మాన్యులు శ్రీ రోహిణీప్రసాద్ గారి నివాళిని చదివి, ఆయన అనుసంధించిన ఆ స్వరలహరిలో తేలియాడుతుంటే మైమఱపు కలిగి, కళ్ళల్లో నీళ్ళుతిరిగాయి. మా చిన్నప్పుడు – ఆయన పేర్కొన్న ఆ కార్యక్రమం జరిగిన తర్వాత – మా బాబాయిగారు, పిన్ని మద్రాసులో మా ఇంటికి వచ్చినప్పుడు ఆ సంఘటనను గుఱించి మా అందరికీ వివరించి చెప్పటం, మా పిన్ని శ్రీ రోహిణీప్రసాద్ గారిని గుఱించి ఎంతో ఆప్యాయనంగా మాట్లాడటం నా కింకా గుర్తున్నది. తెలుగు సాహిత్యాన్ని వేలుపట్టుకొని నడిపించిన మహామహుని తనయునికి ఆయన సంగీతాభిమానమంతా సంక్రమించినదని మా పిన్ని అనటం వల్ల నాకప్పుడు శ్రీ రోహిణీప్రసాద్గారి పేరు తెలిసింది. వారిని నేనెన్నడూ కలుసుకోలేకపోయినా – మా బాబాయిగారు, నాన్నగారల ద్వారానూ; వారి అక్కగారు ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి శాంతసుందరిగారు, బావగారు సుప్రసిద్ధకథకులు శ్రీ రామవరపు గణేశ్వరరావు గారల ముఖతః వారిని గుఱించి తెలుసుకొనే అవకాశం కలిగింది. వారి స్మృత్యంజలి మా ఇంటిల్లిపాదినీ కదిలించిందని చెప్పటానికే ధన్యవాదపురస్సరంగా ఈ నాలుగు మాటలూ వ్రాశాను.
వ్యక్తితో అనుబంధం, ఆత్మీయత అల్లుకొన్నవారి రచనలెప్పుడూ ఆ వ్యక్తితో తమకు గల పరిచయాన్ని నెమరువేసుకొంటూ ఈ విధంగానే ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయలు పరమపదించినప్పుడు అల్లసాని పెద్దనగారు నిఃస్పృహులై, “మనుచరిత్రం బందుకొనువేళ యెదురేఁగి పల్లకి తన కేలఁ బట్టి యెత్తె”, “ఆంధ్రకవితాపితామహ! అల్లసాని పెద్దనార్య! అని నన్నుఁ బిలచునట్టి కృష్ణరాయల తోడ దివి కేఁగలేక బ్రదికియున్నాఁడ” అన్న వాక్యాలు స్వోత్కర్షలు కావు.
సాహిత్యాభిమానులు అందులో చరిత్రశకలాలను గుర్తించి, వ్యక్తిజీవితాన్ని పునర్నిర్మించుకొంటారు.
చాలాకాలంగా భారతదేశవాసానికి, ఈనాటి ప్రచార భేరీభాంకారాలకు దూరంగా ఉండటం వల్ల మా బాబాయిగారిని గుఱించి ఈ తరానికి అంతగా తెలియకపోవటం జరిగింది. వారు స్వర్గస్థులైనప్పుడు నేను మా కుటుంబానికీ, బాబాయిగారికీ ఆప్తులైన శ్రీ మందలపర్తి కిషోర్ గారికి తెలియజేయటమూ, వారు సాక్షి దినపత్రికలోను, సాక్షి టివిలోనూ వెల్లడించటం జరిగింది. తర్వాత శ్రీ రవిబాబుగారు సహృదయంతో గౌరవపూర్వకంగా నెమరువేసుకొన్నారు.
ఈ లేఖావళిని ఈరోజే చూడటం మూలాన ఆలస్యంగా స్పందించినందుకు మన్నింప ప్రార్థన.
వారి జ్ఞాపకాలను మఱెప్పుడైనా వ్రాసే ప్రయత్నం చేస్తాను. శ్రీ రోహిణీప్రసాద్ గారికి ధన్యవాదాలు.
నా స్వోత్కర్ష కొట్టుకోవాలంటే మరెన్నో అవకాశాలుంటాయి సార్. విజయరాఘవరావుగారి కంటే పెద్దల పేర్లే drop చెయ్యగలను. ఆయనతో నాకుండిన interaction మాత్రమే రాశాను.
ఆయన 15-8-1947న జనగణమన ఆర్కెస్ట్రా వాయింపించిన సంగతీ, సంగీతదర్శకుడు రోషన్ దిల్రుబాతో వేణువు జుగల్బందీ వాయించిన సంగతీ స్వయంగా ఆయనే చెప్పారు. ఈ వ్యాసం నా డబ్బా కొట్టుకోవడానికి రాయలేదు. అలాంటి పని ఇంతకన్నా చాలా subtleగా చెయ్యాలి. Pl give me more credit for my writing abilities!
నా సంగతి వదిలేసి సంగీతం మీద ఏమన్నా ఆసక్తి ఉంటే రావుగారి గురించి తలుచుకోండి. మీవంటివారిని కూడా convince చెయ్యలేని నా స్వోత్కర్ష మాటకేం లెండి.
చివరకు “నరసరావుపేట” అన్న బ్లాగు (అది ఆయన స్వస్థలం) నడిపేవారికి కూడా ఈ వార్త తెలిసినట్లు లేదు. వెటకారం బహు బాగానే ఉంది కానీ లాభం లేదు! నిజమే! నాకు కూడా తెలీలేదు. ఆయన నాకు (మా అత్తింటివారి వైపు నుంచి)దూరపు బంధువు కూడా అవుతారు. అయినా తెలీలేదు. బంధుత్వాలిలా ఉన్నాయని ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలన్నమాట! :-))
ఆయనతో కలిసి పని చేసి, కచేరీలు నిర్వహించి, సంగీత దర్శకత్వాలు వహించి, ఎంతో కొంత స్నేహం, పరిచయం ఉన్న వారికే ఏదో ఒక పత్రిక చూస్తే తప్ప తెలీలేదంటే కేవలం నరసరావు పేట సంగతులతో బ్లాగు నడిపే వారికి ఈ విషయం తెలీక పోవడంలో ఆశ్చర్యం ఉందని అనుకోడం లేదు గానీ, బంధువులెవరూ ఈ విషయాన్ని పంచుకోకపోవడం.. కొంత విషాదం! పైగా ఆయన కుటుంబంతో నాకు పరిచయం తక్కువ.
నాకు తెలిసిన ఆయన జ్ఞాపకం! నరరసరావు పేట ద్విశతాబ్ది ఉత్సవాలు జరిగినపుడు ఆయన్ని అహ్వానించగా ఆయన అమెరికా నుంచి వచ్చారు. మా వూరి నడి బొడ్డులో ఆయనకు సన్మానం జరిగింది.ఆ సభలో ఆయన,తన వేణువుని సవరించి అందరికీ వీనుల విందు చేశారు. చాలా ఉద్వేగ భరితులై మాతృభూమి గురించి ఆశువుగా కవిత్వం చెప్పారని చదివాను. వీలైతే ఆ నాటి వార్తా పత్రికలు సంపాదించడానికి ప్రయత్నిస్తే తెలుస్తుందేమో!
నా వద్ద వారి కవితా సంకలనం “అంతర్వాణి” ఉంది. మరి కొన్ని విశేషాలు సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి శ్రీ ఏల్చూరి మురళీధర్ రావు గారిని సంప్రదిస్తే చెప్పగలరు.
ఈ వ్యాసం లో నారాయణరావు గారు, సుప్తచేతన, అవ్యక్తభావాల గురించి ప్రస్తావించినప్పుడు నాకు ఈ పాటలలో వాటి వెనుకనున్న స్త్రీ స్వభావం సహజంగానే కనిపించింది.
“లీలాపత్రాణి గణయామాస” అని ఒక కాళిదాసు అన్నప్పుడు స్త్రీ సిగ్గుపడుతుందనిఅది స్త్రీ సహజ లక్షణమని చెప్పనక్కరలేదు. ఊర్మిళకు సీతపైన, రాముడిపైన అసూయ కోపం ఉన్నై, పాటల్లో అవి ఉద్యోతించబడినాయి అంటే ఆ పాటల వెనుకనున్న స్త్రీ స్వభావం సహజంగానే నాకు కనిపించింది.ఒక ప్రత్యేకమైన విషయాన్ని అన్నిటికి అన్వయిస్తే అది సాధారణీకరణ అవుతుందే తప్ప, సహజంగా అర్థమవుతున్నదాన్ని పాటకు నేపథ్యంగా భావించడం సాధారణీకరణ లేదా సూత్రీకరించటం అని నేను భావించట్లేదు.
స్త్రీ మనస్తత్వం బ్రహ్మపదార్థమో మరొకటో కావచ్చు, కానీ ఈ వ్యాసానికి సంబంధించి అది ప్రధానమైన సబ్జెక్ట్ కాదు. ఆమె పాటల వెనుక, పాటలలో కనిపించే ఆక్రోశం,వెనుక ఉన్న అంతర్యం తెలుసుకోవడానికి ఉపయోగపడే సహజమైన ఉపకరణం.
ఏమైనా, ఈ వాదన ఇలా కొనసాగుతునే ఉంటుంది, ఎందుకంటే ఇందులో అర్థం చేసుకునే విధానం కూడా కొంతవరకు ఉంది కాబట్టి. అందువలన నా తరపున స్వస్తి.
అన్నిటికన్నా ముందుగా విజయరాఘవరావు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ… వివరాలు, ఆయనతో తనకున్న పరిచయాన్ని క్లుప్తంగా వివరించిన రోహిణీప్రసాద్ గారికి కృతజ్ఞతలతో…
ఇహ ఇప్పుడు వ్యాసాన్ని వదిలేసి , వచ్చిన కా”మెంటలు” సంగతికొద్దామని అనుకుంటూ ఒక చిన్న ఉపోద్ఘాతం – ఈమాట నేను చదవటం మానెయ్యటానికి కారణమైన అనేక కారణాల్లో, మచ్చుకి ఒకటి…
అ) అకారణంగానో, వారికి వారు సకారణం అనుకునో, ఆ మాటకొస్తే మానసిక సంతులన లేకపోటం మూలాన, వేరే దారిలేక స్వంత పేరు కూడా చెప్పుకోలేక మారుపేర్ల వ్యాఖ్యలను మీ పత్రికా సంపాదకులు “సగర్వంగా” ప్రచురించటం మొదలుపెట్టటం.
ఆ) ఇంకో కారణం – వస్తువున్నా లేకున్నా, అదీ ఇదీ అని లేకుండా తన అరకొర పుస్తక, భాషా, సంగీత, సాహిత్య – ఒహటేమిటీ సర్వం సహా నిఘంటువులతో సహా – వీరపాండిత్యాన్నంతా ప్రదర్శిస్తూ కాలుగాలిన పిల్లిలా తన”మాట” ఈ”మాట” లో వినపడాలని కొంతమంది విశ్వప్రయత్నం చేస్తూండటం, ఆ ప్రయత్నానికి మీరు ఊతమివ్వడం.
ఇలాటివన్నీ నా బోటి పాఠకులకి పత్రిక మీద, సంపాదకుల మీద “అదో” రకమైన భావాన్ని కలిగించడానికి దోహదం చేస్తున్నాయనడంలో ఇసుమంత సందేహం లేదు. ఎక్కడిదాకో ఎందుకు? ఇక్కడే ఉన్న ఒక కామెంటు చూడండి
ఎవరైనా గౌరవంతో మౌనమ్ వహించడం పోయిన వారి ఆత్మశాంతి కోసమ్ చేయాలి. అలాంటి సంతాప సమావేశం ఒకటి ఏర్పాటై అక్కడ నిలబడినప్పుడు తప్పకుండా ఆ పని చేయగలం !! దాని గురించి రోహిణీప్రసాద్ నించి నేర్చుకోనఖ్ఖరలేదు. ఆ నాగరికత విద్యాధికులమ్ గా మాకు ఉంది.
“విద్యాధికులం”: అహా.. భలే మాట… ఇహ నాగరికతకొస్తే – ఇక్కడే తెలిసిపోయింది, నాగరికత ఏమిటో?
సరే అసలా సంగతి పక్కనబెడితే, చాలా రోజుల తర్వాత బే-ఎరియాలో నివసించే మిత్రులొకాయన ద్వారా విజయరాఘవరావు గారు కాలధర్మం చేసారన్న వార్త విని, గూగుల్లో సెర్చ్ చేద్దును కదా రోహిణీప్రసాద్ గారి వ్యాసం లంకె కనపడింది. ఇక్కడికొస్తే ఏముందీ? అసలు సంగతి పక్కనబెట్టి, మొత్తానికే వదిలేసి – తోకలు పుచ్చుకు వేళ్ళాడుతూ కా”మెంటలు” కనపడ్డవి.
లైలా గారు సంపాదకులను సంపాతిలా “ముందుమాట” గురించీ , “ఈమాట మనుగడ” గురించి “దీర్ఘదృష్టి” సారించమని వెయ్యాల్సిన, వేసిన ప్రశ్న గురితప్పిన బాణంలా రోహిణీప్రసాదు గారి మీదకొచ్చింది… దానికి ఆయనేం సమాధానం చెబుతారు? అసలు ఆయనెందుకు సమాధానం చెప్పాలో ఏమిటో? ఆయన విజయరాఘవరావు గారితో తనకున్న పరిచయంతో తనకు రాయాలనిపించింది రాసి వీళ్ళకు పంపిస్తే వీళ్ళు వేసారు. అది ఆయన తప్పెలా అవుతుంది? ఆవిడ ఇదేమి వెర్రి అని వెసిన ప్రశ్న అడగవలసిన వారిని అడిగితే, అడగబడినవారి మానసిక స్థితి బాగుండి చర్చలకు సిద్ధమైతే అక్కడ సావధానంగా చర్చించవచ్చు.
అదలాగుంచితే పైన ఒహ వెర్రి రహమానుడికి ఇందులో – “స్వోత్కర్ష” కనిపించిందిట… చోద్యం కాకపోతే, కనీస జ్ఞానం ఉన్నవాడెవడికీ కనపడంది, వెర్రివాడైన ఈయనకు కనపడింది. సంతోషం! అయితే ఈ గొడవకంతా బాధ్యత పూర్తిగా లైలాగారిదే అనను కానీ మీ సంపాదకుల బాధ్యత ఉన్నదని ఖచ్చితంగా చెప్పొచ్చు. అసలావిడ ఎప్పటినుంచో వేస్తున్న కొచ్చెనుకు సమాధానం ఇవ్వకుండా , ఆవిడలో రగులుతున్న కొచ్చెనార్తిని సమాధానపరచకుండా, ఎండమావి చూపించటం మీ తప్పే.
చివరి మాటగా – ఈ వ్యాసాన్ని వదిలేసి ఈ వ్యాసానికొచ్చిన కామెంట్లు చూస్తే, మోహనరావు గారు ఒక్కరే ఎప్పటిలానే చాలా సమతులన గా మాట్లాడారు. వారికి నా ధన్యవాదాలు. వారిని చూసి నేర్చుకుంటే కొన్ని జీవితాలు, ఇలాటి పత్రికలు బాగుపడతాయని నా ఘాట్టి నమ్మకం.
భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
తా.క: 1) ఆకాశవాణి వారు విజయరాఘవరావు గారితో పరిచయ కార్యక్రమం ఒకటి ప్రసారం చేసారు. ఆ ఆడియో కావాలనుకున్నవారు http://www.maganti.org/ కు వెళ్ళి , అక్కడ ఆకాశవాణి కార్యక్రమాలు లంకె నొక్కి, పరిచయ కార్యక్రమాల భాగంలో వినవచ్చు.
