శ్యామలరావు గారూ, మీ అభిప్రాయం నిర్మొహమాటంగా చెప్పినందుకు చాలా సంతోషం.
ఇకమీదట అనువాదాలలో మరింత సహజంగా ఉండేటట్లు ప్రయత్నిస్తాను.
నా వరకు సంభాషణల్లో సహజమైన భాష అనుకొనే వాడాను. రచయిత మాటలు వచ్చినపుడు మాత్రం ఉన్నది ఉన్నట్టే వ్రాశాను. ఉదా. తెలుగులో నీకు పెళ్ళి కుదిరిందా అని నేను వ్రాసినది. పంజాబీ యాస ఉన్న హిందీ కథలో తేరీ కుడుమాయీ హోగయీ అని ఉంటుంది ప్రతిసారీ. (నిశ్చితార్థం అయిందా) అలా అడగడం అసహజంగా ఉంటుందని పెళ్ళి కుదిరిందా అని మార్చాను.
అయినా మీరు చెప్పిన విషయాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తాను.
మణి గారి అభిప్రాయంతో యేకోభవించలేక పోతున్నందుకు వారు మన్నించాలి. నాదృష్టిలో అనువాదం యేమంత బాగోలేదు. నిజం చెప్పమని నిలదీస్తే, అస్సలు బాగోలేదని అంటాను.
ఇందులో లక్ష్మి గారి పొరపాటు ఎక్కువగా లేదేమో అనిపిస్తుంది. ఇంచుమించి ఇలాంటి ధోరణి అనువాదకుల్లో సాధారణం!
ఒక అనువాదం చదువుతుంటే అది ఒక అనువాదం అన్న స్పృహ అనుక్షణం మనతో ఉండేలా ఉండేలా చేసే పరిస్థితి ఉండకుండా అనువాదకులు జాగ్రత వహించటం తక్కువగా కనిపించటం విచారపడవలసిన సంగతి. కృతకమైన పదవాక్యశైలీవిన్యాసాలతో అనువాదాలన్నీ సాగవలసిందేనా అని దుఃఖం కలుగుతూ ఉంటుంది. మూలరచనలోని ప్రతిపదమూ వాక్యమూ సాధ్యమైనంతగా అలాగే తెలుగులోనికి వచ్చితీరాలని ఆరాటపడటం వలన అనువాదం చాలా కృతకమైన -సూటిగా చెప్పాలంటే- అతితరచుగా నిర్జీవమైన భాషలోనికి జారిపోతుంది.
అనువాదకులు సహజంగా చేసే ఆ పొరపాటే ఇక్కడా ఉన్నది.
మూలంలోని భావరమ్యతనూ, కథాగమనాన్నీ, శైలీవిన్యాసాన్నీ — ఇలాంటీ గుణాలని వీలైనంతగా గమనించి అవలంబించి అనుకరిస్తూ వ్రాయటం తప్పక మంచి విధానమే. కాని యథామక్షికానువాదం చేయటం ప్రమాదం. అలాచేస్తే తెలుగుచదువుతున్నట్లు కాక విచిత్రంగా ఉండి విచారాన్నీ కొండొకచో వికారాన్నీ కలిగించే అవకాశాలే మొండు.
మూలకథను తీసుకొని తనదిగా ఆవష్కరించటం ముఖ్యం. అనువాదం అన్న భావన వెంటాడితే అనువాదం సరిగా లేనట్లే. కాబట్టి అనువాదకులు తెలుగుకు సహజసుందరమైన నుడికారంలో మూలాన్ని చెప్పటాని ప్రయత్నించాలని మనవి.
అవును మణి గారూ, ప్రపంచయుద్ధ కాలంలో అప్పటి ఆంగ్లేయపాలకులకు సహాయంగా వెళ్ళిన భారతసైనికుల ప్రస్తావనతో, ఆ నాటి వాతావరణంతో, మనస్తత్వంతో కథలు తక్కువే (నేను చదివినవి). అనువాదానికి మార్కులొచ్చినందుకు సంతోషం. 🙂
మీరు దయతో రాసిన అభిప్రాయం, నేను రాసిన అభిప్రాయం తరువాత రావల్సినది. ఎందుకు తిరకాసుగా వచ్చిందని అడిగితే, కంప్యూటర్ ఇంజనీర్లు
Software Glitch అని చెప్పుతారని మీకు నేను గుర్తుచెయ్యవలసిన అవసరం లేదు. నిన్ననే మీకు వందనాలని చెప్పుదామనుకున్నాను కాని, ఇప్పటివరకూ కంటి డాక్టరు నన్ను ఏకాక్షిగా పడి ఉండమని శపించాడు.
మీ సుహృద్భావానికి ఇప్పుడు వేలూరి వేంకటేశ్వర రావు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. (అన్ని అక్షరాలూ సరిగా అచ్చయ్యాయో లేవో చూసుకునే బాధ్యత సంపాదకులది!)
భాస్కర్ గారూ,
ఎంత అందంగా ఉందండీ! మీ అనువాదం కూడా అంత అందంగా ఉంది. నిజానికి మీ అనువాదాలవల్ల వైరముత్తు అన్న గొప్ప తమిళ కవి ఉన్నట్టు నాకు తెలిసింది. అనువాదం వెనుక ఉన్న శ్రమకి ఫలితం అదే కదా!
తెలుగు కావ్యాలను ఈ విధంగా కూలంకషంగా పరిశీలించి మౌలిక ప్రతిపాదనలను చేయడానికి పూనుకుంటున్నవారిని చూస్తే సంతోషం కలుగుతుంది.వ్యాసంలో అనేక విషయాలను పరిశీలించి చక్కగా వివరించారు.
రసస్వరూపావగాహన లేని ఆధునిక కవులు ఎన్నో కావ్యాలను ఈ విధంగా అధిక్షేపించారు. గతశతాబ్దం నుంచే ఇది మొదలైందనుకుంటాను. దానివల్ల తర్వాతి తరాలకు ఆ కావ్యాల భాషాపరమైన ఇతరప్రయోజనాలు కూడా లేకుండా పోతున్నాయి. వ్యాసకర్త తథ్యమిథ్యా వివేచన బాగున్నది.
దోషవిచారణ చేయగలిగిన పండితులు లేకపోవడం – కావ్యపు గుణాన్ని ఉత్కర్షించే కారణం కాజాలదు కదా? అని అనామకుడు గారన్నది వాస్తవం.(ఈ నాటి కవిత్వానికి ఉన్న పెద్ద లోపం అదే కదా.)అందువల్ల ఔచిత్య విచారణ విషయంలో మాత్రం ఇంకొంచెం అనుమానం మిగిలే ఉన్నది.
శ్రీహర్ష ప్రణీతంబైన శృంగార నైషధము తెలుగు వారి పుణ్యఫలము వలన శ్రీనాథునిచే ఆంధ్రీకరించ బడింది. కావ్యోపసంహారపు పలుకు లసంబద్ధమనియు యవి శ్రీనాథుల వారివి కావనియు సోదాహరణముగా శ్రీమురళీధరరావు గారు విశదీకరించడములో కృతకృత్యులయి యాంధ్రశృంగార నైషధమునకు, శ్రీనాథులకు నెంతో మేలు చేసారు.
ఈ సుదీర్ఘ ప్రసంగము చదువుట కాసక్తి కరముగా నున్నా నా వంటి పామరులకు నిఘంటు పరిశోధన తఱచు అవసర ముంటుంది. ఆంధ్రభారతి వారికి నా కృతజ్ఞతలు. ఏమైనా చదువుతే నా కందులో విషయ పరముగానో, లేక భాషాపరముగానో కొంత ప్రయోజనము కలగాలని యాశిస్తాను. ఏల్చూరి వారి వ్యాసములు, ప్రసంగములు నాకా మేలుని సమకూరుస్తాయి. శరీరవ్యాయాయ శ్రమకును, మస్తిష్కాధ్యయన శ్రమకును వయోపరిమితి లేదని నా బోటి వారు నిరూపిస్తూనే ఉంటాము గదా !
శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి వంటి విబుధులు , విజ్ఞానులు యీ కాలములో కూడా మన మధ్య ప్రవర్తిల్లడము మన అదృష్టము. వారికి , వారి యతులిత విద్వత్తుకు నా సుమాంజలి. భగవంతుడు వారికి దీర్ఘాయు రారోగ్య సౌభాగ్యములు సమకూర్చాలని నా శుభాకాంక్షలు .
తన మాట కోసం గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:
11/11/2016 1:32 am
శ్యామలరావు గారూ, మీ అభిప్రాయం నిర్మొహమాటంగా చెప్పినందుకు చాలా సంతోషం.
ఇకమీదట అనువాదాలలో మరింత సహజంగా ఉండేటట్లు ప్రయత్నిస్తాను.
నా వరకు సంభాషణల్లో సహజమైన భాష అనుకొనే వాడాను. రచయిత మాటలు వచ్చినపుడు మాత్రం ఉన్నది ఉన్నట్టే వ్రాశాను. ఉదా. తెలుగులో నీకు పెళ్ళి కుదిరిందా అని నేను వ్రాసినది. పంజాబీ యాస ఉన్న హిందీ కథలో తేరీ కుడుమాయీ హోగయీ అని ఉంటుంది ప్రతిసారీ. (నిశ్చితార్థం అయిందా) అలా అడగడం అసహజంగా ఉంటుందని పెళ్ళి కుదిరిందా అని మార్చాను.
అయినా మీరు చెప్పిన విషయాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తాను.
తన మాట కోసం గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
11/10/2016 10:49 am
మణి గారి అభిప్రాయంతో యేకోభవించలేక పోతున్నందుకు వారు మన్నించాలి. నాదృష్టిలో అనువాదం యేమంత బాగోలేదు. నిజం చెప్పమని నిలదీస్తే, అస్సలు బాగోలేదని అంటాను.
ఇందులో లక్ష్మి గారి పొరపాటు ఎక్కువగా లేదేమో అనిపిస్తుంది. ఇంచుమించి ఇలాంటి ధోరణి అనువాదకుల్లో సాధారణం!
ఒక అనువాదం చదువుతుంటే అది ఒక అనువాదం అన్న స్పృహ అనుక్షణం మనతో ఉండేలా ఉండేలా చేసే పరిస్థితి ఉండకుండా అనువాదకులు జాగ్రత వహించటం తక్కువగా కనిపించటం విచారపడవలసిన సంగతి. కృతకమైన పదవాక్యశైలీవిన్యాసాలతో అనువాదాలన్నీ సాగవలసిందేనా అని దుఃఖం కలుగుతూ ఉంటుంది. మూలరచనలోని ప్రతిపదమూ వాక్యమూ సాధ్యమైనంతగా అలాగే తెలుగులోనికి వచ్చితీరాలని ఆరాటపడటం వలన అనువాదం చాలా కృతకమైన -సూటిగా చెప్పాలంటే- అతితరచుగా నిర్జీవమైన భాషలోనికి జారిపోతుంది.
అనువాదకులు సహజంగా చేసే ఆ పొరపాటే ఇక్కడా ఉన్నది.
మూలంలోని భావరమ్యతనూ, కథాగమనాన్నీ, శైలీవిన్యాసాన్నీ — ఇలాంటీ గుణాలని వీలైనంతగా గమనించి అవలంబించి అనుకరిస్తూ వ్రాయటం తప్పక మంచి విధానమే. కాని యథామక్షికానువాదం చేయటం ప్రమాదం. అలాచేస్తే తెలుగుచదువుతున్నట్లు కాక విచిత్రంగా ఉండి విచారాన్నీ కొండొకచో వికారాన్నీ కలిగించే అవకాశాలే మొండు.
మూలకథను తీసుకొని తనదిగా ఆవష్కరించటం ముఖ్యం. అనువాదం అన్న భావన వెంటాడితే అనువాదం సరిగా లేనట్లే. కాబట్టి అనువాదకులు తెలుగుకు సహజసుందరమైన నుడికారంలో మూలాన్ని చెప్పటాని ప్రయత్నించాలని మనవి.
తన మాట కోసం గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:
11/09/2016 7:53 am
అవును మణి గారూ, ప్రపంచయుద్ధ కాలంలో అప్పటి ఆంగ్లేయపాలకులకు సహాయంగా వెళ్ళిన భారతసైనికుల ప్రస్తావనతో, ఆ నాటి వాతావరణంతో, మనస్తత్వంతో కథలు తక్కువే (నేను చదివినవి). అనువాదానికి మార్కులొచ్చినందుకు సంతోషం. 🙂
Yippee! I’m a poet, and I know it గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:
11/08/2016 2:41 pm
వేమూరి వేంకటేశ్వర రావు గారికి:
మీరు దయతో రాసిన అభిప్రాయం, నేను రాసిన అభిప్రాయం తరువాత రావల్సినది. ఎందుకు తిరకాసుగా వచ్చిందని అడిగితే, కంప్యూటర్ ఇంజనీర్లు
Software Glitch అని చెప్పుతారని మీకు నేను గుర్తుచెయ్యవలసిన అవసరం లేదు. నిన్ననే మీకు వందనాలని చెప్పుదామనుకున్నాను కాని, ఇప్పటివరకూ కంటి డాక్టరు నన్ను ఏకాక్షిగా పడి ఉండమని శపించాడు.
మీ సుహృద్భావానికి ఇప్పుడు వేలూరి వేంకటేశ్వర రావు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. (అన్ని అక్షరాలూ సరిగా అచ్చయ్యాయో లేవో చూసుకునే బాధ్యత సంపాదకులది!)
గూడు గురించి ns murty అభిప్రాయం:
11/08/2016 12:32 pm
భాస్కర్ గారూ,
ఎంత అందంగా ఉందండీ! మీ అనువాదం కూడా అంత అందంగా ఉంది. నిజానికి మీ అనువాదాలవల్ల వైరముత్తు అన్న గొప్ప తమిళ కవి ఉన్నట్టు నాకు తెలిసింది. అనువాదం వెనుక ఉన్న శ్రమకి ఫలితం అదే కదా!
మీకు వేనవేల అభినందనలు.
తన మాట కోసం గురించి మణి వడ్లమాని అభిప్రాయం:
11/08/2016 4:40 am
లక్ష్మి’ గారు కొత్తగా ఉంది అంటే అంతగా పరిచయం లేని నేపధ్యం.అయినా మీ అనువాదం బావుంది.
ఫ్రాగ్మెంట్స్ గురించి మణి వడ్లమాని అభిప్రాయం:
11/08/2016 4:28 am
బాబా గారు చాల బావుంది కవిత ప్రాగ్మేంట్ గా
ఆకు గురించి సాంఘిక అభిప్రాయం:
11/07/2016 8:59 am
“గాలి సాయంతో
గలగలమని నవ్వాను”
ఎంతో బాగుంది!
ఆకులతో అనుభూతి..
సాంఘిక
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:
11/07/2016 3:22 am
తెలుగు కావ్యాలను ఈ విధంగా కూలంకషంగా పరిశీలించి మౌలిక ప్రతిపాదనలను చేయడానికి పూనుకుంటున్నవారిని చూస్తే సంతోషం కలుగుతుంది.వ్యాసంలో అనేక విషయాలను పరిశీలించి చక్కగా వివరించారు.
రసస్వరూపావగాహన లేని ఆధునిక కవులు ఎన్నో కావ్యాలను ఈ విధంగా అధిక్షేపించారు. గతశతాబ్దం నుంచే ఇది మొదలైందనుకుంటాను. దానివల్ల తర్వాతి తరాలకు ఆ కావ్యాల భాషాపరమైన ఇతరప్రయోజనాలు కూడా లేకుండా పోతున్నాయి. వ్యాసకర్త తథ్యమిథ్యా వివేచన బాగున్నది.
దోషవిచారణ చేయగలిగిన పండితులు లేకపోవడం – కావ్యపు గుణాన్ని ఉత్కర్షించే కారణం కాజాలదు కదా? అని అనామకుడు గారన్నది వాస్తవం.(ఈ నాటి కవిత్వానికి ఉన్న పెద్ద లోపం అదే కదా.)అందువల్ల ఔచిత్య విచారణ విషయంలో మాత్రం ఇంకొంచెం అనుమానం మిగిలే ఉన్నది.
నమస్కారములు.
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి గన్నవరపు నరసింహమూర్తి అభిప్రాయం:
11/06/2016 7:07 pm
శ్రీహర్ష ప్రణీతంబైన శృంగార నైషధము తెలుగు వారి పుణ్యఫలము వలన శ్రీనాథునిచే ఆంధ్రీకరించ బడింది. కావ్యోపసంహారపు పలుకు లసంబద్ధమనియు యవి శ్రీనాథుల వారివి కావనియు సోదాహరణముగా శ్రీమురళీధరరావు గారు విశదీకరించడములో కృతకృత్యులయి యాంధ్రశృంగార నైషధమునకు, శ్రీనాథులకు నెంతో మేలు చేసారు.
ఈ సుదీర్ఘ ప్రసంగము చదువుట కాసక్తి కరముగా నున్నా నా వంటి పామరులకు నిఘంటు పరిశోధన తఱచు అవసర ముంటుంది. ఆంధ్రభారతి వారికి నా కృతజ్ఞతలు. ఏమైనా చదువుతే నా కందులో విషయ పరముగానో, లేక భాషాపరముగానో కొంత ప్రయోజనము కలగాలని యాశిస్తాను. ఏల్చూరి వారి వ్యాసములు, ప్రసంగములు నాకా మేలుని సమకూరుస్తాయి. శరీరవ్యాయాయ శ్రమకును, మస్తిష్కాధ్యయన శ్రమకును వయోపరిమితి లేదని నా బోటి వారు నిరూపిస్తూనే ఉంటాము గదా !
శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి వంటి విబుధులు , విజ్ఞానులు యీ కాలములో కూడా మన మధ్య ప్రవర్తిల్లడము మన అదృష్టము. వారికి , వారి యతులిత విద్వత్తుకు నా సుమాంజలి. భగవంతుడు వారికి దీర్ఘాయు రారోగ్య సౌభాగ్యములు సమకూర్చాలని నా శుభాకాంక్షలు .