for no reason at all, etc.
కురుమెళ్ళ వెంకట్రావుగారు గారి “మా మహారాజుతో దూరతీరాలు” అరుదైన పుస్తకo పరిచయం చేసిన (Jiddu Krishnamurti Foundation School, Rishi Valley, Madanapalle వాస్తవ్యులు)శ్రీ పిడూరి రాజశేఖర్ గారికి,
Universal Digital Library లో యీ పుస్తకం దొరకవచ్చుననే సమాచారం అందించిన శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు.
ప్రియమైన శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు, నమస్కారములు.
మీకు తెలిసే ఉంటుంది …. అజంతా గారి కవితలని పుస్తకంగా ప్రచురించటానికి త్రిపురని డిస్కవర్ చేసి తెలుగు పాఠకులకి అందించిన విశాఖ డా.అత్తలూరి నరసింహరావు గారు ఎంత ప్రయత్నించినా సాధించ లేక పోయారు కాని,వారి మేనల్లుడు ప్రముఖ కవి త్రిపురనేని శ్రీనివాస్ ఆ ఘనకార్యం సాదించాడు. అజంతా గారిని ఒప్పించి “స్వప్నలిపి” కవితల పుస్తకాన్ని తన సొంత ఖర్చులతో ‘కవిత్వం ప్రచురణల’ ద్వారా ఎంతో అందంగా తీర్చిదిద్ది వెలుగులోకి తెచ్చాడు. ఈ కవితా సంకలనం 1997లో సాహిత్య అకాడెమీ కవిత్వ పురస్కారం అందుకుంది.”స్వప్నలిపి” ని అజంతా, త్రిపురల ప్రియనేస్తం ‘మో’ గారు “Dream Script” పేరిట ఇంగ్లీషులోకి ఆనువదించారు.
” అక్షరం నిండా అన్నీ అద్భుతాలే అని
శబ్ద శక్తి సార్వభౌమాధికారం అనాహాతం అని చెప్ప లేదా నేను చెప్ప లేదా”
“నేను ప్రతి మనిషిలో వుంటాను, నేను ప్రతి మనిషి స్వప్నంలో వుంటాను, స్వప్న సౌందర్యంలో వుంటాను … అధః పతితుడైన మనిషిని ఆప్యాయంగా లేవనెతుత్తున్న కారుణ్య హస్తాలలో వుంటాను ”
అన్న అజంతా “సజీవ స్వరం” ఈమాట ద్వారా అందరికీ అందుబాటులోకి తెచ్చిన ప్రవాసం లోని మీకు, విజయవాడ లోని శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారికి వినమ్రపూర్వక కృతజ్ఞతలు.
చంద్ర (కన్నడములో రుద్ర లేక బాణ) గణములు లేని అక్కర మధ్యాక్కర. ఇందులో వరుసగా ఇం/ఇం/సూ – ఇం/ఇం/సూ. రెండు అర్ధ భాగములకు ఒకే గణములు. ఇవే గణములకు వరుస మార్పు (permutation) కలిగించినప్పుడు మఱొక రెండు “మధ్యాక్కరలు” ఉద్భవిస్తాయి. అవి (1) సూ/ఇం/ఇం – సూ/ఇం/ఇం, (2) ఇం/సూ/ఇం – ఇం/సూ/ఇం. వీటికి నేను ఆద్యరుణ మధ్యాక్కర, మధ్యారుణ మధ్యాక్కర అని పేరు పెట్టాను. ఇందులో సూర్య గణపు స్థానము స్పష్టము. సామాన్య మధ్యాక్కర నిజముగా అంత్యారుణ మధ్యాక్కర. వీటిని కూడ చక్కగా వ్రాసి పాడుకోవచ్చును. క్రింద నా ఉదాహరణములు –
విషయసంపన్నమైన ఈ సుదీర్ఘవ్యాసాన్ని, ప్రస్తుతం మధ్యాక్కర వరకూ చదివాను. ఇందులో ప్రస్తావించిన కొన్ని విషయాలపై నా ఆలోచనలు:
1. “…గీతులలో పదములను గణములకు తగ్గట్లు ఎంచుకొంటే ఆ గీతి గానయోగ్యముగా ఉంటుందని”
ఇది పాక్షికసత్యం మాత్రమే అని నా అభిప్రాయం. గణాలకు తగ్గట్టుగా పదాలు ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆ గణాలలో “మాత్రా సమత” కూడా ఉండాలి. మచ్చుకి, మోహనగారు ఉదాహరించిన మహాక్కర పాదం పరిశీలిస్తే:
ఈ పాదంలో మొదటి దళం (నీవు లేనిచో జీవమ్ము లేదురా) కన్నా రెండవ దళానికి (నీవెగా నాజీవ రాజీవము) లయబద్ధత (దానివల్ల గానయోగ్యత) అధికంగా ఉన్నదన్న విషయం గమనించవచ్చు. దానికి కారణం రెండవ దళంలోని గణాలలో మాత్రా సమత అధికంగా ఉండటమే. మొదటి దళం “తాన తాననా తానాన తాననా” అయితే, రెండవది “తాననా తానాన తానాన న”. మొదటి దళంలో “తాన తాననా” అనేది లయని కుంటుపరుస్తున్నది. దీన్ని “తాన తానాన” అన్న రీతిలో మారిస్తే కొంత మెరుగైన నడక లభిస్తుంది. “నీవు లేకున్న జీవమ్ము లేదురా – నీవెగా నాజీవ రాజీవము”. మహాక్కర పాదంలో మొదటి దళానికి ఇంకా మెరుగైన నడక నా దృష్టిలో ఇది: “తాననా/(తన తనన) తాననన తాననా తాన”
“నినువిడిచి జీవనము లేదురా నాకు – నీవెగా నాజీవ రాజీవము”
ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇది కూడా మహాక్కర పాదమే. కాని పదాలు గణాలకు తగ్గట్టుగా విడలేదు. అయినా ఖండగతిలో పాదం హాయిగా సాగింది.
సారాంశం ఏమిటంటే, అంశగణ ఛందస్సు పూర్తి మాత్రాబద్ధ ఛందస్సు కాదు. కాబట్టి అందులో గణాల సమత ఉన్నా, ఆ గణాలబట్టి పదాలను కూర్చినా, స్ఫుటమైన చక్కని నడక ఏర్పడుతుందని చెప్పడానికి లేదు. ఆ గణాలను అనేక రకాలైన మాత్రాక్రమాలుగా రచించవచ్చు. అందులో కొన్ని మాత్రాక్రమాల పోహళింపులే మంచి నడకని అందిస్తాయి. అంచేత గానయోగ్యంగా రాయాలంటే అలాంటి క్రమాలని గుర్తించి, వాటిని అనుసరించి పదాలను కూర్చాలి.
2. మధ్యాక్కర యతి గురించి
దీనిపై చాలా చర్చే జరిగింది. అయితే ఆశ్చర్యకరంగా చాలావరకూ అందరూ అయిదవ గణం దగ్గర యతి సరి కాదనీ, నాల్గవ గణం దగ్గరదే సరైనదనీ భావించారు. త్రిపురనేని రామస్వామిగారైతే ఏకంగా “అప్పటి బహుళ ప్రచారములో నున్న యక్కరలను నన్నయ వాడినాడు కాని వాని తత్త్వమెరుగజాలక మధురగతి నంతయు మంటపాలు చేసి కుంటినడక యంటించినాడు” అని నన్నయపై విరుచుకుపడ్డారు. నన్నయ మధ్యాక్కరది కుంటినడకే అయినా, అది చేసినది నన్నయ కాదనీ, అంతకుముందు శాసనాలలో కూడా అదే నడక ఉన్నదనీ త్రిపురనేనివారు గమనించకపోవడం దురదృష్టం. బహుశా దీన్ని దృష్టిలో ఉంచుకొనో ఏమో కోవెల సంపత్కుమారాచర్యగారు నన్నయ మధ్యాక్కరలలో కొన్ని చోట్ల నాల్గవ గణంపై కూడా యతి ఉన్నదనీ అందువల్ల నన్నయకి నాల్గవ గణంపై యతి ఆమోదమేననీ సమర్థించడానికి ప్రయత్నించారు. కాని అది అంత సమంజసం కాదు. ఆ విషయాన్ని ప్రస్తావించి సంగనభట్ల నరసయ్యగారు తన “తెలుగులో దేశిచ్ఛందస్సు ప్రారంభ దశలు” అనే పుస్తకంలో దాన్ని సహేతుకంగా ఖండించారు.
“ఆ కాలములో ఈ కాలములో మధ్యాక్కరను నడిపించే విధానములో భేదమున్నదని అనుకొందును. మొదటి నాలుగు గణములు ఒక పట్టుగా ద్విపదవలె నడిపించి శేషించిన రెండు గణములను రెండవ పట్టుగా చదివిన యెడల వినసొంపుగానే యుండును”, అన్న గిడుగు సీతాపతిగారి అభిప్రాయమే నాకు మిగతావారి వాదనలకన్నా సమంజసంగా తోస్తోంది. నరసయ్యగారు కూడా దీనిని తన పుస్తకంలో సమర్థించారు. గిడుగువారు ఇచ్చిన బొబ్బిలిపాట ఉదాహరణతోబాటు, వారు బతుకమ్మపాట ఉదాహరణకూడా ఇచ్చారు:
శ్రీరామభూపాలుడూ పట్టాభి
షేకుడై కొలువుండగా
ఇక్కడ “పట్టాభి” అనేది అధికంగా వచ్చిన గణం. ఇలా ఒకే రకమైన మాత్రాగణాల మధ్యలో అదనంగా మరొక మాత్రాగణం చేరడం మరికొన్ని పాటలలో కూడా గమనించవచ్చు. ఉదాహరణకు
“కస్తూరి రంగరంగా మాయన్న
కావేటి రంగరంగా”
అన్న పాటలో కూడా “మాయన్న” అనేది “తానాన తాననానా” అనే రెండు సమ మాత్రాగణాల మధ్యలో వచ్చిన గణం.
అయితే, గిడుగువారు కానీ నరసయ్యగారు కానీ యిచ్చిన ఉదాహరణలు ద్విపద – మధ్యాక్కర ఉదాహరణలు కాదు. మధ్యాక్కరను ద్విపదలాగా నడిపించిన ఉదాహరణలు వారు ఇవ్వలేదు. వారు పైన సూచించిన అంశంకన్నా కూడా విశేషమైన మరొక ప్రత్యేకత మధ్యాక్కర – ద్విపద మధ్య నాకు కనిపించింది. అదేమిటంటే, “తననాన తానాన తాననా నాన” అనే దివపదలోని నాలుగు దళాలలో చివరి రెండు దళాలూ మళ్ళీ ఆవృత్తి అయితే అది మధ్యాక్కర అవుతుంది! మోహనగారు ఉదాహరించిన మధ్యాక్కర పాదం చూస్తే అది స్పష్టం అవుతుంది:
మనసెందుకో నేఁడు మైన-మై మారె – మౌనమై జారె
ఇక్కడ “మైనమై మారె”, “మౌనమై జారె” అనే రెంటి గణస్వరూపం సరిగ్గా ఒకటే.
దీనిబట్టి, నా ఊహ (లేదా అంచనా) ఏమిటంటే – పూర్వం ద్విపద పాటని ఒకరు పాడి, చివరి రెండు దళాలనూ వంత పాడేవాళ్ళు తిరిగి పాడే సంప్రదాయం ఉండేది. ఉదాహరణకు:
“అమ్మణ్ణి కన్నుల్లు తమ్మిపూవుల్లు” అని ఒకరు పాడితే, మిగతావాళ్ళు “తమ్మిపూవుల్లు” అని వంతపాడేవారు. అది అంతా కలిసి ఒక వాక్యంగా రాస్తే సరిగ్గా మధ్యాక్కర పాదం అవుతుంది:
అమ్మణ్ణి కన్నుల్లు తమ్మిపూవుల్లు తమ్మిపూవుల్లు
అందువల్ల దీనికి అయిదవ గణం మొదట యతి (పదవిచ్ఛేదం) తప్పనిసరి!
నా ఊహకి సమర్థింపుగా, “లాలమ్మ గుఱ్ఱాలు లంకల్లొ మేసె – లంకల్లొ మేసె” అంటూ ద్విపద నడకలో సాగే జానపదగేయం ఆంధ్రభారతి సైటులో కనిపించింది (లింకు).
ఇది ఇంచుమించుగా మధ్యాక్కర ఛందస్సే (లాలమ్మ గుఱ్ఱాలు లంకలో మేసె – లంకలో మేసె – అని మార్చుకొంటే)!
చివరిగా, వేలూరివారు ఉదాహరించిన విశ్వనాథ మధ్యాక్కరని ఎలా “పాడూకో”వచ్చునో వారినోట కాని, మరెవరి నోటనైనా కాని వినాలనుంది! 🙂
వ్యాసమును చదివి తమ అమూల్యమైన అభిప్రాయములను తెలిపిన శ్రీమతి సుప్రభ, శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు గారలకు నా నమస్సులు. ఇది అక్కరలపై వ్యాసము కాబట్టి ఒకటికన్న ఎక్కువగా ఉదాహరణములను చూపలేకపోయినాను.
