“తెలుగువారి సంగీతాభిరుచి పెరగాలంటే వారు సాహిత్యం పై శ్రధ్ధ పెట్టడం తగ్గించి…” ఇదేం వ్యాఖ్యానం ?? సంగీతం మీద అభిరుచిని పెంచుకోవడానికీ సాహిత్యాన్ని పట్టించుకోనఖ్ఖరలేదని ఓ సలహా పారేసే ముందు అసలు ఆ వాక్యానికి ఉన్న బలం ఏమిటోనన్నా ఆలోచించుకోలేదే రోహిణీ ప్రాసాదు గారు? సరిగ్గా ఆయన అభిప్రాయానికి భిన్నంగా ఉన్న జయప్రభ గారి అన్నమయ్య విశ్లేషణ పదంలోని సాహిత్యానికి ఉన్న ప్రాధాన్యత ఎంతటిదో చెప్పకనే చెబుతోంది మరి!! సంగీతంలో ఎప్పుడైనా రాగాలూ స్వరాలూ ఇవి మాత్రమే ముఖ్యమైనవట!! దీని అర్ధమేమో రోహిణీ ప్రసాదు గారు వివరించాలి. ఆయన సాహితీ విశ్లేషకులని చూసి ఇబ్బంది పడుతున్నారా?? లేక సంగీతానికి ఆ పదాల్లోని సాహిత్యం ప్రతిబంధకం అని అనుకుంటున్నారా?? ఆయన సమస్య ఏమిటో నాకు స్పస్టం కాలేదు.
ఒకసారి రాజమండ్రిలో పద్యనాటకాల ప్రాభవం బాగా ఉండే రోజుల్లో సంగీతం ముఖ్యమా? సాహిత్యం ముఖ్యమా అని చర్చలు చేసుకునే రోజుల్లో భమిడిపాటి కామేశ్వరావు గారు స్టేజీ మీద ఏకబిగిన రాగాన్ని ఆలాపన చేసి ఊరుకున్నారట!! పద్యం పాడటం అయిపోయింది అని చెప్పేసేరట. అదేమిటీ పద్యం అంటే సాహిత్యం ఏదీ అది వినిపించకపోతే ఇంక అందులో సొగసేమిటి పద్యం చదవండి మొర్రో అని జనం మొత్తుకున్నారట!! అలా ఆయన సంగీతంలో రాగం చాలు సాహిత్యం అనవసరమ్ అని భావించేవారికి తనదైన తరహాలో జవాబు చెప్పి ఉన్నారు. ఇది ఏనాడో ముగిసిపోయిన చర్చ. అలాగే ఘంటసాల గారికి ప్రియ శిష్యుడైన సంగీతరావు గారు సాహిత్యం లో ఉండే ప్రాముఖ్యతకి సదా ముగ్ధులైన వ్యక్తి. పాట తాలుకు బలం అంతా ఆ పాటలోని సాహిత్యానిదే నని తాను స్వయంగా సంగీతకారుడై ఉండిన్నీ.. గాయకుడై ఉండిన్నీ బలంగా నమ్మిన వ్యక్తి. సాహిత్యం తాలుకు ప్రాభవం అంత సరిగ్గా తెలియని వారెవరో అక్షరాన్ని గురించి ఆలోచించలేకపోయి ఉంటారు. కానీ సంగీతంలో అక్షరమే ముందు నడిచేదనీనీ స్వరం ఎప్పుడైనా దాన్ని అనుసరించే సాగవలసినదనీనీ సాహిత్యం తెలిసిన వారెవరైనా భావిస్తారు. అందుకనే అన్నమయ్య సాహిత్యం అంత ప్రాచుర్యం పొందగలిగింది. ఆయన పదాన్ని ఎవరేయే రాగాలలో.. పాడుకుంటున్నా కూడా ఆయన పదాలలోని ఆ కవితామాధుర్యమే చెవికింపుగానూ మనసుకి సుఖంగానూ ఉంటుంది. అక్షరాన్ని మినహాయించే సంగీతం మనలేదు. అందువల్ల రోహిణీప్రసాదు గారు ఒక పక్షపాత ధోరణితో ఆ మాటలు అన్నారని భావించేలా ఉంది. ఆయనకి సాహిత్యం మీద మక్కువ లేనంత మాత్రాన తెలుగువారికందరికీ ఉండకూడదని ఏమీ లేదు.
లైలా గారూ !! మీరు రాసిన కొన్ని వాక్యాలకి నేను ఇంకా అలా నవ్వుతూనే ఉన్నాను.” కడుపొచ్చ్చినంత సులువుగా సంగీతం రాదు” 😉
మనుచరిత్ర ప్రభావం అన్నది ఒంటిగా ఉన్న అమ్మాయిని వెళ్ళి పలకరించి కుశల ప్రశ్నలు వేసి ఆ అమ్మాయి యోగక్షేమాలు కనుక్కునే నెపంతో సంభాషణ మొదలుపెట్టడం..ఇంకా గర్భిణీ స్త్రీ లక్షణాలు వర్నించడం ఇత్యాదుల్లో !! అంతదాకానే !!
ఇకపోతే పద్యరచనలో తిరుమల దేశికాచార్యులవారిది అందె వేసిన చెయ్యే !! అందులో ఇసుమంత కూడా సందేహం లేదు. అయితే, ప్రతీదీ పద్యంలోకి ఇరికిస్తే అది నప్పదు. అందుకు ఉదాహరణ గానే ఈ “గానభారతి”. లైలా అన్నట్టూ ఇది ఈ కాలం కధ అయితే ఈ కాలం ఆడపిల్ల వ్యవహారం ఇందులో ఏం లేదు. ఈ గానభారతి కవి గారి ఊహల్లో రూపొందిన అమ్మాయి. ఇవాళ్టి సమాజంలోని అమ్మాయే అయితే లైలా చెప్పినట్టూ ముందుగా గైనకాలజిస్టునే సంప్రదిస్తుంది మరి.
చాదస్తం భాష లో ఉన్నప్పుడు కవి సహజం గానే విషయాన్ని సైతం అంతే చాదస్తమ్ గా రాయక తప్పదు. dress code ని మార్చుకున్నారు గానీ భాష విషయలోనూ కధా కల్పనలోనూ మాత్రం ఈ చాలా మంది పద్య కవులు కాలాన్ని ఇంకా శతాబ్దాల పొలిమేరని దాటనివ్వడం లేందే?? పద్యం బాగుంటుంది కదా అని అన్నిటికీ పద్యాన్నే వాడితే అది ఇదిగో ఇలాగే ఉంటుంది. పైగా కాలం ఆధునికం అన్న సూచన స్వయంగా చేస్తూ కవి ఆ ఆధునిక కాలం లో స్త్రీని మాత్రం బేలగా కవి సలహా లేనిదే అడుగు ముందుకు వేయలేని దానిగా చిత్రించడం ఏమిటీ??
ముక్తకాలైన భావాలకి పద్యం నప్పుతుంది. ప్రకృతి వర్ణనలకి కూడా ఇప్పటికీ పద్యమ్ నప్పుతుంది. దేశికాచార్యులవారే జలప్రపాతాన్ని వర్ణించే పద్యాలు రాసేరు. కానీ ఆధునిక కధ అందునా సంక్లిష్టమైన ఇతివృత్తం తప్పని సరిగా ఆధునికమైన భాష లోనే ఉండటం సముచితంగా ఉంటుంది. లేనప్పుడది కృతకంగానే ఉంటుంది. మన బతుకులో చాలా ప్రాంతాల ప్రమేయం చాలా నాగరికతల ప్రమేయం ఉన్నప్పుడు “తెల్గిష్” నప్పినంతగా మణిప్రవాళమ్ నప్పదు. పైగా ఇదివరలో వేరే భాషలని తెలుగు గ్రహించనట్టూ ఇప్పటికిప్పుడే ఇటువంటి పరిస్థితి ఏదో తెలుగులో తలెత్తినట్టూ దేశికాచార్యుల వారు అనడం వింత . భాష జీవద్భాష అయితే అది అన్నిటినీ కలుపుకుని నడుస్తుంది. లేకపోతే చస్తుంది. అప్పారావు గారి కన్యాశుల్కం లోని వాక్యాలకి ఆ ప్రాచుర్యం వచ్చిందీ అంటే అందుకు కారణం ఆయన సుబ్బరంగా “తెల్గిష్” ని తన నాటకంలో వాడటమే కద!!
విశ్వనాథ సత్యనారాయణ వసుచరిత్రము (ఎమెస్కో ప్రచురణ) కు పీఠిక రాస్తూ, వసుచరిత్ర కావ్యము చదవటానికి ఇప్పటి పాఠకులు అధ్యైర్య పడనక్కరలేదనీ, – “మానవజాతిలో నది యొక అవివేకము. ప్రతివాడును తనకేమియు తెలియదనుకొనును. ఆ యనుకొనుట మానివేసినచో మన కావ్యములు కూడ చాలవరకు మనకు తెలియగలవు. నాల్గు మాటలు చదివిన తరువాత నైదవమాట కర్థము తెలియదు. నాకు తెలియుటే లేదని యా పుస్తకము నవతల పారవేయును. ఆ మాట యర్థము కానిచో తక్కిన మాటల కర్థమేమి? పద్యమంతయు చదివినచో నేదో కొంత తెలియదా? ఒక పద్యము తెలియలేదు. రెండవ పద్యము తెలియదా?” – అంటూ కావ్యాలు తప్పక చదవమని సలహా ఇస్తారు.
విశ్వనాథ సలహా నాకు నచ్చింది. ఆయన ఎంతమంది విద్యార్థులకో చదువు చెప్పిన పంతులయ్యె. నేను పద్యాలు అలాగే చదువుతున్నాను. చదివిన కొద్దీ అర్థమవుతున్నయి.
దేశికాచారి గారి పద్యాలు మధురంగా ఉంటాయి. నేను చదువుతున్నా. ఇందులో అన్ని పద్యాల్లో అన్ని మాటలూ అర్థం కాకపోయినా, కథ అర్థమయ్యింది. ఇది ఇప్పటి కాలపు కథ కాదంటానికి వీల్లేదు.
కొంచెం బాగోనట్టు ఎక్కడ అనిపించిందంటే; 🙂 కవితో కథానాయిక .. ఆమె… ఆమె…. – O! What the hell. I will say that horrible word in Telugu – ఆమె తన గర్భిణీ చిహ్నాలను వర్ణించి వర్ణించి చెప్పినప్పుడు. ఈ కాలపు స్త్రీ, ఆ సోదంతా అంత వివరంగా కవికి ఒక లతా నికుంజంలో ఎందుకు చెపుతుంది? అంతకు ముందెప్పుడో తన గైనకాలజిస్ట్ కి హాస్పిటల్లో చెప్పి ఉండొచ్చు.
అంతే. అందుకని. అంతకు మించి నచ్చనిది ఏం లేదు.
ఒంటరిగా, విచారంగా, ఉన్న ఒక స్త్రీని “ఏమిటమ్మా నీ కష్టం?” అని ఒక మగాడు కల్పించుకుని అడగటం ఈ రోజుల్లో జరగదా? అంటే జరుగుతుంది. సరే, కవి తర్వాత కుంచెం, వైద్యుడు, సలహాదారుగా ప్రవర్తించాడు అనుకోండి. అది ఈ రోజుల్లో ఆశ్చర్యం కలిగించే విషయమా అంటే అదీ కాదు. అలా రోజూ ఎడా పెడా లక్ష సలహాలు ఇస్తూనే ఉంటారు చాలామంది మనుషులు. కాని ఇక్కడ ఇచ్చిన సలహా అంత చచ్చుగానూ లేదు. నా కర్థమైనంత వరకూ ఆ కవి, ఆమె మనసు నొచ్చుకునే మాటలు అన్నట్టు లేదు. ఆమెను ఏ చెరువులోనూ దూకించలేదు. పైగా ఆమె కిష్టమయ్యి, ఆమె అదే పొదరింట్లో మరొకరితో సంభోగించితే , కవికి కష్టం కలిగేట్లూ లేదు.
