అయ్యా బాబ్జీలు గారూ! మీరెవరండీ బాబు!!
మాకేసి ముత్తేలమ్మని మధురవాణిని నాకు చెప్తున్నారు. vaaLLu maa APPAle kaaraa?”chatri baabu” ikaTaalu meevannee!!
కృష్ణ దేశికాచారి గారి వ్యాసం మీద మీ అభిప్రాయం ఇప్పుడే చదివాను. చాన్నాళ్ళకి మంచి సరదా కలిగింది నాలో. కానీ మీతో పోటీపడి respond కాగల సత్తువ నాకు లేదు గనుక విరమించుకుంటున్నాను. కవులకి కవిత్వంతో పాటు వుండవలసిన మిగితా నేర్పుల తాలూకు లిస్టు ఇంకా నాకు నవ్వుతెప్పిస్తూనే వుంది.
ముత్తాలమ్మో, మధురవాణో, ఎవరైతేనేం గానీ, వున్నవిషయమే అన్నది కదా? సారం అన్నది అనిర్వచనీయం సామీ. వుప్పు ఎక్కువో, తక్కువో తిని చెప్పాల్సిందే, విని కాదు!
మీ “ఇజీనగరంలో” లేదా “ఇస్సపట్నంలో” మరోపాలి బొంకులదిబ్బ కాడినించి అయ్యకోనేరు దాటి వెతకండి. పైడి తల్లి, నూకాలమ్మ వరం ఇస్తే సారం మీకు తెలుస్తుంది. అనిర్వవచనీయం గనక చర్చతో పనిలేదు. ఎవరెవరి రూప సారాల సంతోషాలు వారివే.
anyway, చాలా enjoy చేస్తున్నాను మీ అభిప్రాయాలని. “ఒగ్గీకండి. రాస్తూండండి. బెగి తొంగోవాలి. శానా పొద్దోయింది”
అయ్యా బాబ్జీలుగారు కవిత్వం, సాహిత్యం గురించి కాదు కాని, నాకు తెలిసిన విషయంలో మాత్రం మీరు పొరబడ్డారేమో అని భయం!
పిల్లల “హోం వర్క్” (సొంతంగా) చేయడం సులువంటే ఒప్పుకోవచ్చేమో కాని, “చేయించడం సులువు” అంటే నిజమేనా అనిపిస్తుంది. చేయించడానికి కనీసం పిల్లలను ఒక్కచోట కూచోబెట్టాలి. కాళ్ళు కట్టేసినా, పిల్లకాయల మనసులను కట్టేయడం, కాదు ఆకట్టుకోవడం, ఒక చాలెంజ్. ఇంతా అయింతర్వాత మన ధిమాక్ లోకెక్కింది వాళ్ళ ధిమాక్ లోకి ఎక్కించడాన్ని ఏమన్నా అనొచ్చు కాని సులువు అని మాత్రం అనగలమా అని డౌటు. ఈ తిప్పలంతా చూసే గురువుగారిని “గురు బ్రహ్మ” అనికూడా అనేసారేమో అని అనుమానం కూడా. దీనికంటే ఒకచోట కూర్చోని, అక్షరాల ఒక కావ్యమో, విమర్శో, గేయమో, వచనమో, కథనో, నవలనో, లేకపోతే ఇప్పటి దాక పుట్టని ఒక అపూర్వ సాహితీప్రక్రియనో ఈ తిప్పలగురించే వ్రాసేయడం సులువేమో అని కూడా చెడ్డ అనుమానం. కాదంటారా?!
“నాకు పద్యం రాయడం రాదు, అందుచేత రాయలేదు” అని. అది మా కాలోజీ సూటితనం. మరి నేను చెప్పేది కూడా అంతే.
జయప్రభగారూ,
మీరు చెప్పింది కాళోజీకి, ఈనాటి వాళ్ళకీ వర్తిస్తుందేమో కానీ, మొదట్లో కవిత్వాన్ని పద్యానికి దూరంగా నడిపించిన అతిరథ మహారథులకి ( గురజాడ, శ్రీశ్రీ, నారాయణబాబు, తిలక్, ఆరుద్ర) వర్తించదనుకుంటాను. (మిగతావాళ్ళు మహారథులు కారని నా ఉద్దేశం కాదు, వాళ్ళకి పద్యం రాయడం వచ్చో రాదో నాకు తెలీదు!)
ఈ వ్యాసం పేరు ఏమీ బాగోలేదు. పైపెచ్చు చాలా అభ్యంతరకరంగా వుంది. ఒకరి ఇంటి పేరునీ, ఇంకొకరి అసలు పేరునీ కలిపేసి, ఒక మనిషి పేరు అని అర్థం వచ్చేలా పేరు పెట్టి, ఆ అసలు ఇద్దరు వ్యక్తుల గురించీ రాయడం ఏమీ బాగోలేదు. ఏ కారణం చేత గానీ, నా ఇంటి పేరు మార్చేస్తే నాకు ఒళ్ళు మండదూ? అలాగే బాల సుబ్రహ్మణ్యం గారి ఇంటి పేరు మార్చేసి నట్టు పేరు పెడితే, ఆయనకి మాత్రం ఒళ్ళు మండదూ? “ఘంటసాల, బాల సుబ్రహ్మణ్యం” అని కామాతో వుంటే, సరిగా వుండేది. ఇలా కామా లేకుండా పేరు పెట్టడం ఆ ఇద్దరు గాయకుల్నీ అవమానం చెయ్యడమే.
వ్యాసంలో వాళ్ళ మీద ఎంత గౌరవం చూపిస్తే ఏమిటీ, పేరులో ఆ గౌరవం లేక పోయాక?
మిగిలిన వారి సంగతి ఏమో గానీ, ఇలా చెయ్యడం ఘంటసాల అభిమాని అయిన నాకు చాలా అభ్యంతరకరంగా వుంది.
పాఠకుడు
ఛందోధర్మము
గురించి satya rama prasad kalluri అభిప్రాయం:
తెలుగు సామెతల్లో సాధారణంగా యతో, ప్రాసో లేకుండా ఉండి ఉంటే వాటిలో సగానికి సగం కాలగర్భంలో కలిసిపోయి ఉండేవి కావా?
భావం పుణ్యాంగన అయితే దానికి సోకును (బాహ్యమే కానక్కరలేదు) ఛందస్సు అనుకోవచ్చును అని నేననుకొంటున్నాను. (దీనినే ఎవరో ఒక పూర్వికుడు పుణ్యాంగనకు పణ్యాంగనకువలె అందాన్ని కూర్చేది ఛందస్సు అన్నాడు.) ‘యతిప్రాసలు విసర్జింపబడినవి’ అని బోరవిరుచుకోవటం సులభమేగాని, లయ కూడా లేని కవితలు కాలపురుషుడి కట్టెదుట నిలవటం కష్టమే.
ఎటొచ్చీ ఛందస్సుకోసం కవిత్వం అనటంకూడా తెలివితక్కువే.
ఆంధ్రపత్రికలో ఒకప్పుడు ప్రాస ఎంత సాంక్రామికమో (contagious) చెప్పటానికి ఒక ఉదాహరణను ఇచ్చారు. ఎవరో ఒక సింగుగారు క్రొత్తగా తెలుగుతో కుస్తీపడుతూ ‘అనుమానానికైనా ఆస్కారంలేకుండా తిరస్కరించి పంపారు’ అంటే కోపంతో వాళ్ళ బాసు ‘మిస్టర్ సింగ్ ! రైమింగ్ కోసం మీనింగ్ పాడుచేయద్దని మీకెన్నిసార్లు వార్నింగ్ ఇవ్వాలి?’ అన్నాడట. మరి దీనిని కవిత్వం అని ఎవరూ అనరు కదా!
చేతనైన వైణికుడి చేతిలో ఎలాగైతే స్వరాలు వాటంతట అవే సరిగ్గా వస్తాయో, అలాగే కవిత్వంచెప్పేవాడి ముఖతః రావలసిన లయ, సందర్భోచితఛందస్సు వగైరా అవే వచ్చిపడతాయి. వెతుక్కుంటే వచ్చేవికావు అవి.
(ఈ అభిప్రాయం కామేశ్వర రావు గారినుద్దేసించి రాసినది కాదు. ఆయన తిరుమల రామచంద్ర గారు రాసిన “తెలుగు వ్యాసం” వ్యాసం ప్రకారం “వ్యాసుడు”. కామేశ్వర రావు గారి గురించి కానీ, వారు వ్రాసిన పై వ్యాసం గురించి కానీ అనుకొని ఎవరయినా, ఈ క్రిందు వ్రాసిన అభిప్రాయానికి “సెట్ పట్” లాడిస్తూ “అభిప్రాయం” వ్రాస్తే అట్టి వారు “ఇంటర్నేషనల్ పీనల్ కోడు టూ థౌజెండైటు” ప్రకారం శిక్షార్హులగుదురు)
ఇహపోతే, ఏవిటొ అంతా “అద్దువైతం” గా వుంది.
“ట్రాఫిక్ డిపార్ట్ మెంట్” కీ కవిత్వం గురించి రాసీవాళ్ళకీ పెద్ద తేడా లేదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.
కవిత్వంగురించి రాసీ వాళ్ళు, అందులోనూ ఇది కవిత్వం, అది కవిత్వం కాదు అని రాసీ వాళ్ళు “పెథాలజిస్టులు”. ఆ మాటకొస్తే “విమర్శకులు” కూడా.
వొక రకంగా కవిత్వం రాసేవాళ్ళకూ, వచనం రాసేవాళ్ళకూ ఇది ఆనందదాయకవైన వార్త. ( ఈముక్కే మా స్నేహితుడితో అంటే, రాసీ వాళ్ళు విమర్శించీవాళ్ళనెప్పుడు పట్టించుకున్నార్రా అనీసేడు, ధన్యుడు వాడు.) బహుశా “ఉక్తి వైచిత్రి” వున్న వాళ్ళందరికీ “ఈ చీకిరెట్టు” ముందే తెలుసేమో? అందుకే క్రుష్ణశాస్త్రి గారు విమర్శకులకి మందు ఇంకా రాయడవే అనీసేరు.
వుదాహరణకి, “వైదేహీ శశిధర్” గారి కవిత్వంలో, “క్లుప్తత” లేదు, “భావ శబలత” లేదు వగైరాలతో పాటూ, “కుకవి నింద” లేదు, “పుష్పలావికల” వర్ణన లేదు అని మహానుభావుడు “చేరా” గారన్నా ఆ కవిత్వాన్ని మనం చదువుతాం. (“చేరా” గార్ని “బరువు” కోసం వాడుకున్నాను. తప్పు నాది)
“అద్దువైతం” అంతా తెలిసిపోయిందనుకుంటున్నాను.
“చాత్రిబాబు” వచనంలో కవిత్వాన్ని, బతుకునీ, చూసి మురిసిపోయే మాకు, వొక వ్యాసంలొ (పేరు గుర్తులేదు), వొకాయన “చాత్రిబాబు”కి “మెంటల్ మెనోపాజ్” వచ్చేసింది అని రాసేరు. అది చదివి”ఏందార్రా బగమంతుడా” అని “బెంగటిల్లిపోయేం” జమిలిగా మేవందరం.
అయినా “చాత్రిబాబు” ఈయేల్టికీ బతికేవున్నాడు. హమ్మయ్య అనుకున్నాం మళ్ళీ జమిలిగా.
“యద్యదాచరిత శ్రేష్ఠహ తత్త దేవేతరో జనహ” అన్న “మంచిముక్కకి” ఇలా అర్ధం చెప్పుకోవల్సొస్తుంది: “ఆవిడ పట్టిన నోము, జగవంతా పట్టింది. జగం పట్టిన నోము మనం పడుతున్నాం”. ఎవరూ మిగల్రూ. అయినా నోవుపట్టాల్సిందే.
“అసందర్భ ప్రేలాపన” అని మా “సాయి” లాటి వాళ్ళు అనొచ్చు.
“సాయి” గారూ, “ఎమ్ ఒ ఎమ్ ” లో ఇలా రాస్తే మనకెవరికీ అభ్యంతరం వుండదనే అనుకుంటున్నాను.
కవిత్వం/వచనం రాయడం సులువు. దాన్ని చదువుకుని “ఆహా, వోహో” అనుకోవడం ఇంకా సులువు. “చెస్, చెండాలం” అనుకోవడం మరీ సులువు.
ఎవరో రాసిన కవిత్వం/వచనం గురించి, అది ఎందుకు బాగుందో/బాగోలేదో రాయడం చాలా కష్టం.”ఈ చాలా కష్టాన్ని” చదివి, నాలాటి పాఠకుడు అయోమయంలో పడడం ఇంకా సులువు. (మా “సాయి” లాటి వారు కాదు).
దీని బదులు, పిల్లల పుస్తకాలకి అట్టలేసుకోడం, వాళ్ళ “హోమ్ వర్క్” చేయించడం సులువు.
ఏవిటొ అంతా “అద్దువైతం” గా వుంది.
ఛందస్సు ప్రకారం రాయాలి, సమాసాల ప్రకారం చదవాలి, వొకే గుక్కలో చదవాలి, వొకేగుక్కక్కర్లేదు. వుత్పలమాలలోనూ, చంపకమాలలోనూ, మత్తేభంలోనూ, అన్నిట్లోనూ అన్ని రసాలూ ఆవిష్కరించొచ్చు.
త్యాగరాజు రాసినట్టు కృతులు రాసి, వాటిని త్యాగరాజు పేరు మీదే చలామణీ చేస్తే, దాన్ని గ్రంధ చౌర్యం అనరు. దాన్ని ప్రక్షిప్తం అంటారు. రామాయణం తిరగరాసి నప్పుడు అనేక మంది కవులు తమ సొంత పైత్యాన్ని కూడా కలిపేసి రాసేవారు. అయితే ఈ ప్రక్షిప్తాలు మూల కధకి గానీ, మూల కవికి గానీ హాని చెయ్యవు. అపఖ్యాతి తీసుకురావు. ప్రక్షిప్తాలు సమాజ పరిణామ క్రమంలో భాగంగా వుంటాయి. దీనికీ, గ్రంధ చౌర్యానికీ పోలికే లేదు.
పాఠకుడు
ఛందోధర్మము
గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:
08/20/2008
6:28 am
కవిత్వం కోసం ఛందస్సా, ఛందస్సు కోసం కవిత్వమా? కవిత్వం కోసం ఛందస్సు వదులుకోడం తప్పా? ఛందస్సు కోసం కవిత్వాన్ని బలి చేయడం ఒప్పా?
ఛందస్సువలన కవిత్వానికి ఒరిగేదేమిటి?
ఈ ప్రశ్నలకి సమాధానాలు ఆంగ్లకవి P.B. Shelley రాసిన “To a Sky Lark”
…
Thou art unseen, but yet I hear thy shrill delight
…
Like a high-born maiden
In a palace tower,
Soothing her love-laden
Soul in secret hour
With music sweet as love, which overflows her bower…
లోని భావాన్ని రాయప్రోలు సుబ్బారావుగారు తన చంపకమాల పద్యాలలో ఎంత మధురంగా పొందుపరిచారో ఆలోచించి చూస్తే దొరకవచ్చు:
“ప్రమద రసోదయాలస తరంగములన్ దవిలించి, పారవ
శ్యమున నుయాలలూపెదవయారె! చరాచర చేతన ప్రపం
చము బహిరంతర భ్రమణ సాధ్వసమేది ప్రశాంతమయ్యె, నే
త్రములకు గానరావు, మధురంబుగ పాడెదవెందొ కోయిలా!
నేను నమ్మిన సత్యం: నిజమైన కవిత్వం చెప్పగలిగన వారికెవరికీ ఛందస్సు ఆటంకం కాదు. భాష మీద పట్టులేక, వచనకవితా ప్రక్రియని అడ్డంపెట్టుకుని ఎదో గిలికి పారేసి ఛందోధర్మాన్ని వదిలిపెట్టినందువల్లె ఇంత గొప్ప కవిత్వం వ్రాయగలిగామని జబ్బలు చరుచుకునే (కు)కవులు, వారి భజంత్రీలు విస్తృతపఠనం అలవాటు చేసుకుంటే పైన మచ్చుకు చెప్పిన ఉదాహరణలులాటివి కోకొల్లలు కనపడతాయి తెలుగు సాహిత్యంలో.
ఆధునిక తెలుగుకవిత్వానికి ఆద్యుడుగా గుర్తింపు పొందిన రాయప్రోలువారు అద్భుతమైన కవిత్వాన్ని అలవోకగా చిలికించగల గొప్ప కవి. యతిప్రాసలు పద్యానికి అతికించినట్టు ఉండకూడదనేవారిలో ఆయన ఒకరు అని ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తంగారు నాతో ఎప్పుడూ అనేవారు. కవిత్వభాష గురించి అలాంటి మహనీయుడు రాయప్రోలువారి మాటల్లోనే:
పద్యం అంటే సుముఖత ఎందుకు? గురించి jayaprabha అభిప్రాయం:
08/20/2008 10:07 am
అయ్యా బాబ్జీలు గారూ! మీరెవరండీ బాబు!!
మాకేసి ముత్తేలమ్మని మధురవాణిని నాకు చెప్తున్నారు. vaaLLu maa APPAle kaaraa?”chatri baabu” ikaTaalu meevannee!!
కృష్ణ దేశికాచారి గారి వ్యాసం మీద మీ అభిప్రాయం ఇప్పుడే చదివాను. చాన్నాళ్ళకి మంచి సరదా కలిగింది నాలో. కానీ మీతో పోటీపడి respond కాగల సత్తువ నాకు లేదు గనుక విరమించుకుంటున్నాను. కవులకి కవిత్వంతో పాటు వుండవలసిన మిగితా నేర్పుల తాలూకు లిస్టు ఇంకా నాకు నవ్వుతెప్పిస్తూనే వుంది.
ముత్తాలమ్మో, మధురవాణో, ఎవరైతేనేం గానీ, వున్నవిషయమే అన్నది కదా? సారం అన్నది అనిర్వచనీయం సామీ. వుప్పు ఎక్కువో, తక్కువో తిని చెప్పాల్సిందే, విని కాదు!
మీ “ఇజీనగరంలో” లేదా “ఇస్సపట్నంలో” మరోపాలి బొంకులదిబ్బ కాడినించి అయ్యకోనేరు దాటి వెతకండి. పైడి తల్లి, నూకాలమ్మ వరం ఇస్తే సారం మీకు తెలుస్తుంది. అనిర్వవచనీయం గనక చర్చతో పనిలేదు. ఎవరెవరి రూప సారాల సంతోషాలు వారివే.
anyway, చాలా enjoy చేస్తున్నాను మీ అభిప్రాయాలని. “ఒగ్గీకండి. రాస్తూండండి. బెగి తొంగోవాలి. శానా పొద్దోయింది”
సెలవ్..
జయప్రభ.
a_jayaprabha@yahoo.co.in
కవిత్వ భాష తీరుతెన్నులు గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
08/20/2008 10:05 am
అయ్యా బాబ్జీలుగారు కవిత్వం, సాహిత్యం గురించి కాదు కాని, నాకు తెలిసిన విషయంలో మాత్రం మీరు పొరబడ్డారేమో అని భయం!
పిల్లల “హోం వర్క్” (సొంతంగా) చేయడం సులువంటే ఒప్పుకోవచ్చేమో కాని, “చేయించడం సులువు” అంటే నిజమేనా అనిపిస్తుంది. చేయించడానికి కనీసం పిల్లలను ఒక్కచోట కూచోబెట్టాలి. కాళ్ళు కట్టేసినా, పిల్లకాయల మనసులను కట్టేయడం, కాదు ఆకట్టుకోవడం, ఒక చాలెంజ్. ఇంతా అయింతర్వాత మన ధిమాక్ లోకెక్కింది వాళ్ళ ధిమాక్ లోకి ఎక్కించడాన్ని ఏమన్నా అనొచ్చు కాని సులువు అని మాత్రం అనగలమా అని డౌటు. ఈ తిప్పలంతా చూసే గురువుగారిని “గురు బ్రహ్మ” అనికూడా అనేసారేమో అని అనుమానం కూడా. దీనికంటే ఒకచోట కూర్చోని, అక్షరాల ఒక కావ్యమో, విమర్శో, గేయమో, వచనమో, కథనో, నవలనో, లేకపోతే ఇప్పటి దాక పుట్టని ఒక అపూర్వ సాహితీప్రక్రియనో ఈ తిప్పలగురించే వ్రాసేయడం సులువేమో అని కూడా చెడ్డ అనుమానం. కాదంటారా?!
విధేయుడు
-Srinivas
పద్యం అంటే సుముఖత ఎందుకు? గురించి Kameswara Rao అభిప్రాయం:
08/20/2008 9:46 am
జయప్రభగారూ,
మీరు చెప్పింది కాళోజీకి, ఈనాటి వాళ్ళకీ వర్తిస్తుందేమో కానీ, మొదట్లో కవిత్వాన్ని పద్యానికి దూరంగా నడిపించిన అతిరథ మహారథులకి ( గురజాడ, శ్రీశ్రీ, నారాయణబాబు, తిలక్, ఆరుద్ర) వర్తించదనుకుంటాను. (మిగతావాళ్ళు మహారథులు కారని నా ఉద్దేశం కాదు, వాళ్ళకి పద్యం రాయడం వచ్చో రాదో నాకు తెలీదు!)
ఛందోధర్మము గురించి baabjeelu అభిప్రాయం:
08/20/2008 9:27 am
పావలా పట్కా, పాతికరూపాయిల జట్కా.
పట్కా ఛందస్సు, సంధులూ, సమాసాలూ వగైరాలు.
జట్కా కవిత్వం.
మరి గుర్రం?
అసలయిన దానినెలా వొగ్గెస్తావండీ.
“కవితా వస్తువు”.
పద్య కవిత్వవయినా, పొలై పొలై / మిల్లు ఖద్దరు కవిత్వ వయినా “ఇత్యాని పద్య/కవిత లక్షణాని” (పైటలు/చున్నీలు తగలెట్టండి అనే కవిత్వవయినా)
పద్యం అంటే సుముఖత ఎందుకు? గురించి baabjeelu అభిప్రాయం:
08/20/2008 9:16 am
మా ముత్తేలు తెగ్గొట్టీసినట్టు, తెగ్గొట్టీసేరు జయప్రభగారూ.
(ముత్తేలంటే చదువూ సంధ్యా లేని మధురవాణని తెలుసున్న వాళ్ళు చెప్పేరు)
సారం వుంటే “ఆళ్ళిద్దరూ” పొద్దుగూకులూ నిలబడరా? నిలబడతారు.
సారం ఏదన్న ప్రశ్నకే ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు.
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి పాఠకుడు అభిప్రాయం:
08/20/2008 7:28 am
ఈ వ్యాసం పేరు ఏమీ బాగోలేదు. పైపెచ్చు చాలా అభ్యంతరకరంగా వుంది. ఒకరి ఇంటి పేరునీ, ఇంకొకరి అసలు పేరునీ కలిపేసి, ఒక మనిషి పేరు అని అర్థం వచ్చేలా పేరు పెట్టి, ఆ అసలు ఇద్దరు వ్యక్తుల గురించీ రాయడం ఏమీ బాగోలేదు. ఏ కారణం చేత గానీ, నా ఇంటి పేరు మార్చేస్తే నాకు ఒళ్ళు మండదూ? అలాగే బాల సుబ్రహ్మణ్యం గారి ఇంటి పేరు మార్చేసి నట్టు పేరు పెడితే, ఆయనకి మాత్రం ఒళ్ళు మండదూ? “ఘంటసాల, బాల సుబ్రహ్మణ్యం” అని కామాతో వుంటే, సరిగా వుండేది. ఇలా కామా లేకుండా పేరు పెట్టడం ఆ ఇద్దరు గాయకుల్నీ అవమానం చెయ్యడమే.
వ్యాసంలో వాళ్ళ మీద ఎంత గౌరవం చూపిస్తే ఏమిటీ, పేరులో ఆ గౌరవం లేక పోయాక?
మిగిలిన వారి సంగతి ఏమో గానీ, ఇలా చెయ్యడం ఘంటసాల అభిమాని అయిన నాకు చాలా అభ్యంతరకరంగా వుంది.
పాఠకుడు
ఛందోధర్మము గురించి satya rama prasad kalluri అభిప్రాయం:
08/20/2008 7:27 am
అన్నట్లు శ్రీశ్రీ ‘ సిప్రాలి ‘ ఏమిటండీ? ‘సిరిసిరిమువ్వ, ప్రాసక్రీడ, లిమరిక్కుల సమాహారమే కదా! వీటిలో ఛందస్సు లేనివేవి?
తెలుగు సామెతల్లో సాధారణంగా యతో, ప్రాసో లేకుండా ఉండి ఉంటే వాటిలో సగానికి సగం కాలగర్భంలో కలిసిపోయి ఉండేవి కావా?
భావం పుణ్యాంగన అయితే దానికి సోకును (బాహ్యమే కానక్కరలేదు) ఛందస్సు అనుకోవచ్చును అని నేననుకొంటున్నాను. (దీనినే ఎవరో ఒక పూర్వికుడు పుణ్యాంగనకు పణ్యాంగనకువలె అందాన్ని కూర్చేది ఛందస్సు అన్నాడు.) ‘యతిప్రాసలు విసర్జింపబడినవి’ అని బోరవిరుచుకోవటం సులభమేగాని, లయ కూడా లేని కవితలు కాలపురుషుడి కట్టెదుట నిలవటం కష్టమే.
ఎటొచ్చీ ఛందస్సుకోసం కవిత్వం అనటంకూడా తెలివితక్కువే.
ఆంధ్రపత్రికలో ఒకప్పుడు ప్రాస ఎంత సాంక్రామికమో (contagious) చెప్పటానికి ఒక ఉదాహరణను ఇచ్చారు. ఎవరో ఒక సింగుగారు క్రొత్తగా తెలుగుతో కుస్తీపడుతూ ‘అనుమానానికైనా ఆస్కారంలేకుండా తిరస్కరించి పంపారు’ అంటే కోపంతో వాళ్ళ బాసు ‘మిస్టర్ సింగ్ ! రైమింగ్ కోసం మీనింగ్ పాడుచేయద్దని మీకెన్నిసార్లు వార్నింగ్ ఇవ్వాలి?’ అన్నాడట. మరి దీనిని కవిత్వం అని ఎవరూ అనరు కదా!
చేతనైన వైణికుడి చేతిలో ఎలాగైతే స్వరాలు వాటంతట అవే సరిగ్గా వస్తాయో, అలాగే కవిత్వంచెప్పేవాడి ముఖతః రావలసిన లయ, సందర్భోచితఛందస్సు వగైరా అవే వచ్చిపడతాయి. వెతుక్కుంటే వచ్చేవికావు అవి.
గణితంప్రకారం కవిత్వంలో భావం, ఛందస్సు పరస్పరపూరకాలు (complementary) అనుకోవటం సబబేమోననిపిస్తోంది నాకైతే.
ఏది ఏమైనా ఆలోచింపజేసిన, మంచి వ్యాసాన్ని అందించిన దేశికాచార్యులవారిని అభినందిస్తున్నాను.
కల్లూరి సత్యరామ ప్రసాద్
kalluriprasad@hotmail.com
కవిత్వ భాష తీరుతెన్నులు గురించి baabjeelu అభిప్రాయం:
08/20/2008 7:23 am
(ఈ అభిప్రాయం కామేశ్వర రావు గారినుద్దేసించి రాసినది కాదు. ఆయన తిరుమల రామచంద్ర గారు రాసిన “తెలుగు వ్యాసం” వ్యాసం ప్రకారం “వ్యాసుడు”. కామేశ్వర రావు గారి గురించి కానీ, వారు వ్రాసిన పై వ్యాసం గురించి కానీ అనుకొని ఎవరయినా, ఈ క్రిందు వ్రాసిన అభిప్రాయానికి “సెట్ పట్” లాడిస్తూ “అభిప్రాయం” వ్రాస్తే అట్టి వారు “ఇంటర్నేషనల్ పీనల్ కోడు టూ థౌజెండైటు” ప్రకారం శిక్షార్హులగుదురు)
ఇహపోతే, ఏవిటొ అంతా “అద్దువైతం” గా వుంది.
“ట్రాఫిక్ డిపార్ట్ మెంట్” కీ కవిత్వం గురించి రాసీవాళ్ళకీ పెద్ద తేడా లేదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.
కవిత్వంగురించి రాసీ వాళ్ళు, అందులోనూ ఇది కవిత్వం, అది కవిత్వం కాదు అని రాసీ వాళ్ళు “పెథాలజిస్టులు”. ఆ మాటకొస్తే “విమర్శకులు” కూడా.
వొక రకంగా కవిత్వం రాసేవాళ్ళకూ, వచనం రాసేవాళ్ళకూ ఇది ఆనందదాయకవైన వార్త. ( ఈముక్కే మా స్నేహితుడితో అంటే, రాసీ వాళ్ళు విమర్శించీవాళ్ళనెప్పుడు పట్టించుకున్నార్రా అనీసేడు, ధన్యుడు వాడు.) బహుశా “ఉక్తి వైచిత్రి” వున్న వాళ్ళందరికీ “ఈ చీకిరెట్టు” ముందే తెలుసేమో? అందుకే క్రుష్ణశాస్త్రి గారు విమర్శకులకి మందు ఇంకా రాయడవే అనీసేరు.
వుదాహరణకి, “వైదేహీ శశిధర్” గారి కవిత్వంలో, “క్లుప్తత” లేదు, “భావ శబలత” లేదు వగైరాలతో పాటూ, “కుకవి నింద” లేదు, “పుష్పలావికల” వర్ణన లేదు అని మహానుభావుడు “చేరా” గారన్నా ఆ కవిత్వాన్ని మనం చదువుతాం. (“చేరా” గార్ని “బరువు” కోసం వాడుకున్నాను. తప్పు నాది)
“అద్దువైతం” అంతా తెలిసిపోయిందనుకుంటున్నాను.
“చాత్రిబాబు” వచనంలో కవిత్వాన్ని, బతుకునీ, చూసి మురిసిపోయే మాకు, వొక వ్యాసంలొ (పేరు గుర్తులేదు), వొకాయన “చాత్రిబాబు”కి “మెంటల్ మెనోపాజ్” వచ్చేసింది అని రాసేరు. అది చదివి”ఏందార్రా బగమంతుడా” అని “బెంగటిల్లిపోయేం” జమిలిగా మేవందరం.
అయినా “చాత్రిబాబు” ఈయేల్టికీ బతికేవున్నాడు. హమ్మయ్య అనుకున్నాం మళ్ళీ జమిలిగా.
ఏవిటొ అంతా “అద్దువైతం” గా వుంది.
సర్పవా? రజ్జువా? ఎవళు చెబ్తారో? ఎవళికాళ్ళే తెల్సుకోవాలో?
“యద్యదాచరిత శ్రేష్ఠహ తత్త దేవేతరో జనహ” అన్న “మంచిముక్కకి” ఇలా అర్ధం చెప్పుకోవల్సొస్తుంది: “ఆవిడ పట్టిన నోము, జగవంతా పట్టింది. జగం పట్టిన నోము మనం పడుతున్నాం”. ఎవరూ మిగల్రూ. అయినా నోవుపట్టాల్సిందే.
“అసందర్భ ప్రేలాపన” అని మా “సాయి” లాటి వాళ్ళు అనొచ్చు.
“సాయి” గారూ, “ఎమ్ ఒ ఎమ్ ” లో ఇలా రాస్తే మనకెవరికీ అభ్యంతరం వుండదనే అనుకుంటున్నాను.
కవిత్వం/వచనం రాయడం సులువు. దాన్ని చదువుకుని “ఆహా, వోహో” అనుకోవడం ఇంకా సులువు. “చెస్, చెండాలం” అనుకోవడం మరీ సులువు.
ఎవరో రాసిన కవిత్వం/వచనం గురించి, అది ఎందుకు బాగుందో/బాగోలేదో రాయడం చాలా కష్టం.”ఈ చాలా కష్టాన్ని” చదివి, నాలాటి పాఠకుడు అయోమయంలో పడడం ఇంకా సులువు. (మా “సాయి” లాటి వారు కాదు).
దీని బదులు, పిల్లల పుస్తకాలకి అట్టలేసుకోడం, వాళ్ళ “హోమ్ వర్క్” చేయించడం సులువు.
ఏవిటొ అంతా “అద్దువైతం” గా వుంది.
ఛందస్సు ప్రకారం రాయాలి, సమాసాల ప్రకారం చదవాలి, వొకే గుక్కలో చదవాలి, వొకేగుక్కక్కర్లేదు. వుత్పలమాలలోనూ, చంపకమాలలోనూ, మత్తేభంలోనూ, అన్నిట్లోనూ అన్ని రసాలూ ఆవిష్కరించొచ్చు.
ఏవిటొ అంతా “అద్దువైతం” గా వుంది.
గ్రంథచౌర్యం గురించి … గురించి పాఠకుడు అభిప్రాయం:
08/20/2008 7:21 am
త్యాగరాజు రాసినట్టు కృతులు రాసి, వాటిని త్యాగరాజు పేరు మీదే చలామణీ చేస్తే, దాన్ని గ్రంధ చౌర్యం అనరు. దాన్ని ప్రక్షిప్తం అంటారు. రామాయణం తిరగరాసి నప్పుడు అనేక మంది కవులు తమ సొంత పైత్యాన్ని కూడా కలిపేసి రాసేవారు. అయితే ఈ ప్రక్షిప్తాలు మూల కధకి గానీ, మూల కవికి గానీ హాని చెయ్యవు. అపఖ్యాతి తీసుకురావు. ప్రక్షిప్తాలు సమాజ పరిణామ క్రమంలో భాగంగా వుంటాయి. దీనికీ, గ్రంధ చౌర్యానికీ పోలికే లేదు.
పాఠకుడు
ఛందోధర్మము గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:
08/20/2008 6:28 am
కవిత్వం కోసం ఛందస్సా, ఛందస్సు కోసం కవిత్వమా? కవిత్వం కోసం ఛందస్సు వదులుకోడం తప్పా? ఛందస్సు కోసం కవిత్వాన్ని బలి చేయడం ఒప్పా?
ఛందస్సువలన కవిత్వానికి ఒరిగేదేమిటి?
ఈ ప్రశ్నలకి సమాధానాలు ఆంగ్లకవి P.B. Shelley రాసిన “To a Sky Lark”
…
Thou art unseen, but yet I hear thy shrill delight
…
Like a high-born maiden
In a palace tower,
Soothing her love-laden
Soul in secret hour
With music sweet as love, which overflows her bower…
లోని భావాన్ని రాయప్రోలు సుబ్బారావుగారు తన చంపకమాల పద్యాలలో ఎంత మధురంగా పొందుపరిచారో ఆలోచించి చూస్తే దొరకవచ్చు:
“ప్రమద రసోదయాలస తరంగములన్ దవిలించి, పారవ
శ్యమున నుయాలలూపెదవయారె! చరాచర చేతన ప్రపం
చము బహిరంతర భ్రమణ సాధ్వసమేది ప్రశాంతమయ్యె, నే
త్రములకు గానరావు, మధురంబుగ పాడెదవెందొ కోయిలా!
ధవళ చిరత్న రత్నరచితంబగు సౌధమునగ్రమందు పూ
నవకపు సెజ్జపై వలపునన్ తన కిన్నెర మేళవించి మో
హవశముగా ప్రపంచమును నాకులపెట్టు నొయారివోలె, నీ
భువనమునెల్ల రాగమయ భోగములన్ దనియింతొ కోయిలా!”
నేను నమ్మిన సత్యం: నిజమైన కవిత్వం చెప్పగలిగన వారికెవరికీ ఛందస్సు ఆటంకం కాదు. భాష మీద పట్టులేక, వచనకవితా ప్రక్రియని అడ్డంపెట్టుకుని ఎదో గిలికి పారేసి ఛందోధర్మాన్ని వదిలిపెట్టినందువల్లె ఇంత గొప్ప కవిత్వం వ్రాయగలిగామని జబ్బలు చరుచుకునే (కు)కవులు, వారి భజంత్రీలు విస్తృతపఠనం అలవాటు చేసుకుంటే పైన మచ్చుకు చెప్పిన ఉదాహరణలులాటివి కోకొల్లలు కనపడతాయి తెలుగు సాహిత్యంలో.
ఆధునిక తెలుగుకవిత్వానికి ఆద్యుడుగా గుర్తింపు పొందిన రాయప్రోలువారు అద్భుతమైన కవిత్వాన్ని అలవోకగా చిలికించగల గొప్ప కవి. యతిప్రాసలు పద్యానికి అతికించినట్టు ఉండకూడదనేవారిలో ఆయన ఒకరు అని ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తంగారు నాతో ఎప్పుడూ అనేవారు. కవిత్వభాష గురించి అలాంటి మహనీయుడు రాయప్రోలువారి మాటల్లోనే:
ధేనువులు తిను బహువిధ తృణచయమ్ము
త్రావు నానానదీకూప జీవనమును
కలిసి పరిణమింపవె పాలుగా ధరిత్రి
శబ్దమేళన తంత్రనైజమ్ము నిదియె
రాయప్రోలుగారి కవిత్వానికి నన్ను పరిచయం చేసిని పూజ్యులు ఆచార్య భొడ్డుపల్లి పురుషోత్తంగారికి నేను ఎంతో ఋణపడి ఉన్నాను.
రాజాశంకర్ కాశీనాథుని