పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. వెన్నెల – తిలక్ కవిత గురించి lyla yerneni అభిప్రాయం:

    09/20/2010 5:31 pm

    బాగుంది. పుస్తకంలో చదవటానికీ, పైకి చదివితే వినటానికీ కూడా బాగుంది.

    ఐతే, దాదాపు చివరి ఇరవై పంక్తులు – ఇంకో కవితను తెచ్చి అతుకు వేసిట్లుగా ఉంది. కవిత లయ మారింది. లయ మారితే మారింది. కవిత విషయం కూడా మారింది.

    అప్పటివరకు వెన్నెలను ప్రయివేటుగా అనుభవిస్తున్న మానవుడు, అకస్మాత్తుగా 🙂 “ఎవరో” – వెధవా! నీ ఒక్కడి కోసమే నీ దొడ్లోనే కురుస్తాందా వెన్నెల? వెన్నెల అందరిదీ కాదూ. అది అన్నిచోట్లా కురవదూ? అని కొరడా పెట్టి కొట్టినట్లు; సన్నాసీ! కవిత్వంలో ఏవి తప్పక రాయాలో మర్చిపోయావా -అని కోప్పడితే ఢమిక్కిన గుర్తుకు వచ్చినట్లు; అక్కణ్ణుంచీ కవితలో -“ధనికులు, నిరుపేదలు, ఊరిపక్క కాలువ అద్దపు రొమ్ములు, ఊరి బైట కాలీకాలని చితికీలలు” -వచ్చి పడ్డాయి.

    నా ఉద్దేశంలో, ‘వెన్నెల’ ఇతివృత్తంగా తీసుకుని రాసిన రెండు వేరు కవితలు ఒకదాని తర్వాత ఒకటి పేర్చబడి – ఒకటి చేయబడ్డాయి. ఆ పని కవి సొంతగానే చేసుకున్నాడో, లేక ఇతరుల ప్రోద్బలం వల్ల జరిగిందో, ఊరికే పోనివ్వడమెందుకు ‘వెన్నెల’ మీద ఉన్న బంతులన్నీ ఒక కవితలోనే ఒక ప్రసారంలోనే వినిపించేద్దాం, పనై పోతుంది – అని ప్రసారకర్తలో, ప్రచురణకర్తలో అనుకున్నారో మరి.

    ధోరణి వేరైన -రెండు రచనలనూ విడగొట్టి -మొదటి కవిత ధనికుల పెట్టెలోనూ, రెండోది పేదల పొట్టలోనూ వేస్తే రెండూ నిండుతాయి. 🙂 కాదా.

    కవితలో కొన్ని పంక్తులు తిలక్ రెండుసార్లు చదవటం నచ్చలేదు. అవి సంగీతంలో సంగతుల వంటివి కావు. రెండో సారి చదివినంతనే వాటి రుచి పెరగలేదు. ఏ వాక్యానికీ రెండో సారి చదవవలసిన అదిక ప్రాముఖ్యతా లేదు.

    తిలక్ – హాయిగా వెన్నెల అనుభవించటం అర్ధాంతరంగా మానేసి – హడావిడిగా పెన్నూ కాగితం తెచ్చేసుకుని-

    ” నా రచనగా తానై పోయింది
    వెన్నెల వంటి నా ఉద్రేకానికి
    తెలుగు భాష శరద్వియ
    ద్విహార వనమై నడచిపోయింది ”

    అని రాయటం కూడా మానేసి ఉండాల్సింది.

    ఏమంటారు చదువరులు? శ్రోతలు?

    లైలా

  2. పూల పల్లకి గురించి విశాల అభిప్రాయం:

    09/20/2010 11:18 am

    శ్రీనివాస్ గారూ,

    అనవసరపు హంగులు, ఆర్భాటాలు, బరువులు, బేరాలు లేకుండా శృతి లో పలికిన లలిత గీతంలా చల్లగా, హాయిగా ఒక చక్కటి అనుభూతిని అందిస్తూ సాగిపోయింది… మీ ‘పూల పల్లకి’.

    చాలా బావుంది. అభినందనలు.

  3. సా విరహే తవ దీనా గురించి mOhana అభిప్రాయం:

    09/20/2010 10:14 am

    నమస్కారాలు నారాయణ బాబు గారూ, నస్రుద్దీన్ గారి పాట ఇంటర్నెట్‌లో ఉంటే తెలుపగలరు. ఈ వ్యాసం బాగుందంటే దానికి కారణం నేనొక్కడిని మాత్రమే కాదు. నాతోబాటు వ్రాసిన సహరచయిత బ్రహ్మానందంగారు కూడ దీనికి కారకులు.
    విధేయుడు – మోహన

  4. సా విరహే తవ దీనా గురించి Narayana babu vedula అభిప్రాయం:

    09/20/2010 9:16 am

    Nindati chandana mindu kirana manu was also sung by Ustaad Amin Nasiruddin Dagar in Bageshwari of Dhrupad styleof music.
    excellent piece of article by mohana rao garu

  5. రాగలహరి: సింధుభైరవి గురించి Murali అభిప్రాయం:

    09/20/2010 7:21 am

    వేణు మాధవా అన్న పాట మోహన రాగమ్లో కూర్చబడినది. లక్ష్మన్న గారు, దయచేసి మధ్యమావతి రాగం గురించి రాయండి.

  6. మారుపేర్ల మాయువు గురించి మారుపేర్ల మాయువు అభిప్రాయం:

    09/19/2010 6:42 pm

    మారుపేర్ల మాయువు ఈమాట పత్రికలో పుట్టడానికి ప్రధాన కారణం, వ్యక్తి గత నిందలతో కూడిన అభిప్రాయాలను సెన్సార్‌ చెయ్యడంలో ఉన్న ఈమాట సంపాదకుల బాధ్యతా రాహిత్యమే. పైకి బాగానే కబుర్లు చెబుతారు గానీ, ఎంతో మంది సంపాదకులు ఎన్నో సార్లు అభ్యంతరమైన వ్యాఖ్యలను సెన్సారు చెయ్యకుండా ప్రచురించారు. ఒక్కోసారి ఒక సంపాదకుడు మిగిలిన సంపాదకులతో సంప్రదించకుండా అటువంటి వ్యాఖ్యని అనుమతించారని ఓ సిల్లీ సంజాయిషీ చెబుతారు. “స్వల్పమైన వ్యంగ్యం ఆరోగ్యకరం, హాస్యదాయకం” అని అనుకుంటూ, వ్యక్తి గత నిందలున్న వ్యాఖ్యలని ప్రచురిస్తారు. అది ‘స్వల్పమో’, ‘అధికమో’ తేల్చడానికి మీరెవరు అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఇది మీ పత్రిక అని సమాధానం చెబుతారు. ఆ ‘స్వల్పం’ రచయితకి కూడా ‘స్వల్పం’ అవునో, కాదో తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడన్నా చేశారా? ఇక ఆ రచయిత్రి(త) ఏడవలేక, కృత్రిమ నవ్వు మొహానికి పులుముకుని, ఏదో జవాబివ్వడమో, దాన్ని నిర్లక్ష్యం చెయ్యడమో చేస్తారు. రచన గురించే రాయండీ, రచన గురించే రాయండీ అని ఓ పక్క కేకలు పెడుతూనే వుంటారు. ఇంకో పక్క అలా లేని వ్యాఖ్యలు కూడా ఇక్కడ చోటు చేసుకుంటూనే వుంటాయి. దానికి బాధ్యత ఈ సంపాదకత్వ వర్గానిదే. ఏ రచయిత్రి(త) వచ్చి “నా మీద వ్యక్తిగతమైన నింద వుంది, బాబోయి” అని మీతో చెప్పుకోగలరు?

    ఒక పాఠకురాలు(డు) ఒక రచన గురించి, ఆ రచయిత్రి(త) ప్రశక్తి లేకుండా, ఏమన్నా విమర్శ చేస్తే, ఆ రచన నచ్చిన ఒక గుంపు ఇక విరుచుకు పడుతుంది. ఆ విరుచుకు పడ్డం అంతా, రచన గురించో, రచన మీద వచ్చిన విమర్శ గురించో అయితే, ఎవరికీ అభ్యంతరం వుండదు. నెమ్మదిగా మొదలయి, తీవ్రంగా వ్యక్తి గత స్థాయిలోకి వెళుతుంది ఆ నింద. ఒక్కోసారి వ్యక్తి గత మెప్పుదలే కదా, ఎవరికీ అభ్యంతరం వుండదు అని మీరనుకుంటూ, ఆ రచయిత్రి(త)ని ఇష్టపడే వంధిమాగధుల గొప్ప గొప్ప మెప్పుకోళ్ళు ప్రచురిస్తారు. అవి చదవడానికి మాత్రం ఎంత వెగటు పుడుతుందో.

    ఈమాట సంపాదకులు వ్యాఖ్యానాల విషయంలో, ఏ మాత్రమైన వ్యక్తి గత రిఫెరెన్సూ లేకుండా సెన్సారు చెయ్యగలిగి నప్పుడు మాత్రమే, ఈ “మారుపేర్ల మాయువు”కి అంతం పుడుతుంది. లేదా, ఈ “మారుపేర్ల మాయువు” వల్ల మీకు వచ్చిన నష్టం ఏమిటీ అని మిమ్మల్ని మీరు ప్రశ్నంచుకోండి. ఇవన్నీ మీరు సెన్సారు చేసి, అనుమతించిన రచనలూ, వ్యాఖ్యానాలూ. ఇంక రాసిన మనిషికి అక్కర్లేని పేరు మీకెందుకూ? ఆ మనిషి అసలు పేరు రాయలేదని మీకు బాధ ఎందుకూ?

    ఒక వేలు అవతల వేపు వాళ్ళ కేసి చూపిస్తే, మిగిలిన నాలుగు వేళ్ళూ మీ వేపే చూపిస్తాయన్న నానుడి వుండనే వుంది. స్వవిమర్శ కూడా ముఖ్యమే.

  7. తోడు గురించి shanthi అభిప్రాయం:

    09/19/2010 3:55 am

    నిజంగా ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మకు పెళ్ళి చేయాలని అనిపిస్తే రామారావు కాకుండా యే భీమారావునో చూస్తే సరిపోయేది.

  8. శ్రీశ్రీ కవితకు బాపూ బొమ్మ గురించి BADAGALA RAMANAMURTY అభిప్రాయం:

    09/18/2010 7:52 am

    మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం బాపూ బొమ్మలతో ఇచ్చిన మీ రుణం ఎలాగున తీర్చుకోవడం? మీకు నా కృతజ్ఞతలు, నమస్కారములు.

  9. ప్రేమ కవితలు గురించి Nagaraju.Voore అభిప్రాయం:

    09/18/2010 7:09 am

    మీ కవితలు చదువుతుంటే నాకు కవితలు రాయాలని అనిపిస్తుంది. నిజంగా అంత బాగున్నాయి.

  10. “అమృతం కురిసిన రాత్రి” పై రారా సమీక్ష – ఒక ప్రతి విమర్శ గురించి C.S.Rao అభిప్రాయం:

    09/17/2010 11:30 pm

    కామేశ్వరరావు గారూ,
    రారా విమర్శపై నేను వ్రాసిన ప్రతివిమర్శ, ఆయన విమర్శకు మాత్రమే పరిమితమై వ్రాసినది.అభ్యుదయ కవిత్వాన్ని తన “అమృతం కురిసిన రాత్రి” పై సమీక్ష లోకి లాగింది రారానే, నేను కాదు. విమర్శ లో చెప్పిన విషయాలపై స్పందించటమే కదా ప్రతివిమర్శ. నేను చేసింది అదే. దానిని మీరు అసమంజసం అన్నారు. ఇది అసమంజసం ఎలా అవుతుంది?

    భావుకత్వం పరిపుష్టంగా ఉన్న కవి ఏ అనుభూతిని కవిత్వీకరించినా అది కదిలించే శక్తిని సంతరించుకుంటుంది. తరతరాలుగా సాహిత్యంలో స్థిరపడిన విషయాలమీద మనం పునరాలోచన చేస్తూనే ఉన్నాం కదా. భావకవులనీ, అభ్యుదయకవులనీ, విప్లవకవులనీ చేసే వర్గీకరణ కృత్రిమమైనదే. నినాదప్రాయాలైన రచనల నాధారంగా కవులు కానివారికి కవులుగా అస్తిత్వాన్ని చేకూర్చాలనే వ్యర్ధప్రయత్నం అని నేను నమ్ముతున్నాను. ఒకవైపు మీరు ఈ వర్గీకరణను అంగీకరిస్తూనే, ప్రతి కవినీ, ప్రతి కవితను వర్గీకరణలలోకి బలవంతాన ఇరికించటం సమంజసం కాదు అంటున్నారు. ఇందులో నాకు వైరుధ్యం కనబడుతుంది . అంతేకాక, పదిమంది మెప్పుకోసం పాప్యులర్ విషయాలమీద కవిత వ్రాసినంతమాత్రాన అది కవి యొక్క హృదయతత్వంగా తీసుకోవటానికి వీలు లేదని నా అభిప్రాయం.కారణం, తాను కవిత్వం లో వెలిబుచ్చే అభిప్రాయాల యెడల తన నిత్యజీవితంలో నిబద్ధత కనిపించినపుడే అది అతని “హృదయతత్వం” అవుతుంది.

    అందంగా వ్రాయటమంటే ఆకట్టుకునేలా ఏ రకమైన అనుభూతినైనా వ్యక్తీకరించటం అనేది నా నిర్వచనం అన్నారు.అందానికి రారా నిర్వచనం వేరన్నారు.అదేమిటో చెప్పలేదు.

    నిజమే ,ఆకట్టుకునేలా వ్రాయకపోతే ఉత్తేజితులెలా అవుతారన్నాను. ఆకట్టుకున్నంతమాత్రాన ఉత్తేజితులని చెయ్యలేదని రారా ఉద్దేశ్యమన్నారు మీరు. బ్రతకాలంటే పుష్ఠికరమైన ఆహారం తినాలి. తిన్నాక కూడా బ్రతకకుండా ఉండటానికి అనేక కారణాలు ఉండవచ్చు.

    నా నిర్వచనం ప్రకారం అభ్యుదయ కవులు, విప్లవకవులు అందానికి వ్యతిరేకులు కాదన్నారు. సంతోషం. వారు అందానికి వ్యతిరేకులయ్యేంత సంకుచితమైన నిర్వచనం రారా “అందానికి” ఇచ్చారా ?

    కవిత్వానికి,సాహిత్యానికి అలంకారికులు చెప్పే రసానందమే అస్తిత్వాన్ని ఇస్తుంది. ఆకట్టుకోవటానికి ,ఉత్తేజితులను చేయటానికి ప్రేరకాలు ఆహ్లాదం,ఆనందం.

    “నా గీతం గుండెలలో……..” నేననేదీ అదే . ఆయన చెప్పవలసినది తోటి జనుల ఆశలను, ఆశయాలను,ఆకాంక్షలను తన గీతం లో ప్రతిఫలింపచేస్తానని. కానీ ఆయన చెప్పింది తన గీతం జాతి జనుల గుండెలలో మ్రోగాలని. తనకు ప్రాధాన్యత ఆపాదించుకోవటం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందే! తనకు నమ్మకంలేని ‘మంత్రం’ ప్రస్తావన ఎందుకు ?త నను తన జాతి జనులు అనుసరించటం కాదు, వారిని తాను అనుసరించి వారి ఆకాంక్షలు తన గీతం లో ప్రతిబింబించి, వారిని ఉత్తేజితులను చేయటం. ఆ విధంగా తన గీతాన్ని వినిపించడం జరగాలి.

    కవిత్వం వాస్తవ జీవితానికి దూరమవ్వటంలోనే, దాన్ని(వాస్తవజీవితాన్ని) విస్మరించటం ఇమిడి ఉంది.ఇంక మరలా ఉదాహరణలు అవసరం లేదనుకుంటాను.

    ఆనందం (కవిత ఇచ్చే రసానందం), ఉత్తేజం ఒకే అనుభూతికి రెండు పార్శ్వాలుగానూ, పరస్పరాశ్రయాలు గానూ ఉండవచ్చు. ఒక చిన్న వివరణ: ఏ బలీయమైన అనుభూతి అయినా, ఉత్తేజానికి ప్రేరకంగా ఉండవచ్చు. ఏదో చేయాలని పురికొల్పటం కాన్షస్ గా చేసే ప్రయత్నం. ఇది కళకు విరుద్ధం. కవి బలీయంగా అనుభూతిని వ్యక్తీకరించటం మాత్రమే చేయాలి. “ఆర్ట్ లైస్ ఇన్ కన్సీలింగ్ ఆర్ట్”.

    రుచి,శుచి విషయంలో కూడా పైన చెప్పిన విషయమే వర్తిస్తుందనుకుంటాను: బ్రతకాలంటే తినాలి.కానీ తిన్నాక కూడా బ్రతకకపోవటానికి అనేక కారణాలు ఉంటాయి.

    “వెన్నెల సముద్రాలు” మొదలగునవి అందంగా వ్రాయటానికి సంకేతాలు అని స్పష్టంగా తెలుస్తుంది.వాటిలో అన్వయకాఠిన్యం లేదు. మరి రాబందుల రెక్కల చప్పుడు వగైరాలు దేనికి ఏది సంకేతం? ఎలా వీటిని అన్వయించటం? వీటిగురించి ప్రస్తావనకు కారణం, మీరనుకుంటున్నట్లు అసంగతంగానేనైనా రారా, శ్రీశ్రీ కవితా పంక్తులని కోట్ చేయటం. దీనిలో అర్ధం కాకపోవటానికేముంది?

    ఇక లాలిత్యాన్ని గురించి:ఇది కడుపు నిండినవాళ్ళ కవిత్వంలోనే ఉంటుందని అనుకుంటే, అభ్యుదయభావాలతో కవిత్వం వ్రాస్తున్నవారందరూ పస్తులు పడుకుంటున్నవాళ్ళా? పీడితప్రజల విముక్తి పోరాటాలకు కలంతో పాటు కత్తిపట్టి దన్నుగా నిలుస్తున్నవారా? ఎవరో చెరబండరాజు లాంటి వారు కోటికొకరు మినహా!

    “వచనగేయపు శైలి లలితమైన (లిరికల్) ఇతివృత్తాలకు అనుచితంగా ఉంటుందని,గంభీరమైన ఇతివృత్తాలకు సముచితంగా ఉంటుదని స్పష్టంగా అర్ధమవుతుంది” – లలితమైన అన్నమాటకు సమానార్ధకంగా లిరికల్ అనే మాటను బ్రాకెట్లో వాడారు, రారా. వచనగేయపు శైలిని గురించి, రెండు రకాల ఇతివృత్తాల గురించి మాట్లాడారు. మీరనుకున్నట్లు రెండు రకాల శైలీ విశేషాలగురించి మాట్లాడలేదు.

    మీరు ఆరోపించినట్లు, భావకవుల వేదనను నేను సాంద్రత లేనిదనికానీ, కృత్రిమమైనదని కానీ అనలేదు.వారి వేదనా ప్రియత్వాన్ని మాత్రమే కృత్రిమం అనడం జరిగింది. వేదనలో అనుభూతి సాంద్రత తప్పనిసరిగా ఉంది, కృత్రిమత్వం లేదు. వేదనా ప్రియత్వంలో కృత్రిమత్వం ఉంది,అనుభూతిసాంద్రత లేదు. పాక్షికదృష్టి ఎవరిలో ఉన్నా, బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఎవరు చేసినా అభిలషణీయంకాదు. ఇవి సాహిత్య విమర్శకు వన్నె తెచ్చేవి ఎంతమాత్రమూ కావు.