“ఎప్పుడో చిన్నప్పుడు మా ఊర్లో అమ్మలక్కలు మండువా లోగిళ్ళలో పాడుతుండగా విన్న ఊర్మిళాదేవి నిద్ర పాటల శైలి ఇప్పటికీ ఇంకా నాకు బాగా గుర్తుంది. (ఎవరికైనా వినే దమ్ముంటే పాడగలను కూడా!).” -Krishna Rao Maddipati
పాడండి. ఆకస్మిక ప్రసారం చెయ్యటం ఈ పత్రికకు సాధ్యమే అని తెలిసింది. కృష్ణారావ్! మీపాట ఎందుకు మమ్మల్ని విననీయరు. కవిత్వాలు వ్యాసాలు రాసుకుంటే, రాయటం వస్తుందేమో కాని సంగీతం రాదు. సంగీతం వింటే వస్తుంది. పాడితే వస్తుంది. అని రోహిణీ ప్రసాద్ చెప్పింది చాలా నిజమే.
మీరు పాడండి. నాకు వినాలని ఉంది.
కొత్త సంవత్సరం సందర్భంగా ఎక్కడో భారతంలో ఒక చలి ప్రాంతం నుండి నాకు ఫోన్ వచ్చింది. ఆమె వైణికురాలు. ఏమి వాయిస్తున్నాదీ ఇప్పుడు అని నేను అడిగి తెలుసుకుంటుంటే, పినాక పాణి పుస్తకం నుంచి కొన్ని కీర్తనలు నేర్చుకుంటున్నా, నువ్వు రా, నేను వినిపిస్తానంది.
ఇప్పుడు ఫోన్లో వినిపించమన్నాను. అప్పుడు నాకు అర్థరాత్రి.
నీకు నిద్ర పోయే సమయం. ఇప్పుడు కాదు -అంది ఆమె.
లేదు నే వింటానన్నా.
ఆమెకు హఠాత్తుగా గుర్తు వచ్చింది. నా వీణకు ఒక తీగ తెగిపోయి ఉంది. మార్చాలి.-అంది
ఎంత సేపు పడుతుంది. తీగ మార్చటానికి? -నా ప్రశ్న
ఒక అరగంట ఇవ్వు. తీగ మార్చి కొంచెం సాధకం చేసుకుని వినిపిస్తా నంది.
నేను మళ్ళీ ఫోన్ చేసే లోపలే, తనే ఫోన్ చేసి,
వీణతో, తన కంఠస్వరం కలిపి పాడితే, నే విని ఈమె నాకు తెలిసిన వ్యక్తేనా అని ఆశ్చర్య పోయాను. నిజంగా చెప్పాలంటే ఆమె నాకు తెలియదు. పదిహేను ఇరవయ్యి సంవత్సరాల పైగా సాధన చేసి వైణికురాలైన ఆమె నాకేం తెలుసు? ఏదో దగ్గిర చుట్టంగా ఆ చనువుతో తెలుసు. ఆమె ఇంకా ఏమేమిటో? నిజంగా నాకేం తెలుసు?
ఆమెకు తన వీణ నేను వినాలనీ, తను వేసిన బొమ్మలు నేను చూడాలనీ ఎంతో ఉబలాటం. ప్రకృతి అందమైన దృశ్యాలు తనతో పాటు నేను చూడాలని ఆమె ఆశ. వీణ వాయించుకోటం ఆమె నిత్యకృత్యం. ఆమెకు గుర్తింపు అంటే ఏమిటో తెలియదు. పద్మశ్రీల సెరిమొనీలు ఆమెకు పట్టవు.
మా సంభాషణలో, -అన్నమయ్య కీర్తనలలో మాటలు నాకు అన్నీ అర్థం కావు- అని తను అన్నప్పుడు, జయప్రభ రాసిన రెండు పుస్తకాలను నువ్వు తెప్పించుకుని చదువుకోవాలని తనకి చెప్పాను. తప్పకుండా చదవాలి. అప్పుడు నువ్వు ఇంకా బాగా వాయిస్తావు. నీ ఆనందం ఇంకా ఎక్కువవుతుంది, అని నేను చెప్పాను.
కృష్ణారావ్! మీ పాట “ఈమాట” లో ప్రసారం కోసం నేను ఎదురు చూస్తాను.
మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి రాసూరి మహేశ్వరరావు అభిప్రాయం:
01/12/2012 10:31 pm
ఈరోజు మెదటిసారి ఈ సైట్ లోకి వచ్చాము. చాలా ఉపయోగకరమైన మంచి సమాచారం ఉంది. చాలా బాగుంది.
వేణునాదం ఆగింది! గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
01/12/2012 9:33 pm
మాన్యులు శ్రీ రోహిణీప్రసాద్ గారి నివాళిని చదివి, ఆయన అనుసంధించిన ఆ స్వరలహరిలో తేలియాడుతుంటే మైమఱపు కలిగి, కళ్ళల్లో నీళ్ళుతిరిగాయి. మా చిన్నప్పుడు – ఆయన పేర్కొన్న ఆ కార్యక్రమం జరిగిన తర్వాత – మా బాబాయిగారు, పిన్ని మద్రాసులో మా ఇంటికి వచ్చినప్పుడు ఆ సంఘటనను గుఱించి మా అందరికీ వివరించి చెప్పటం, మా పిన్ని శ్రీ రోహిణీప్రసాద్ గారిని గుఱించి ఎంతో ఆప్యాయనంగా మాట్లాడటం నా కింకా గుర్తున్నది. తెలుగు సాహిత్యాన్ని వేలుపట్టుకొని నడిపించిన మహామహుని తనయునికి ఆయన సంగీతాభిమానమంతా సంక్రమించినదని మా పిన్ని అనటం వల్ల నాకప్పుడు శ్రీ రోహిణీప్రసాద్గారి పేరు తెలిసింది. వారిని నేనెన్నడూ కలుసుకోలేకపోయినా – మా బాబాయిగారు, నాన్నగారల ద్వారానూ; వారి అక్కగారు ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి శాంతసుందరిగారు, బావగారు సుప్రసిద్ధకథకులు శ్రీ రామవరపు గణేశ్వరరావు గారల ముఖతః వారిని గుఱించి తెలుసుకొనే అవకాశం కలిగింది. వారి స్మృత్యంజలి మా ఇంటిల్లిపాదినీ కదిలించిందని చెప్పటానికే ధన్యవాదపురస్సరంగా ఈ నాలుగు మాటలూ వ్రాశాను.
వ్యక్తితో అనుబంధం, ఆత్మీయత అల్లుకొన్నవారి రచనలెప్పుడూ ఆ వ్యక్తితో తమకు గల పరిచయాన్ని నెమరువేసుకొంటూ ఈ విధంగానే ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయలు పరమపదించినప్పుడు అల్లసాని పెద్దనగారు నిఃస్పృహులై, “మనుచరిత్రం బందుకొనువేళ యెదురేఁగి పల్లకి తన కేలఁ బట్టి యెత్తె”, “ఆంధ్రకవితాపితామహ! అల్లసాని పెద్దనార్య! అని నన్నుఁ బిలచునట్టి కృష్ణరాయల తోడ దివి కేఁగలేక బ్రదికియున్నాఁడ” అన్న వాక్యాలు స్వోత్కర్షలు కావు.
సాహిత్యాభిమానులు అందులో చరిత్రశకలాలను గుర్తించి, వ్యక్తిజీవితాన్ని పునర్నిర్మించుకొంటారు.
చాలాకాలంగా భారతదేశవాసానికి, ఈనాటి ప్రచార భేరీభాంకారాలకు దూరంగా ఉండటం వల్ల మా బాబాయిగారిని గుఱించి ఈ తరానికి అంతగా తెలియకపోవటం జరిగింది. వారు స్వర్గస్థులైనప్పుడు నేను మా కుటుంబానికీ, బాబాయిగారికీ ఆప్తులైన శ్రీ మందలపర్తి కిషోర్ గారికి తెలియజేయటమూ, వారు సాక్షి దినపత్రికలోను, సాక్షి టివిలోనూ వెల్లడించటం జరిగింది. తర్వాత శ్రీ రవిబాబుగారు సహృదయంతో గౌరవపూర్వకంగా నెమరువేసుకొన్నారు.
ఈ లేఖావళిని ఈరోజే చూడటం మూలాన ఆలస్యంగా స్పందించినందుకు మన్నింప ప్రార్థన.
వారి జ్ఞాపకాలను మఱెప్పుడైనా వ్రాసే ప్రయత్నం చేస్తాను. శ్రీ రోహిణీప్రసాద్ గారికి ధన్యవాదాలు.
సవినమ్రంగా,
ఏల్చూరి మురళీధరరావు
వేణునాదం ఆగింది! గురించి Editors అభిప్రాయం:
01/12/2012 2:50 pm
Dear Posters:
The editors have decided to not approve further comments on this article (barring those that are only about the person being remembered, Sri E. V. R).
We appreciate your cooperation.
Editors of eemaata.
వేణునాదం ఆగింది! గురించి Rohiniprasad అభిప్రాయం:
01/12/2012 10:23 am
ఎందుకో నేను రెహమాన్గారి కామెంట్ మిస్ అయాను.
నా స్వోత్కర్ష కొట్టుకోవాలంటే మరెన్నో అవకాశాలుంటాయి సార్. విజయరాఘవరావుగారి కంటే పెద్దల పేర్లే drop చెయ్యగలను. ఆయనతో నాకుండిన interaction మాత్రమే రాశాను.
ఆయన 15-8-1947న జనగణమన ఆర్కెస్ట్రా వాయింపించిన సంగతీ, సంగీతదర్శకుడు రోషన్ దిల్రుబాతో వేణువు జుగల్బందీ వాయించిన సంగతీ స్వయంగా ఆయనే చెప్పారు. ఈ వ్యాసం నా డబ్బా కొట్టుకోవడానికి రాయలేదు. అలాంటి పని ఇంతకన్నా చాలా subtleగా చెయ్యాలి. Pl give me more credit for my writing abilities!
నా సంగతి వదిలేసి సంగీతం మీద ఏమన్నా ఆసక్తి ఉంటే రావుగారి గురించి తలుచుకోండి. మీవంటివారిని కూడా convince చెయ్యలేని నా స్వోత్కర్ష మాటకేం లెండి.
వేణునాదం ఆగింది! గురించి సుజాత అభిప్రాయం:
01/12/2012 7:12 am
చివరకు “నరసరావుపేట” అన్న బ్లాగు (అది ఆయన స్వస్థలం) నడిపేవారికి కూడా ఈ వార్త తెలిసినట్లు లేదు. వెటకారం బహు బాగానే ఉంది కానీ లాభం లేదు! నిజమే! నాకు కూడా తెలీలేదు. ఆయన నాకు (మా అత్తింటివారి వైపు నుంచి)దూరపు బంధువు కూడా అవుతారు. అయినా తెలీలేదు. బంధుత్వాలిలా ఉన్నాయని ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలన్నమాట! :-))
ఆయనతో కలిసి పని చేసి, కచేరీలు నిర్వహించి, సంగీత దర్శకత్వాలు వహించి, ఎంతో కొంత స్నేహం, పరిచయం ఉన్న వారికే ఏదో ఒక పత్రిక చూస్తే తప్ప తెలీలేదంటే కేవలం నరసరావు పేట సంగతులతో బ్లాగు నడిపే వారికి ఈ విషయం తెలీక పోవడంలో ఆశ్చర్యం ఉందని అనుకోడం లేదు గానీ, బంధువులెవరూ ఈ విషయాన్ని పంచుకోకపోవడం.. కొంత విషాదం! పైగా ఆయన కుటుంబంతో నాకు పరిచయం తక్కువ.
నాకు తెలిసిన ఆయన జ్ఞాపకం! నరరసరావు పేట ద్విశతాబ్ది ఉత్సవాలు జరిగినపుడు ఆయన్ని అహ్వానించగా ఆయన అమెరికా నుంచి వచ్చారు. మా వూరి నడి బొడ్డులో ఆయనకు సన్మానం జరిగింది.ఆ సభలో ఆయన,తన వేణువుని సవరించి అందరికీ వీనుల విందు చేశారు. చాలా ఉద్వేగ భరితులై మాతృభూమి గురించి ఆశువుగా కవిత్వం చెప్పారని చదివాను. వీలైతే ఆ నాటి వార్తా పత్రికలు సంపాదించడానికి ప్రయత్నిస్తే తెలుస్తుందేమో!
నా వద్ద వారి కవితా సంకలనం “అంతర్వాణి” ఉంది. మరి కొన్ని విశేషాలు సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి శ్రీ ఏల్చూరి మురళీధర్ రావు గారిని సంప్రదిస్తే చెప్పగలరు.
పొదుపు సమీకరణాలు గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:
01/12/2012 6:12 am
శర్మ గారికి,
నవ్వులు కూడా పొదుపు చేస్తే ఎలా సారూ.
ధన్యవాదాలు.
రాజ్ కుమార్ గార్కి,
మీ అభిమానం ఎప్పటి లాగానే ఉండాలని కోరుకుంటాను.
ధన్యవాదాలు.
పేరం కిరణ్ కుమార్ గారికి,
శివ సుబ్రహ్మణ్యం గారికి,
ధన్యవాదాలు.
వేణునాదం ఆగింది! గురించి Rohiniprasad అభిప్రాయం:
01/12/2012 3:10 am
విజయరాఘవరావుగారి గురించి అభిమానం ఒలకబోస్తున్నవారు ఆయన మీద James Beveridge తీసిన డాక్యుమెంటరీ చూశారో లేదో.
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి రవి అభిప్రాయం:
01/12/2012 1:46 am
నాది కూడా చివరాఖరు మాట.
ఈ వ్యాసం లో నారాయణరావు గారు, సుప్తచేతన, అవ్యక్తభావాల గురించి ప్రస్తావించినప్పుడు నాకు ఈ పాటలలో వాటి వెనుకనున్న స్త్రీ స్వభావం సహజంగానే కనిపించింది.
“లీలాపత్రాణి గణయామాస” అని ఒక కాళిదాసు అన్నప్పుడు స్త్రీ సిగ్గుపడుతుందనిఅది స్త్రీ సహజ లక్షణమని చెప్పనక్కరలేదు. ఊర్మిళకు సీతపైన, రాముడిపైన అసూయ కోపం ఉన్నై, పాటల్లో అవి ఉద్యోతించబడినాయి అంటే ఆ పాటల వెనుకనున్న స్త్రీ స్వభావం సహజంగానే నాకు కనిపించింది.ఒక ప్రత్యేకమైన విషయాన్ని అన్నిటికి అన్వయిస్తే అది సాధారణీకరణ అవుతుందే తప్ప, సహజంగా అర్థమవుతున్నదాన్ని పాటకు నేపథ్యంగా భావించడం సాధారణీకరణ లేదా సూత్రీకరించటం అని నేను భావించట్లేదు.
స్త్రీ మనస్తత్వం బ్రహ్మపదార్థమో మరొకటో కావచ్చు, కానీ ఈ వ్యాసానికి సంబంధించి అది ప్రధానమైన సబ్జెక్ట్ కాదు. ఆమె పాటల వెనుక, పాటలలో కనిపించే ఆక్రోశం,వెనుక ఉన్న అంతర్యం తెలుసుకోవడానికి ఉపయోగపడే సహజమైన ఉపకరణం.
ఏమైనా, ఈ వాదన ఇలా కొనసాగుతునే ఉంటుంది, ఎందుకంటే ఇందులో అర్థం చేసుకునే విధానం కూడా కొంతవరకు ఉంది కాబట్టి. అందువలన నా తరపున స్వస్తి.
వేణునాదం ఆగింది! గురించి మాగంటి వంశీ మోహన్ అభిప్రాయం:
01/11/2012 6:42 pm
అన్నిటికన్నా ముందుగా విజయరాఘవరావు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ… వివరాలు, ఆయనతో తనకున్న పరిచయాన్ని క్లుప్తంగా వివరించిన రోహిణీప్రసాద్ గారికి కృతజ్ఞతలతో…
ఇహ ఇప్పుడు వ్యాసాన్ని వదిలేసి , వచ్చిన కా”మెంటలు” సంగతికొద్దామని అనుకుంటూ ఒక చిన్న ఉపోద్ఘాతం – ఈమాట నేను చదవటం మానెయ్యటానికి కారణమైన అనేక కారణాల్లో, మచ్చుకి ఒకటి…
అ) అకారణంగానో, వారికి వారు సకారణం అనుకునో, ఆ మాటకొస్తే మానసిక సంతులన లేకపోటం మూలాన, వేరే దారిలేక స్వంత పేరు కూడా చెప్పుకోలేక మారుపేర్ల వ్యాఖ్యలను మీ పత్రికా సంపాదకులు “సగర్వంగా” ప్రచురించటం మొదలుపెట్టటం.
ఆ) ఇంకో కారణం – వస్తువున్నా లేకున్నా, అదీ ఇదీ అని లేకుండా తన అరకొర పుస్తక, భాషా, సంగీత, సాహిత్య – ఒహటేమిటీ సర్వం సహా నిఘంటువులతో సహా – వీరపాండిత్యాన్నంతా ప్రదర్శిస్తూ కాలుగాలిన పిల్లిలా తన”మాట” ఈ”మాట” లో వినపడాలని కొంతమంది విశ్వప్రయత్నం చేస్తూండటం, ఆ ప్రయత్నానికి మీరు ఊతమివ్వడం.
ఇలాటివన్నీ నా బోటి పాఠకులకి పత్రిక మీద, సంపాదకుల మీద “అదో” రకమైన భావాన్ని కలిగించడానికి దోహదం చేస్తున్నాయనడంలో ఇసుమంత సందేహం లేదు. ఎక్కడిదాకో ఎందుకు? ఇక్కడే ఉన్న ఒక కామెంటు చూడండి
ఎవరైనా గౌరవంతో మౌనమ్ వహించడం పోయిన వారి ఆత్మశాంతి కోసమ్ చేయాలి. అలాంటి సంతాప సమావేశం ఒకటి ఏర్పాటై అక్కడ నిలబడినప్పుడు తప్పకుండా ఆ పని చేయగలం !! దాని గురించి రోహిణీప్రసాద్ నించి నేర్చుకోనఖ్ఖరలేదు. ఆ నాగరికత విద్యాధికులమ్ గా మాకు ఉంది.
“విద్యాధికులం”: అహా.. భలే మాట… ఇహ నాగరికతకొస్తే – ఇక్కడే తెలిసిపోయింది, నాగరికత ఏమిటో?
సరే అసలా సంగతి పక్కనబెడితే, చాలా రోజుల తర్వాత బే-ఎరియాలో నివసించే మిత్రులొకాయన ద్వారా విజయరాఘవరావు గారు కాలధర్మం చేసారన్న వార్త విని, గూగుల్లో సెర్చ్ చేద్దును కదా రోహిణీప్రసాద్ గారి వ్యాసం లంకె కనపడింది. ఇక్కడికొస్తే ఏముందీ? అసలు సంగతి పక్కనబెట్టి, మొత్తానికే వదిలేసి – తోకలు పుచ్చుకు వేళ్ళాడుతూ కా”మెంటలు” కనపడ్డవి.
లైలా గారు సంపాదకులను సంపాతిలా “ముందుమాట” గురించీ , “ఈమాట మనుగడ” గురించి “దీర్ఘదృష్టి” సారించమని వెయ్యాల్సిన, వేసిన ప్రశ్న గురితప్పిన బాణంలా రోహిణీప్రసాదు గారి మీదకొచ్చింది… దానికి ఆయనేం సమాధానం చెబుతారు? అసలు ఆయనెందుకు సమాధానం చెప్పాలో ఏమిటో? ఆయన విజయరాఘవరావు గారితో తనకున్న పరిచయంతో తనకు రాయాలనిపించింది రాసి వీళ్ళకు పంపిస్తే వీళ్ళు వేసారు. అది ఆయన తప్పెలా అవుతుంది? ఆవిడ ఇదేమి వెర్రి అని వెసిన ప్రశ్న అడగవలసిన వారిని అడిగితే, అడగబడినవారి మానసిక స్థితి బాగుండి చర్చలకు సిద్ధమైతే అక్కడ సావధానంగా చర్చించవచ్చు.
అదలాగుంచితే పైన ఒహ వెర్రి రహమానుడికి ఇందులో – “స్వోత్కర్ష” కనిపించిందిట… చోద్యం కాకపోతే, కనీస జ్ఞానం ఉన్నవాడెవడికీ కనపడంది, వెర్రివాడైన ఈయనకు కనపడింది. సంతోషం! అయితే ఈ గొడవకంతా బాధ్యత పూర్తిగా లైలాగారిదే అనను కానీ మీ సంపాదకుల బాధ్యత ఉన్నదని ఖచ్చితంగా చెప్పొచ్చు. అసలావిడ ఎప్పటినుంచో వేస్తున్న కొచ్చెనుకు సమాధానం ఇవ్వకుండా , ఆవిడలో రగులుతున్న కొచ్చెనార్తిని సమాధానపరచకుండా, ఎండమావి చూపించటం మీ తప్పే.
చివరి మాటగా – ఈ వ్యాసాన్ని వదిలేసి ఈ వ్యాసానికొచ్చిన కామెంట్లు చూస్తే, మోహనరావు గారు ఒక్కరే ఎప్పటిలానే చాలా సమతులన గా మాట్లాడారు. వారికి నా ధన్యవాదాలు. వారిని చూసి నేర్చుకుంటే కొన్ని జీవితాలు, ఇలాటి పత్రికలు బాగుపడతాయని నా ఘాట్టి నమ్మకం.
భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
తా.క: 1) ఆకాశవాణి వారు విజయరాఘవరావు గారితో పరిచయ కార్యక్రమం ఒకటి ప్రసారం చేసారు. ఆ ఆడియో కావాలనుకున్నవారు http://www.maganti.org/ కు వెళ్ళి , అక్కడ ఆకాశవాణి కార్యక్రమాలు లంకె నొక్కి, పరిచయ కార్యక్రమాల భాగంలో వినవచ్చు.
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి lyla yerneni అభిప్రాయం:
01/11/2012 3:44 pm
పాడండి. ఆకస్మిక ప్రసారం చెయ్యటం ఈ పత్రికకు సాధ్యమే అని తెలిసింది. కృష్ణారావ్! మీపాట ఎందుకు మమ్మల్ని విననీయరు. కవిత్వాలు వ్యాసాలు రాసుకుంటే, రాయటం వస్తుందేమో కాని సంగీతం రాదు. సంగీతం వింటే వస్తుంది. పాడితే వస్తుంది. అని రోహిణీ ప్రసాద్ చెప్పింది చాలా నిజమే.
మీరు పాడండి. నాకు వినాలని ఉంది.
కొత్త సంవత్సరం సందర్భంగా ఎక్కడో భారతంలో ఒక చలి ప్రాంతం నుండి నాకు ఫోన్ వచ్చింది. ఆమె వైణికురాలు. ఏమి వాయిస్తున్నాదీ ఇప్పుడు అని నేను అడిగి తెలుసుకుంటుంటే, పినాక పాణి పుస్తకం నుంచి కొన్ని కీర్తనలు నేర్చుకుంటున్నా, నువ్వు రా, నేను వినిపిస్తానంది.
ఇప్పుడు ఫోన్లో వినిపించమన్నాను. అప్పుడు నాకు అర్థరాత్రి.
నీకు నిద్ర పోయే సమయం. ఇప్పుడు కాదు -అంది ఆమె.
లేదు నే వింటానన్నా.
ఆమెకు హఠాత్తుగా గుర్తు వచ్చింది. నా వీణకు ఒక తీగ తెగిపోయి ఉంది. మార్చాలి.-అంది
ఎంత సేపు పడుతుంది. తీగ మార్చటానికి? -నా ప్రశ్న
ఒక అరగంట ఇవ్వు. తీగ మార్చి కొంచెం సాధకం చేసుకుని వినిపిస్తా నంది.
నేను మళ్ళీ ఫోన్ చేసే లోపలే, తనే ఫోన్ చేసి,
“వందే వాసుదేవం, శ్రీ హరిం
వందే వాసుదేవం
బృందారకాధీక వందిత పదాబ్జం
వందే వాసుదేవం
ఇందీవరశ్యామ మిందిరా కుచకటీ
చందనాంకిత లసచ్చారు దేహమ్
మందార మాలికా మకుట సంశోభితం
కందర్ప జనక మరవింద నాభమ్…”
వీణతో, తన కంఠస్వరం కలిపి పాడితే, నే విని ఈమె నాకు తెలిసిన వ్యక్తేనా అని ఆశ్చర్య పోయాను. నిజంగా చెప్పాలంటే ఆమె నాకు తెలియదు. పదిహేను ఇరవయ్యి సంవత్సరాల పైగా సాధన చేసి వైణికురాలైన ఆమె నాకేం తెలుసు? ఏదో దగ్గిర చుట్టంగా ఆ చనువుతో తెలుసు. ఆమె ఇంకా ఏమేమిటో? నిజంగా నాకేం తెలుసు?
ఆమెకు తన వీణ నేను వినాలనీ, తను వేసిన బొమ్మలు నేను చూడాలనీ ఎంతో ఉబలాటం. ప్రకృతి అందమైన దృశ్యాలు తనతో పాటు నేను చూడాలని ఆమె ఆశ. వీణ వాయించుకోటం ఆమె నిత్యకృత్యం. ఆమెకు గుర్తింపు అంటే ఏమిటో తెలియదు. పద్మశ్రీల సెరిమొనీలు ఆమెకు పట్టవు.
మా సంభాషణలో, -అన్నమయ్య కీర్తనలలో మాటలు నాకు అన్నీ అర్థం కావు- అని తను అన్నప్పుడు, జయప్రభ రాసిన రెండు పుస్తకాలను నువ్వు తెప్పించుకుని చదువుకోవాలని తనకి చెప్పాను. తప్పకుండా చదవాలి. అప్పుడు నువ్వు ఇంకా బాగా వాయిస్తావు. నీ ఆనందం ఇంకా ఎక్కువవుతుంది, అని నేను చెప్పాను.
కృష్ణారావ్! మీ పాట “ఈమాట” లో ప్రసారం కోసం నేను ఎదురు చూస్తాను.
లైలా