శ్రీమతి దోనేపూడి లక్ష్మీకాంతమ్మ “తెలుగు కవిత్వంలో మధ్యాక్కర – ఒక పరిశీలన” అనే PhD సిద్ధాంత గ్రంథములో మధ్యాక్కరలను ఉపయోగించిన తెలుగు కవులపై ప్రత్యేకముగా కొన్ని ప్రకరణములను కేటాయించారు. అందులో ఆ కవులు వ్రాసిన కావ్యములనుండి ఎన్నియో ఉదాహరణములను కూడ ఇచ్చారు. క్రింది మొదటి ఏడు మధ్యాక్కరలను అక్కడినుండి గ్రహించి, ఉదాహరణములుగా ఇక్కడ పొందుపరచినాను. ఎనిమిదవది “వేదనామధ్యాక్కరలు” (లింకు) అనే పుస్తకమునుండి గ్రహించాను. తొమ్మిదవది శ్రీ రవిగారు నేను వ్రాసిన “ఛందస్సుకు ఒక కొండ – కొక్కొండ” (లింకు) వ్యాసమునకు ఒక అభిప్రాయములో తెలిపినారు. విశ్వనాథ మధ్యాక్కరలు ఇక్కడ లభ్యము (లింకు)
1) తుమ్మల సీతారామమూర్తి చౌదరి – మహాత్మకథ
ఓ యయ్య ప్రాయోపవేశమునకు – మూనకు, నీవు
పోయిన మాకు స్వాతంత్ర్య మేల ప్ర-భుత్వ మదేల
శ్రీయేల జీవిత మేల సౌహార్ద – సిద్ధికై శ్రమము
సేయుదుమని కమ్మ నంపి రా యోగి-శేఖరు కడకు
2) ఆరుద్ర – శుద్ధ మధ్యాక్కరలు
పదమూడు మాత్ర లున్నట్టె – పాదార్ధముల వళ్లు పెట్టె
తుది ప్రాస లందులో నిలుపు – తూకాన అవి రెండు కలుపు
మొదలట్లు తొలి ప్రాస వుంచు – ముద్దుగా నాల్గాలపించు
కుదురైన అందాల గములు – కొత్తవీ మధ్యాక్కరములు
3) నాయని సుబ్బా రావు – విషాద మోహనం
పోయిన సూర్యుండు వచ్చు – పోయిన చంద్రుండు వచ్చు
పోయిన పదునాఱు కళలు – పూర్తిగా విధునకు వచ్చు
పోయిన తారకత మినుకు – పూవుల గుత్తులు వచ్చు
పోయిన మోహనా వినయ – భూషణా తిరిగి రావేమి
4) కోవెల సుప్రసన్నాచార్య – పాంచాలరాయ శతకము
ఎన్నడు వినుటయే కాని – యెన్నడు కనుటయే లేదు
ఎన్నడు కాంచుట కాదు – యెన్న డూహించుట లేదు
ఎన్నాళ్ల కెన్నాళ్ల కయ్యె – యిట్టి మీ దివ్య దర్శనము
కన్నుల పండువు కాగ – కరుణాబ్ధి పాంచాలరాయ
ఒకచేత వీణ ధరించి చిరునవ్వు – లొలుకబోయుచును
నొకచేతఁ బొత్తమ్ము గొనుచు నంచపై – నొప్పారి రావె
ప్రకటింతు వేవేల నతులు సకల సౌ-భాగ్యంబు లీవె
యిక నాకు జ్ఞానసరస్వతీ వాస-రేశ్వరీ దేవి
6) జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి (శాంతిశ్రీ) – సత్యశాయి మధ్యాక్కరలు
తల్లి వందురు కొందరు మరి కొందరు – తండ్రి వందురు జ-
గల్లీల కాని స్త్రీపురుష భేదమ్ము – కలద నీయందు
తల్లివై లాలింతు వెంతొ తండ్రియై – దండింతు వంతె
చల్లని మా తల్లి తండ్రి జయ సత్య-శాయీ నమోస్తు
ఇష్టదైవము దేశమాత కావలె నీతరమ్మునకు
ఇష్టకామ్యార్థము లొసగు నీదేవి యీనాడు మనకు
సర్వ లోకము లేలు తల్లి స్వయముగా సాక్షాత్కరించె
సర్వావతారాల మూలమౌ పరమావతారమ్ము
శర్వాణి వాణి వైష్ణవి సకలదైవ సమ్మేళనమ్ము
ఉర్విలో భరతోర్వి, ఈమె సేవయే ఉత్తమ పూజ
ఆదరపూర్వకమైన మీ సహృదయ వ్యాఖ్యకు ధన్యవాదాలు. మీరు ప్రస్తావించిన విషయాలు:
మొదటిది: రాయలు ‘ఆంధ్రకవి’ అనటం సాభిప్రాయమూ, విశేష హృదయధర్మమే కాని, ఇతరభాషాకవుల మధ్య వ్యవచ్ఛేదకంగా అన్న మాట కాదు. అది పాదపూరకం కాదు. పరివృత్తిని ఎంతమాత్రం సహింపని భావభావన. తెలుగువారిని ఉద్దేశించి తెలుగులో పద్యం చెబుతూ, ‘తెలుగు కవి ధూర్జటి’ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. “ప్రౌఢకవి ధూర్జటి” అనవచ్చును కదా. అష్టదిగ్గజ కవులందరూ తెలుగువారే అయితే, “స్తుతమతి యైన ఆంధ్రకవి” (లేదా, ‘తెల్గు కవి’) అనవలసిన అవసరం అసలే ఉండదు. అక్కడ “ఆంధ్ర” శబ్దప్రయోగం కేవలం భాషాభిమానాన్ని మాత్రమే సూచిస్తున్నదన్నది ప్రతిపాద్యాంశం.
రాయాస్థానంలో ఉన్నది అష్టదిగ్గజములా? నవరత్నములా? వారిలో అందరూ తెలుగువారు మాత్రమేనా? ఇతరులూ ఉన్నారా? అన్న విషయాన్ని అధికరించి అనేకవాదోపవాదాలున్నాయి. సంస్కృతాంధ్రతమిళకన్నడ కవులవి ఏవేవో పేర్లు విమర్శకుల పరిశీలనకు వచ్చాయి. ఆ కవులలో సుప్రసిద్ధులూ, అప్రసిద్ధులూ ఉన్నారు. ఇదమిత్థమని తీర్పు చెప్పటం సాధ్యం కాదు. కనీసం అందుకు ఆవశ్యకమైన సాధనసామగ్రినైనా సమీచీనంగా సమీకరించటం ఈనాటికీ జరగలేదు.
రెండవది: ఆముక్తమాల్యదలో ఆ వాక్యం ప్రస్తావింపబడిన తీరును బట్టి “దేశభాషలందు తెలుగు లెస్స” అన్న నిరుక్తికి రాజకీయ, సాంస్కృతిక కారణాలనేకం తప్పక ఉండి ఉంటాయని విశ్వసింపవచ్చును. అటువంటివేవో ఉండినందువల్లనే అదేదో తన మాటగా చెప్పక క్రీడాభిరామములోని ఆ మాటను త్రవ్వి తలకెత్తి, ప్రార్థితస్వప్నాన్ని భగవద్వాక్యంగా నిరూపింపవలసి వచ్చి ఉంటుంది. కారణం ఏదైనా, ఎంతో అభిమానం లేనిది అసలు ఆంధ్రకావ్యరచనకు ఉపక్రమణమే ఉండదు కదా.
మూడవది: కావ్యరచన సాగుతున్న కాలంలో కవులు తత్తత్సన్నివేశాలను నలుగురికీ వినిపించటం వింతేమీ కాదు. అది నాడూ, నేడూ జరుగుతున్న దృగ్విషయమే. నా మటుకు నేనే ఎంతోమంది ప్రసిద్ధుల రచనలను అవి సుపరీక్షితాలూ, సుపరిష్కృతాలూ కాకముందే ఉక్తలేఖనదశలో విన్నాను. చదివాను. కావ్యం మానవసమర్పితమైతే, ఆ కావ్యాన్ని నలుగురికీ నాలుగు చోట్ల వినిపిస్తూ, ఎవరికి అంకితం ఇవ్వాలో వ్యక్తిని కుదుర్చుకోవటానికి ఆ రోజుల్లో ఎంతో కాలం పట్టేది. ఆ ‘కృతిభర్త’కు నలుగురి చేత చెప్పింపవలసి వచ్చేది. అంకితం పుచ్చుకొని ఏమివ్వగలడో, ఏమిస్తానంటాడో; అది తనకు అంగీకార్యమో, కాదో తెలుసుకోవాలి కదా. కృతి పూర్తయిన తర్వాత ఒప్పందాలు కుదుర్చుకొని, వంశచరిత్ర సేకరించి, కృత్యాదిని వ్రాయటానికి పడే ఆ అవస్థనే ‘కృతాద్యవస్థ’ అనేవారు. కృతాద్యవస్థ అంటే రచన మొదలుపెట్టేందుకు పడే అవస్థ కాదు; కృతి పూర్తయిన తర్వాత అవతారికను వ్రాసేందుకు పడే అవస్థ.