అందువల్ల కవి సహృదయుడు అనిపిస్తున్నది.
అరే! ఒకటి రెండు కూజితాల్లోనే ఆమె కోయిల అని కవికి ఎలా తెలిసింది? అంటే – అదీ అంత నమ్మలేని విషయంలా అనిపించటం లేదు. 🙂 “తాళ్” సినిమాలో ‘మానవి’ /ఐష్వర్యారాయ్ సందేహిస్తూ “జీ. మై క్యా బోలూ” అనంగానే ఆ ధ్వనికి మురిసి ఆమె బాగా పాడుతుందని, స్టార్ క్వాలిటీ అని అనిల్ కపూర్కి తెలిసిపోయి, తన సంగీతం డాన్స్ కంపెనీతో కాంట్రాక్ట్ సైన్ చెయ్యమనలా:-)
ఐతే ఈ కథలో కవి, తన సలహానే ఆ స్త్రీ పాటించి, అందువల్లే ‘గానభారతి’ ఐపోయిందని, మనసులో అనుకున్నాడా? ఏమో మరి. తెలియదు. కానీ, సలహా ఇచ్చినప్పుడు సంగీతం ఆవిడకు మర్నాటికల్లా వస్తుందని అపోహ మాత్రం పడలేదు. కడుపొచ్చినంత సులువుగా సంగీతం రాదు. సంవత్సరాలు పడుతుందనే అనుకున్నాడు. “ఈ మాట” లో సంగీతం వ్యాసాలు రాసే రచయితలు మాత్రం, – వద్దులెండి, ఇక్కడ ఆ సంగతులు – వాళ్ళు రెండు దరువులు వేస్తే, నే బేరుమంటే, మళ్ళీ సుకవులు … 🙂 ఎందుకు గానీ ‘రోమంధము’, ‘ముకురాయితమైన’ అన్న మాటలకు అర్థాలు చెపితే, ప్రస్తుతానికి చాలు.
చెప్పొద్దూ – వరూధినీ, ప్రవరుడు అని వినిపించేసరికి కుతూహలం కలిగిన మాట వాస్తవం. ఎత్తుగడ అలా అనిపింపజేస్తుంది కూడ. ఐతే మిగిలిన ఏ విషయాల్లోనూ ఎలాటి పోలికా లేదని మనుచరిత్ర తొలి రెండు ఆశ్వాసాలూ చదివిన వారు ఇట్టే పోల్చుకోగలరు (నిజానికి నేను ఆ రెండు ఆశ్వాసాలు “ఈమాట”లో చాలాకాలం క్రితం పెట్టిన గుర్తు, ఇంకా ఉండి ఉండవచ్చు).
ముందుగా, ఇంకా పట్టుపట్టి ఛందోబద్ధమైన పద్యాల్ని రాస్తున్నందుకు తిరుమల దేశికాచార్యుల్ని అభినందించాలి.
ఐతే ఛందోబద్ధమైన పద్యాలు రాసేవారు భాష విషయంలో ఏమైనా కొత్తదనాన్ని తీసుకురావటానికి ప్రయత్నిస్తే ఇంకా పాఠకులకు అందుబాటులో వుండే అవకాశం ఉంటుందేమో ! సమకాలీన పాత్రలు సంస్కృతసమాసభూయిష్టమైన సంభాషణలు చేస్తుంటే తమాషాగానూ ఎబ్బెట్టు గానూ ఉంటుంది. అంతే కాదు సంప్రదాయ భాషలో సమకాలీన భావాల్ని చెప్పలేరు కూడ. అందుకే భావకవులు వస్తువుకి అనుగుణమైన భావజాలాన్నీ భాషనీ తయారుచేసుకున్నారు (వసుచరిత్ర తర్వాత వచ్చిన ఏ రచననీ చదివే ఉద్దేశం లేదని కవిగారు ఇదివరకు అన్నగుర్తు; కాబట్టి ఈ మాటలు వారిని ఉద్దేశించినవి కావు – ఇంకెవరన్నా పద్యాలు రాద్దామనుకుంటే వారికీ ఈ మనవి.) తర్వాత పద్యాలు రాసిన నండూరి వారు కాని, కోవెల వారు కాని భాషని ఆధునీకరించటానికి బాగానే ప్రయత్నించారు వస్తువు పౌరాణికమైనదైనా (ఉదాహరణకి నండూరి “శీర్ణమేఖల”). రామాయణాన్ని రాసిన విశ్వనాథ కూడ చాలా ఆధునిక భాషని భావజాలాన్ని వాడాడు. శ్రీశ్రీ, ఆరుద్ర లాటి వాళ్లు సంప్రదాయ ఛందస్సుల్లో అధునాతన భావాలని చెప్పగలిగారు, అందుకు అనుకూలంగా భాషనీ మలుచుకుని. ఎంతోమంది “సెటైర్లు”, “పేరడీ”లకు ఛందోపద్యాల్ని బాగానే ఉపయోగించుకున్నారు.
ఇప్పటికీ చారిత్రక పౌరాణిక నాటకాలకు కొత్త తరం కవులు పాతరకం పద్యాలు రాస్తున్నారు; శ్రోతలూ వింటున్నారు. చిక్కల్లా సమకాలీన పాత్రలు అదే ఒరవడిలో నడవబోయినప్పుడే. కొత్తభాషని తయారుచేసుకోవటం మాటలు కాదు; కాని కష్టే ఫలిః .
“కూడదని” నేనేల అనవలె గానీ.. “చందోబధ్ధమైన..సత్సంప్రదాయ ముకురాయమాన… అన్న విశేషణం మాత్రం మీ రచనలపై మీకున్న ఎక్కువ మక్కువ ని సూచిస్తోంది 🙂
ఆధునిక జీవితాన్ని అందులోని సంఘర్షణనీ రాయడానికి మాత్రం ఈ రకమైన భాష నప్పదన్నది పాఠకులకి తెలిసే విషయమే! మరీ గబగబ ఏమీ ఘర్షణ వ్యక్తమ్ కాకుండా నడిపిన కధనంలా ఉంది. కాలం ఆధునికమే గానీ కధనంలో ఏమీ ఆధునికం కన్పించలా! ఇంక దీనికి మీరు వాడిన భాష సైతం అలాగే ఉంది. పాత కాలం నాటి వాడకం ఇదేం నప్పుతుందీ? కిరీటాలు పెట్టుకుని రోడ్లమీద నడిస్తే కొట్టొచ్చినట్టు కన్పిస్తుందే అలా ఉంటుంది. ఈ రకమైన భాషలో మనుచరిత్ర మాత్రమే చదివేందుకు ఎక్కువ బాగున్నట్టూ.. గానభారతికి ఈ రకమైన “సత్సంప్రదాయం” ఏమంత నప్పనట్టూ అన్పించే నేనా మాట రాసింది.
తమ వంగ్యాత్మకమైన సమీక్షను ఓపికతో వ్రాసినందుకుశ్రీ యశస్విగారికి ప్రశంసలు. నేను మనుచరిత్రను నెమరు వేసుకుంటూ వ్రాయకున్నా మనుచరిత్రరోమంథాన్ని మీకది కలిగించిందంటే నే నాశించినదానికంటె అధికప్రయోజనమే చేకూరింది!! ఇంతకంటె కావలసిన దేముంది? మీకు మనుచరిత్రతో నున్న పరిచయం మాట అటుంచి, మానవప్రకృతులు, విభావానుభావాలు కాలాతీతములూ, అందుచేత 15వ శతాబ్దిలో వ్రాసినా 25వ శతాబ్దిలో వ్రాసినా ఈ అనుభావాల, ప్రకృతుల సారూప్యత ఉంటుందనే అంశం ఈ రోమంథానికి మూలమనేది మీరు గ్రహించవలసిన విషయం. కథను ఏదో 70% ఇంగ్లీషుపదాలతో గూడిన “తెల్గీషు” భాషలో వ్రాస్తే కాని శంఖులోతీర్థం పోసినట్లు కానేరదనే అపోహ మీ వ్రాతలో చూచాయగా స్ఫురిస్తూ ఉన్నది. ఈ అపోహను తొలగించడానికే లాక్షణికమైన ఛందోబద్ధమైన శైలిలో నేనీ కథను వ్రాసినాను. ఇట్టి ఛందోబద్ధమైన సత్సంప్రదాయ ముకురాయితమైన రచనలకు 15వ శతాబ్దియే కాని 21వ శతాబ్ది తగదని మీ అభిప్రాయమా? మీరేమన్నను ఈమాట సంపాదకులకు మాత్రం ఇటువంటి భావం లేకపోవడం నావంటివారి అదృష్టం. అభినందనీయం.
వేటూరి పాట
గురించి Nageswara Rao Mutnuri అభిప్రాయం:
08/07/2011
11:58 am
వేటూరి గారు మొన్నటిదాకా మన మధ్యనే ఉన్నారు. ఆయన చాలా ఇంటర్వ్యూ లలో తానూ కొన్ని పాటలు ఎప్పుడు ఎందుకు ఎలా రాసిందీ వివరంగా చెప్పారు. వేటూరి గారు పుంభావ సరస్వతి. మన కావ్యాల మీద, సంస్కుతం లోను, తెలుగు జాతీయాలు, నుడికారాల మీద ఆయనకున్న అధికారం అపారమైనది. ఇన్ని తెలిసిన ఆయన ఇలా రాసారంటే దాని వెనక ఎంతో కొంత ఆలోచన ఉండే ఉంటుంది. ఈ వ్యాసం రామారావు గారు వేటూరి సజీవులుగా ఉన్నపుడు ప్రచురించి ఉంటే బాగుండేది. ఆయనకీ విమర్శలకు సమాధానం చెప్పే అవకాసం కలిగించిన వారయ్యి ఉండేవారు. నామట్టుకు నాకు ఇందులో రంద్రాన్వేషణ ఎక్కువగా కనిపించిది. రామారావు గారు ‘పోయటిక్ లైసెన్స్’ అనేది ఒకటి ఉందన్న వాస్తవాన్ని ఈ వ్యాసం రాసేటప్పుడు విస్మరించారని అనిపిస్తోంది. పింగళి వారు, భావం చెడకుండా అందంగా ఒదిగేటట్లయితే పదాలను కొంచెం అటూ ఇటూగా వాడుకోవడం లో తప్పు లేదని ఎప్పుడో చెప్పారు.
తెలుగు సాహిత్య మాగాణంలో పద్య సుమాలను విరబూయించిన మహోన్నత మహిమాన్వితుడు గుర్రం జాషువా గారు. పద్యాలు చక్కగా వినసొంపుగా ఉన్నాయి.
ఇంత చక్కటి పద్యాలు అందించినందుకు చాలా చాలా ధన్యవాదములు.
నిలువు నూరు వండేటి మొలక: అన్నమయ్య పదం గురించి yasasvi అభిప్రాయం:
08/12/2011 2:17 am
“తెలుగువారి సంగీతాభిరుచి పెరగాలంటే వారు సాహిత్యం పై శ్రధ్ధ పెట్టడం తగ్గించి…” ఇదేం వ్యాఖ్యానం ?? సంగీతం మీద అభిరుచిని పెంచుకోవడానికీ సాహిత్యాన్ని పట్టించుకోనఖ్ఖరలేదని ఓ సలహా పారేసే ముందు అసలు ఆ వాక్యానికి ఉన్న బలం ఏమిటోనన్నా ఆలోచించుకోలేదే రోహిణీ ప్రాసాదు గారు? సరిగ్గా ఆయన అభిప్రాయానికి భిన్నంగా ఉన్న జయప్రభ గారి అన్నమయ్య విశ్లేషణ పదంలోని సాహిత్యానికి ఉన్న ప్రాధాన్యత ఎంతటిదో చెప్పకనే చెబుతోంది మరి!! సంగీతంలో ఎప్పుడైనా రాగాలూ స్వరాలూ ఇవి మాత్రమే ముఖ్యమైనవట!! దీని అర్ధమేమో రోహిణీ ప్రసాదు గారు వివరించాలి. ఆయన సాహితీ విశ్లేషకులని చూసి ఇబ్బంది పడుతున్నారా?? లేక సంగీతానికి ఆ పదాల్లోని సాహిత్యం ప్రతిబంధకం అని అనుకుంటున్నారా?? ఆయన సమస్య ఏమిటో నాకు స్పస్టం కాలేదు.
ఒకసారి రాజమండ్రిలో పద్యనాటకాల ప్రాభవం బాగా ఉండే రోజుల్లో సంగీతం ముఖ్యమా? సాహిత్యం ముఖ్యమా అని చర్చలు చేసుకునే రోజుల్లో భమిడిపాటి కామేశ్వరావు గారు స్టేజీ మీద ఏకబిగిన రాగాన్ని ఆలాపన చేసి ఊరుకున్నారట!! పద్యం పాడటం అయిపోయింది అని చెప్పేసేరట. అదేమిటీ పద్యం అంటే సాహిత్యం ఏదీ అది వినిపించకపోతే ఇంక అందులో సొగసేమిటి పద్యం చదవండి మొర్రో అని జనం మొత్తుకున్నారట!! అలా ఆయన సంగీతంలో రాగం చాలు సాహిత్యం అనవసరమ్ అని భావించేవారికి తనదైన తరహాలో జవాబు చెప్పి ఉన్నారు. ఇది ఏనాడో ముగిసిపోయిన చర్చ. అలాగే ఘంటసాల గారికి ప్రియ శిష్యుడైన సంగీతరావు గారు సాహిత్యం లో ఉండే ప్రాముఖ్యతకి సదా ముగ్ధులైన వ్యక్తి. పాట తాలుకు బలం అంతా ఆ పాటలోని సాహిత్యానిదే నని తాను స్వయంగా సంగీతకారుడై ఉండిన్నీ.. గాయకుడై ఉండిన్నీ బలంగా నమ్మిన వ్యక్తి. సాహిత్యం తాలుకు ప్రాభవం అంత సరిగ్గా తెలియని వారెవరో అక్షరాన్ని గురించి ఆలోచించలేకపోయి ఉంటారు. కానీ సంగీతంలో అక్షరమే ముందు నడిచేదనీనీ స్వరం ఎప్పుడైనా దాన్ని అనుసరించే సాగవలసినదనీనీ సాహిత్యం తెలిసిన వారెవరైనా భావిస్తారు. అందుకనే అన్నమయ్య సాహిత్యం అంత ప్రాచుర్యం పొందగలిగింది. ఆయన పదాన్ని ఎవరేయే రాగాలలో.. పాడుకుంటున్నా కూడా ఆయన పదాలలోని ఆ కవితామాధుర్యమే చెవికింపుగానూ మనసుకి సుఖంగానూ ఉంటుంది. అక్షరాన్ని మినహాయించే సంగీతం మనలేదు. అందువల్ల రోహిణీప్రసాదు గారు ఒక పక్షపాత ధోరణితో ఆ మాటలు అన్నారని భావించేలా ఉంది. ఆయనకి సాహిత్యం మీద మక్కువ లేనంత మాత్రాన తెలుగువారికందరికీ ఉండకూడదని ఏమీ లేదు.
యశస్వి.
గానభారతి గురించి yasasvi అభిప్రాయం:
08/11/2011 2:02 pm
లైలా గారూ !! మీరు రాసిన కొన్ని వాక్యాలకి నేను ఇంకా అలా నవ్వుతూనే ఉన్నాను.” కడుపొచ్చ్చినంత సులువుగా సంగీతం రాదు” 😉
మనుచరిత్ర ప్రభావం అన్నది ఒంటిగా ఉన్న అమ్మాయిని వెళ్ళి పలకరించి కుశల ప్రశ్నలు వేసి ఆ అమ్మాయి యోగక్షేమాలు కనుక్కునే నెపంతో సంభాషణ మొదలుపెట్టడం..ఇంకా గర్భిణీ స్త్రీ లక్షణాలు వర్నించడం ఇత్యాదుల్లో !! అంతదాకానే !!
ఇకపోతే పద్యరచనలో తిరుమల దేశికాచార్యులవారిది అందె వేసిన చెయ్యే !! అందులో ఇసుమంత కూడా సందేహం లేదు. అయితే, ప్రతీదీ పద్యంలోకి ఇరికిస్తే అది నప్పదు. అందుకు ఉదాహరణ గానే ఈ “గానభారతి”. లైలా అన్నట్టూ ఇది ఈ కాలం కధ అయితే ఈ కాలం ఆడపిల్ల వ్యవహారం ఇందులో ఏం లేదు. ఈ గానభారతి కవి గారి ఊహల్లో రూపొందిన అమ్మాయి. ఇవాళ్టి సమాజంలోని అమ్మాయే అయితే లైలా చెప్పినట్టూ ముందుగా గైనకాలజిస్టునే సంప్రదిస్తుంది మరి.
చాదస్తం భాష లో ఉన్నప్పుడు కవి సహజం గానే విషయాన్ని సైతం అంతే చాదస్తమ్ గా రాయక తప్పదు. dress code ని మార్చుకున్నారు గానీ భాష విషయలోనూ కధా కల్పనలోనూ మాత్రం ఈ చాలా మంది పద్య కవులు కాలాన్ని ఇంకా శతాబ్దాల పొలిమేరని దాటనివ్వడం లేందే?? పద్యం బాగుంటుంది కదా అని అన్నిటికీ పద్యాన్నే వాడితే అది ఇదిగో ఇలాగే ఉంటుంది. పైగా కాలం ఆధునికం అన్న సూచన స్వయంగా చేస్తూ కవి ఆ ఆధునిక కాలం లో స్త్రీని మాత్రం బేలగా కవి సలహా లేనిదే అడుగు ముందుకు వేయలేని దానిగా చిత్రించడం ఏమిటీ??
ముక్తకాలైన భావాలకి పద్యం నప్పుతుంది. ప్రకృతి వర్ణనలకి కూడా ఇప్పటికీ పద్యమ్ నప్పుతుంది. దేశికాచార్యులవారే జలప్రపాతాన్ని వర్ణించే పద్యాలు రాసేరు. కానీ ఆధునిక కధ అందునా సంక్లిష్టమైన ఇతివృత్తం తప్పని సరిగా ఆధునికమైన భాష లోనే ఉండటం సముచితంగా ఉంటుంది. లేనప్పుడది కృతకంగానే ఉంటుంది. మన బతుకులో చాలా ప్రాంతాల ప్రమేయం చాలా నాగరికతల ప్రమేయం ఉన్నప్పుడు “తెల్గిష్” నప్పినంతగా మణిప్రవాళమ్ నప్పదు. పైగా ఇదివరలో వేరే భాషలని తెలుగు గ్రహించనట్టూ ఇప్పటికిప్పుడే ఇటువంటి పరిస్థితి ఏదో తెలుగులో తలెత్తినట్టూ దేశికాచార్యుల వారు అనడం వింత . భాష జీవద్భాష అయితే అది అన్నిటినీ కలుపుకుని నడుస్తుంది. లేకపోతే చస్తుంది. అప్పారావు గారి కన్యాశుల్కం లోని వాక్యాలకి ఆ ప్రాచుర్యం వచ్చిందీ అంటే అందుకు కారణం ఆయన సుబ్బరంగా “తెల్గిష్” ని తన నాటకంలో వాడటమే కద!!
యశస్వి.
గానభారతి గురించి lyla yerneni అభిప్రాయం:
08/11/2011 12:51 pm
విశ్వనాథ సత్యనారాయణ వసుచరిత్రము (ఎమెస్కో ప్రచురణ) కు పీఠిక రాస్తూ, వసుచరిత్ర కావ్యము చదవటానికి ఇప్పటి పాఠకులు అధ్యైర్య పడనక్కరలేదనీ, – “మానవజాతిలో నది యొక అవివేకము. ప్రతివాడును తనకేమియు తెలియదనుకొనును. ఆ యనుకొనుట మానివేసినచో మన కావ్యములు కూడ చాలవరకు మనకు తెలియగలవు. నాల్గు మాటలు చదివిన తరువాత నైదవమాట కర్థము తెలియదు. నాకు తెలియుటే లేదని యా పుస్తకము నవతల పారవేయును. ఆ మాట యర్థము కానిచో తక్కిన మాటల కర్థమేమి? పద్యమంతయు చదివినచో నేదో కొంత తెలియదా? ఒక పద్యము తెలియలేదు. రెండవ పద్యము తెలియదా?” – అంటూ కావ్యాలు తప్పక చదవమని సలహా ఇస్తారు.
విశ్వనాథ సలహా నాకు నచ్చింది. ఆయన ఎంతమంది విద్యార్థులకో చదువు చెప్పిన పంతులయ్యె. నేను పద్యాలు అలాగే చదువుతున్నాను. చదివిన కొద్దీ అర్థమవుతున్నయి.
దేశికాచారి గారి పద్యాలు మధురంగా ఉంటాయి. నేను చదువుతున్నా. ఇందులో అన్ని పద్యాల్లో అన్ని మాటలూ అర్థం కాకపోయినా, కథ అర్థమయ్యింది. ఇది ఇప్పటి కాలపు కథ కాదంటానికి వీల్లేదు.
కొంచెం బాగోనట్టు ఎక్కడ అనిపించిందంటే; 🙂 కవితో కథానాయిక .. ఆమె… ఆమె…. – O! What the hell. I will say that horrible word in Telugu – ఆమె తన గర్భిణీ చిహ్నాలను వర్ణించి వర్ణించి చెప్పినప్పుడు. ఈ కాలపు స్త్రీ, ఆ సోదంతా అంత వివరంగా కవికి ఒక లతా నికుంజంలో ఎందుకు చెపుతుంది? అంతకు ముందెప్పుడో తన గైనకాలజిస్ట్ కి హాస్పిటల్లో చెప్పి ఉండొచ్చు.
అంతే. అందుకని. అంతకు మించి నచ్చనిది ఏం లేదు.
ఒంటరిగా, విచారంగా, ఉన్న ఒక స్త్రీని “ఏమిటమ్మా నీ కష్టం?” అని ఒక మగాడు కల్పించుకుని అడగటం ఈ రోజుల్లో జరగదా? అంటే జరుగుతుంది. సరే, కవి తర్వాత కుంచెం, వైద్యుడు, సలహాదారుగా ప్రవర్తించాడు అనుకోండి. అది ఈ రోజుల్లో ఆశ్చర్యం కలిగించే విషయమా అంటే అదీ కాదు. అలా రోజూ ఎడా పెడా లక్ష సలహాలు ఇస్తూనే ఉంటారు చాలామంది మనుషులు. కాని ఇక్కడ ఇచ్చిన సలహా అంత చచ్చుగానూ లేదు. నా కర్థమైనంత వరకూ ఆ కవి, ఆమె మనసు నొచ్చుకునే మాటలు అన్నట్టు లేదు. ఆమెను ఏ చెరువులోనూ దూకించలేదు. పైగా ఆమె కిష్టమయ్యి, ఆమె అదే పొదరింట్లో మరొకరితో సంభోగించితే , కవికి కష్టం కలిగేట్లూ లేదు.
అందువల్ల కవి సహృదయుడు అనిపిస్తున్నది.
అరే! ఒకటి రెండు కూజితాల్లోనే ఆమె కోయిల అని కవికి ఎలా తెలిసింది? అంటే – అదీ అంత నమ్మలేని విషయంలా అనిపించటం లేదు. 🙂 “తాళ్” సినిమాలో ‘మానవి’ /ఐష్వర్యారాయ్ సందేహిస్తూ “జీ. మై క్యా బోలూ” అనంగానే ఆ ధ్వనికి మురిసి ఆమె బాగా పాడుతుందని, స్టార్ క్వాలిటీ అని అనిల్ కపూర్కి తెలిసిపోయి, తన సంగీతం డాన్స్ కంపెనీతో కాంట్రాక్ట్ సైన్ చెయ్యమనలా:-)
ఐతే ఈ కథలో కవి, తన సలహానే ఆ స్త్రీ పాటించి, అందువల్లే ‘గానభారతి’ ఐపోయిందని, మనసులో అనుకున్నాడా? ఏమో మరి. తెలియదు. కానీ, సలహా ఇచ్చినప్పుడు సంగీతం ఆవిడకు మర్నాటికల్లా వస్తుందని అపోహ మాత్రం పడలేదు. కడుపొచ్చినంత సులువుగా సంగీతం రాదు. సంవత్సరాలు పడుతుందనే అనుకున్నాడు. “ఈ మాట” లో సంగీతం వ్యాసాలు రాసే రచయితలు మాత్రం, – వద్దులెండి, ఇక్కడ ఆ సంగతులు – వాళ్ళు రెండు దరువులు వేస్తే, నే బేరుమంటే, మళ్ళీ సుకవులు … 🙂 ఎందుకు గానీ ‘రోమంధము’, ‘ముకురాయితమైన’ అన్న మాటలకు అర్థాలు చెపితే, ప్రస్తుతానికి చాలు.
లైలా
గానభారతి గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
08/09/2011 7:37 pm
చెప్పొద్దూ – వరూధినీ, ప్రవరుడు అని వినిపించేసరికి కుతూహలం కలిగిన మాట వాస్తవం. ఎత్తుగడ అలా అనిపింపజేస్తుంది కూడ. ఐతే మిగిలిన ఏ విషయాల్లోనూ ఎలాటి పోలికా లేదని మనుచరిత్ర తొలి రెండు ఆశ్వాసాలూ చదివిన వారు ఇట్టే పోల్చుకోగలరు (నిజానికి నేను ఆ రెండు ఆశ్వాసాలు “ఈమాట”లో చాలాకాలం క్రితం పెట్టిన గుర్తు, ఇంకా ఉండి ఉండవచ్చు).
ముందుగా, ఇంకా పట్టుపట్టి ఛందోబద్ధమైన పద్యాల్ని రాస్తున్నందుకు తిరుమల దేశికాచార్యుల్ని అభినందించాలి.
ఐతే ఛందోబద్ధమైన పద్యాలు రాసేవారు భాష విషయంలో ఏమైనా కొత్తదనాన్ని తీసుకురావటానికి ప్రయత్నిస్తే ఇంకా పాఠకులకు అందుబాటులో వుండే అవకాశం ఉంటుందేమో ! సమకాలీన పాత్రలు సంస్కృతసమాసభూయిష్టమైన సంభాషణలు చేస్తుంటే తమాషాగానూ ఎబ్బెట్టు గానూ ఉంటుంది. అంతే కాదు సంప్రదాయ భాషలో సమకాలీన భావాల్ని చెప్పలేరు కూడ. అందుకే భావకవులు వస్తువుకి అనుగుణమైన భావజాలాన్నీ భాషనీ తయారుచేసుకున్నారు (వసుచరిత్ర తర్వాత వచ్చిన ఏ రచననీ చదివే ఉద్దేశం లేదని కవిగారు ఇదివరకు అన్నగుర్తు; కాబట్టి ఈ మాటలు వారిని ఉద్దేశించినవి కావు – ఇంకెవరన్నా పద్యాలు రాద్దామనుకుంటే వారికీ ఈ మనవి.) తర్వాత పద్యాలు రాసిన నండూరి వారు కాని, కోవెల వారు కాని భాషని ఆధునీకరించటానికి బాగానే ప్రయత్నించారు వస్తువు పౌరాణికమైనదైనా (ఉదాహరణకి నండూరి “శీర్ణమేఖల”). రామాయణాన్ని రాసిన విశ్వనాథ కూడ చాలా ఆధునిక భాషని భావజాలాన్ని వాడాడు. శ్రీశ్రీ, ఆరుద్ర లాటి వాళ్లు సంప్రదాయ ఛందస్సుల్లో అధునాతన భావాలని చెప్పగలిగారు, అందుకు అనుకూలంగా భాషనీ మలుచుకుని. ఎంతోమంది “సెటైర్లు”, “పేరడీ”లకు ఛందోపద్యాల్ని బాగానే ఉపయోగించుకున్నారు.
ఇప్పటికీ చారిత్రక పౌరాణిక నాటకాలకు కొత్త తరం కవులు పాతరకం పద్యాలు రాస్తున్నారు; శ్రోతలూ వింటున్నారు. చిక్కల్లా సమకాలీన పాత్రలు అదే ఒరవడిలో నడవబోయినప్పుడే. కొత్తభాషని తయారుచేసుకోవటం మాటలు కాదు; కాని కష్టే ఫలిః .
మన భాషలో అంకెలు, సంఖ్యలు గురించి రాణి. అభిప్రాయం:
08/09/2011 6:56 am
కన్నడంలో ఒకటిని ఒందు అంటారు. ఒండు కాదు.
గానభారతి గురించి yasasvi అభిప్రాయం:
08/08/2011 1:01 pm
అయ్యా !! దేశికాచారి గారూ !!
“కూడదని” నేనేల అనవలె గానీ.. “చందోబధ్ధమైన..సత్సంప్రదాయ ముకురాయమాన… అన్న విశేషణం మాత్రం మీ రచనలపై మీకున్న ఎక్కువ మక్కువ ని సూచిస్తోంది 🙂
ఆధునిక జీవితాన్ని అందులోని సంఘర్షణనీ రాయడానికి మాత్రం ఈ రకమైన భాష నప్పదన్నది పాఠకులకి తెలిసే విషయమే! మరీ గబగబ ఏమీ ఘర్షణ వ్యక్తమ్ కాకుండా నడిపిన కధనంలా ఉంది. కాలం ఆధునికమే గానీ కధనంలో ఏమీ ఆధునికం కన్పించలా! ఇంక దీనికి మీరు వాడిన భాష సైతం అలాగే ఉంది. పాత కాలం నాటి వాడకం ఇదేం నప్పుతుందీ? కిరీటాలు పెట్టుకుని రోడ్లమీద నడిస్తే కొట్టొచ్చినట్టు కన్పిస్తుందే అలా ఉంటుంది. ఈ రకమైన భాషలో మనుచరిత్ర మాత్రమే చదివేందుకు ఎక్కువ బాగున్నట్టూ.. గానభారతికి ఈ రకమైన “సత్సంప్రదాయం” ఏమంత నప్పనట్టూ అన్పించే నేనా మాట రాసింది.
ఇహ కవిగా మీ భావన మీది..పఠిత గా నా భావన నాదీను.
యశస్వి.
గానభారతి గురించి దేశికాచారి అభిప్రాయం:
08/08/2011 10:20 am
తమ వంగ్యాత్మకమైన సమీక్షను ఓపికతో వ్రాసినందుకుశ్రీ యశస్విగారికి ప్రశంసలు. నేను మనుచరిత్రను నెమరు వేసుకుంటూ వ్రాయకున్నా మనుచరిత్రరోమంథాన్ని మీకది కలిగించిందంటే నే నాశించినదానికంటె అధికప్రయోజనమే చేకూరింది!! ఇంతకంటె కావలసిన దేముంది? మీకు మనుచరిత్రతో నున్న పరిచయం మాట అటుంచి, మానవప్రకృతులు, విభావానుభావాలు కాలాతీతములూ, అందుచేత 15వ శతాబ్దిలో వ్రాసినా 25వ శతాబ్దిలో వ్రాసినా ఈ అనుభావాల, ప్రకృతుల సారూప్యత ఉంటుందనే అంశం ఈ రోమంథానికి మూలమనేది మీరు గ్రహించవలసిన విషయం. కథను ఏదో 70% ఇంగ్లీషుపదాలతో గూడిన “తెల్గీషు” భాషలో వ్రాస్తే కాని శంఖులోతీర్థం పోసినట్లు కానేరదనే అపోహ మీ వ్రాతలో చూచాయగా స్ఫురిస్తూ ఉన్నది. ఈ అపోహను తొలగించడానికే లాక్షణికమైన ఛందోబద్ధమైన శైలిలో నేనీ కథను వ్రాసినాను. ఇట్టి ఛందోబద్ధమైన సత్సంప్రదాయ ముకురాయితమైన రచనలకు 15వ శతాబ్దియే కాని 21వ శతాబ్ది తగదని మీ అభిప్రాయమా? మీరేమన్నను ఈమాట సంపాదకులకు మాత్రం ఇటువంటి భావం లేకపోవడం నావంటివారి అదృష్టం. అభినందనీయం.
వేటూరి పాట గురించి Nageswara Rao Mutnuri అభిప్రాయం:
08/07/2011 11:58 am
వేటూరి గారు మొన్నటిదాకా మన మధ్యనే ఉన్నారు. ఆయన చాలా ఇంటర్వ్యూ లలో తానూ కొన్ని పాటలు ఎప్పుడు ఎందుకు ఎలా రాసిందీ వివరంగా చెప్పారు. వేటూరి గారు పుంభావ సరస్వతి. మన కావ్యాల మీద, సంస్కుతం లోను, తెలుగు జాతీయాలు, నుడికారాల మీద ఆయనకున్న అధికారం అపారమైనది. ఇన్ని తెలిసిన ఆయన ఇలా రాసారంటే దాని వెనక ఎంతో కొంత ఆలోచన ఉండే ఉంటుంది. ఈ వ్యాసం రామారావు గారు వేటూరి సజీవులుగా ఉన్నపుడు ప్రచురించి ఉంటే బాగుండేది. ఆయనకీ విమర్శలకు సమాధానం చెప్పే అవకాసం కలిగించిన వారయ్యి ఉండేవారు. నామట్టుకు నాకు ఇందులో రంద్రాన్వేషణ ఎక్కువగా కనిపించిది. రామారావు గారు ‘పోయటిక్ లైసెన్స్’ అనేది ఒకటి ఉందన్న వాస్తవాన్ని ఈ వ్యాసం రాసేటప్పుడు విస్మరించారని అనిపిస్తోంది. పింగళి వారు, భావం చెడకుండా అందంగా ఒదిగేటట్లయితే పదాలను కొంచెం అటూ ఇటూగా వాడుకోవడం లో తప్పు లేదని ఎప్పుడో చెప్పారు.
గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి Mallesham అభిప్రాయం:
08/06/2011 11:16 pm
తెలుగు సాహిత్య మాగాణంలో పద్య సుమాలను విరబూయించిన మహోన్నత మహిమాన్వితుడు గుర్రం జాషువా గారు. పద్యాలు చక్కగా వినసొంపుగా ఉన్నాయి.
ఇంత చక్కటి పద్యాలు అందించినందుకు చాలా చాలా ధన్యవాదములు.
రెండు కవితలు గురించి Gurunath D అభిప్రాయం:
08/06/2011 11:57 am
మీ పత్రిక చాలా బాగుంది. కీబోర్దు మ్యాపింగు కూడా చాలా సులువుగా ఉంది. ధన్యవాదాలు.