కాశీనాథుని రాజశేఖర్ గారూ,
కవులు, పండితులు కన్నా మిగిలిన వాళ్ళకన్నా “అణా” లు ఎక్కువివ్వగలిగిన రోజు ఇంతకుముందు లేదు, ఇప్పుడూ లేదు, ఇక ముందు వుంటే కవులందరూ మీ పేరు చెప్పుకుంటారు సంస్క్రుతంలో. గోదావరి ప్రాంతపు పండితులు “కాటన్” ని కూడా రోజూ స్మరిస్తున్నట్టు. విచిత్రవేవిటంటే “తానీషా” నో ఎవర్నో “ఇభరాముడు”, మల్కిభరాముడు” అని మార్చినట్టు కాదు, “ఇంగ్లండులో పుట్టిన కాటన్” అని సంస్క్రుతం లో.
ఈ “అణా” ల గొడవ నేనేదో స్వంతంగా కల్పించింది కాదు (అది ఈ మాట పాఠకులందరికీ తెలుసు). “తాతాజీ” పుస్తకంలో చదివింది. సాహిత్యమొర్మరాలు నవిలినపుడు తగిలిన జీడిపప్పు.
అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లుండడం “స్థితప్రజ్నుల” లక్షణం. పండితుల లక్షణం కాదు. అందుకే పండితులకీ పండితబ్రువులకీ తేడా మనలాటి సామాన్యులకి తెలీదు.
అందుకే మీరు నన్ను పండితుడనీసేరు.
“థేంక్స్ ఎవరో వొకరన్నారు”. మీకూ “రాజేంద్రకుమార్ దేవరపల్లి” గారికీ ధన్యవాదములు.
రవి గారూ, జ్యోతిషాభిమానులకి కొన్ని సూచనలు అన్న అంశంలో నేను చెప్పదలచుకున్నది కొంతమటుకు మీ ప్రశ్నకి సమాధానాన్ని ఇస్తుంది. అయినా మీరు అడిగారు కాబట్టి కొన్ని సూచనలు –
1) ఎవరైనా జ్యోతిష్కులని భవిష్యత్తు కాకుండా ఇదే విధంగా గతాన్ని గురించి చెప్పమనండి.
2) ఒక పదీ, ఇరవై జాతకాలకి ఒక్కో జాతకానికి పదేసి చొప్పున ఖచ్చితమైన ఫలితాలు రాసి ఇమ్మనండి. (మీ కామెంటులో రాసిన ఫలితాలు అన్నీ ఖచ్చితమైనవే, ambiguity లేదు అని మీరు భావిస్తున్నారా?)
3) చెప్పిన వంద, రెండువందల ఫలితాల్లోనూ ఎన్ని సరైనవో లెక్కపెట్టండి. దాన్ని బట్టి జ్యోతిషం ఎంతవరకు పని చేస్తుందో మీరే నిర్ణయించుకోవచ్చు.
4) ఏదైనా పత్రికలో ఇదే విధంగా గతానికి సంబంధించిన విషయాలు చెప్పి, తరవాత సంచికలో పాఠకులచేత ఆ ప్రిడిక్షన్సు తప్పో, ఒప్పో చెప్పించే శీర్షిక ఒకటి పెట్టడానికి వీలవుతుందో లేదో చూడండి. కనీసం ఇటువంటి ప్రతిపాదనకి పేరుప్రఖ్యాతులున్న జ్యోతిష్కులెవరైనా అంగీకరిస్తారేమో చూడండి. (ఆ శీర్షిక ద్వారా జ్యోతిషం నిజమని నిరూపితమైతే, జేమ్సు రాండీ బహుమతిని గెల్చుకోవడం ద్వారా కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు.)
Yes, there are some news papers, even T.V.channels which are biased and serve the needs of certain section only. The true,courageous journlists are becoming rare commodity.
“ఈ మాట” సంపాదక వర్గానికి
వుప్పల లక్ష్మణరావు గారి ప్రభావం వల్ల “అమ్రుతం”, “క్రుష్ణుడు”, “క్రుతగ్యత”, “సంస్క్రుతం” వగైరాలు.
“ప్రాలేయరుఙ్మండలీ” తెలుగులో రాయడానికి సాయం చేసినందుకు సంపాదకవర్గానికి “క్రుతగ్యతలు”. “డబలెమ్” రాయాలని్ పట్టుకోలేకపోయేను.
కామేశ్వర రావు గారికి,
నేను కోరిన కొండ మీద వాన కురిసిందని “నామిని” రాస్తే పూర్తిగా అర్ధం కాలేదు. మీ చిన్న వాక్యం “డైనమైట్” లా పేలింది. ఆ వ్యాక్యం అర్ధం పూర్తిగా “అర్ధవయ్యింది”.
అ) చందస్సు ప్రకారం “రెసైట్” చెయ్యడానికని చందస్సు “చెక్” చెయ్యలేదు. పద్యం, పద్యంలా రాసుకోవాలి కదా. అందుకు.
“అల వైకుంఠ…” చిన్నప్పుడు ఎందువల్ల కంఠతా పట్టేనో గుర్తులేదు, పద్యం గుర్తుంది. అందుకని ఇన్ని దశాబ్దాల తరవాత గణవిభజన చేసి పద్యం పద్యంలా “తయారు చేయగలిగేను. (ఇంకా “రిసైట్” చేయడం వరకూ రాలేదు.)
“సిరికిం జెప్పడు..” బహుశా “ఎగ్జామ్” లో రాదని “మేషారు” చెబితే వదిలేసేనేమో? కొన్ని పదాలకి అర్ధం కూడా సరిగ్గా తెలీదు. “అభ్రతపతి” కి “గరుత్మంతుడని, “ఆకర్ణికాంతరథమిల్లము” అంటే “విల్లు బాణాలు” అని “జక్కనొత్తడు” అంటే “పట్టుకోడు” అని నాలుగో తరగతి పిల్లకి చెప్పేను. తప్పులయుండొచ్చు. తప్పులేనేమో.
ఆ) నిన్న నేను “ఈ మాట” పాత సంచికలలో “దేశికాచారి” గారు రాసిన వ్యాసం, చందస్సు గురించి ( తారీఖు, ఇది రాస్తూ ఎలా వెనక్కి వెళ్ళి “చెక్” చెయ్యాలో నాకు తెలీదు, ఈ అభిప్రాయం “సబ్మిట్” చేసేక అది వెతుకుతాను. ) , చదివేను. చందస్సు కవిత్వం రాయడానికి బాగా వుపయోగపడుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీశ్రీ, కాళోజీ గారు కూడా చందస్సు అనే పాముకాటుకి ఎలా గురయ్యారో సోదాహరణంగా రాసేరు. “జయప్రభ” గారి కవిత్వం కూడా ఉదహరించేరు. ఇంకా చాలా మంది ఆధునిక కవుల కవిత్వాన్ని కూడా వుదహరించేరు. వ్యాసాలు రాసేవాళ్ళందరూ వాళ్ళకి అనువయిన వుదాహరణలే తీసుకుంటారు. అందువల్ల ఆ వుదాహరణలకి అంత “ఏల్యూయేషన్” వుండదు. ఎందుకంటే అన్ని సహజ సంఖ్యలకీ ఆ “థీరమ్” రుజువవాలి. దీని మీద ఎక్కువ ఇక్కడ నేను రాయను. దీని గురించి మీరేం రాయకండి.
ఆ వ్యాసం చదివిన తరవాత, ఏపని చేస్తున్నా, ఒకటే ప్రశ్న వెంటాడింది.
ఆ ప్రశ్న “సిరికిం జెప్పడు…” పద్యమే.
“… శంఖచక్రయుగమున్ జేదోయి సంధింపడేపరివారంబున్ జీరడభ్రతపతింబన్నింపడాకర్ణికాంతరథమ్మిలములన్ జక్కనొత్తడు..”
ఇదంతా కలిపి చదవాలా? చదవక్కర్లేదా? చదివినపుడు కలిపి, ఒకే గుక్కలో చదవక్కరలేక పోతే “డా” లన్నిటినీ కలపడవెందుకు? ఇలా ఎందుకు రాయకూడదు?
“….శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు,
ఏ పరివారంబున్ జీరడు, అభ్రతపతింబన్నింపడు,
ఆకర్ణికాంతరథమ్మిలము జక్కనొత్తడు..” అని ఎందుకు రాయకూడదు.
రాయడానికి చందస్సు కావాలి, చదవడానికి ఎందుకు అక్కర్లేదు?
కామేశ్వర రావు గారూ,
దయచేసి ఛందస్సు ప్రకారం పద్యమెందుకు రాయలి? చదివినపుడు ఎందుకు విడగొట్టాలి? దీని మీదే (ప్లీజ్) రాయండి. మిగిలినవాటిగురించి రాసి మీ సమయం వ్రుధా చేసుకోకండి.
“ధారణ” ముఖ్యావసరం వేదకాలంనాటినుంచీ, తాళపత్ర గ్రంథాలొచ్చిన తరవాత కూడాతప్పలేదు. “గుటెన్ బెర్గ్” తరవాత ధారణ అక్కరలేదు. “కుందుర్తి ఆంజనేయులు” గారి “నగరంలో వాన” కవిత ధారణకి లొంగదు అయినా ఇబ్బంది లేదు. అందులోని “కోటబుల్ కోట్స్” గుర్తుంటాయి. పూర్తి పాఠం కావాలంటే పుస్తకం వుంటుంది. ఎక్కాలు గుర్తుంచుకోవలసిన తరం “రెండోట్ల రెండు. రెండ్రెళ్ళ్నాలుగు..” అని “రిథిమిక్” గా కంఠతా పట్టేరు. “కేలిక్యులేటర్” ఆ తరవాత “కంపూటర్” వచ్చేక కంఠతా అవసరం తీరిపోయిందికదా? “ఇంటర్నెట్” వచ్చాక ఇంకా సులువయిపోయిందికదా?
పండితులకి ఛందస్సు “కంపల్సరీ” గా వస్తుంది. రాకపోతే పండితుడు అవుతాడా?
ఛందస్సు వచ్చిన వాళ్ళందరూ కవులుకారు.
సాయంకాలం అయిదు గంటల వేళ ఒక చక్కని అమ్మాయిని చూసి నాలాటివాడు “తూర్ణం మానీయతాం చూర్ణం పూర్ణచంద్రనిభాననే” అన్నాట్ట. మీ లాటి కవిగారు “పర్ణాని, స్వర్ణ పర్ణాని, కర్ణాంతాయతలోచనే” అన్నారుట. ఆ చక్కనమ్మ, పరిచారికకి నన్ను చూపించి “ఈ పండితుడికి సున్నప్పిడత ఇవ్వవే” అంది. మిమ్మల్ని “మేషారూ, ఇలారండి, ఇక్కడ కూచోండి, స్వర్ణ పర్ణానికి చాలా టైమ్ పడుతుందికదా? ఎంత చక్కని కవిత్వం మీది” అందిట. ఎంత తెలివయిన అమ్మాయి కదండీ? అలా ఎందుకందో మీకు తెలుసు. మాలాటివాళ్ళకి మీరు వివరించి చెప్పాలి.
ఆదివారం ఆంధ్రజ్యోతిలో అదృష్ట రత్న జ్యోతి శీర్షికలో ప్రిడిక్షన్సు చెప్తూ ఉంటారు. మీరు చెప్పిన verifiability/falsifiability కి సరిపోయే విధంగా ఈవారం (3/ఆగస్టు/2008) చాలా ఖచ్చితమైన ఫలితాలు చెప్పారు. ఆఖరికి జాతకుడు ఎప్పుడు మరణిస్తాడో కూడా చెప్పేశారు. అయినాసరే మీరు జ్యోతిషం తప్పంటారా? పైగా ఇది కేవలం జాతకం చూసి చెప్పినది మాత్రమే. జ్యోతిష్కుడికి సమాచారం లీకయ్యే అవకాశం లేదు కదా.
ఆంధ్రజ్యోతిలో చెప్పిన ఫలితాలు –
1. 2006 అక్టోబర్ నుంచి 2008 మే మధ్య ఉద్యోగంలో మార్పు.
2. 2009 జూన్ 21 నుంచి ఏ క్షణంలోనైనా వివాహం. ఛేంజాఫ్ ప్లేస్. అయితే ప్రస్తుతం సంబంధం కుదిరినా కూడా 2009 జూన్ 21 వరకూ వివాహం చేసుకోకూడదు. ఒక ప్రాపర్టీ డిజ్పోజాఫ్ చెయ్యడం.
3. 2001 నవంబర్ 2 నుండి 2014 ఆగస్టు మధ్య కెరీర్ లో ఉన్నత స్థితి. కానీ చిన్నపాటి అవమానం. ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతుంది. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. స్పెక్యులేషన్, షేర్స్ జోలికి వెళ్ళి నష్టపోకుండా జాగ్రత్త పడాలి. అలాగే సంతానం గురించిన ఎంతో కొంత ఆందోళన.
4. 2014 ఆగస్టు నుండి 2017 ఫిబ్రవరి మధ్య మళ్ళీ చేంజాఫ్ జాబ్. ఎక్కువ తిరగాల్సి వస్తుంది. టూ మెనీ షార్ట్ జర్నీస్. పీరియడ్ లో అనే కాదు, ఆఅన్ జనరల్ ధరించాల్సిన రత్నాలు పచ్చ + వజ్రం. అదృష్ట దిక్కు ప్రత్యేకంగా ఇదీ అని ఏమీ లేదు.
5. 2017 ఫిబ్రవరి నుండి 2018 ఫిబ్రవరి మధ్య ఒక దురదృష్టకర సంఘటన చోటు చేసుకోకుండా రాహు కేతువులకి గట్టి రెమెడీస్ పాటించాలి. అలాగే ఎటువంటి దూరప్రయాణం చేయకపోవడమే అసలైన రెమెడీ. అయితే ఇదే పీరియడ్ లో ఊహించని ప్రమోషన్ రావడం విశేషం.
6. 2018 ఫిబ్రవరి నుండి 2021 ఫిబ్రవరి మధ్య కెరీర్ లో ఉన్నత స్థితి వాహనయోగం. అన్నీ కలిసి రావడం. అంతా అదృష్టం.
7. 2023 జూలై 8 నుండీ 2024 జూలై మధ్య వారసత్వంగా వచ్చే ధనం. గృహయోగం. అయితే స్థిరాస్తులు వీలైనంతవరకు మీ పేరు మీద లేకుండా చూసుకుంటే మంచిది. నిలకడ కనిపించడం లేదు.
8. గురు దశ అంతా కూడా సబార్టినేషన్ ఉంటుంది. రిటైర్మెంట్ కనిపించడం లేదు. కావాలని పనిచేయడం కావచ్చు. కొందరికి పనే విశ్రాంతి.
9. 2011 నవంబర్ నుండి 2014 ఆగస్టు మధ్య చిన్నపాటి గండం రాకుండా రెమెడీస్ పాటించాలి. అయితే 2050 జూన్ 22 నుండి ఆగస్టు 7 మధ్య అంటే మీ 76 వ ఏట ఒక ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున పగటిపూట సంతానం సమక్షంలో మీ పరమపద ప్రాప్తి.
మీ పత్రిక బాగుంది. ఈమాట మనమాటగా ఆంధ్రులందరిదీ అనిపించేలా పత్రికను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్న సంపాదకవర్గానికి ఒక రచయితగా నా అభినందనలు.
డా. జొన్నలగడ్డ మార్కండేయులు
పేరవరం-533235-తూ.గో.జిల్లా ఆంథ్ర ప్రదేశ్
నూలు చీర
గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
08/05/2008
11:55 am
బాబ్జీలు గారూ,
సరదాగా రాసింది “దిల్” మీదకి తీసుకున్నట్లున్నారు.
తప్పులు దొర్లితే చూపించడమూ, అచ్చయిన దాన్ని “ఇలా రాయాలి సుమా” అని చెప్పడమూ రెండూ ఒకటి కాదని నా అభిప్రాయం. రెంటికీ తేడా ఉంది.
మీ స్పందన కంటే,
“రోజుకి మూడు కవితలూ ఆరు వ్యాసాలుగా, “చింతబొట్టలు దులిపినట్టు” దులిపేయాలి.” అన్న సలహా బాగా నచ్చింది. ఇది నాకు మాత్రమేనా? లేక “చెయ్యి” చేసుకునే అందరికీనా?
మీకు పలవరింతలెలాగో, నాకు ఈ పేలాపన్లలాగ!
బతుకు మాట దేవుడెరుగు, “అబద్ధం నిజంలా మాట్లాడ్డం మాత్రం నాకు తెలీదు.”
నమ్మినా, నమ్మక పోయినా మీ వాక్యం మాత్రం నాకు నచ్చింది.
ఇహ ఈ చర్చకి దారీ, తెన్నూ లేనట్లు అనిపిస్తోంది.
మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి Kameswara Rao అభిప్రాయం:
08/08/2008 7:00 am
నేను పండితుణి కాను కాబట్టి ఏమీ తెలియనట్లు ఉండలేక…
బాబ్జీలుగారు,
ముందుగా, “మిగిలినవాటిగురించి రాసి మీ సమయం వ్రుధా చేసుకోకండి.”, అన్న మీ సలహాకి ధన్యవాదాలు, ఎంతవరకూ పాటిస్తానో చెప్పలేను కాని. అది నా చేతుల్లో ఉంటేకదా!
అభ్రతపతి కాదు అభ్రగపతి. అభ్ర = ఆకాశం; అభ్రగ = ఆకాశంలో తిరిగేది = పక్షి; అభ్రగపతి = పక్షుల రాజు = గరుత్మంతుడు
ఆకర్ణికాంతరథమిల్లము; కర్ణిక = చెవి కమ్మ; అంతర = మధ్యలో; ఆకర్ణికాంతర = చెవి కమ్మ మధ్యలో చిక్కుకున్న; ధమ్మిల్లము = కొప్పు
చక్కనొత్తక = సరిచెయ్యక
విష్ణుమూర్తికి కొప్పుంటుంది కాబోలు!
ఈ పద్యాన్ని చదవడం గురించి ఇంతకు ముందొక వ్యాసంలో (ఈమాట లోనే) రాసిన గుర్తు.
దీనికి నేను విన్న పాఠం “పర్ణాని, స్వర్ణ వర్ణాని, కర్ణాంతాకీర్ణ లోచనే”. ఒక అణా ఎక్కువుంది 🙂
మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి baabjeelu అభిప్రాయం:
08/08/2008 6:57 am
కాశీనాథుని రాజశేఖర్ గారూ,
కవులు, పండితులు కన్నా మిగిలిన వాళ్ళకన్నా “అణా” లు ఎక్కువివ్వగలిగిన రోజు ఇంతకుముందు లేదు, ఇప్పుడూ లేదు, ఇక ముందు వుంటే కవులందరూ మీ పేరు చెప్పుకుంటారు సంస్క్రుతంలో. గోదావరి ప్రాంతపు పండితులు “కాటన్” ని కూడా రోజూ స్మరిస్తున్నట్టు. విచిత్రవేవిటంటే “తానీషా” నో ఎవర్నో “ఇభరాముడు”, మల్కిభరాముడు” అని మార్చినట్టు కాదు, “ఇంగ్లండులో పుట్టిన కాటన్” అని సంస్క్రుతం లో.
ఈ “అణా” ల గొడవ నేనేదో స్వంతంగా కల్పించింది కాదు (అది ఈ మాట పాఠకులందరికీ తెలుసు). “తాతాజీ” పుస్తకంలో చదివింది. సాహిత్యమొర్మరాలు నవిలినపుడు తగిలిన జీడిపప్పు.
అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లుండడం “స్థితప్రజ్నుల” లక్షణం. పండితుల లక్షణం కాదు. అందుకే పండితులకీ పండితబ్రువులకీ తేడా మనలాటి సామాన్యులకి తెలీదు.
అందుకే మీరు నన్ను పండితుడనీసేరు.
“థేంక్స్ ఎవరో వొకరన్నారు”. మీకూ “రాజేంద్రకుమార్ దేవరపల్లి” గారికీ ధన్యవాదములు.
మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:
08/07/2008 2:07 pm
రెండవ పద్యంలో ‘అణా'”లు ఎక్కువగా ఉన్నందువలన అని మీకు తెలుసని మాకూ తెలుసు. అన్నీ తెలిసి ఏమీ తెలియనట్లుండడమే పండితుల లక్షణం.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి నాగమురళి అభిప్రాయం:
08/07/2008 11:07 am
రవి గారూ, జ్యోతిషాభిమానులకి కొన్ని సూచనలు అన్న అంశంలో నేను చెప్పదలచుకున్నది కొంతమటుకు మీ ప్రశ్నకి సమాధానాన్ని ఇస్తుంది. అయినా మీరు అడిగారు కాబట్టి కొన్ని సూచనలు –
1) ఎవరైనా జ్యోతిష్కులని భవిష్యత్తు కాకుండా ఇదే విధంగా గతాన్ని గురించి చెప్పమనండి.
2) ఒక పదీ, ఇరవై జాతకాలకి ఒక్కో జాతకానికి పదేసి చొప్పున ఖచ్చితమైన ఫలితాలు రాసి ఇమ్మనండి. (మీ కామెంటులో రాసిన ఫలితాలు అన్నీ ఖచ్చితమైనవే, ambiguity లేదు అని మీరు భావిస్తున్నారా?)
3) చెప్పిన వంద, రెండువందల ఫలితాల్లోనూ ఎన్ని సరైనవో లెక్కపెట్టండి. దాన్ని బట్టి జ్యోతిషం ఎంతవరకు పని చేస్తుందో మీరే నిర్ణయించుకోవచ్చు.
4) ఏదైనా పత్రికలో ఇదే విధంగా గతానికి సంబంధించిన విషయాలు చెప్పి, తరవాత సంచికలో పాఠకులచేత ఆ ప్రిడిక్షన్సు తప్పో, ఒప్పో చెప్పించే శీర్షిక ఒకటి పెట్టడానికి వీలవుతుందో లేదో చూడండి. కనీసం ఇటువంటి ప్రతిపాదనకి పేరుప్రఖ్యాతులున్న జ్యోతిష్కులెవరైనా అంగీకరిస్తారేమో చూడండి. (ఆ శీర్షిక ద్వారా జ్యోతిషం నిజమని నిరూపితమైతే, జేమ్సు రాండీ బహుమతిని గెల్చుకోవడం ద్వారా కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు.)
ప్రజాస్వామ్యం – పత్రికాస్వాతంత్ర్యం గురించి T.Raja gopal అభిప్రాయం:
08/07/2008 10:13 am
Dear Editor,
I concur with sri K.Mahesh kumar’s openion.
Yes, there are some news papers, even T.V.channels which are biased and serve the needs of certain section only. The true,courageous journlists are becoming rare commodity.
Raja gopal
మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి baabjeelu అభిప్రాయం:
08/07/2008 9:44 am
“ఈ మాట” సంపాదక వర్గానికి
వుప్పల లక్ష్మణరావు గారి ప్రభావం వల్ల “అమ్రుతం”, “క్రుష్ణుడు”, “క్రుతగ్యత”, “సంస్క్రుతం” వగైరాలు.
“ప్రాలేయరుఙ్మండలీ” తెలుగులో రాయడానికి సాయం చేసినందుకు సంపాదకవర్గానికి “క్రుతగ్యతలు”. “డబలెమ్” రాయాలని్ పట్టుకోలేకపోయేను.
కామేశ్వర రావు గారికి,
నేను కోరిన కొండ మీద వాన కురిసిందని “నామిని” రాస్తే పూర్తిగా అర్ధం కాలేదు. మీ చిన్న వాక్యం “డైనమైట్” లా పేలింది. ఆ వ్యాక్యం అర్ధం పూర్తిగా “అర్ధవయ్యింది”.
అ) చందస్సు ప్రకారం “రెసైట్” చెయ్యడానికని చందస్సు “చెక్” చెయ్యలేదు. పద్యం, పద్యంలా రాసుకోవాలి కదా. అందుకు.
“అల వైకుంఠ…” చిన్నప్పుడు ఎందువల్ల కంఠతా పట్టేనో గుర్తులేదు, పద్యం గుర్తుంది. అందుకని ఇన్ని దశాబ్దాల తరవాత గణవిభజన చేసి పద్యం పద్యంలా “తయారు చేయగలిగేను. (ఇంకా “రిసైట్” చేయడం వరకూ రాలేదు.)
“సిరికిం జెప్పడు..” బహుశా “ఎగ్జామ్” లో రాదని “మేషారు” చెబితే వదిలేసేనేమో? కొన్ని పదాలకి అర్ధం కూడా సరిగ్గా తెలీదు. “అభ్రతపతి” కి “గరుత్మంతుడని, “ఆకర్ణికాంతరథమిల్లము” అంటే “విల్లు బాణాలు” అని “జక్కనొత్తడు” అంటే “పట్టుకోడు” అని నాలుగో తరగతి పిల్లకి చెప్పేను. తప్పులయుండొచ్చు. తప్పులేనేమో.
ఆ) నిన్న నేను “ఈ మాట” పాత సంచికలలో “దేశికాచారి” గారు రాసిన వ్యాసం, చందస్సు గురించి ( తారీఖు, ఇది రాస్తూ ఎలా వెనక్కి వెళ్ళి “చెక్” చెయ్యాలో నాకు తెలీదు, ఈ అభిప్రాయం “సబ్మిట్” చేసేక అది వెతుకుతాను. ) , చదివేను. చందస్సు కవిత్వం రాయడానికి బాగా వుపయోగపడుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీశ్రీ, కాళోజీ గారు కూడా చందస్సు అనే పాముకాటుకి ఎలా గురయ్యారో సోదాహరణంగా రాసేరు. “జయప్రభ” గారి కవిత్వం కూడా ఉదహరించేరు. ఇంకా చాలా మంది ఆధునిక కవుల కవిత్వాన్ని కూడా వుదహరించేరు. వ్యాసాలు రాసేవాళ్ళందరూ వాళ్ళకి అనువయిన వుదాహరణలే తీసుకుంటారు. అందువల్ల ఆ వుదాహరణలకి అంత “ఏల్యూయేషన్” వుండదు. ఎందుకంటే అన్ని సహజ సంఖ్యలకీ ఆ “థీరమ్” రుజువవాలి. దీని మీద ఎక్కువ ఇక్కడ నేను రాయను. దీని గురించి మీరేం రాయకండి.
ఆ వ్యాసం చదివిన తరవాత, ఏపని చేస్తున్నా, ఒకటే ప్రశ్న వెంటాడింది.
ఆ ప్రశ్న “సిరికిం జెప్పడు…” పద్యమే.
“… శంఖచక్రయుగమున్ జేదోయి సంధింపడేపరివారంబున్ జీరడభ్రతపతింబన్నింపడాకర్ణికాంతరథమ్మిలములన్ జక్కనొత్తడు..”
ఇదంతా కలిపి చదవాలా? చదవక్కర్లేదా? చదివినపుడు కలిపి, ఒకే గుక్కలో చదవక్కరలేక పోతే “డా” లన్నిటినీ కలపడవెందుకు? ఇలా ఎందుకు రాయకూడదు?
“….శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు,
ఏ పరివారంబున్ జీరడు, అభ్రతపతింబన్నింపడు,
ఆకర్ణికాంతరథమ్మిలము జక్కనొత్తడు..” అని ఎందుకు రాయకూడదు.
రాయడానికి చందస్సు కావాలి, చదవడానికి ఎందుకు అక్కర్లేదు?
కామేశ్వర రావు గారూ,
దయచేసి ఛందస్సు ప్రకారం పద్యమెందుకు రాయలి? చదివినపుడు ఎందుకు విడగొట్టాలి? దీని మీదే (ప్లీజ్) రాయండి. మిగిలినవాటిగురించి రాసి మీ సమయం వ్రుధా చేసుకోకండి.
“ధారణ” ముఖ్యావసరం వేదకాలంనాటినుంచీ, తాళపత్ర గ్రంథాలొచ్చిన తరవాత కూడాతప్పలేదు. “గుటెన్ బెర్గ్” తరవాత ధారణ అక్కరలేదు. “కుందుర్తి ఆంజనేయులు” గారి “నగరంలో వాన” కవిత ధారణకి లొంగదు అయినా ఇబ్బంది లేదు. అందులోని “కోటబుల్ కోట్స్” గుర్తుంటాయి. పూర్తి పాఠం కావాలంటే పుస్తకం వుంటుంది. ఎక్కాలు గుర్తుంచుకోవలసిన తరం “రెండోట్ల రెండు. రెండ్రెళ్ళ్నాలుగు..” అని “రిథిమిక్” గా కంఠతా పట్టేరు. “కేలిక్యులేటర్” ఆ తరవాత “కంపూటర్” వచ్చేక కంఠతా అవసరం తీరిపోయిందికదా? “ఇంటర్నెట్” వచ్చాక ఇంకా సులువయిపోయిందికదా?
పండితులకి ఛందస్సు “కంపల్సరీ” గా వస్తుంది. రాకపోతే పండితుడు అవుతాడా?
ఛందస్సు వచ్చిన వాళ్ళందరూ కవులుకారు.
సాయంకాలం అయిదు గంటల వేళ ఒక చక్కని అమ్మాయిని చూసి నాలాటివాడు “తూర్ణం మానీయతాం చూర్ణం పూర్ణచంద్రనిభాననే” అన్నాట్ట. మీ లాటి కవిగారు “పర్ణాని, స్వర్ణ పర్ణాని, కర్ణాంతాయతలోచనే” అన్నారుట. ఆ చక్కనమ్మ, పరిచారికకి నన్ను చూపించి “ఈ పండితుడికి సున్నప్పిడత ఇవ్వవే” అంది. మిమ్మల్ని “మేషారూ, ఇలారండి, ఇక్కడ కూచోండి, స్వర్ణ పర్ణానికి చాలా టైమ్ పడుతుందికదా? ఎంత చక్కని కవిత్వం మీది” అందిట. ఎంత తెలివయిన అమ్మాయి కదండీ? అలా ఎందుకందో మీకు తెలుసు. మాలాటివాళ్ళకి మీరు వివరించి చెప్పాలి.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి Ravi అభిప్రాయం:
08/07/2008 5:54 am
ఆదివారం ఆంధ్రజ్యోతిలో అదృష్ట రత్న జ్యోతి శీర్షికలో ప్రిడిక్షన్సు చెప్తూ ఉంటారు. మీరు చెప్పిన verifiability/falsifiability కి సరిపోయే విధంగా ఈవారం (3/ఆగస్టు/2008) చాలా ఖచ్చితమైన ఫలితాలు చెప్పారు. ఆఖరికి జాతకుడు ఎప్పుడు మరణిస్తాడో కూడా చెప్పేశారు. అయినాసరే మీరు జ్యోతిషం తప్పంటారా? పైగా ఇది కేవలం జాతకం చూసి చెప్పినది మాత్రమే. జ్యోతిష్కుడికి సమాచారం లీకయ్యే అవకాశం లేదు కదా.
ఆంధ్రజ్యోతిలో చెప్పిన ఫలితాలు –
1. 2006 అక్టోబర్ నుంచి 2008 మే మధ్య ఉద్యోగంలో మార్పు.
2. 2009 జూన్ 21 నుంచి ఏ క్షణంలోనైనా వివాహం. ఛేంజాఫ్ ప్లేస్. అయితే ప్రస్తుతం సంబంధం కుదిరినా కూడా 2009 జూన్ 21 వరకూ వివాహం చేసుకోకూడదు. ఒక ప్రాపర్టీ డిజ్పోజాఫ్ చెయ్యడం.
3. 2001 నవంబర్ 2 నుండి 2014 ఆగస్టు మధ్య కెరీర్ లో ఉన్నత స్థితి. కానీ చిన్నపాటి అవమానం. ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతుంది. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. స్పెక్యులేషన్, షేర్స్ జోలికి వెళ్ళి నష్టపోకుండా జాగ్రత్త పడాలి. అలాగే సంతానం గురించిన ఎంతో కొంత ఆందోళన.
4. 2014 ఆగస్టు నుండి 2017 ఫిబ్రవరి మధ్య మళ్ళీ చేంజాఫ్ జాబ్. ఎక్కువ తిరగాల్సి వస్తుంది. టూ మెనీ షార్ట్ జర్నీస్. పీరియడ్ లో అనే కాదు, ఆఅన్ జనరల్ ధరించాల్సిన రత్నాలు పచ్చ + వజ్రం. అదృష్ట దిక్కు ప్రత్యేకంగా ఇదీ అని ఏమీ లేదు.
5. 2017 ఫిబ్రవరి నుండి 2018 ఫిబ్రవరి మధ్య ఒక దురదృష్టకర సంఘటన చోటు చేసుకోకుండా రాహు కేతువులకి గట్టి రెమెడీస్ పాటించాలి. అలాగే ఎటువంటి దూరప్రయాణం చేయకపోవడమే అసలైన రెమెడీ. అయితే ఇదే పీరియడ్ లో ఊహించని ప్రమోషన్ రావడం విశేషం.
6. 2018 ఫిబ్రవరి నుండి 2021 ఫిబ్రవరి మధ్య కెరీర్ లో ఉన్నత స్థితి వాహనయోగం. అన్నీ కలిసి రావడం. అంతా అదృష్టం.
7. 2023 జూలై 8 నుండీ 2024 జూలై మధ్య వారసత్వంగా వచ్చే ధనం. గృహయోగం. అయితే స్థిరాస్తులు వీలైనంతవరకు మీ పేరు మీద లేకుండా చూసుకుంటే మంచిది. నిలకడ కనిపించడం లేదు.
8. గురు దశ అంతా కూడా సబార్టినేషన్ ఉంటుంది. రిటైర్మెంట్ కనిపించడం లేదు. కావాలని పనిచేయడం కావచ్చు. కొందరికి పనే విశ్రాంతి.
9. 2011 నవంబర్ నుండి 2014 ఆగస్టు మధ్య చిన్నపాటి గండం రాకుండా రెమెడీస్ పాటించాలి. అయితే 2050 జూన్ 22 నుండి ఆగస్టు 7 మధ్య అంటే మీ 76 వ ఏట ఒక ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున పగటిపూట సంతానం సమక్షంలో మీ పరమపద ప్రాప్తి.
మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి Kameswara Rao అభిప్రాయం:
08/06/2008 3:32 am
పద్యాలని వాటి ఛందస్సు ప్రకారం “రిసైట్” చేస్తారా?!
రచయితలకు సూచనలు గురించి Dr.Jonnalagadda Markandeyulu అభిప్రాయం:
08/05/2008 11:33 pm
మీ పత్రిక బాగుంది. ఈమాట మనమాటగా ఆంధ్రులందరిదీ అనిపించేలా పత్రికను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్న సంపాదకవర్గానికి ఒక రచయితగా నా అభినందనలు.
డా. జొన్నలగడ్డ మార్కండేయులు
పేరవరం-533235-తూ.గో.జిల్లా ఆంథ్ర ప్రదేశ్
నూలు చీర గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
08/05/2008 11:55 am
బాబ్జీలు గారూ,
సరదాగా రాసింది “దిల్” మీదకి తీసుకున్నట్లున్నారు.
తప్పులు దొర్లితే చూపించడమూ, అచ్చయిన దాన్ని “ఇలా రాయాలి సుమా” అని చెప్పడమూ రెండూ ఒకటి కాదని నా అభిప్రాయం. రెంటికీ తేడా ఉంది.
మీ స్పందన కంటే,
“రోజుకి మూడు కవితలూ ఆరు వ్యాసాలుగా, “చింతబొట్టలు దులిపినట్టు” దులిపేయాలి.” అన్న సలహా బాగా నచ్చింది. ఇది నాకు మాత్రమేనా? లేక “చెయ్యి” చేసుకునే అందరికీనా?
మీకు పలవరింతలెలాగో, నాకు ఈ పేలాపన్లలాగ!
బతుకు మాట దేవుడెరుగు, “అబద్ధం నిజంలా మాట్లాడ్డం మాత్రం నాకు తెలీదు.”
నమ్మినా, నమ్మక పోయినా మీ వాక్యం మాత్రం నాకు నచ్చింది.
ఇహ ఈ చర్చకి దారీ, తెన్నూ లేనట్లు అనిపిస్తోంది.
శలవ్,
సాయి బ్రహ్మానందం