శ్రీమహాభాగవతం రచన అద్భుతంగా సాగుతున్నదని విన్న తర్వాతనే కదా, రాజు పోతన గారిని దానిని తనకు అంకితం చేయాలని అడగటమూ, ఆయన ఇవ్వననటమూ జరిగింది? రచనాప్రక్రియ నిర్విఘ్నపరిసమాప్తి పర్యంతం రహస్యంగా ఉంటే ఈ వృత్తాంతాలే సంభవింపవు కదా.
కావ్యరచన ఎంత గజగర్భపద్ధతి అయినా, అదేమీ ఐకాంతికమైన రహస్యవ్యాసంగం కానేరదు. రచనా ప్రారంభానికి పూర్వపు కృషి మాత్రమే కవికి ఆంతరంగికం. రచన సాగుతున్న దశ, రచన పూర్తయాక అంకితోత్సవానికి లేదా భగవత్సమర్పణకు మునుపు సూర్యాలోకం అన్నవి బహిర్ముఖీనములే. నిండుసభలో ఇంకా పూర్తి కాని కావ్యమధ్యసన్నివేశాన్ని గానంచేయటం గుణగౌరవాన్ని, అందుకొనబోయే గౌరవాన్ని గౌణీకరింపదు సరికదా, రచన సవ్యంగా కొనసాగటానికి, కావ్యప్రశస్తికి మరింత ఉల్లాసదోహదం కాగలుగుతుంది.
కావ్యాన్ని పూర్తిచేసిన తర్వాతైనా, కావ్యరచనాకాలంలో నైనా కావ్యగానాన్ని కవి తానై స్వయంగా చేసి ఉండటమూ, ఇతరులు కోరగా చేసి ఉండటమూ రెండూ సహజమే. సాహిత్యసభ అన్నాక కొలువుతీరినవారు వారు వారు వ్రాస్తున్న విశేషాలనూ, నాటినాటికి వ్రాసిన విషయాలనూ తెలుసుకోక మానరు కదా. నిజంగా అష్టదిగ్గజాలలో ఉన్నవాడే అయితే, కావ్యాన్ని ఇంట్లో లేఖకులకు చెప్పి వ్రాయిస్తూ, రచన పూర్తయే దాకా శైలి, కథ, కవిత్వం, చమత్కారాలు ఎవరికీ తెలియకుండా దాచిపెట్టటం అసలే వీలుకాదు. కావ్యగానాలు జరుగుతుండేవని, ధూర్జటి ఆలస్యంగా ఆస్థానప్రవేశం చేసి కృష్ణరాయలు అప్పటికింకా సుముఖుడై ఉన్న 1523-1524 ప్రాంతాల కావ్యాన్ని మొదలుపెట్టి రచన సాగిస్తూ, అడిగినప్పుడు నలుగురికీ వినిపిస్తూ ఉండేవాడని, పరిస్థితులు తారుమారయిన కొంతకాలానికి పూర్తిచేసేనాటికి భవపరాఙ్ముఖుడుగా ఉన్నాడని ఊహ్యం.
ధూర్జటి గారు అష్టదిగ్గజాలలో ఒకరా? అన్న విషయం అనుమేయమే కాని, ఏ సంగతీ నిర్ధారించి చెప్పలేమని వ్రాశాను.
కందుకూరి రుద్రకవి సాహిత్యజీవితమంతా క్రీస్తుశకం 1550 తర్వాత ప్రారంభమయింది. తొలిరచన నాటికి నలభై యాభై యేళ్ళవాడనుకొంటే, అష్టదిగ్గజకవులలో కాదు సరికదా, మామూలు ఆస్థానకవి కూడా అయివుండడు. ఆయన ఈశాన్య సింహాసనాసీనుడన్నది విశ్వసనీయం కాదు. సంస్కృతంలో ‘రాష్ట్రౌఢ వంశకావ్యం’ ఆయన కృతి అని తెలుగు సాహిత్య చరిత్రకారులు వ్రాసినది సరికాదు.
ఈ లఘుప్రస్తావికను సహృదయంతో చదివి ఎంతో ఔదార్యంతో ఆశీర్వచస్సులను అందించిన పూజ్యులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి నమస్సుమాంజలి! _/|\_ !
సౌజన్యమూర్తులు శ్రీ రంగ గారికి, శ్రీ రవి గారికి – ప్రణామాలు.
అజంతా రెండు కవితలు గురించి lyla yerneni అభిప్రాయం:
01/10/2016 3:38 pm
So good to be forewarned. For safety – Ajantha, Tripura, Mo – I will be avoiding all three. Under conceited poets I now got to divide them up into -secretly conceited, openly conceited, grandly conceited, humbly conceited, ruly conceited, unruly conceited, conceited for no reason at all, etc.
స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నో
యతులితమాధురీమహిమ?
హా! తెలిసెన్ భువనైక మోహనో
ద్ధత కవనాల సార రచనా సమయాల ససేమిరా ఇసిం
త తగని(క) తెల్గు అక్కరల నంటక యుండుట చేతనే సుమీ!
Lyla
(All kinds of Pun is certainly intended.)
మా మహారాజుతో దూరతీరాలు – పుస్తక పరిచయం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
01/10/2016 1:04 pm
కురుమెళ్ళ వెంకట్రావుగారు గారి “మా మహారాజుతో దూరతీరాలు” అరుదైన పుస్తకo పరిచయం చేసిన (Jiddu Krishnamurti Foundation School, Rishi Valley, Madanapalle వాస్తవ్యులు)శ్రీ పిడూరి రాజశేఖర్ గారికి,
Universal Digital Library లో యీ పుస్తకం దొరకవచ్చుననే సమాచారం అందించిన శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు.
DLI లింకు
అజంతా రెండు కవితలు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
01/09/2016 11:57 pm
ప్రియమైన శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు, నమస్కారములు.
మీకు తెలిసే ఉంటుంది …. అజంతా గారి కవితలని పుస్తకంగా ప్రచురించటానికి త్రిపురని డిస్కవర్ చేసి తెలుగు పాఠకులకి అందించిన విశాఖ డా.అత్తలూరి నరసింహరావు గారు ఎంత ప్రయత్నించినా సాధించ లేక పోయారు కాని,వారి మేనల్లుడు ప్రముఖ కవి త్రిపురనేని శ్రీనివాస్ ఆ ఘనకార్యం సాదించాడు. అజంతా గారిని ఒప్పించి “స్వప్నలిపి” కవితల పుస్తకాన్ని తన సొంత ఖర్చులతో ‘కవిత్వం ప్రచురణల’ ద్వారా ఎంతో అందంగా తీర్చిదిద్ది వెలుగులోకి తెచ్చాడు. ఈ కవితా సంకలనం 1997లో సాహిత్య అకాడెమీ కవిత్వ పురస్కారం అందుకుంది.”స్వప్నలిపి” ని అజంతా, త్రిపురల ప్రియనేస్తం ‘మో’ గారు “Dream Script” పేరిట ఇంగ్లీషులోకి ఆనువదించారు.
” అక్షరం నిండా అన్నీ అద్భుతాలే అని
శబ్ద శక్తి సార్వభౌమాధికారం అనాహాతం అని చెప్ప లేదా నేను చెప్ప లేదా”
“నేను ప్రతి మనిషిలో వుంటాను, నేను ప్రతి మనిషి స్వప్నంలో వుంటాను, స్వప్న సౌందర్యంలో వుంటాను … అధః పతితుడైన మనిషిని ఆప్యాయంగా లేవనెతుత్తున్న కారుణ్య హస్తాలలో వుంటాను ”
అన్న అజంతా “సజీవ స్వరం” ఈమాట ద్వారా అందరికీ అందుబాటులోకి తెచ్చిన ప్రవాసం లోని మీకు, విజయవాడ లోని శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారికి వినమ్రపూర్వక కృతజ్ఞతలు.
రెండు కవితలు గురించి S A RAHMAN అభిప్రాయం:
01/07/2016 2:00 pm
రెండు కవితలు కూడా చాలా బాగున్నాయి.
మా ఆవిడ – మంగళసూత్రం గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:
01/07/2016 3:12 am
జిలేబి గారికి,
ధన్యవాదాలు.
భామినులు కాంచునది పసిడినే కదా….దహా.
రమణి గారికి,
ధన్యవాదాలు.
రెండు FDలు తీసిన తరువాత లాభం ఎవరికి? మంగళ సూత్రం స్ట్రాంగ్ గానే ఉంది ప్రద్యుమ్నుడే వీక్ అయ్యాడు……దహా.
జనవరి 2016 గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:
01/06/2016 10:43 am
అభినందనలు. “ఈమాట” మరిన్ని మైలురాళ్ళు తప్పక దాటుతుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు.
అక్కరలు గురించి మోహన అభిప్రాయం:
01/06/2016 10:25 am
వరుసమార్పు (permutation) మధ్యాక్కరలు –
చంద్ర (కన్నడములో రుద్ర లేక బాణ) గణములు లేని అక్కర మధ్యాక్కర. ఇందులో వరుసగా ఇం/ఇం/సూ – ఇం/ఇం/సూ. రెండు అర్ధ భాగములకు ఒకే గణములు. ఇవే గణములకు వరుస మార్పు (permutation) కలిగించినప్పుడు మఱొక రెండు “మధ్యాక్కరలు” ఉద్భవిస్తాయి. అవి (1) సూ/ఇం/ఇం – సూ/ఇం/ఇం, (2) ఇం/సూ/ఇం – ఇం/సూ/ఇం. వీటికి నేను ఆద్యరుణ మధ్యాక్కర, మధ్యారుణ మధ్యాక్కర అని పేరు పెట్టాను. ఇందులో సూర్య గణపు స్థానము స్పష్టము. సామాన్య మధ్యాక్కర నిజముగా అంత్యారుణ మధ్యాక్కర. వీటిని కూడ చక్కగా వ్రాసి పాడుకోవచ్చును. క్రింద నా ఉదాహరణములు –
“ఆద్యరుణ” మధ్యాక్కర – సూ/ఇం/ఇం – సూ/ఇం/ఇం
రమ్ము నక్తంపు భ్రాంతిలో – రమ్ము నక్షత్ర కాంతిలో
రమ్ము కౌముదీ మాయలో – రమ్ము శృంగంపు ఛాయలో
రమ్ము మృదుగాన పదముగా – రమ్ము రసరాగ నదముగా
రమ్ము రాజీవ లోచనా – రమ్ము నా జీవమోచనా
జలజ మిత్రుండు వెలుఁగగా – జలజ మాలికల్ విరియఁగా
జలజ లోచనున్ లేపఁగా – జలజ లోచనల్ పాడఁగా
జలద వర్ణునిన్ జూడఁగా – జలదమై డెంద మాడఁగా
జలము పొంగెఁగాఁ గంటిలో – జలదరింపులే యొంటిలో
“మధ్యారుణ” మధ్యాక్కర – ఇం/సూ/ఇం – ఇం/సూ/ఇం
ఎందుకే నీకు తొందర – యెందుకో చెప్పు ముందర
చిందులాడంగ వచ్చునే – శ్రీలఁ దా నీకు నిచ్చునే
బంధమో యింక గట్టిదే – బాధ యీ నిన్ను ముట్టదే
తందనా తాన తాననా – తందనా తాన తాననా
శారికా వాని రాకలో – సారమే జీవితమ్ములో
చేరి యీ నన్ను మార్చునే – చింతలన్ వేగ తీర్చునే
కోరికల్ గ్రొత్త పుష్పముల్ – కూర్మి నానంద బాష్పముల్
వేఱుగా జన్మ లేలనే – ప్రేమలో విరియు బాలనే
విధేయుడు – మోహన
అక్కరలు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
01/06/2016 4:58 am
విషయసంపన్నమైన ఈ సుదీర్ఘవ్యాసాన్ని, ప్రస్తుతం మధ్యాక్కర వరకూ చదివాను. ఇందులో ప్రస్తావించిన కొన్ని విషయాలపై నా ఆలోచనలు:
1. “…గీతులలో పదములను గణములకు తగ్గట్లు ఎంచుకొంటే ఆ గీతి గానయోగ్యముగా ఉంటుందని”
ఇది పాక్షికసత్యం మాత్రమే అని నా అభిప్రాయం. గణాలకు తగ్గట్టుగా పదాలు ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆ గణాలలో “మాత్రా సమత” కూడా ఉండాలి. మచ్చుకి, మోహనగారు ఉదాహరించిన మహాక్కర పాదం పరిశీలిస్తే:
“నీవు లేనిచో జీవమ్ము లేదురా – నీవెగా నాజీవ రాజీవము”
ఈ పాదంలో మొదటి దళం (నీవు లేనిచో జీవమ్ము లేదురా) కన్నా రెండవ దళానికి (నీవెగా నాజీవ రాజీవము) లయబద్ధత (దానివల్ల గానయోగ్యత) అధికంగా ఉన్నదన్న విషయం గమనించవచ్చు. దానికి కారణం రెండవ దళంలోని గణాలలో మాత్రా సమత అధికంగా ఉండటమే. మొదటి దళం “తాన తాననా తానాన తాననా” అయితే, రెండవది “తాననా తానాన తానాన న”. మొదటి దళంలో “తాన తాననా” అనేది లయని కుంటుపరుస్తున్నది. దీన్ని “తాన తానాన” అన్న రీతిలో మారిస్తే కొంత మెరుగైన నడక లభిస్తుంది. “నీవు లేకున్న జీవమ్ము లేదురా – నీవెగా నాజీవ రాజీవము”. మహాక్కర పాదంలో మొదటి దళానికి ఇంకా మెరుగైన నడక నా దృష్టిలో ఇది: “తాననా/(తన తనన) తాననన తాననా తాన”
“నినువిడిచి జీవనము లేదురా నాకు – నీవెగా నాజీవ రాజీవము”
ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇది కూడా మహాక్కర పాదమే. కాని పదాలు గణాలకు తగ్గట్టుగా విడలేదు. అయినా ఖండగతిలో పాదం హాయిగా సాగింది.
సారాంశం ఏమిటంటే, అంశగణ ఛందస్సు పూర్తి మాత్రాబద్ధ ఛందస్సు కాదు. కాబట్టి అందులో గణాల సమత ఉన్నా, ఆ గణాలబట్టి పదాలను కూర్చినా, స్ఫుటమైన చక్కని నడక ఏర్పడుతుందని చెప్పడానికి లేదు. ఆ గణాలను అనేక రకాలైన మాత్రాక్రమాలుగా రచించవచ్చు. అందులో కొన్ని మాత్రాక్రమాల పోహళింపులే మంచి నడకని అందిస్తాయి. అంచేత గానయోగ్యంగా రాయాలంటే అలాంటి క్రమాలని గుర్తించి, వాటిని అనుసరించి పదాలను కూర్చాలి.
2. మధ్యాక్కర యతి గురించి
దీనిపై చాలా చర్చే జరిగింది. అయితే ఆశ్చర్యకరంగా చాలావరకూ అందరూ అయిదవ గణం దగ్గర యతి సరి కాదనీ, నాల్గవ గణం దగ్గరదే సరైనదనీ భావించారు. త్రిపురనేని రామస్వామిగారైతే ఏకంగా “అప్పటి బహుళ ప్రచారములో నున్న యక్కరలను నన్నయ వాడినాడు కాని వాని తత్త్వమెరుగజాలక మధురగతి నంతయు మంటపాలు చేసి కుంటినడక యంటించినాడు” అని నన్నయపై విరుచుకుపడ్డారు. నన్నయ మధ్యాక్కరది కుంటినడకే అయినా, అది చేసినది నన్నయ కాదనీ, అంతకుముందు శాసనాలలో కూడా అదే నడక ఉన్నదనీ త్రిపురనేనివారు గమనించకపోవడం దురదృష్టం. బహుశా దీన్ని దృష్టిలో ఉంచుకొనో ఏమో కోవెల సంపత్కుమారాచర్యగారు నన్నయ మధ్యాక్కరలలో కొన్ని చోట్ల నాల్గవ గణంపై కూడా యతి ఉన్నదనీ అందువల్ల నన్నయకి నాల్గవ గణంపై యతి ఆమోదమేననీ సమర్థించడానికి ప్రయత్నించారు. కాని అది అంత సమంజసం కాదు. ఆ విషయాన్ని ప్రస్తావించి సంగనభట్ల నరసయ్యగారు తన “తెలుగులో దేశిచ్ఛందస్సు ప్రారంభ దశలు” అనే పుస్తకంలో దాన్ని సహేతుకంగా ఖండించారు.
“ఆ కాలములో ఈ కాలములో మధ్యాక్కరను నడిపించే విధానములో భేదమున్నదని అనుకొందును. మొదటి నాలుగు గణములు ఒక పట్టుగా ద్విపదవలె నడిపించి శేషించిన రెండు గణములను రెండవ పట్టుగా చదివిన యెడల వినసొంపుగానే యుండును”, అన్న గిడుగు సీతాపతిగారి అభిప్రాయమే నాకు మిగతావారి వాదనలకన్నా సమంజసంగా తోస్తోంది. నరసయ్యగారు కూడా దీనిని తన పుస్తకంలో సమర్థించారు. గిడుగువారు ఇచ్చిన బొబ్బిలిపాట ఉదాహరణతోబాటు, వారు బతుకమ్మపాట ఉదాహరణకూడా ఇచ్చారు:
శ్రీరామభూపాలుడూ పట్టాభి
షేకుడై కొలువుండగా
ఇక్కడ “పట్టాభి” అనేది అధికంగా వచ్చిన గణం. ఇలా ఒకే రకమైన మాత్రాగణాల మధ్యలో అదనంగా మరొక మాత్రాగణం చేరడం మరికొన్ని పాటలలో కూడా గమనించవచ్చు. ఉదాహరణకు
“కస్తూరి రంగరంగా మాయన్న
కావేటి రంగరంగా”
అన్న పాటలో కూడా “మాయన్న” అనేది “తానాన తాననానా” అనే రెండు సమ మాత్రాగణాల మధ్యలో వచ్చిన గణం.
అయితే, గిడుగువారు కానీ నరసయ్యగారు కానీ యిచ్చిన ఉదాహరణలు ద్విపద – మధ్యాక్కర ఉదాహరణలు కాదు. మధ్యాక్కరను ద్విపదలాగా నడిపించిన ఉదాహరణలు వారు ఇవ్వలేదు. వారు పైన సూచించిన అంశంకన్నా కూడా విశేషమైన మరొక ప్రత్యేకత మధ్యాక్కర – ద్విపద మధ్య నాకు కనిపించింది. అదేమిటంటే, “తననాన తానాన తాననా నాన” అనే దివపదలోని నాలుగు దళాలలో చివరి రెండు దళాలూ మళ్ళీ ఆవృత్తి అయితే అది మధ్యాక్కర అవుతుంది! మోహనగారు ఉదాహరించిన మధ్యాక్కర పాదం చూస్తే అది స్పష్టం అవుతుంది:
మనసెందుకో నేఁడు మైన-మై మారె – మౌనమై జారె
ఇక్కడ “మైనమై మారె”, “మౌనమై జారె” అనే రెంటి గణస్వరూపం సరిగ్గా ఒకటే.
దీనిబట్టి, నా ఊహ (లేదా అంచనా) ఏమిటంటే – పూర్వం ద్విపద పాటని ఒకరు పాడి, చివరి రెండు దళాలనూ వంత పాడేవాళ్ళు తిరిగి పాడే సంప్రదాయం ఉండేది. ఉదాహరణకు:
“అమ్మణ్ణి కన్నుల్లు తమ్మిపూవుల్లు” అని ఒకరు పాడితే, మిగతావాళ్ళు “తమ్మిపూవుల్లు” అని వంతపాడేవారు. అది అంతా కలిసి ఒక వాక్యంగా రాస్తే సరిగ్గా మధ్యాక్కర పాదం అవుతుంది:
అమ్మణ్ణి కన్నుల్లు తమ్మిపూవుల్లు తమ్మిపూవుల్లు
అందువల్ల దీనికి అయిదవ గణం మొదట యతి (పదవిచ్ఛేదం) తప్పనిసరి!
నా ఊహకి సమర్థింపుగా, “లాలమ్మ గుఱ్ఱాలు లంకల్లొ మేసె – లంకల్లొ మేసె” అంటూ ద్విపద నడకలో సాగే జానపదగేయం ఆంధ్రభారతి సైటులో కనిపించింది (లింకు).
ఇది ఇంచుమించుగా మధ్యాక్కర ఛందస్సే (లాలమ్మ గుఱ్ఱాలు లంకలో మేసె – లంకలో మేసె – అని మార్చుకొంటే)!
చివరిగా, వేలూరివారు ఉదాహరించిన విశ్వనాథ మధ్యాక్కరని ఎలా “పాడూకో”వచ్చునో వారినోట కాని, మరెవరి నోటనైనా కాని వినాలనుంది! 🙂
అక్కరలు గురించి మోహన అభిప్రాయం:
01/05/2016 2:30 pm
వ్యాసమును చదివి తమ అమూల్యమైన అభిప్రాయములను తెలిపిన శ్రీమతి సుప్రభ, శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు గారలకు నా నమస్సులు. ఇది అక్కరలపై వ్యాసము కాబట్టి ఒకటికన్న ఎక్కువగా ఉదాహరణములను చూపలేకపోయినాను.
శ్రీమతి దోనేపూడి లక్ష్మీకాంతమ్మ “తెలుగు కవిత్వంలో మధ్యాక్కర – ఒక పరిశీలన” అనే PhD సిద్ధాంత గ్రంథములో మధ్యాక్కరలను ఉపయోగించిన తెలుగు కవులపై ప్రత్యేకముగా కొన్ని ప్రకరణములను కేటాయించారు. అందులో ఆ కవులు వ్రాసిన కావ్యములనుండి ఎన్నియో ఉదాహరణములను కూడ ఇచ్చారు. క్రింది మొదటి ఏడు మధ్యాక్కరలను అక్కడినుండి గ్రహించి, ఉదాహరణములుగా ఇక్కడ పొందుపరచినాను. ఎనిమిదవది “వేదనామధ్యాక్కరలు” (లింకు) అనే పుస్తకమునుండి గ్రహించాను. తొమ్మిదవది శ్రీ రవిగారు నేను వ్రాసిన “ఛందస్సుకు ఒక కొండ – కొక్కొండ” (లింకు) వ్యాసమునకు ఒక అభిప్రాయములో తెలిపినారు. విశ్వనాథ మధ్యాక్కరలు ఇక్కడ లభ్యము (లింకు)
1) తుమ్మల సీతారామమూర్తి చౌదరి – మహాత్మకథ
ఓ యయ్య ప్రాయోపవేశమునకు – మూనకు, నీవు
పోయిన మాకు స్వాతంత్ర్య మేల ప్ర-భుత్వ మదేల
శ్రీయేల జీవిత మేల సౌహార్ద – సిద్ధికై శ్రమము
సేయుదుమని కమ్మ నంపి రా యోగి-శేఖరు కడకు
2) ఆరుద్ర – శుద్ధ మధ్యాక్కరలు
పదమూడు మాత్ర లున్నట్టె – పాదార్ధముల వళ్లు పెట్టె
తుది ప్రాస లందులో నిలుపు – తూకాన అవి రెండు కలుపు
మొదలట్లు తొలి ప్రాస వుంచు – ముద్దుగా నాల్గాలపించు
కుదురైన అందాల గములు – కొత్తవీ మధ్యాక్కరములు
3) నాయని సుబ్బా రావు – విషాద మోహనం
పోయిన సూర్యుండు వచ్చు – పోయిన చంద్రుండు వచ్చు
పోయిన పదునాఱు కళలు – పూర్తిగా విధునకు వచ్చు
పోయిన తారకత మినుకు – పూవుల గుత్తులు వచ్చు
పోయిన మోహనా వినయ – భూషణా తిరిగి రావేమి
4) కోవెల సుప్రసన్నాచార్య – పాంచాలరాయ శతకము
ఎన్నడు వినుటయే కాని – యెన్నడు కనుటయే లేదు
ఎన్నడు కాంచుట కాదు – యెన్న డూహించుట లేదు
ఎన్నాళ్ల కెన్నాళ్ల కయ్యె – యిట్టి మీ దివ్య దర్శనము
కన్నుల పండువు కాగ – కరుణాబ్ధి పాంచాలరాయ
5) దాశరథుల బాలయ్య – శ్రీవాసరజ్ఞానసరస్వతీ మధ్యాక్కరలు
ఒకచేత వీణ ధరించి చిరునవ్వు – లొలుకబోయుచును
నొకచేతఁ బొత్తమ్ము గొనుచు నంచపై – నొప్పారి రావె
ప్రకటింతు వేవేల నతులు సకల సౌ-భాగ్యంబు లీవె
యిక నాకు జ్ఞానసరస్వతీ వాస-రేశ్వరీ దేవి
6) జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి (శాంతిశ్రీ) – సత్యశాయి మధ్యాక్కరలు
తల్లి వందురు కొందరు మరి కొందరు – తండ్రి వందురు జ-
గల్లీల కాని స్త్రీపురుష భేదమ్ము – కలద నీయందు
తల్లివై లాలింతు వెంతొ తండ్రియై – దండింతు వంతె
చల్లని మా తల్లి తండ్రి జయ సత్య-శాయీ నమోస్తు
7) దోనేపూడి వెంకయ్య – చారిత్రకం
(ఇతడు మధ్యాక్కరను free verse రూపములో యతిప్రాసలను ఎల్లప్పుడు పాటించక వ్రాసినారు)
ఇష్టదైవము దేశమాత కావలె నీతరమ్మునకు
ఇష్టకామ్యార్థము లొసగు నీదేవి యీనాడు మనకు
సర్వ లోకము లేలు తల్లి స్వయముగా సాక్షాత్కరించె
సర్వావతారాల మూలమౌ పరమావతారమ్ము
శర్వాణి వాణి వైష్ణవి సకలదైవ సమ్మేళనమ్ము
ఉర్విలో భరతోర్వి, ఈమె సేవయే ఉత్తమ పూజ
8) జి. వి. సుబ్బా రావు – వేదనా మధ్యాక్కరలు
హేమంత మానంద భావ – హేలా మనోజ్ఞమ్ము నగుచు
చేమంతి విరబూచి నవ్వి – సీమంతినీ కేశ మొదిగి
భామాంతర ప్రణయ మధు-వాను ప్రియుని హర్ష మొలికి
హేమంత శీతల జ్యోత్స్న – యిముడదీ కవితాపథాన
9) పుట్టపర్తి నారాయణాచార్యులు – శ్రీనివాసప్రబంధము
పార్వతీ పరమేశ మదన – పరవశతావృత్తి జెల్లె
యోర్వంగ రాక బెక్కేడు, – లుద్రిక్తులై సురలెల్ల
శర్వుని భంగింపనెంచి, – శతధృతి తోడన గూడి
పర్వెత్తిరుత్తాల సాల-పంక్తి తుషారాద్రి గుఱిచి
విధేయుడు – మోహన
ధూర్జటి కవిత్వంలో మాధురీమహిమ: తెనాలి రామకృష్ణుని మధురపూరణ గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
01/05/2016 2:07 pm
మాన్యులు శ్రీ కృష్ణమోహనరావు గారికి
నమస్కారములతో,
ఆదరపూర్వకమైన మీ సహృదయ వ్యాఖ్యకు ధన్యవాదాలు. మీరు ప్రస్తావించిన విషయాలు:
మొదటిది: రాయలు ‘ఆంధ్రకవి’ అనటం సాభిప్రాయమూ, విశేష హృదయధర్మమే కాని, ఇతరభాషాకవుల మధ్య వ్యవచ్ఛేదకంగా అన్న మాట కాదు. అది పాదపూరకం కాదు. పరివృత్తిని ఎంతమాత్రం సహింపని భావభావన. తెలుగువారిని ఉద్దేశించి తెలుగులో పద్యం చెబుతూ, ‘తెలుగు కవి ధూర్జటి’ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. “ప్రౌఢకవి ధూర్జటి” అనవచ్చును కదా. అష్టదిగ్గజ కవులందరూ తెలుగువారే అయితే, “స్తుతమతి యైన ఆంధ్రకవి” (లేదా, ‘తెల్గు కవి’) అనవలసిన అవసరం అసలే ఉండదు. అక్కడ “ఆంధ్ర” శబ్దప్రయోగం కేవలం భాషాభిమానాన్ని మాత్రమే సూచిస్తున్నదన్నది ప్రతిపాద్యాంశం.
రాయాస్థానంలో ఉన్నది అష్టదిగ్గజములా? నవరత్నములా? వారిలో అందరూ తెలుగువారు మాత్రమేనా? ఇతరులూ ఉన్నారా? అన్న విషయాన్ని అధికరించి అనేకవాదోపవాదాలున్నాయి. సంస్కృతాంధ్రతమిళకన్నడ కవులవి ఏవేవో పేర్లు విమర్శకుల పరిశీలనకు వచ్చాయి. ఆ కవులలో సుప్రసిద్ధులూ, అప్రసిద్ధులూ ఉన్నారు. ఇదమిత్థమని తీర్పు చెప్పటం సాధ్యం కాదు. కనీసం అందుకు ఆవశ్యకమైన సాధనసామగ్రినైనా సమీచీనంగా సమీకరించటం ఈనాటికీ జరగలేదు.
రెండవది: ఆముక్తమాల్యదలో ఆ వాక్యం ప్రస్తావింపబడిన తీరును బట్టి “దేశభాషలందు తెలుగు లెస్స” అన్న నిరుక్తికి రాజకీయ, సాంస్కృతిక కారణాలనేకం తప్పక ఉండి ఉంటాయని విశ్వసింపవచ్చును. అటువంటివేవో ఉండినందువల్లనే అదేదో తన మాటగా చెప్పక క్రీడాభిరామములోని ఆ మాటను త్రవ్వి తలకెత్తి, ప్రార్థితస్వప్నాన్ని భగవద్వాక్యంగా నిరూపింపవలసి వచ్చి ఉంటుంది. కారణం ఏదైనా, ఎంతో అభిమానం లేనిది అసలు ఆంధ్రకావ్యరచనకు ఉపక్రమణమే ఉండదు కదా.
మూడవది: కావ్యరచన సాగుతున్న కాలంలో కవులు తత్తత్సన్నివేశాలను నలుగురికీ వినిపించటం వింతేమీ కాదు. అది నాడూ, నేడూ జరుగుతున్న దృగ్విషయమే. నా మటుకు నేనే ఎంతోమంది ప్రసిద్ధుల రచనలను అవి సుపరీక్షితాలూ, సుపరిష్కృతాలూ కాకముందే ఉక్తలేఖనదశలో విన్నాను. చదివాను. కావ్యం మానవసమర్పితమైతే, ఆ కావ్యాన్ని నలుగురికీ నాలుగు చోట్ల వినిపిస్తూ, ఎవరికి అంకితం ఇవ్వాలో వ్యక్తిని కుదుర్చుకోవటానికి ఆ రోజుల్లో ఎంతో కాలం పట్టేది. ఆ ‘కృతిభర్త’కు నలుగురి చేత చెప్పింపవలసి వచ్చేది. అంకితం పుచ్చుకొని ఏమివ్వగలడో, ఏమిస్తానంటాడో; అది తనకు అంగీకార్యమో, కాదో తెలుసుకోవాలి కదా. కృతి పూర్తయిన తర్వాత ఒప్పందాలు కుదుర్చుకొని, వంశచరిత్ర సేకరించి, కృత్యాదిని వ్రాయటానికి పడే ఆ అవస్థనే ‘కృతాద్యవస్థ’ అనేవారు. కృతాద్యవస్థ అంటే రచన మొదలుపెట్టేందుకు పడే అవస్థ కాదు; కృతి పూర్తయిన తర్వాత అవతారికను వ్రాసేందుకు పడే అవస్థ.
శ్రీమహాభాగవతం రచన అద్భుతంగా సాగుతున్నదని విన్న తర్వాతనే కదా, రాజు పోతన గారిని దానిని తనకు అంకితం చేయాలని అడగటమూ, ఆయన ఇవ్వననటమూ జరిగింది? రచనాప్రక్రియ నిర్విఘ్నపరిసమాప్తి పర్యంతం రహస్యంగా ఉంటే ఈ వృత్తాంతాలే సంభవింపవు కదా.
కావ్యరచన ఎంత గజగర్భపద్ధతి అయినా, అదేమీ ఐకాంతికమైన రహస్యవ్యాసంగం కానేరదు. రచనా ప్రారంభానికి పూర్వపు కృషి మాత్రమే కవికి ఆంతరంగికం. రచన సాగుతున్న దశ, రచన పూర్తయాక అంకితోత్సవానికి లేదా భగవత్సమర్పణకు మునుపు సూర్యాలోకం అన్నవి బహిర్ముఖీనములే. నిండుసభలో ఇంకా పూర్తి కాని కావ్యమధ్యసన్నివేశాన్ని గానంచేయటం గుణగౌరవాన్ని, అందుకొనబోయే గౌరవాన్ని గౌణీకరింపదు సరికదా, రచన సవ్యంగా కొనసాగటానికి, కావ్యప్రశస్తికి మరింత ఉల్లాసదోహదం కాగలుగుతుంది.
కావ్యాన్ని పూర్తిచేసిన తర్వాతైనా, కావ్యరచనాకాలంలో నైనా కావ్యగానాన్ని కవి తానై స్వయంగా చేసి ఉండటమూ, ఇతరులు కోరగా చేసి ఉండటమూ రెండూ సహజమే. సాహిత్యసభ అన్నాక కొలువుతీరినవారు వారు వారు వ్రాస్తున్న విశేషాలనూ, నాటినాటికి వ్రాసిన విషయాలనూ తెలుసుకోక మానరు కదా. నిజంగా అష్టదిగ్గజాలలో ఉన్నవాడే అయితే, కావ్యాన్ని ఇంట్లో లేఖకులకు చెప్పి వ్రాయిస్తూ, రచన పూర్తయే దాకా శైలి, కథ, కవిత్వం, చమత్కారాలు ఎవరికీ తెలియకుండా దాచిపెట్టటం అసలే వీలుకాదు. కావ్యగానాలు జరుగుతుండేవని, ధూర్జటి ఆలస్యంగా ఆస్థానప్రవేశం చేసి కృష్ణరాయలు అప్పటికింకా సుముఖుడై ఉన్న 1523-1524 ప్రాంతాల కావ్యాన్ని మొదలుపెట్టి రచన సాగిస్తూ, అడిగినప్పుడు నలుగురికీ వినిపిస్తూ ఉండేవాడని, పరిస్థితులు తారుమారయిన కొంతకాలానికి పూర్తిచేసేనాటికి భవపరాఙ్ముఖుడుగా ఉన్నాడని ఊహ్యం.
ధూర్జటి గారు అష్టదిగ్గజాలలో ఒకరా? అన్న విషయం అనుమేయమే కాని, ఏ సంగతీ నిర్ధారించి చెప్పలేమని వ్రాశాను.
కందుకూరి రుద్రకవి సాహిత్యజీవితమంతా క్రీస్తుశకం 1550 తర్వాత ప్రారంభమయింది. తొలిరచన నాటికి నలభై యాభై యేళ్ళవాడనుకొంటే, అష్టదిగ్గజకవులలో కాదు సరికదా, మామూలు ఆస్థానకవి కూడా అయివుండడు. ఆయన ఈశాన్య సింహాసనాసీనుడన్నది విశ్వసనీయం కాదు. సంస్కృతంలో ‘రాష్ట్రౌఢ వంశకావ్యం’ ఆయన కృతి అని తెలుగు సాహిత్య చరిత్రకారులు వ్రాసినది సరికాదు.
ఈ లఘుప్రస్తావికను సహృదయంతో చదివి ఎంతో ఔదార్యంతో ఆశీర్వచస్సులను అందించిన పూజ్యులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి నమస్సుమాంజలి! _/|\_ !
సౌజన్యమూర్తులు శ్రీ రంగ గారికి, శ్రీ రవి గారికి – ప్రణామాలు.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు