“శ్రీ రామరాజభూషణుడు తాను “సంగీతకళారహస్యనిధి”ని అన్న విషయాన్ని వసుచరిత్ర (1-16) లో స్వయంగా తానై పేర్కొన్నాడు. అది ఒక బిరుదం కాదు. స్వోపజ్ఞమైన విశేష్యమాత్రం. ఆయన సంగీతకళారహస్యనిధిత్వాన్ని గురించిన అవగాహనకు ఆ కావ్యమూ, దానిపై వెలువడిన సోమనాథకవి విద్వజ్జనమనోరంజనీ వ్యాఖ్య, శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారివి, శ్రీ రాజన్న కవిగారివి, తదితరుల విమర్శగ్రంథాలు ఉండనే ఉన్నాయి.”
1. సంగీత రహస్య కళానిధి విషయం: Thanks Muralidhara Rao garu! I understand now. A patron had asked him to come over to his court to discuss if he can write a book to his liking, and Bhattumurthi is submitting his resume. He got selected to do the work, good for him.
2. విమర్శ గ్రంధాల విషయం – యాహూ రచ్చబండలో, శాయిగారు ‘వసుచరిత్ర’ కు సంబంధించి చదవవలసిన రచనలు చాలా చెప్పారు. (నవంబర్ 17, 2006.) ఆయన చెప్పిన వన్నీ, ఇప్పటివరకూ ఎన్ని పేజీల గ్రంథమైనా సరే, నేను చదివాను. నాకది చాలా ఇష్టమైన పనండీ. శాయి గారు, సోమనాథకవి విద్వజ్జనమనోరంజనీ వ్యాఖ్య గురించి చెప్పినట్టు లేరు. దొరకాలే గాని తప్పకుండా చదువుతాను.
3. కాంభోజి రాగం విషయం- Found the book The Raga Guide – a survey of 74 Hindustani Ragas now, in my library. From page 100 of this book:
“Raga khamaj (खमाज) is an offspring of the ancient raga Kamboja, which was described by Matanga (c.800 AD) and was also the name of a region in the North. Later authors refer to it as Kambhoji, Kambodi or Kamodi. According to Meshakama (1570), Kamodi is as beautiful as Goddess of love. Another poet observes cryptically that this raga “not only turns the flower red with passion, but also makes the antelope turn musty”…”
Sounds like an appropriate choice of raga, in the setting of poem under discussion. I just don’t understand the insistence of some critics that everything and every character has to be imagined as Telugu, just because a story or a book is in Telugu language.
అని శ్రీ రామరాజభూషణుడు తాను “సంగీతకళారహస్యనిధి”ని అన్న విషయాన్ని వసుచరిత్ర (1-16) లో స్వయంగా తానై పేర్కొన్నాడు. అది ఒక బిరుదం కాదు. స్వోపజ్ఞమైన విశేష్యమాత్రం. ఆయన సంగీతకళారహస్యనిధిత్వాన్ని గురించిన అవగాహనకు ఆ కావ్యమూ, దానిపై వెలువడిన సోమనాథకవి విద్వజ్జనమనోరంజనీ వ్యాఖ్య, శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారివి, శ్రీ రాజన్న కవిగారివి, తదితరుల విమర్శగ్రంథాలు ఉండనే ఉన్నాయి.
ఆధునికయుగంలో మహావిద్వాంసులైన శ్రీ శిష్టు కృష్ణమూర్తికవి గారు దీనిని పునఃపఠనపాఠనాలలోకి తెచ్చి, వీణాదికసంగీతవాయిద్యాలపై రాగధర్మాన్ని వివరిస్తూ ఉపన్యాసాలు చేసేవారని ప్రతీతి.
మొత్తంమీద సంగీతరసజ్ఞులకు కొరుకుడుపడని కల్పనలు వసుచరిత్రలో ఉన్నాయన్నది ఈ ప్రసంగంలోని ప్రతిపాద్యార్థం. ఆ సంగతిని ప్రస్తుతీకరించటమే గాని, కవిని ప్రస్తుతించటం జరగలేదు. లైలా గారన్నట్లు అది కొన్ని పారిభాషికపదాల ప్రయోగం వల్ల ప్రస్ఫుటించే సామాన్యవిషయం కాదు. కవి సంగీతకళారహస్యనిధి అన్న విషయం అడుగడుగున స్పష్టమే. ఆ ప్రపంచంలో ఉపజీవిస్తున్నవారికి తప్ప సంస్ఫురింపని అపూర్వములైన సాంగీతిక కల్పనలు అందులో అనేకం ఉన్నాయి. “కాంభోజి” అన్న ఒకానొక రాగనామప్రయుక్తికై దీర్ఘజకారాన్ని ప్రాసస్థానంలో నిలిపేందుకు “ఆ జాబిల్లి” అన్న నిర్దేశాత్మకమైన ఉపక్రమణిక జరిగిందని ఊహించటం ఎవరో మామూలు కవుల విషయంలో అనవలసిన మాట. శ్రీ శాస్త్రిగారి వంటి పెద్దలు శబ్దబ్రహ్మవేత్త అయిన రామరాజభూషణుని వంటి మహాకవిని అధికరించి అనవలసిన మాట కాదు.
ఇంతకీ, కాంభోజి కావ్యోపగతమైన నాయికారోదనకు నైమిత్తికం కాకూడదని శ్రీ శాస్త్రిగారు ఎందుకు భావించారో తెలియలేదు.
అని క్రీస్తుశకం 1433-1468 నాటి కుంభకర్ణ నరేంద్రుని సంగీతరాజం. అంతటి జగదేకమహాకవి ఆ మాత్రం చూసుకోడా?
అద్భుతావహమైన “అరిగా పంచమ మేవగించి” పద్యాన్ని గురించిన చర్చ చాలామంది పెద్దలచే జరిగినదే కనుక ఇప్పుడా ప్రసక్తిని మాని, ఆ కల్పనలో ఎటువంటి దోషమూ లేదన్న అక్కడి నిగమనాన్ని మాత్రం స్థూలంగా ఇక్కడ పేర్కొంటున్నాను.
శ్రీ శాస్త్రిగారు సంగీతశాస్త్రవేత్త అని, శ్రావ్యగాయనులని వారి కంఠస్వరం చెప్పకనే చెబుతున్నది. పాండిత్యగౌరవం వల్ల ధ్వనిస్తున్న వారి శాస్త్రాధికారమూ ప్రశంసనీయమే. ప్రసంగమంతటా పరచుకొని ఉన్న వారి పలుకుబడిలోని ఆప్యాయనం కూడా ప్రస్ఫుటమే. “ఆలంబిత పల్లవవ్రతవిధుల్” అని ఉచ్చరిస్తున్నప్పుడు రెండుమార్లూ “పల్లవ – వ్రత” అని ఆ పదాలను విడదీయకుండా చదివి ఉంటే వకారం గురుత్వాన్ని కోల్పోక – ఛందస్సు పాటింపబడి, మహాకవి వేతృత్వాన్ని గూర్చిన విమర్శ కాబట్టి – పద్యపఠనం మరింత శ్రావ్యంగా ఉండేది.
రేడియో స్టేషన్ లో కొన్ని సంవత్సరాల క్రింద చేసిన ప్రసారం, ఎంతో ప్రేమతో దేశ దేశాల్లో ఉన్న తెలుగు వారిని, ఈ వక్త వినమని ఇచ్చారు. ఆ ఉదారతకు చాలా సంతోషం కలిగింది.
నాకు వీరి ఉపన్యాసం కన్నా, వీరి గానం ఎక్కువ నచ్చింది. మళ్లీ ఏమన్నా కమ్మగా పాడిన ఆడియోలు పత్రిక శ్రోతల కోసం పంపిస్తారేమో. తప్పక వేచి ఉంటాను.
ఉపన్యాసం లోని విషయాలకు వస్తే:
భట్టుమూర్తిని సంగీత కళా రహస్య నిధి అని ఎవరన్నారో, ఎందుకన్నారో మనకెలా తెలుసు? ఎవరికైనా తెలిస్తే దయచేసి చెప్పండి. భట్టుమూర్తికి, సంగీతం ప్రావీణ్యతలో బిరుదులివ్వటం, అసలు ఒక కావ్యరచన పరిశీలించి చెయ్యటమెలా జరుగుతుంది? ఉపన్యాసకులు చెప్పిన ప్రకారం, కవి కాలానికి సంగీతం, సాహిత్యం (కవిత్వం) స్వంత ప్రతిపత్తి కలిగిన కళలు కదా. సంగీతం, సాహిత్యం లో ప్రజ్ఞలు విడిగా పరీక్షించడానికి సాధనాలున్నయ్యి కదా. సంగీతం పరీక్షలు పెట్టి, సంగీత స్వరకల్పనకు కాని, సాహిత్యం కూర్చినందుకో, పాడగలిగినందుకో, వాయిద్యం వాయించగలిగినందుకో గాని, అతడు మేటి ఐతే సంగీత కళానిధి అని సంగీత విద్వాంసులు బిరుదు ఇవ్వచ్చు. అతను అలాటి పరీక్షలు ఇచ్చి ఉన్నాడేమో, ఇచ్చి ఆ బిరుదు పుచ్చుకున్నాడేమో. మరి ఆ విషయం ఎక్కడా చదవటానికి కనపడదు. వసు చరిత్ర కావ్యం ద్వారా అతని సంగీత పాటవం ఎలా చెపుతారూ? అనేది నా సంశయం.
పైగా, కేవలం రెండు పద్యాల ద్వారా అతని సంగీత ప్రావీణ్యత ఎలా తెలుస్తుంది? అదీ సరి కాదు. వసుచరిత్ర రాసిన భట్టుమూర్తి సంగీత జ్ఞానం గురించి, ఎందుకు ఎవరైనా ఆ రెండు పద్యాలే ఉదహరిస్తారో నాకు అర్థం అవదు.
ఒక కవి పద్యాల్లో అక్కడో చోట ఇక్కడో చోట ‘వీణ’ అనో ‘మద్దెల’ అనో, లేకపోతే ‘నాట’ అనో ‘కల్యాణి’ అన్నంత మాత్రాన, ఎవరైనా సంగీత కళానిధి అని బిరుదు ఇస్తారా? ఊరికే, ఒక కథలో మలేరియా, టైఫాయిడ్ అన్నంత మాత్రాన కథా రచయితకు వైద్య శిఖామణి బిరుదు ఇచ్చిన తంతు ఎక్కడా వినలేదు.
సరే, కొంతమందిని కవి అని అంటే సర్లే పోనీలే అని నాలాటివాళ్లు సరిపెట్టుకుందామంటే, ఇంకా ఉద్రేకులు ఢమిక్కిన ఒక్కొక్కరిని మహాకవి, శతాబ్ది కవి అనేస్తారు. మార్క్సిస్టులు శ్రీశ్రీని ప్రజాకవి, మహాకవి అంటే వాళ్ల అభిమానుల గుంపులో చెల్లుబడి అవుతుందేమో కాని, ప్రపంచ కవులు ఎవరండీ ఈ శ్రీ శ్రీ! అంటే ఏం చెపుతారు? ఇదుగోండి ఈ మా గొప్ప తెలుగు కవి – ఈయన ‘ఆనందం అర్ణవమైతే’ అని ఒక పాట రాసాడు, ఆ పాటకి ‘కన్యాశుల్కం’ తెలుగు సినిమాలో మహానటి సావిత్రి ఇలా డాన్స్ చేసింది, ఈ విడియో బిట్ చూడండి అని గాని – ఎవరైనా డాన్స్ వచ్చిన వాళ్లకు చూపిస్తే, నిజంగా నృత్యం నేర్చిన వాళ్లు, వచ్చిన వాళ్లు – ఇది డాన్సా? ఇదేం పాట, ఇదెక్కడి డాన్స్ అయ్యా ఇదా తెలుగు నృత్యం అని వాళ్లు నవ్వి పోతారు.
ఇప్పుడా మధురవాణి, కుహనా కవిత్వం, కుహనా నృత్యం సంగతి నాకెందుకు గానీ, హిందోళ రాగం, వసంత రాగం గురించి, భట్టుమూర్తి ఒక పద్యం లో చమత్కరించి చెప్పినంత మాత్రాన, పద్యం మొదటి భాగం, హిందోళ లో, రెండో భాగం వసంత రాగంలో పాడమని కవి ఉద్దేశం కానే కాదు. అసలు ఏ రాగంలోనూ తన పద్యాలు పాడమని కవి ఆదేశమివ్వలేదు.
పద్యం కూర్చిన భట్టుమూర్తి అతడు ఉపయోగించిన ఛందస్సులు మాత్రమే ఇచ్చాడు. ఆ పద్యం మత్తేభము. అని మాత్రమే అతడు మనకు చెప్పింది. ఆ ఛందస్సులో ఎన్నైనా పద్యాలున్నయ్యి. ఆ ఛందస్సులు వేల మంది కవులు వాడినారు కదా. వారు కూడ అక్కడో పద్యం ఇక్కడో వచనంలో, నాట, కల్యాణి, వసంత, మోహన, కాంభోజి – అంటే ఇక వారికీ సంగీతం వచ్చినట్లేనా. ఆ లెక్కన తెలుగు సినిమా పాటలు రాసిన వాళ్లు వైణికులై కూర్చుంటారు. తకిట తకిట అంటే తబలా expert, ఓంకార నాదాలు సంధానమౌ గానమే – అంటే శంకరాభరణము specialist– ఐ పోతారు.
ఆ పద్యంలో మొత్తం మీద, కవి చమత్కారంగా ఉద్దేశించింది, తోటలో ఆడవాళ్ల ఉయ్యాల పాటలకు, కోయిలలు గొంతు కలిపినందున వసంతం పరిపూర్ణంగా శోభించిందని. అదే ఇంకోలాగా తిప్పి, గిరిక వీణా వాదనం విన్నప్పుడు, వసురాజు స్నేహితుడు – ఎవరో వీణ ఎంత బాగా వాయిస్తున్నారు, ఈ కొండ కోనలలో! కోయిలలు, నెమళ్లు తమ గొంతు కలిపి -పంచమ, షడ్జమాలు వినిపిస్తున్నాయి, అంటాడు. తెలుగు ( కర్ణాటక) సంగీతంలో, కోయిల స్వరం పంచమం కి సరిపోతుందని, నెమలి షడ్జమమని ఆ విషయాలు అలా రాసి ఉన్న సంగీతం పుస్తకాలు ఉన్నవి. ఒక్కొక్క సంగీత స్వరం ప్రకృతి లోని ఆ యా జంతువుల అరుపుతో సరిపోల్చటం పాతకాలంలో ఉన్నది.
అందువల్ల మహా అనుకుంటే మనం – భట్టుమూర్తి కవి సంగీతం పుస్తకాలు చదివాడేమో, పాట మీద అభిమానం ఉన్నట్లుంది, ఔరంగజేబు కాదు సుమా అనుకోవచ్చు.
హిందోళ రాగం వినాలంటే భట్టుమూర్తి పద్యం కష్టపడి పాడటమెందుకూ? – త్యాగరాజు ఆది తాళములో కూర్చిన ‘సామజ వర గమనా’ కృతి వింటే ధన్యులమై పోమా? సాహిత్యం లేకుండా స్వరం వీణ మీద పలికిస్తే, ముగ్ధులమై వినమా? సంగీత స్వరాలతో మనల్ని సమ్మోహితులను చేసి, ఈ త్యాగరాజు తన మాటలలో ఏమి చెప్పాలనుకుంటున్నాడు అని చూస్తే
అంటూ ఆ సాహిత్యం తోనూ మనల్ని రంజింప చేస్తాడు. సామజ వర గమనా సాధుహృ – అని అక్కడికి ఆపి, సంగతులు వెయ్యటం మొదలు పెడితే, కొంతమంది పట్టూ విడుపూ లేని వాళ్లకు, దొబ్బిడాయి వస్తుంది కాని సంగీత హృదయులు నొచ్చుకోరు. తన్మయులౌతారు. త్యాగరాజు తప్పకుండా సంగీత కళానిధి. సందేహం లేకుండా వాగ్గేయకారుడు.
ఉపన్యాసకులు మనకు ఆయా రాగాలు గురించి ఎంతైనా చెప్ప వచ్చు. కాలక్రమాన రాగాల స్వరాలలో వచ్చిన మార్పులు గురించి చెప్ప వచ్చు. అవి తప్పక శ్రోతలకు ఆసక్తికరంగా ఉంటాయి. ఆ ప్రస్తావనలు నాకు నచ్చాయి.
కాని, భట్టుమూర్తి కావ్యనాయిక గిరిక ఏడిస్తే కాంభోజీ రాగంలో మేళవించిన వీణలా వినిపించిందని -తన ఒక పద్యంలో అంటే ఉపన్యాసకులు ఆ పద్యాన్ని కాంభోజిలో పాడి వినిపించటం ఎందుకు? పద్యం అంతా గిరిక ఏడుపు కాదే. పద్యం ఒక విరహావస్థ వర్ణన. వెన్నెలలో ఒక సుందర స్త్రీ విలాప దృశ్యం. గిరిక ఎవరు? కోలాహలుడు అనే పర్వత రాజు కూతురు. కోలాహలుడు హిమవంతుడి కొడుకు. పార్వతికి సోదరుడు. గిరిక తల్లి నది. ఆ శుక్తిమతి గంగ లాగా స్వర్గంలో, భూమ్మీదా ప్రవహించే నదేమో మనకు తెలియదు. గిరిక దేవకాంత ఏమో. ఆమె నెత్తి మీద ముసుగు వేసుకు ఏడుస్తుందా? తెలుగు ఆడవాళ్ల లాగా, పమిట వెనక నించి ముందుకు లాగి, చెంగులోకి ముక్కు చీదుతుందా. దేవా! ఏమి దుస్థితి. విరహం లో కూడా వసురాజు ప్రేమిక గంభీర కాదా? ఆమెను ‘పటాగ్రంబెత్తి’ అని కవి ఎంత నాజూకుగా వర్ణించినాడు. గిరిక కట్టినది అది ఎంత నాజూకు దుకూలమో. ఆమె దానిని మునివేళ్ళతో ఎత్తి, తన ముఖానికీ, వెన్నెలకూ మధ్య అడ్డంగా ఎలా ఎత్తి పట్టిందో ఆ చిత్రం గొప్ప చిత్రకారుడు గీయాలి, మనం చూడాలి. భట్టుమూర్తి చాలా చక్కని వర్ణన చేసాడు. వడ్డాది పాపయ్య ఐతే బహుశా బాగానే చిత్రించ కలిగి ఉండొచ్చు.
గిరిక కాంభోజీ లో ఏడవటానికి అది సరైన రాగం కాదు, అలా సూచించటంలో భట్టుమూర్తి సంగీత పరంగా పొరపాటు చేసాడనుకోటం సరికాదు. భట్టుమూర్తి ఏదో మొదటి మూడక్షరాల కోసం కక్కుర్తి పడి, కాంభోజీ అన్న మాట వాడతాడా? అన్ని వందల తియ్యని పద్యాలు రాసినతడు, ఒక పద్యం అవతల పారెయ్యటానికి తిరగ రాయటానికి వెనకాడతాడా? ఏ కాలంలోనూ చూడండి, వందల పేజీలు తిరగ రాసే రచయితలుంటారు. వారి మనసుకే నచ్చక మళ్లీ మళ్లీ రాస్తారు. ఎడిటర్ కి నచ్చకపోతే, సలహాను గౌరవించి, తను చెప్పదలచింది సరిగా వివరించ గలిగే దాకా తిరగరాసేవి ఇక ఎన్నో.
కధా విషయం హిమాలయాల ప్రాంతంలో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మరి ఉత్తరాది కాంభోజీ రాగం ఎందుకు కవి ఉదహరించకూడదు? ఆ రాగం కాంభోజ ప్రాంతంకు చెందినందున ఆ పేరు వచ్చిందనీ, గంభీరం ఐన రాగం అని raga guide లో పేర్కొన్నారు. స్వరాలలో కైశిక నిషాదం ఉన్నది. విషాదం ఎందుకు పలకదు!
గిరిక సంగీతం దేవతల దేమో. మానవ సంగీతానికి అతీతమైన దేమో. సంగీతం పుస్తకాల్లో, రాసి ఉన్న ప్రకారం మంద్ర, షడ్జమ స్థాయి లే మానవులకు అందుబాటులో ఉన్నవి. గాంధర్వం దేవతలే పాడగలరు. కాళిదాసు కుమార సంభవం లో కూడా ఈ విషయ ప్రస్తావన ఉంది. భారతదేశంలో తయారయే తంజావూరు వీణలు, సరస్వతీ వీణల నాదం పక్కల కూర్చొన్న వాళ్లకే వినిపిస్తుంది. గిరిక వీణ వసురాజుకు, కొండమీద అడవులలో దూరానికి వినిపించిందంటే, అది మనుషులు చేసిన వీణ కాదు. వసురాజు ఇంద్రుని వరాలు పొందిన వాడు. వసురాజుకు స్వర్గానికి విమానంలో రాకపోకలున్నయ్యి. అతడి నర్మసఖునికి కూడా, స్వర్గానికి వీసా, పాస్పోర్ట్ ఉండి ఉండాలి. వారు గంధర్వ గానం విని ఆనందించి ఉన్నారు. అంతకన్నా ఎక్కువ ఆకర్షణీయంగా గిరిక వీణ పలికించిందని వసురాజు, అతని మిత్రుని సంభాషణలద్వారా కవి మనకు ముందే చెప్పి ఉన్నాడు.
భట్టుమూర్తికి సంగీత కళా రహస్య నిధి అని బిరుదు ఎవరిచ్చారో, ఎందుకిచ్చారో? నాకు తెలియదు కాని, వసుచరిత్ర కావ్యం చదివి, అతడి సంగీత కళా పాటవం నిర్ణయించక్కర్లేదు. ఒకటి రెండు పద్యాల ద్వారా, అతడు చేయని తప్పులు సంగీత పరంగా అతని మీద ఆరోపించక్కర్లేదు. సంగీతజ్ఞులు ఆ ధోరణిగా ఆలోచించక్కర్లేదు, అని నాకనిపిస్తున్నది.
ముప్ఫయ్యేళ్ళ క్రితం నాటి శ్రీ వెల్చేరు నారాయణరావు గారి ఈ ప్రసంగవ్యాసాన్ని మళ్ళీ ఇరవయ్యేళ్ళకు పునఃప్రచురిస్తే అప్పటి పరిస్థితులైనా ఆశాజనకాలుగా ఉండవచ్చునన్న అవకాశమేమీ కనబడటం లేదు. నానాటికీ తీసికట్టుగా మారుతున్న విశ్వవిద్యాలయాలలోని తెలుగు శాఖల వారందరూ ఇప్పటికైనా విజ్ఞులతో సమావేశమై లోపాలను గుర్తించి, పరిష్కారమేమిటో నిర్ణయించి, సంయుక్తంగా కార్యాచరణకు పూనుకొనకపోతే రాబోయే రోజులలో పరిశోధకులూ, పర్యవేక్షకులూ అబ్బూరి వారన్నట్లు, “పాతాళంబున” అంటే చేతులు పైకెత్తి చూపవలసినంత నిమ్నస్థాయికి (అధోగతికి) దిగజారటం తథ్యం.
ఈ విషయాన్ని అధికరించి తెలుగులో పరిశోధన తీరుతెన్నుల సర్వాంగీణసమీక్షతో ‘ఈమాట’ ఒక మార్గదీపక సంచికను గాని, ఒక క్రమసంహితతో విద్వత్పరిశీలకుల వ్యాసపరంపరను గాని వెలువరిస్తే బాగుంటుందన్న అభ్యాకాంక్షతో,
ఒకటి నుంచి పదిల దాకా… గురించి Lalitha TS అభిప్రాయం:
03/16/2017 7:09 pm
Sreenivas Paruchuri గారు: దిబ్బరొట్టి అబ్బాయి రూపకం వివరాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.
జిలేబిగారు: మీ పద్య వ్యాఖ్యకి బదులు నా బ్లాగులో – ధన్యవాదాలు 🙂
చంద్రిక: బోల్దన్ని థాంక్ యూలు – యూట్యూబు లింకుకి.
లక్ష్మీదేవిగారు: నా కవిత నా గొంతులో మెచ్చినందుకు ధన్యవాదాలు.
సంగీత కళా రహస్య నిధి భట్టుమూర్తి గురించి lyla yerneni అభిప్రాయం:
03/16/2017 1:05 pm
“శ్రీ రామరాజభూషణుడు తాను “సంగీతకళారహస్యనిధి”ని అన్న విషయాన్ని వసుచరిత్ర (1-16) లో స్వయంగా తానై పేర్కొన్నాడు. అది ఒక బిరుదం కాదు. స్వోపజ్ఞమైన విశేష్యమాత్రం. ఆయన సంగీతకళారహస్యనిధిత్వాన్ని గురించిన అవగాహనకు ఆ కావ్యమూ, దానిపై వెలువడిన సోమనాథకవి విద్వజ్జనమనోరంజనీ వ్యాఖ్య, శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారివి, శ్రీ రాజన్న కవిగారివి, తదితరుల విమర్శగ్రంథాలు ఉండనే ఉన్నాయి.”
1. సంగీత రహస్య కళానిధి విషయం: Thanks Muralidhara Rao garu! I understand now. A patron had asked him to come over to his court to discuss if he can write a book to his liking, and Bhattumurthi is submitting his resume. He got selected to do the work, good for him.
2. విమర్శ గ్రంధాల విషయం – యాహూ రచ్చబండలో, శాయిగారు ‘వసుచరిత్ర’ కు సంబంధించి చదవవలసిన రచనలు చాలా చెప్పారు. (నవంబర్ 17, 2006.) ఆయన చెప్పిన వన్నీ, ఇప్పటివరకూ ఎన్ని పేజీల గ్రంథమైనా సరే, నేను చదివాను. నాకది చాలా ఇష్టమైన పనండీ. శాయి గారు, సోమనాథకవి విద్వజ్జనమనోరంజనీ వ్యాఖ్య గురించి చెప్పినట్టు లేరు. దొరకాలే గాని తప్పకుండా చదువుతాను.
3. కాంభోజి రాగం విషయం- Found the book The Raga Guide – a survey of 74 Hindustani Ragas now, in my library. From page 100 of this book:
“Raga khamaj (खमाज) is an offspring of the ancient raga Kamboja, which was described by Matanga (c.800 AD) and was also the name of a region in the North. Later authors refer to it as Kambhoji, Kambodi or Kamodi. According to Meshakama (1570), Kamodi is as beautiful as Goddess of love. Another poet observes cryptically that this raga “not only turns the flower red with passion, but also makes the antelope turn musty”…”
Sounds like an appropriate choice of raga, in the setting of poem under discussion. I just don’t understand the insistence of some critics that everything and every character has to be imagined as Telugu, just because a story or a book is in Telugu language.
Thanks, – Lyla
ఒకటి నుంచి పదిల దాకా… గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:
03/16/2017 8:05 am
చాలా బాగుంది లలిత గారూ, ముఖ్యంగా మీరు పాడడం వల్ల ఇంకా బాగుంది.
తెలుగు పరిశోధనపై వెల్చేరు నారాయణరావుతో ఇంటర్వ్యూ గురించి శిరీష్ ఆదిత్య అభిప్రాయం:
03/15/2017 11:41 pm
ఎంతో బాగుందండి ఇంటర్వ్యూ. ముప్ఫైయేళ్ళ నాటిదయినా ఇంకా ఇంత relevant గా ఉండటం దురదృష్టకరం. ఆర్కైవ్స్ నుండి వెతికి తీసి పునర్ముద్రించినందుకు ధన్యవాదాలు.
ఒకటి నుంచి పదిల దాకా… గురించి Chandrika అభిప్రాయం:
03/14/2017 11:06 pm
@లలిత గారు, దిబ్బ రొట్టి అబ్బాయి గురించి Sreenivas Paruchuri చెప్పేసారు 🙂 యూ ట్యూబు ఇక్కడ లంకె ఇస్తున్నాను
సంగీత కళా రహస్య నిధి భట్టుమూర్తి గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
03/14/2017 9:55 am
“నను శ్రీరామపదారవిందభజనానందున్ జగత్ప్రాణనం
దనకారుణ్యకటాక్షలబ్ధకవితాధారాసుధారాశి సం
జనితైకైకదినప్రబంధఘటికాసద్యశ్శతగ్రంథక
ల్పను సంగీతకళారహస్యనిధిఁ బిల్వం బంచి పల్కెం గృపన్.”
అని శ్రీ రామరాజభూషణుడు తాను “సంగీతకళారహస్యనిధి”ని అన్న విషయాన్ని వసుచరిత్ర (1-16) లో స్వయంగా తానై పేర్కొన్నాడు. అది ఒక బిరుదం కాదు. స్వోపజ్ఞమైన విశేష్యమాత్రం. ఆయన సంగీతకళారహస్యనిధిత్వాన్ని గురించిన అవగాహనకు ఆ కావ్యమూ, దానిపై వెలువడిన సోమనాథకవి విద్వజ్జనమనోరంజనీ వ్యాఖ్య, శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారివి, శ్రీ రాజన్న కవిగారివి, తదితరుల విమర్శగ్రంథాలు ఉండనే ఉన్నాయి.
ఆధునికయుగంలో మహావిద్వాంసులైన శ్రీ శిష్టు కృష్ణమూర్తికవి గారు దీనిని పునఃపఠనపాఠనాలలోకి తెచ్చి, వీణాదికసంగీతవాయిద్యాలపై రాగధర్మాన్ని వివరిస్తూ ఉపన్యాసాలు చేసేవారని ప్రతీతి.
మొత్తంమీద సంగీతరసజ్ఞులకు కొరుకుడుపడని కల్పనలు వసుచరిత్రలో ఉన్నాయన్నది ఈ ప్రసంగంలోని ప్రతిపాద్యార్థం. ఆ సంగతిని ప్రస్తుతీకరించటమే గాని, కవిని ప్రస్తుతించటం జరగలేదు. లైలా గారన్నట్లు అది కొన్ని పారిభాషికపదాల ప్రయోగం వల్ల ప్రస్ఫుటించే సామాన్యవిషయం కాదు. కవి సంగీతకళారహస్యనిధి అన్న విషయం అడుగడుగున స్పష్టమే. ఆ ప్రపంచంలో ఉపజీవిస్తున్నవారికి తప్ప సంస్ఫురింపని అపూర్వములైన సాంగీతిక కల్పనలు అందులో అనేకం ఉన్నాయి. “కాంభోజి” అన్న ఒకానొక రాగనామప్రయుక్తికై దీర్ఘజకారాన్ని ప్రాసస్థానంలో నిలిపేందుకు “ఆ జాబిల్లి” అన్న నిర్దేశాత్మకమైన ఉపక్రమణిక జరిగిందని ఊహించటం ఎవరో మామూలు కవుల విషయంలో అనవలసిన మాట. శ్రీ శాస్త్రిగారి వంటి పెద్దలు శబ్దబ్రహ్మవేత్త అయిన రామరాజభూషణుని వంటి మహాకవిని అధికరించి అనవలసిన మాట కాదు.
ఇంతకీ, కాంభోజి కావ్యోపగతమైన నాయికారోదనకు నైమిత్తికం కాకూడదని శ్రీ శాస్త్రిగారు ఎందుకు భావించారో తెలియలేదు.
“ధాన్తగ్రహాంశః సనిపైశ్చ భూరిః కామ్భోజికేయం కకుభప్రసూతా
భాషాఙ్గకం యాష్టికసంమతస్య తుల్యవరా చ పూర్ణా.
ఇమాం త్రిషడ్జాం విధరం నిభూరిం హిన్దోలజా మాహు రతద్విదోఽన్యే
శుచౌ నియుక్తాం కరుణే రసే చ సంచారివర్ణం ప్రగుణం వదన్తి.
అని క్రీస్తుశకం 1433-1468 నాటి కుంభకర్ణ నరేంద్రుని సంగీతరాజం. అంతటి జగదేకమహాకవి ఆ మాత్రం చూసుకోడా?
అద్భుతావహమైన “అరిగా పంచమ మేవగించి” పద్యాన్ని గురించిన చర్చ చాలామంది పెద్దలచే జరిగినదే కనుక ఇప్పుడా ప్రసక్తిని మాని, ఆ కల్పనలో ఎటువంటి దోషమూ లేదన్న అక్కడి నిగమనాన్ని మాత్రం స్థూలంగా ఇక్కడ పేర్కొంటున్నాను.
శ్రీ శాస్త్రిగారు సంగీతశాస్త్రవేత్త అని, శ్రావ్యగాయనులని వారి కంఠస్వరం చెప్పకనే చెబుతున్నది. పాండిత్యగౌరవం వల్ల ధ్వనిస్తున్న వారి శాస్త్రాధికారమూ ప్రశంసనీయమే. ప్రసంగమంతటా పరచుకొని ఉన్న వారి పలుకుబడిలోని ఆప్యాయనం కూడా ప్రస్ఫుటమే. “ఆలంబిత పల్లవవ్రతవిధుల్” అని ఉచ్చరిస్తున్నప్పుడు రెండుమార్లూ “పల్లవ – వ్రత” అని ఆ పదాలను విడదీయకుండా చదివి ఉంటే వకారం గురుత్వాన్ని కోల్పోక – ఛందస్సు పాటింపబడి, మహాకవి వేతృత్వాన్ని గూర్చిన విమర్శ కాబట్టి – పద్యపఠనం మరింత శ్రావ్యంగా ఉండేది.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
సంగీత కళా రహస్య నిధి భట్టుమూర్తి గురించి lyla yerneni అభిప్రాయం:
03/14/2017 12:44 am
రేడియో స్టేషన్ లో కొన్ని సంవత్సరాల క్రింద చేసిన ప్రసారం, ఎంతో ప్రేమతో దేశ దేశాల్లో ఉన్న తెలుగు వారిని, ఈ వక్త వినమని ఇచ్చారు. ఆ ఉదారతకు చాలా సంతోషం కలిగింది.
నాకు వీరి ఉపన్యాసం కన్నా, వీరి గానం ఎక్కువ నచ్చింది. మళ్లీ ఏమన్నా కమ్మగా పాడిన ఆడియోలు పత్రిక శ్రోతల కోసం పంపిస్తారేమో. తప్పక వేచి ఉంటాను.
ఉపన్యాసం లోని విషయాలకు వస్తే:
భట్టుమూర్తిని సంగీత కళా రహస్య నిధి అని ఎవరన్నారో, ఎందుకన్నారో మనకెలా తెలుసు? ఎవరికైనా తెలిస్తే దయచేసి చెప్పండి. భట్టుమూర్తికి, సంగీతం ప్రావీణ్యతలో బిరుదులివ్వటం, అసలు ఒక కావ్యరచన పరిశీలించి చెయ్యటమెలా జరుగుతుంది? ఉపన్యాసకులు చెప్పిన ప్రకారం, కవి కాలానికి సంగీతం, సాహిత్యం (కవిత్వం) స్వంత ప్రతిపత్తి కలిగిన కళలు కదా. సంగీతం, సాహిత్యం లో ప్రజ్ఞలు విడిగా పరీక్షించడానికి సాధనాలున్నయ్యి కదా. సంగీతం పరీక్షలు పెట్టి, సంగీత స్వరకల్పనకు కాని, సాహిత్యం కూర్చినందుకో, పాడగలిగినందుకో, వాయిద్యం వాయించగలిగినందుకో గాని, అతడు మేటి ఐతే సంగీత కళానిధి అని సంగీత విద్వాంసులు బిరుదు ఇవ్వచ్చు. అతను అలాటి పరీక్షలు ఇచ్చి ఉన్నాడేమో, ఇచ్చి ఆ బిరుదు పుచ్చుకున్నాడేమో. మరి ఆ విషయం ఎక్కడా చదవటానికి కనపడదు. వసు చరిత్ర కావ్యం ద్వారా అతని సంగీత పాటవం ఎలా చెపుతారూ? అనేది నా సంశయం.
పైగా, కేవలం రెండు పద్యాల ద్వారా అతని సంగీత ప్రావీణ్యత ఎలా తెలుస్తుంది? అదీ సరి కాదు. వసుచరిత్ర రాసిన భట్టుమూర్తి సంగీత జ్ఞానం గురించి, ఎందుకు ఎవరైనా ఆ రెండు పద్యాలే ఉదహరిస్తారో నాకు అర్థం అవదు.
ఒక కవి పద్యాల్లో అక్కడో చోట ఇక్కడో చోట ‘వీణ’ అనో ‘మద్దెల’ అనో, లేకపోతే ‘నాట’ అనో ‘కల్యాణి’ అన్నంత మాత్రాన, ఎవరైనా సంగీత కళానిధి అని బిరుదు ఇస్తారా? ఊరికే, ఒక కథలో మలేరియా, టైఫాయిడ్ అన్నంత మాత్రాన కథా రచయితకు వైద్య శిఖామణి బిరుదు ఇచ్చిన తంతు ఎక్కడా వినలేదు.
సరే, కొంతమందిని కవి అని అంటే సర్లే పోనీలే అని నాలాటివాళ్లు సరిపెట్టుకుందామంటే, ఇంకా ఉద్రేకులు ఢమిక్కిన ఒక్కొక్కరిని మహాకవి, శతాబ్ది కవి అనేస్తారు. మార్క్సిస్టులు శ్రీశ్రీని ప్రజాకవి, మహాకవి అంటే వాళ్ల అభిమానుల గుంపులో చెల్లుబడి అవుతుందేమో కాని, ప్రపంచ కవులు ఎవరండీ ఈ శ్రీ శ్రీ! అంటే ఏం చెపుతారు? ఇదుగోండి ఈ మా గొప్ప తెలుగు కవి – ఈయన ‘ఆనందం అర్ణవమైతే’ అని ఒక పాట రాసాడు, ఆ పాటకి ‘కన్యాశుల్కం’ తెలుగు సినిమాలో మహానటి సావిత్రి ఇలా డాన్స్ చేసింది, ఈ విడియో బిట్ చూడండి అని గాని – ఎవరైనా డాన్స్ వచ్చిన వాళ్లకు చూపిస్తే, నిజంగా నృత్యం నేర్చిన వాళ్లు, వచ్చిన వాళ్లు – ఇది డాన్సా? ఇదేం పాట, ఇదెక్కడి డాన్స్ అయ్యా ఇదా తెలుగు నృత్యం అని వాళ్లు నవ్వి పోతారు.
ఇప్పుడా మధురవాణి, కుహనా కవిత్వం, కుహనా నృత్యం సంగతి నాకెందుకు గానీ, హిందోళ రాగం, వసంత రాగం గురించి, భట్టుమూర్తి ఒక పద్యం లో చమత్కరించి చెప్పినంత మాత్రాన, పద్యం మొదటి భాగం, హిందోళ లో, రెండో భాగం వసంత రాగంలో పాడమని కవి ఉద్దేశం కానే కాదు. అసలు ఏ రాగంలోనూ తన పద్యాలు పాడమని కవి ఆదేశమివ్వలేదు.
పద్యం కూర్చిన భట్టుమూర్తి అతడు ఉపయోగించిన ఛందస్సులు మాత్రమే ఇచ్చాడు. ఆ పద్యం మత్తేభము. అని మాత్రమే అతడు మనకు చెప్పింది. ఆ ఛందస్సులో ఎన్నైనా పద్యాలున్నయ్యి. ఆ ఛందస్సులు వేల మంది కవులు వాడినారు కదా. వారు కూడ అక్కడో పద్యం ఇక్కడో వచనంలో, నాట, కల్యాణి, వసంత, మోహన, కాంభోజి – అంటే ఇక వారికీ సంగీతం వచ్చినట్లేనా. ఆ లెక్కన తెలుగు సినిమా పాటలు రాసిన వాళ్లు వైణికులై కూర్చుంటారు. తకిట తకిట అంటే తబలా expert, ఓంకార నాదాలు సంధానమౌ గానమే – అంటే శంకరాభరణము specialist– ఐ పోతారు.
ఆ పద్యంలో మొత్తం మీద, కవి చమత్కారంగా ఉద్దేశించింది, తోటలో ఆడవాళ్ల ఉయ్యాల పాటలకు, కోయిలలు గొంతు కలిపినందున వసంతం పరిపూర్ణంగా శోభించిందని. అదే ఇంకోలాగా తిప్పి, గిరిక వీణా వాదనం విన్నప్పుడు, వసురాజు స్నేహితుడు – ఎవరో వీణ ఎంత బాగా వాయిస్తున్నారు, ఈ కొండ కోనలలో! కోయిలలు, నెమళ్లు తమ గొంతు కలిపి -పంచమ, షడ్జమాలు వినిపిస్తున్నాయి, అంటాడు. తెలుగు ( కర్ణాటక) సంగీతంలో, కోయిల స్వరం పంచమం కి సరిపోతుందని, నెమలి షడ్జమమని ఆ విషయాలు అలా రాసి ఉన్న సంగీతం పుస్తకాలు ఉన్నవి. ఒక్కొక్క సంగీత స్వరం ప్రకృతి లోని ఆ యా జంతువుల అరుపుతో సరిపోల్చటం పాతకాలంలో ఉన్నది.
అందువల్ల మహా అనుకుంటే మనం – భట్టుమూర్తి కవి సంగీతం పుస్తకాలు చదివాడేమో, పాట మీద అభిమానం ఉన్నట్లుంది, ఔరంగజేబు కాదు సుమా అనుకోవచ్చు.
హిందోళ రాగం వినాలంటే భట్టుమూర్తి పద్యం కష్టపడి పాడటమెందుకూ? – త్యాగరాజు ఆది తాళములో కూర్చిన ‘సామజ వర గమనా’ కృతి వింటే ధన్యులమై పోమా? సాహిత్యం లేకుండా స్వరం వీణ మీద పలికిస్తే, ముగ్ధులమై వినమా? సంగీత స్వరాలతో మనల్ని సమ్మోహితులను చేసి, ఈ త్యాగరాజు తన మాటలలో ఏమి చెప్పాలనుకుంటున్నాడు అని చూస్తే
సామజ వర గమనా సాధు హృత్సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత
సామ నిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మాంపాలయ..
అంటూ ఆ సాహిత్యం తోనూ మనల్ని రంజింప చేస్తాడు. సామజ వర గమనా సాధుహృ – అని అక్కడికి ఆపి, సంగతులు వెయ్యటం మొదలు పెడితే, కొంతమంది పట్టూ విడుపూ లేని వాళ్లకు, దొబ్బిడాయి వస్తుంది కాని సంగీత హృదయులు నొచ్చుకోరు. తన్మయులౌతారు. త్యాగరాజు తప్పకుండా సంగీత కళానిధి. సందేహం లేకుండా వాగ్గేయకారుడు.
ఉపన్యాసకులు మనకు ఆయా రాగాలు గురించి ఎంతైనా చెప్ప వచ్చు. కాలక్రమాన రాగాల స్వరాలలో వచ్చిన మార్పులు గురించి చెప్ప వచ్చు. అవి తప్పక శ్రోతలకు ఆసక్తికరంగా ఉంటాయి. ఆ ప్రస్తావనలు నాకు నచ్చాయి.
కాని, భట్టుమూర్తి కావ్యనాయిక గిరిక ఏడిస్తే కాంభోజీ రాగంలో మేళవించిన వీణలా వినిపించిందని -తన ఒక పద్యంలో అంటే ఉపన్యాసకులు ఆ పద్యాన్ని కాంభోజిలో పాడి వినిపించటం ఎందుకు? పద్యం అంతా గిరిక ఏడుపు కాదే. పద్యం ఒక విరహావస్థ వర్ణన. వెన్నెలలో ఒక సుందర స్త్రీ విలాప దృశ్యం. గిరిక ఎవరు? కోలాహలుడు అనే పర్వత రాజు కూతురు. కోలాహలుడు హిమవంతుడి కొడుకు. పార్వతికి సోదరుడు. గిరిక తల్లి నది. ఆ శుక్తిమతి గంగ లాగా స్వర్గంలో, భూమ్మీదా ప్రవహించే నదేమో మనకు తెలియదు. గిరిక దేవకాంత ఏమో. ఆమె నెత్తి మీద ముసుగు వేసుకు ఏడుస్తుందా? తెలుగు ఆడవాళ్ల లాగా, పమిట వెనక నించి ముందుకు లాగి, చెంగులోకి ముక్కు చీదుతుందా. దేవా! ఏమి దుస్థితి. విరహం లో కూడా వసురాజు ప్రేమిక గంభీర కాదా? ఆమెను ‘పటాగ్రంబెత్తి’ అని కవి ఎంత నాజూకుగా వర్ణించినాడు. గిరిక కట్టినది అది ఎంత నాజూకు దుకూలమో. ఆమె దానిని మునివేళ్ళతో ఎత్తి, తన ముఖానికీ, వెన్నెలకూ మధ్య అడ్డంగా ఎలా ఎత్తి పట్టిందో ఆ చిత్రం గొప్ప చిత్రకారుడు గీయాలి, మనం చూడాలి. భట్టుమూర్తి చాలా చక్కని వర్ణన చేసాడు. వడ్డాది పాపయ్య ఐతే బహుశా బాగానే చిత్రించ కలిగి ఉండొచ్చు.
గిరిక కాంభోజీ లో ఏడవటానికి అది సరైన రాగం కాదు, అలా సూచించటంలో భట్టుమూర్తి సంగీత పరంగా పొరపాటు చేసాడనుకోటం సరికాదు. భట్టుమూర్తి ఏదో మొదటి మూడక్షరాల కోసం కక్కుర్తి పడి, కాంభోజీ అన్న మాట వాడతాడా? అన్ని వందల తియ్యని పద్యాలు రాసినతడు, ఒక పద్యం అవతల పారెయ్యటానికి తిరగ రాయటానికి వెనకాడతాడా? ఏ కాలంలోనూ చూడండి, వందల పేజీలు తిరగ రాసే రచయితలుంటారు. వారి మనసుకే నచ్చక మళ్లీ మళ్లీ రాస్తారు. ఎడిటర్ కి నచ్చకపోతే, సలహాను గౌరవించి, తను చెప్పదలచింది సరిగా వివరించ గలిగే దాకా తిరగరాసేవి ఇక ఎన్నో.
కధా విషయం హిమాలయాల ప్రాంతంలో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మరి ఉత్తరాది కాంభోజీ రాగం ఎందుకు కవి ఉదహరించకూడదు? ఆ రాగం కాంభోజ ప్రాంతంకు చెందినందున ఆ పేరు వచ్చిందనీ, గంభీరం ఐన రాగం అని raga guide లో పేర్కొన్నారు. స్వరాలలో కైశిక నిషాదం ఉన్నది. విషాదం ఎందుకు పలకదు!
గిరిక సంగీతం దేవతల దేమో. మానవ సంగీతానికి అతీతమైన దేమో. సంగీతం పుస్తకాల్లో, రాసి ఉన్న ప్రకారం మంద్ర, షడ్జమ స్థాయి లే మానవులకు అందుబాటులో ఉన్నవి. గాంధర్వం దేవతలే పాడగలరు. కాళిదాసు కుమార సంభవం లో కూడా ఈ విషయ ప్రస్తావన ఉంది. భారతదేశంలో తయారయే తంజావూరు వీణలు, సరస్వతీ వీణల నాదం పక్కల కూర్చొన్న వాళ్లకే వినిపిస్తుంది. గిరిక వీణ వసురాజుకు, కొండమీద అడవులలో దూరానికి వినిపించిందంటే, అది మనుషులు చేసిన వీణ కాదు. వసురాజు ఇంద్రుని వరాలు పొందిన వాడు. వసురాజుకు స్వర్గానికి విమానంలో రాకపోకలున్నయ్యి. అతడి నర్మసఖునికి కూడా, స్వర్గానికి వీసా, పాస్పోర్ట్ ఉండి ఉండాలి. వారు గంధర్వ గానం విని ఆనందించి ఉన్నారు. అంతకన్నా ఎక్కువ ఆకర్షణీయంగా గిరిక వీణ పలికించిందని వసురాజు, అతని మిత్రుని సంభాషణలద్వారా కవి మనకు ముందే చెప్పి ఉన్నాడు.
భట్టుమూర్తికి సంగీత కళా రహస్య నిధి అని బిరుదు ఎవరిచ్చారో, ఎందుకిచ్చారో? నాకు తెలియదు కాని, వసుచరిత్ర కావ్యం చదివి, అతడి సంగీత కళా పాటవం నిర్ణయించక్కర్లేదు. ఒకటి రెండు పద్యాల ద్వారా, అతడు చేయని తప్పులు సంగీత పరంగా అతని మీద ఆరోపించక్కర్లేదు. సంగీతజ్ఞులు ఆ ధోరణిగా ఆలోచించక్కర్లేదు, అని నాకనిపిస్తున్నది.
లైలా.
కత్తి పడవలు గురించి Krishna Chaitanya అభిప్రాయం:
03/13/2017 5:47 am
Very Good and story taken me to my school days.Tears came out of my eyes on reading the story. Thanks a lot…
అయిదో కుర్చీ గురించి Rekha Singh అభిప్రాయం:
03/12/2017 3:38 am
వాస్తవానికి దగ్గరగా ఉంది.
తెలుగు పరిశోధనపై వెల్చేరు నారాయణరావుతో ఇంటర్వ్యూ గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
03/12/2017 3:33 am
ముప్ఫయ్యేళ్ళ క్రితం నాటి శ్రీ వెల్చేరు నారాయణరావు గారి ఈ ప్రసంగవ్యాసాన్ని మళ్ళీ ఇరవయ్యేళ్ళకు పునఃప్రచురిస్తే అప్పటి పరిస్థితులైనా ఆశాజనకాలుగా ఉండవచ్చునన్న అవకాశమేమీ కనబడటం లేదు. నానాటికీ తీసికట్టుగా మారుతున్న విశ్వవిద్యాలయాలలోని తెలుగు శాఖల వారందరూ ఇప్పటికైనా విజ్ఞులతో సమావేశమై లోపాలను గుర్తించి, పరిష్కారమేమిటో నిర్ణయించి, సంయుక్తంగా కార్యాచరణకు పూనుకొనకపోతే రాబోయే రోజులలో పరిశోధకులూ, పర్యవేక్షకులూ అబ్బూరి వారన్నట్లు, “పాతాళంబున” అంటే చేతులు పైకెత్తి చూపవలసినంత నిమ్నస్థాయికి (అధోగతికి) దిగజారటం తథ్యం.
ఈ విషయాన్ని అధికరించి తెలుగులో పరిశోధన తీరుతెన్నుల సర్వాంగీణసమీక్షతో ‘ఈమాట’ ఒక మార్గదీపక సంచికను గాని, ఒక క్రమసంహితతో విద్వత్పరిశీలకుల వ్యాసపరంపరను గాని వెలువరిస్తే బాగుంటుందన్న అభ్యాకాంక్షతో,
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు